నేత్రదానానికి 80 మంది సిద్ధం | 80 ready to donate eyes | Sakshi
Sakshi News home page

నేత్రదానానికి 80 మంది సిద్ధం

Oct 7 2016 12:57 AM | Updated on Sep 4 2017 4:25 PM

తమ తదనంతరం నేత్రదానం చేసేందుకు 80 మంది అంగీకారం తెలిపారు. గురువారం మండల కేంద్రంలోని కేవీకేలో శ్రీసాయి హెల్త్‌కేర్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నేత్రదాన నమోదు శిబిరం నిర్వహించారు.

బుక్కరాయసముద్రం : తమ తదనంతరం నేత్రదానం చేసేందుకు 80 మంది అంగీకారం తెలిపారు. గురువారం మండల కేంద్రంలోని కేవీకేలో శ్రీసాయి హెల్త్‌కేర్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నేత్రదాన నమోదు శిబిరం నిర్వహించారు. కార్యక్రమానికి జెడ్పీ చైర్మన్‌ చమన్‌సాహెబ్, అనంతపురం డిఎస్పీ మల్లికార్జున వర్మ, జెడ్పీటీసీ రామలింగారెడ్డి హాజరయ్యారు.

ఈ సందర్భంగా చమన్‌సాహెబ్‌ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మరణానంతరం నేత్రదానం చేసి మరొకరికి చూపు ఇవ్వాలని సూచించారు. అనంతరం 80 మంది మరణానంతరం నేత్ర దానం చేస్తామని అంగీకార పత్రాన్ని నిర్వాహకులకు ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement