'బార్లోనే కల్తీ జరిగింది' | alcohol Adulterated at swarna bar only | Sakshi
Sakshi News home page

'బార్లోనే కల్తీ జరిగింది'

Published Thu, Dec 10 2015 1:04 PM | Last Updated on Sun, Sep 3 2017 1:47 PM

alcohol Adulterated  at swarna bar only

విజయవాడ: బెజవాడ కల్తీ మద్యం ఘటనలో విచారణ నివేదిక సిద్ధమైంది. స్వర్ణ బార్లోనే మద్యం కల్తీ జరిగినట్లు అధికారులు ఓ నిర్థారణకు వచ్చారు. ఈ ఘటనపై విచారణ నివేదికను ఎక్సైజ్ కమిషనర్ మీనా స్వయంగా గురువారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సమర్పించనున్నారు.

 

బార్లోనే మోతాదుకు మించి మిథైనల్ కలిపినట్లు ఎక్సైజ్  అధికారులు చెప్పుతున్నారు. దీనిని ఆధారాలతో సహా నిరూపించే ప్రయత్నాల్లో అధికారులు ఉన్నట్లు తెలుస్తుంది. ఈ కేసులో ఇద్దరి అధికారుల సస్పెన్షన్తో పాటు పలువురిని పోలీసులు అదుపులోకి  తీసుకుని విచారిస్తున్నారు. కల్తీ మద్యం సేవించి అయిదుగురు మృతి చెందగా, పలువురు అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement