పార్కులకు అమృత్ నిధులు
Published Tue, Aug 30 2016 10:47 PM | Last Updated on Fri, Jun 1 2018 7:32 PM
కరీంనగర్: అమృత్ పథకానికి ఎంపికైన జిల్లాలోని కరీంనగర్, రామగుండం కార్పొరేషన్ల పరిధిలో పార్కుల అభివృద్ధి కోసం నిధులు మంజూరయ్యాయి. జీవో నెం.589 ద్వారా ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ ఎంజీ గోపాల్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. కరీంనగర్కు రూ.69 లక్షలకు రూ.57 లక్షలు మంజూరయ్యాయి.
అందులో 50 శాతం కేంద్రప్రభుత్వ వాటా రూ.28 లక్షలు, 20శాతం రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.11.40 లక్షలు, కార్పొరేషన్ వాటా 30 శాతం 29.10 లక్షలు. రామగుండంకు రూ.1.08 కోట్లకు రూ.కోటి మంజూరు కాగా అందులో 50 శాతం కేంద్రప్రభుత్వ వాటా రూ.50 లక్షలు, 20శాతం రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.20 లక్షలు పోను కార్పొరేషన్ వాటా 30 శాతం రూ.29.10 లక్షలు జమచేయాల్సి ఉంటుంది. ఈ నిధులు ఫైనాన్స్ విభాగం ద్వారా మున్సిపాలిటీల ఖాతాల్లో జమ అవుతాయని జీవోలో పేర్కొన్నారు.
Advertisement
Advertisement