భార్య చేతిలో భర్త దారుణ హత్య | Wife Killed Husband In Warangal | Sakshi

భార్య చేతిలో భర్త దారుణ హత్య

Jun 17 2018 12:28 PM | Updated on Jul 30 2018 8:41 PM

Wife Killed Husband In Warangal - Sakshi

మృతదేహాన్ని పరిశీలిస్తున్న పోలీసులు 

పాలకుర్తి టౌన్‌ : పాలకుర్తిలో శనివారం ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని వల్మిడి గ్రామానికి చెందిన వాసూరి చిన కొంరయ్య (65) కుటుంబ కలహాల కారణంగా భార్య లక్ష్మితో 30 సంవత్సరాలుగా దూరం ఉంటున్నాడు. కుమారుడు రవి టీచర్‌ ఉద్యోగం చేస్తూ తల్లి లక్ష్మితో కలిసి పాలకుర్తిలో నివాసం ఉంటున్నాడు. చినకొంరయ్య పేరు మీద 1.18 ఎకరాల భూమి ఉంది. తల్లిదండ్రులు కలిసి ఉండాలని కుమారుడు రవి ప్రయత్నాలు చేశాడు.

ఈ మేరకు గ్రామస్తులు మూడు నెలల క్రితం చినకొంరయ్యను వారితో కలిసి ఉండాలని ఒప్పించారు. అప్పటి నుంచి కొంరయ్య తన భార్య, కుమారుడితో కలిసి పాలకుర్తిలో నివాసముంటున్నాడు. శుక్రవారం రాత్రి భార్యతో ఆయన గొడవ పడ్డాడు. ఆగ్రహి ంచిన లక్ష్మి రోకలి బండతో చినకొంరయ్య తలపై కొట్టగా ఆయన మృతి చెందాడు. మృతుడి సోదరి ముణెమ్మ ఫిర్యాదు మేరకు సీఐ కరుణాసాగర్‌ రెడ్డి, ఎస్సై వెంకటేశ్వర్లు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement