టీవీ రీచార్జ్‌ చేయించలేదని మహిళ ఆత్మహత్య | woman commit to suicide | Sakshi
Sakshi News home page

టీవీ రీచార్జ్‌ చేయించలేదని మహిళ ఆత్మహత్య

Jan 10 2018 8:15 AM | Updated on Jan 10 2018 8:15 AM

woman commit to suicide  - Sakshi

వెంకటలక్ష్మమ్మ(ఫైల్‌)

కర్నూలు, ఉయ్యాలవాడ: టీవీకి రీచార్జ్‌ చేయించలేదని ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. ఎస్‌ఐ నిరంజన్‌రెడ్డి వివరాల మేరకు..  ఇంజేడు గ్రామానికి చెందిన పచ్చర్ల వెంకటలక్ష్మమ్మ(45) టీవీ రీచార్జ్‌ చేయించాలని తన కుమారుడికి రూ. 300 అందజేసింది. అయితే అతడు రీచార్జ్‌ చేయించకుండా ఆ డబ్బుతో మద్యం సేవించి ఇంటికి చేరుకున్నాడు. తీవ్ర మనోవేదనకు గురైన తల్లి క్రిమి సంహారక మందు సేవించి అపస్మారక స్థితికి చేరుకుంది. తెలుసుకున్న భర్త, బంధువులు ఆళ్లగడ్డ వైద్యశాలకు తరలించారు. ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం కర్నూలుకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందింది. మృతురాలి భర్త అంకాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement