corporations
-
ఇదేమి మిత్ర‘ధర్మం’?
సాక్షి, అమరావతి: నామినేటెడ్ పదవుల పంపిణీలో టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు వ్యవహరించిన తీరుపై మిత్రపక్షాలైన బీజేపీ, జనసేన పార్టీల నేతలు మండిపడుతున్నారు. ఇదేమి మిత్రధర్మమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం మొత్తం 20 కార్పొరేషన్లకు ఛైర్మన్లను ప్రకటించగా అందులో జనసేనకు 3, బీజేపీకి కేవలం ఒకటి ఇచ్చారు. ప్రకటించిన కార్పొరేషన్లలో ఛైర్మన్లు, ఒక వైస్ ఛైర్మన్తోపాటు కొన్నింటిలో డైరెక్టర్ పదవులుండడంతో వాటినీ భర్తీ చేశారు. డైరెక్టర్లతో కలిసి మొత్తం 99 నామినేటెడ్ పదవులు భర్తీ చేసినట్లు టీడీపీ ప్రకటన విడుదల చేసింది.కీలకమైన కార్పొరేషన్లను చంద్రబాబు తమ పార్టీ వారికే ఇచ్చుకున్నారు. ఆర్టీసీ, ఏపీఐఐసీ, శాప్, హౌసింగ్ బోర్డు, సీడాప్, మారిటైమ్ బోర్డు, మార్క్ఫెడ్, ఏపీటీడీసీ వంటి ప్రధానమైన కార్పొరేషన్లు టీడీపీ ఖాతాలోకి వెళ్లాయి. జనసేనకు ఇచ్చిన మూడు కార్పొరేషన్లు కూడా అప్రాధాన్యమైనవేనని ఆ పార్టీ నేతలు వాపోతున్నారు. పెద్దగా గుర్తింపు లేని, ఎవరూ పట్టించుకోని సివిల్ సప్లైస్ కార్పొరేషన్, టిడ్కో, ఎంఎస్ఎంఈ కార్పొరేషన్లను జనసేనకు కేటాయించారు. బీజేపీకి 20 సూత్రాల కమిటీ చైర్మన్ పదవి ఒకటే దక్కింది. అది కూడా టీడీపీ పాత నాయకుడు లంకా దినకర్కు ఇవ్వడంతో అది పేరుకు బీజేపీ ఖాతాయే తప్ప పదవి టీడీపీదేనని చెబుతున్నారు.ఒరిజినల్ బీజేపీ నేతలు ఎంతో మంది ఉండగా వారెవ్వరినీ పట్టించుకోకుండా టీడీపీ నుంచి వలస వచ్చిన నాయకుడికి ఇవ్వడంపై ఆ పార్టీలో అసంతృప్తి నెలకొంది. చంద్రబాబు ఉద్దేశపూర్వకంగానే బీజేపీ ముఖ్య నాయకులందరినీ పక్కన పెట్టి ఆ పార్టీలో ఉన్న తన శిష్యుడైన లంకా దినకర్కు పదవి ఇచ్చినట్లు చెబుతున్నారు. పొత్తు ధర్మాన్ని విస్మరించి కంటి తుడుపుగా ఒక పదవి ఇవ్వడం ఏమిటని ఆ పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు. లోపించిన సామాజిక సమతూకంమరోవైపు నామినేటెడ్ పదవుల్లో చంద్రబాబు ఓసీలకే ప్రాధాన్యత ఇవ్వడంపై మిగతా సామాజికవర్గాల నేతలు గుర్రుగా ఉన్నారు. 20 పదవుల్లో 9 ఓసీలకే కట్టబెట్టారు. బీసీల పార్టీ అని చెప్పుకుంటున్నా ఏడు పదవులే ఇచ్చారని వెనుకబడిన వర్గాల నేతలు వాపోతున్నారు. ఎస్సీలకు రెండు, ఎస్టీ ఒకటి, మైనారిటీలకు ఒకటి కేటాయించి చేతులు దులుపుకున్నారని ఆ వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. తాజా పదవుల పంపకంపై టీడీపీ నేతలు సైతం అసహనంగానే ఉన్నారు. పదవులు ఆశించిన ఆలపాటి రాజా, దేవినేని ఉమామహేశ్వరరావు వంటి ముఖ్యమైన నేతలకు మొండి చేయే చూపారు. దీంతో సీనియర్లు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. -
ఏపీలో కూటమి పార్టీల బరితెగింపు
కూటమి నేతల ఆగడాలకు అంతేలేకుండా పోతోంది. వైఎస్సార్సీపీ ఆధీనంలో ఉన్న కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, మండల పరిషత్లను కూటమి నేతలు కై వసం చేసుకునేందుకు బెదిరింపులు, దౌరన్యాలకు దిగుతున్నారు. ఎక్కడా వైఎస్సార్సీపీ పేరు వినిపించకుండా ఉండేందుకు కార్పొరేటర్లు, కౌన్సిలర్లు,జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్లపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి చేస్తున్నారు. ‘మర్యాదగా పచ్చ కండువా కప్పుకోండి. లేదంటే మీ అంతు చూస్తాం. పాతకేసుల ఏవైనా ఉంటే తోడుతాం. లేవంటే ఏదో ఒక కేసు పెట్టి జైలుకు పంపుతాం’ అంటూ పోలీసులు, ఇంటలిజెన్స్ అధికారుల ద్వారా కూటమి నేతలు బెదిరింపులకుపాల్పడుతున్నారు. ఆ కోవలోనే చిత్తూరు కార్పొరేషన్తో పాటు పుంగనూరు మున్సిపాలిటీని కూటమి నేతలు దౌర్జన్యంగా వారి ఆధీనంలోకి తెచ్చుకున్నారు.ఇంకా మిగిలిన వాటిపై దృష్టి సారించారు.సాక్షి టాస్్కఫోర్స్: ఉమ్మడి చిత్తూరు జిల్లాలో జిల్లా పరిషత్తో పాటు.. తిరుపతి, చిత్తూరు కార్పొరేషన్లు, కుప్పం, పుంగనూరు, పలమనేరు, నగరి, పుత్తూరు, సూళ్లూరుపేట, నాయుడుపేట, గూడూరు మున్సిపాలిటీలన్నింటిలోనూ వైఎస్సార్సీపీ నేతలే విజయం సాధించారు. మేయర్, మున్సిపల్ చైర్మన్ పీఠాలను కైవశం చేసుకున్నారు. అదేవిధంగా అన్ని మండల పరిషత్ల్లోనూ వైఎస్సార్సీపీ నేతలే ఎంపీపీలుగా వ్యవహరిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ పార్టీ నేతలు తమ అనుచరులను ఆ కురీ్చల్లో కూర్చోబెట్టేందుకు అడ్డదారులు తొక్కుతున్నారు. రంగంలోకి ఖాకీలు ప్రజాస్వామ్య దేశంలో ప్రజలకు రక్షణకల్పించాల్సిన పోలీసులు కొందరు టీడీపీ, జనసేన నాయకుల్లా వ్యవహరిస్తున్నారు. కార్పొరేషన్, ఎంపీపీ, జెడ్పీటీసీ కురీ్చల్లో కూటమి నేతలను కూర్చోబెట్టేందుకు వైఎస్సార్సీపీ తరుఫున గెలిచిన వారిని ప్రత్యేకంగా పిలిపించి బెదిరింపులకు పాల్పడుతున్నారు. సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను పిలిపించి టీడీపీలో చేరాలంటూ బెదిరింపులకు దిగారు. ఓ పోలీసు, ఇంటిలిజెన్స్లోని మరో అధికారి నేరుగా వారి నివాసాలకు, మున్సిపల్ కార్యాలయానికి పిలిపించి బెదిరించిన విషయం తెల్సిందే. వైఎస్సార్సీపీ తరుఫున గెలిచిన మున్సిపల్ కౌన్సిలర్లందరినీ చంద్రబాబు వద్దకు తీసుకెళ్లి పచ్చకండువాలు కప్పించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అదేవిధంగా కుప్పం నియోజకవర్గం గుడుపల్లి మండల పరిధిలోని ఎంపీటీసీ, సర్పంచ్లను సైతం ఇదే స్థాయిలో పోలీసుల ద్వారా బెదిరింపులకు పాల్పడుతున్నారు. కొద్ది రోజుల్లో నియోజకవర్గంలో ఉన్న కౌన్సిలర్లు, ఎంపీపీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్లందరినీ అమరావతికి తీసుకెళ్లి చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేర్చేటట్లు ప్రణాళికలు సిద్ధం చేసినట్టు తెలుస్తోంది.జనసేన జీరో అంటతిరుపతిలో టీడీపీ, జనసేన, బీజేపీ నేతల మధ్య ఆధిపత్య పోరు తారస్థాయికి చేరింది. ఆరణి శ్రీనివాసులు ఎమ్మెల్యే అయినా.. తిరుపతిలో జనసేన జీరో.. తామే హీరోలమంటూ టీడీపీ నేతలు ప్రచారం చేసుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో తిరుపతి మేయర్ పీఠంపై టీడీపీ, జనసేన పార్టీ కార్పొరేటర్లను కూర్చోబెట్టాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. వాస్తవంగా అయితే తిరుపతిలోని 50 డివిజన్లలో 49 స్థానాల్లో వైఎస్సార్సీపీ నేతలే విజయం సాధించారు. కేవలం ఒకే ఒక స్థానంలో టీడీపీ అభ్యర్థి కార్పొరేటర్గా గెలుపొందారు. ఎన్నికలకు నాలుగు రోజుల ముందు, కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత కొంత మంది వైఎస్సార్సీపీ కార్పొరేటర్లకు డబ్బులిచ్చి కూటమి ప్రభుత్వంలో చేర్చుకున్నారు. వారిలో ఒకరిని మేయర్ పీఠంపై కూర్చోబెట్టాలని ఇటు టీడీపీ, అటు జనసేన నేతలు తహతహలాడుతున్నారు. అందులో భాగంగా ఆదివారం కొందరు కార్పొరేటర్లతో ఆయా పార్టీలకు చెందిన నాయకులు రహస్య సమావేశాలు నిర్వహించారు. కొంతమందిని బెదిరిచించారు. అలాగే ఇంకొంత మందికి ప్యాకేజీ ఇస్తామని హామీ ఇచ్చారు. తిరుపతిలో జనసేన జీరో అని, టీడీపీ నేతలే హీరోలని వైఎస్సార్సీపీ కార్పొరేటర్లతో అన్నట్లు తెలిసింది. ఇదిలా ఉంటే.. తాము అడిగినంత డబ్బు ఇచి, పార్టీ మారితే మేయర్, చైర్మన్ కుర్చీలో మీరే కొనసాగవచ్చుంటూ ఆఫర్ చెస్తున్నట్టు తెలుస్తుంది. ఈ సందర్భంగా కొందరు ప్రాణం ఉన్నంత వరకు వైఎస్సార్సీపీ కార్పొరేటర్లగానే ఉంటామని, పార్టీ మారే ఆలోచనే లేదని తేల్చిచెప్పడం విశేషం. -
హైదరాబాద్ గ్రేటర్ సిటీ కార్పొరేషన్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్లోని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలను విలీనం చేసి ఒకే కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. హెచ్ఎండీఏ పరిధిలో మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలను విలీనం చేయాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి సూత్రప్రాయంగా నిర్ణయించినట్టు తెలిసింది. ప్రస్తుతం హెచ్ఎండీఏ పరిధిలో 30 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లు ఉండగా, అన్నింటినీ కలిపి గ్రేటర్ సిటీ కార్పొరేషన్గా ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు. ఒకే మున్సిపల్ కార్పొరేషన్గా ఏర్పాటు చేయాలా లేదా తూర్పు, పశ్చిమ, ఉత్తర, దక్షిణ హైదరాబాద్ సిటీల పేరుతో నాలుగు ప్రత్యేక కార్పొరేషన్లుగా విభజించాలా? అనే అంశాన్ని పరిశీలిస్తున్నారు. హెచ్ఎండీఏ పరిధిని అన్ని వైపులా ఔటర్ రింగ్ రోడ్డు వరకు విస్తరించాలని సీఎం ఇటీవలే అధికారులను ఆదేశించారు. పాలకవర్గాల పదవీకాలం ముగిశాకే.. ఇప్పుడున్న కార్పొరేషన్లు, మున్సిపాలిటీల పాలకవర్గాల పదవీ కాలం పూర్తయిన వెంటనే వాటికి స్పెషలాఫీసర్లను నియమించాలని, అన్నింటి పదవీకాలం ముగిసిన తర్వాత ఈ విలీన ప్రక్రియను ప్రారంభించాలని మున్సిపల్ శాఖ అధికారులతో ముఖ్యమంత్రి ఇటీవల సమాలోచనలు చేశారు. పదవీకాలం ముగిసిన తర్వాత విలీనం చేస్తే న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తకుండా ఉంటుందని యోచిస్తున్నారు. హెచ్ఎండీఏ పరిధిని యూనిట్గా తీసుకొని ఒకే గ్రేటర్ సిటీ కార్పొ రేషన్గా చేయటం, లేదా సిటీ మొత్తాన్ని 4 కార్పొరేషన్లుగా విభజించడం అనే అంశాన్ని పరిశీలించాలని మున్సిపల్ శాఖ అధికా రులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. జనాభా ప్రాతిపదికన డివిజన్ల పునర్విభజన.. జీహెచ్ఎంసీతో పాటు కొత్తగా ఏర్పడ్డ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లోని డివిజన్లకు నిధుల పంపిణీలో అసమానతలున్నాయని విమర్శలున్నాయి. కొన్ని డివిజన్ల పరిధిలో లక్ష మందికిపైగా జనాభా ఉండగా.. కొన్ని కార్పొరేషన్లలోని డివిజన్లలో కేవలం 30 వేల మంది మాత్రమే ఉన్నారు. మౌలిక వసతుల కల్పనకు కేటాయించే నిధులు, గ్రాంట్లను ఒకే తీరుగా కేటాయిస్తే కొన్ని ప్రాంతాలకు లాభం జరిగి, కొన్ని ప్రాంతాలు నష్టపోతున్నాయి. సిటీ విస్తరణకు అనుగుణంగా శివారు ప్రాంతాల్లో రోడ్లు, డ్రైనేజీలు, వసతుల కల్పనకు ఎక్కువ నిధులు ఖర్చు చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే సిటీలో అభివృద్ధి చెందిన డివిజన్లకు తక్కువ నిధులు సరిపోతాయి. వీటన్నింటి దృష్ట్యా గ్రేటర్ హైదరాబాద్ సిటీని ఏకరీతిగా అభివృద్ధి చేసేందుకు ఈ విలీనం ఉపయోగపడుతుందని ముఖ్యమంత్రి యోచిస్తున్నారు. కొత్తగా ఏర్పాటు చేసే కార్పొరేషన్ పరిధిలోని డివిజన్లను జనాభా ప్రాతిపదికన పునర్విభజించాలని సూచించారు. ఇంచుమించుగా సమాన జనాభా ఉండేలా డివిజన్లను ఏర్పాటు చేయాలని, నియోజకవర్గాల సరిహద్దులను కూడా పరిగణనలోకి తీసుకోవాలని భావిస్తున్నారు. అందుకు అవసరమైన పునర్విభజన ప్రక్రియపై ముందుగా అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు. ఢిల్లీ కార్పొరేషన్ తరహాలో... దేశ రాజధాని ఢిల్లీలో రెండేళ్ల కిందటే అక్కడున్న మూడు మునిసిపల్ కార్పొరేషన్లను ప్రభుత్వం ఒకే కార్పొరేషన్గా విలీనం చేసింది. అక్కడ జరిగిన విలీనం తీరు, అందుకు అనుసరించిన విధానాలను సీఎం మున్సిపల్ శాఖను అడిగి తెలుసుకున్నారు. హెచ్ఎండీఏ పరిధిలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)తో పాటు బోడుప్పల్, పీర్జాదిగూడ, జవహర్నగర్, బండ్లగూడ జాగీర్, నిజాంపేట, బడంగ పేట్, మీర్పేట్ మునిసిపల్ కార్పొరేషన్లు, మరో 30 మున్సిపాలిటీలు ఉన్నాయి. 30 మున్సిపాలిటీలివే.. ► రంగారెడ్డి జిల్లా: పెద్దఅంబర్పేట, ఇబ్రహీంపట్నం, జల్పల్లి, షాద్నగర్, శంషాబాద్, తుర్కయాంజాల్, మణికొండ, నార్సింగి, ఆదిభట్ల, శంకరపల్లి, తుక్కుగూడ ►మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లా: మేడ్చల్, దమ్మాయిగూడ, నాగారం, పోచారం, ఘట్కేసర్, గుండ్లపోచంపల్లి, తూంకుంట, కొంపల్లి, దుండిగల్ ►యాదాద్రి భువనగిరి జిల్లా: భువనగిరి, చౌటుప్పల్, పోచంపల్లి ►సంగారెడ్డి జిల్లా: సంగారెడ్డి, బొల్లారం, తెల్లాపూర్, అమీన్పూర్, చేర్యాల ►మెదక్ జిల్లా: తూప్రాన్, నర్సాపూర్ -
వ్యవసాయ కార్పొరేషన్ల ఎండీల మార్పు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని వివిధ కార్పొరేషన్లకు ఐఏఎస్లను ఎండీలుగా నియమిస్తామంటూ ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో వ్యవసాయ కార్పొరేషన్ల ఎండీల్లో గుబులు నెలకొంది. మరోవైపు కొత్తగా కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో వ్యవసాయ శాఖలో కొందరు అధికారులు మారతారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. సంక్రాంతికి ముందుగానే లేదా ఆ వెంటనే కార్పొరేషన్ల ఎండీలు, జనరల్ మేనేజర్లు మారే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు తనకు గతంలో తెలిసిన, సమర్థులైన అధికారులను ఆయా పోస్టుల్లో నియమించవచ్చని చెబుతున్నారు. వ్యవసాయ శాఖలో మార్క్ఫెడ్, ఆయిల్ ఫెడ్, ఆగ్రోస్, సీడ్, హాకా, వేర్ హౌసింగ్ లాంటి కార్పొరేషన్లు ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో, తర్వాత కూడా వీటిల్లో కొన్నింటికి ఐఏఎస్లు ఎండీలుగా ఉన్నారు. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వంలో మాత్రం ఐఏఎస్లు కానివారు ఎండీలుగా కొనసాగుతున్నారు. గత సర్కారుతో సంబంధాలపై ఆరా ప్రస్తుతం కార్పొరేషన్ల ఎండీలుగా ఉన్నవారి గురించిన సమాచారాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం సేకరిస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. గత ప్రభుత్వంతో వారెలా ఉన్నారు? వృత్తిపరంగా వ్యవహరించారా? లేక అప్పటి అధికార పార్టీ నేతల్లా పనిచేశారా? అన్నది ఆరా తీస్తున్నట్లు సమాచారం. కొన్ని కార్పొరేషన్లలో ఎండీలు, చైర్మన్లు కలిసి ఇష్టారాజ్యంగా వ్యవహరించారన్న విమర్శలున్నాయి. కొందరు ఎండీ స్థాయి లేకున్నా పైరవీలతో ఆయా సీట్లలో కూర్చున్నారన్న ఆరోపణలున్నాయి. మరోవైపు ఆయా పోస్టుల్లో కొనసాగేందుకు కొందరు పెద్ద ఎత్తున పైరవీలు చేస్తున్నట్లు తెలిసింది. ఉండేదెవరు? ఊడేదెవరు?: మార్క్ఫెడ్కు సత్యనారాయణరెడ్డి ఎండీగా ఉన్నారు. సరిగ్గా ఎన్నికల షెడ్యూల్ కంటే ముందు ఆయన ఈ బాధ్యతల్లోకి వచ్చారు. అంతకుముందు ఆయన గత ప్రభుత్వంలోని మంత్రి దయాకర్రావు వద్ద పీఎస్గా పనిచేశారు. ఇలా గతంలో పీఎస్లుగా పనిచేసిన వారి ని ఇప్పుడు తీసుకోబోమని ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో సత్యనారాయణరెడ్డి కొనసాగింపుపై చర్చ జరుగుతోంది. వేర్ హౌసింగ్ కార్పొరేషన్కు ఎండీగా ఉన్న జితేందర్రెడ్డి ఒక బీఆర్ఎస్ ప్రజాప్రతినిధికి దగ్గరి బంధువు. కాబట్టి ఈయన కొనసాగింపుపైనా ప్రభుత్వం ఎలాంటి నిర్ణ యం తీసుకుంటుందోనన్న చర్చ జరుగుతోంది. ఇక ఆయిల్ఫెడ్, ఆగ్రోస్, సీడ్, హాకా సంస్థలకు ఎండీలుగా సీనియర్ అధికారులు ఉన్నారు. వీరికి గతంలో బీఆర్ఎస్తో రాజకీయపరమైన సంబంధాలు లేవంటున్నారు. రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ఎండీ డాక్టర్ కేశవులు అంతర్జాతీయ విత్తన ధ్రువీకరణ సంస్థ (ఇష్టా)కు అధ్యక్షుడిగా ఉన్నారు. అంతర్జాతీయంగా రాష్ట్ర ఖ్యాతిని చాటుతున్నారు. కాబట్టి ఈయన మార్పు ఉండబోదన్న వాదన వినిపిస్తోంది. ఇక ఆయిల్ ఫెడ్, హాకాలకు ఎండీగా ఉన్న సురేందర్, ఆగ్రోస్ ఎండీ రాములు ఇద్దరూ సీఎం రేవంత్రెడ్డి జిల్లాకు చెందినవారు. కాబట్టి వారిని కూడా మార్చక పోవచ్చని చెబుతున్నారు. వారికి సీఎంతో ఉన్న అనుబంధం కూడా కలిసి వస్తుందని అంటున్నారు. రఘునందన్రావు కొనసాగుతారా? వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్రావు కొనసాగుతారా లేదా అన్న చర్చ కూడా జరుగుతోంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు ఆయన సన్నిహితుడన్న ప్రచారముంది. మరోవైపు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితోనూ, అలాగే మంత్రి తుమ్మల నాగేశ్వర్రావుతోనూ రఘునందన్రావుకు మంచి సంబంధాలే ఉన్నాయంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన కొనసాగే అవకాశాలున్నాయని చెబుతున్నారు. ఒకవేళ మార్చినా మంచి పోస్టులోకే వెళ్తారని అంటున్నారు. -
కేసీఆర్ సర్కార్ కీలక నిర్ణయం!.. కార్పొరేషన్లుగా పెద్ద మున్సిపాలిటీలు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో స్పెషల్ గ్రేడ్, గ్రేడ్–1 స్థాయి మున్సిపాలిటీలను కార్పొరేషన్లుగా మార్చేందుకు కసరత్తు జరుగుతోంది. రెండేళ్లలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్నందున.. ఆలోపు పెద్ద మున్సిపాలిటీలను కార్పొ రేషన్లుగా అప్గ్రేడ్ చేయాలనే విజ్ఞప్తులు వస్తున్నాయి. ఈ మేరకు ఆయా జిల్లాల పాలనా యంత్రాంగాలు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తున్నాయి. కొత్త మున్సిపల్ చట్టం– 2019 ప్రకారం నాలుగేళ్ల క్రితం రాష్ట్రంలో ఏడు మున్సిపల్ కార్పొరేషన్లు.. బడంగ్పేట, బండ్లగూడ జాగీర్, మీర్పేట–జిల్లెలగూడ, బోడుప్పల్, ఫిర్జాదిగూడ, జవహర్నగర్, నిజాంపేటలను ఏర్పాటుచేశారు. ఇవన్నీ హైదరాబాద్ శివార్లలో రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలోనే ఉన్నాయి. మిగతా చోట్ల ఉన్న పెద్ద మున్సిపాలిటీలను అప్గ్రేడ్ చేయలేదు. ఈ క్రమంలో మున్సిపాలిటీలుగానే ఉన్న కొ న్ని జిల్లా కేంద్రాలతోపాటు కొత్త జిల్లా కేంద్రాలుగా మారిన పలు పట్టణాల్లో పెరిగిన జన సాంద్రతకు అనుగుణంగా వాటిని కా ర్పొరేషన్లుగా మార్చాలనే డిమాండ్ వస్తోంది. గ్రేడ్–1, స్పెషల్ గ్రేడ్ స్థాయి మున్సిపాలిటీలలో.. కొత్త మున్సిపల్ చట్టం ప్రకారం.. కనీసం మూడు లక్షల జనాభా గల పట్టణాలను కార్పొరేషన్లుగా మార్చుకునే వీలుంది. రాష్ట్రంలో నల్లగొండ, మహబూబ్నగర్, ఆదిలాబాద్, సిద్ధిపేట, మంచిర్యాల పట్టణాలు స్పెషల్ గ్రేడ్, గ్రేడ్–1 స్థాయి మున్సిపాలిటీలుగా ఉన్నాయి. వీటిలో కొన్ని గ్రామాలు, పట్టణాలను విలీనం చేయడం ద్వారా కార్పొరేషన్లుగా మార్చుకునే అవకాశముంది. - గ్రేడ్–1 మున్సిపాలిటీగా ఉన్న మహబూబ్నగర్ను కార్పొరేషన్ చేయాలని మంత్రి శ్రీనివాస్గౌడ్ పట్టుదలతో ఉన్నారు. ఆయన సూచనల మేరకు దివిటిపల్లి, ధర్మాపూర్, జైనల్లీపూర్తోపాటు మరో గ్రామాన్ని విలీనం చేసి కార్పొరేషన్గా మార్చాలని జిల్లా కలెక్టర్ రవి నాయక్ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. - ఇదే తరహాలో జనాభా ప్రాతిపదికన నల్లగొండ, ఆదిలాబాద్ మున్సిపాలిటీలను కూడా విస్తరించి కార్పొరేషన్లుగా అప్గ్రేడ్ చేయాలన్న చాలా కాలం నుంచీ డిమాండ్లు ఉన్నాయి. ఈసారి ఆ దిశగా ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. కార్పొరేషన్లుగా మారితే ఈ రెండు పట్టణాలు సరికొత్తగా మారుతాయని ప్రజా ప్రతినిధులు చెప్తున్నారు. - కొత్తగా ఏర్పాటైన జిల్లా కేంద్రాలలో సిద్ధిపేట, మంచిర్యాల వేగంగా విస్తరిస్తున్నాయి. ఇప్పటికే స్పెషల్ గ్రేడ్ స్థాయికి ఎదిగిన ఈ మున్సిపాలిటీల్లో చుట్టుపక్కల గ్రామాలు, కొత్తగా ఏర్పాటైన మున్సిపాలిటీలను విలీనం చేస్తే కార్పొరేషన్లుగా రూపొందుతాయి. మంచిర్యాలకు నస్పూర్, క్యాతనపల్లి మున్సిపాలిటీలతోపాటు కొన్ని గ్రామ పంచాయతీలను కలిపితే కార్పొరేషన్గా అప్గ్రేడ్ కానుంది. వేగంగా అభివృద్ధి చెందుతున్న సిద్ధిపేటకు మరికొన్ని గ్రామాలను విలీనం చేయడం ద్వారా కార్పొరేషన్ హోదా పొందే అవకాశం ఉంది. కరీంనగర్లో మరికొన్ని గ్రామాల విలీనం? కరీంనగర్ పట్టణంలో కలసిపోయి/ ఆనుకుని ఉన్న బొమ్మకల్, చింతకుంట, నగునూరు, మల్కాపూర్, తిమ్మాపూర్ గ్రామాలు వివిధ కారణాల వల్ల కార్పొరేషన్లో విలీనం కాలేదు. పట్టణంలోని హౌజింగ్బోర్డు, ఖార్కాన గడ్డ, బైపాస్ రోడ్డు, చల్మెడ మెడికల్ కాలేజీ ఉన్న ప్రాంతమంతా బొమ్మకల్ గ్రామం పరిధిలోనే ఉంది. ప్రతిమ మెడికల్ కాలేజీ, హాస్పిటల్ ఉన్న నగునూరు కూడా పంచాయతీగానే కొనసాగుతోంది. ఈ గ్రామాల కంటే దూరంగా ఉన్న వాటిని కార్పొరేషన్లో విలీనం చేసి.. వీటిని రాజకీయ కారణాలతో కలపలేదనే ఆరోపణలు ఉన్నాయి. తాజాగా వీటిని కార్పొరేషన్లో విలీనం చేయాలనే ప్రతిపాదనలు సిద్ధమైనట్టు తెలిసింది. పట్టణీకరణతో మెరుగవుతున్న జీవన ప్రమాణాలు పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా పట్టణాలను కార్పొరేషన్లుగా మార్చడం వల్ల ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయి. మౌలిక వసతులు సమకూరుతాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ విషయంలో స్పష్టమైన వైఖరితో ఉంది. గతంలో 6 కార్పొరేషన్లు మాత్రమే ఉంటే కొత్తగా మరో ఏడింటిని కొత్త నగరాలుగా తీర్చిదిద్దారు. 69 మున్సిపాలిటీలు 128కి పెరిగాయి. ఇప్పుడు కూడా జనాభాకు అనుగుణంగా కొత్త కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తే స్వాగతిస్తాం. – రాజు వెన్రెడ్డి, మున్సిపల్ చాంబర్స్ చైర్మన్, చౌటుప్పల్ మున్సిపల్ చైర్మన్. ఇది కూడా చదవండి: ఉప్పల్ సరే.. మరి లష్కర్? -
బిల్లును ఓకే చేయించి.. అవిశ్వాసాలు ఆపేలా..!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పలు కార్పొరేషన్లు, మున్సిపాలిటీలలో నెలకొన్న అవిశ్వాసాల గందరగోళానికి తెర దించాలని ప్రభుత్వం భావిస్తోంది. జనవరి 26తో మూడేళ్ల పదవీకాలం పూర్తి చేసుకొన్న 127 పట్టణ, నగర పాలక మండళ్లలో చాలా చోట్ల లుకలుకలు బహిర్గతమయ్యాయి. పలుచోట్ల ఇప్పటికే మున్సిపల్ చైర్పర్సన్లు, మేయర్లపై అవిశ్వాస తీర్మానానికి నోటీసులు కూడా ఇచ్చారు. కొన్ని పట్టణాల్లో క్యాంపులు, కొనుగోళ్ల పర్వం కూ డా మొదలైంది. అవిశ్వాసాలు ప్రతిపాదించిన పట్ట ణాలు, నగరాల్లో అధికార బీఆర్ఎస్ పాలక మండళ్లే కొలువు తీరి ఉండటం, ప్రస్తుత మేయర్లు, చైర్పర్సన్లను గద్దె దించేందుకు సొంత పార్టీ ప్రతినిధులే అవిశ్వాసం నోటీసులు ఇవ్వడం గమనార్హం. ఈ నేపథ్యంలో ప్రభుత్వమే రంగంలోకి దిగింది. పట్టణ, నగర పాలక మండళ్లలో అవిశ్వాస తీర్మా నం ప్రవేశపెట్టేందుకు ఉన్న కనీస గడువును నాలుగేళ్లకు పెంచుతూ గత అసెంబ్లీ సమావేశాల్లో తీసుకొచ్చిన బిల్లు ఆమోదం పొందితే మరో ఏడాది వర కు సమస్య ఉండదని భావిస్తోంది. రెండు, మూడు రోజుల్లో మున్సిపల్ చట్ట సవరణ బిల్లుకు గవర్నర్ ఆమోదం లభించేలా పావులు కదుపుతోంది. మున్సిపల్ చట్ట సవరణ బిల్లు విషయమై ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్కుమార్ గవర్నర్ను కలవాలని నిర్ణయించినట్టు తెలిసింది. ఈ బిల్లు విషయంలో గవర్నర్కు ఏవైనా సందేహాలు ఉంటే నివృత్తి చేసి ఆమోదించాల్సిందిగా కోరాలని భావిస్తున్నట్టు తెలిసింది. ఇన్నాళ్లుగా పెండింగ్లో.. తెలంగాణ మున్సిపల్ చట్టం– 2019 ప్రకారం నగర, పురపాలక సంఘాల్లో మేయర్/ డిప్యూటీ మేయర్, మున్సిపల్ చైర్ పర్సన్/వైస్ చైర్పర్సన్లపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించేందుకు.. పాలక మండలి ఏర్పాటైన నాటి నుంచి కనీసం మూడేళ్లు గడువు పూర్తయి ఉండాలి. ఈ నిబంధనకు సవరణ చేయాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం గత సెప్టెంబర్లో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో అవిశ్వాస కనీస గడువును నాలుగేళ్లకు పెంచుతూ మున్సిపల్ చట్టం సవరణ బిల్లును ప్రవేశపెట్టింది. అసెంబ్లీ ఆమోదించినా గవర్నర్ వద్ద పెండింగ్లో పడింది. రాష్ట్ర ప్రభుత్వానికి, రాజ్భవన్కు మధ్య ఏర్పడిన అగాథం నేపథ్యంలో గవర్నర్ వద్ద ఆగిన ఏడు బిల్లుల్లో మున్సిపల్ చట్ట సవరణ బిల్లు కూడా ఉంది. మరోవైపు రాష్ట్రంలోని పుర/నగర పాలక సంస్థల పాలక మండళ్లకు గత నెల 26తో మూడేళ్ల పదవీకాలం పూర్తయింది. ఇదే అదనుగా అసమ్మతి ప్రజాప్రతినిధులు అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇవ్వడం మొదలుపెట్టారు. అవన్నీ కలెక్టర్ల వద్ద పెండింగ్లో ఉన్నాయి. ఈలోపే చట్ట సవరణ బిల్లు ఆమోదం పొందితే సమస్యకు చెక్పడుతుందని సర్కారు భావిస్తున్నట్టు సమాచారం. -
రెండు కార్పొరేషన్లకు చైర్మన్ల నియామకం
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ విభాగాల పరిధిలోని రెండు కార్పొరేషన్లకు నూతన చైర్మన్లను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. విద్యుత్ శాఖ పరిధిలోని తెలంగాణ పునరుద్ధరణీయ ఇంధన వనరుల కార్పొరేషన్ (రెడ్కో) చైర్మన్గా ఏరువ సతీశ్రెడ్డి, సమాచార, ప్రజా సంబంధాల శాఖ పరిధిలోని సినిమా, టెలివిజన్, నాటక రంగ అభివృద్ధి సంస్థ చైర్మన్గా అనిల్ కూర్మాచలం నియమితులయ్యారు. వీరు ఆ పదవుల్లో మూడేళ్లపాటు కొనసాగుతారని సీఎస్ సోమేశ్కుమార్ ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇంజనీరింగ్ పట్టభద్రుడైన సతీశ్రెడ్డి 2020 నుంచి టీఆర్ఎస్ సోషల్ మీడియా కమిటీ కన్వీనర్గా పనిచేస్తున్నారు. 2012 నుంచి 2019 వరకు ఆ పార్టీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన ఆయన 2018 ప్రగతి నివేదిక సభ డిజిటల్ మీడియా కమిటీ సభ్యుడిగా పనిచేశారు. సినిమా, టెలివిజన్, నాటక రంగ అభివృద్ధి సంస్థ చైర్మన్గా నియమితులైన అనిల్ ప్రస్తుతం టీఆర్ఎస్ ఎన్ఆర్ఐ విభాగం యూకే శాఖకు అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఎన్ఆర్ఐ టీఆర్ఎస్ సెల్, తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యూకే వ్యవస్థాపక సభ్యుడిగా క్రియాశీలకపాత్ర పోషించారు. -
ఉత్సాహంగా మూడోరోజు ‘పట్టణ ప్రగతి’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పట్టణప్రగతి మూడోరోజు కార్యక్రమం ఆదివారం ఉత్సాహంగా జరిగింది. ప్రజాప్రతినిధులు, అధికారులు వార్డుల్లో పర్యటిస్తూ ప్రజల సమస్యలపై అక్కడికక్కడే స్పందించి పరిష్కరించారు. మున్సిపల్ శాఖ తెలిపిన వివరాల ప్రకారం... రాష్ట్రవ్యాప్తంగా ఏడుగురు మంత్రులు, ఒక ఎంపీ, 28 మంది ఎమ్మెల్యేలతోపాటు మేయర్, డిప్యూటీ మేయర్, చైర్మన్, వైస్ చైర్మన్లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జీహెచ్ఎంసీసహా 141 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో 10,189 టన్నుల చెత్త, 1,059 కిలోమీటర్ల మేర రోడ్ల పక్కనున్న పొదలు, 3,129 టన్నుల శిథిలవ్యర్థాలను తొలగించారు. 897 కిలోమీటర్ల మేర మురుగు కాలువల్లో పూడిక తీశారు. మురుగు, వరద నీటికాల్వలు, కల్వర్టుల వద్ద 146 జాలీలను ఏర్పాటు చేశారు. 1,256 ప్రజా మరుగుదొడ్లు, 644 ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, 546 మతపరమైన ప్రదేశాలు, పార్కులను శుభ్రంచేశారు. 182 లోతట్టు ప్రాంతాలను పూడ్చారు. 1,32,762 ప్రాంతాల్లో ఫాగింగ్, స్ప్రే చేశారు. 121 కిలోల సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను సీజ్ చేసి, బాధ్యులపై రూ.15,303 అపరాధ రుసుం విధించారు. పనిచేయని, ఎండిపోయిన 71 బోర్లను మూసివేశారు. 36 ఇంకుడు గుంతలను పునరుద్ధరించడంతోపాటు కొత్తగా పదింటిని నిర్మించారు. శిథిలావస్థలో ఉన్న 68 ఇళ్లను తొలగించినట్లు తెలిపారు. విద్యుత్ మరమ్మతులు.. వైకుంఠధామాలు 125 విద్యుత్, నీటిమీటర్లకు మరమ్మతులు చేశారు. 26 మోటార్లకు కెపాసిటర్లు బిగించారు. 113 వంగిన స్తంభాలను సరిచేసి, 56 తుప్పు పట్టిన విద్యుత్స్తంభాలను మార్చారు. 2,100 మీటర్ల మేర వేలాడుతున్న విద్యుత్ వైర్లను సరిచేశారు. 84 వైకుంఠధామాలు, శ్మశాన వాటికలను శుభ్రంచేశారు. 141 వైకుంఠధామాల పనులు ప్రారంభించారు. 28 వైకుంఠ రథాలను కొనుగోలు చేశారు. 25 మార్కెట్లు, రైతుబజార్లను శుభ్రం చేశారు. 42 క్రీడాప్రాంగణాలను ప్రారంభించారు. మొక్కల సంరక్షణకు అనువుగా... పట్టణాలు, నగరాల్లో 24,045 మొక్కల మధ్య కలుపు తీసి ట్రీగార్డులను ఏర్పాటు చేశారు. రోడ్లకు ఇరువైపులా 11,779, రోడ్ల మధ్యన ఉన్న పాదుల్లో 6, 844 మొక్కలను నాటారు. కొత్తగా 36 స్థలాలను ట్రీ పార్కుల కోసం గుర్తించారు. కొత్త ట్రీ పార్కులో 2,252 గుంతలను మొక్కలు నాటడానికి అనువుగా తీశారు. 14,210 మొక్కలను ఇళ్లకు పంపిణీ చేశారు. మొక్కలు పెంచిన 21 మందిని సన్మానించారు. 320 ప్రదేశాల్లో పైపులైన్ లీకేజీలను గుర్తించి నీరు కలుషితం కాకుండా సరిచేశారు. 44 పంపు సెట్లను బ్రేక్డౌన్ కాకుండా సరిచేశారు. 321 మందికి ఒక రూపాయికి నల్లా కనెక్షన్ను ఇచ్చారు. 148 మందికి రూ.100కు నల్లా నీటి కనెక్షన్ ఇచ్చారు. -
కేంద్రం సంస్కరణలకు అనుగుణంగానే ఆస్తి పన్ను
సాక్షి, అమరావతి: మునిసిపాలిటీలు, కార్పొరేషన్ల లో ప్రభుత్వాలు చేస్తున్న ఖర్చుకు తగ్గట్టుగా ఆదాయం కూడా పెంచుకోవాలని కేంద్రం అన్ని రాష్ట్రాలకు సూచించింది. ఆర్థిక వ్యవస్థలో క్రమశిక్షణను నెలకొల్పడం, ప్రభుత్వ నిధుల నిర్వహణను మెరుగుపరచడంతోపాటు ద్రవ్య లోటును తగ్గించడం వంటి లక్ష్యాలను చేరుకునేందుకు ‘ఫిస్కల్ రెస్పాన్స్బిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ (ఎఫ్ఆర్బీఎం)’ చట్టాన్ని కేంద్రం తీసుకొచ్చింది. దీన్ని గతేడాది ఏప్రిల్ 1 నుంచి అమలు చేయాలని రాష్ట్రాలను ఆదేశించింది. దీంతోపాటు 15వ ఆర్థిక సంఘం సంస్కరణలను సైతం అమలు చేయాలని సూచించింది. దీనికనుగుణంగా మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో స్థానిక సబ్ రిజిస్ట్రార్ లెక్కల ప్రకారం.. ఆస్తి మార్కెట్ విలువ ఎంతుందో లెక్కించి పన్ను విధించాలని మార్గదర్శకాలను సైతం నిర్దేశించింది. దీంతో ఆంధ్రప్రదేశ్, తెలంగా ణతోపాటు మరో 9 రాష్ట్రాలు ఈ పన్ను విధానాన్ని అమలు చేస్తున్నాయి. ఆస్తి విలువ ఆధారంగా పన్ను చట్ట ప్రకారం.. మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో ఆస్తి విలువను ప్రతి ఐదేళ్లకు ఒకసారి మదింపు చేపట్టి అందుకనుగుణంగా ఆస్తి పన్ను పెంచాలి. కానీ వివిధ కారణాలతో పెంపు చర్యలు తీసుకోలేదు. రాష్ట్రంలో చివరిసారిగా 2002లో నివాసయోగ్య ఆస్తులు, 2007లో నివాసేతర ఆస్తుల (కమర్షియల్) పన్నును మదింపు చేశారు. అప్పట్లో ఆస్తుల వార్షిక అద్దె ప్రాతిపదికగా పన్ను విధానం అమలులో ఉండేది. దీనివల్ల ఒకే ప్రాంతంలో పన్ను విధింపులో అసమానతలు ఉండేవి. దీన్ని సరిచేసేందుకు ఆస్తి మార్కెట్ విలువ ప్రకారం.. పన్ను ఉండాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు దిశానిర్దేశం చేసింది. -
కూలుతున్న అక్రమ కట్టడాలు
సాక్షి, హైదరాబాద్: మున్సిపాలిటీలుగా మారిన గ్రామ పంచాయతీలలో సరైన అనుమతులు లేకుండా నిర్మించిన అక్రమ కట్టడాలపై సర్కారు కన్నెర్ర చేసింది. వాటిని కూల్చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. గ్రామ పంచాయతీల అనుమతి పేరు చెప్పి కొత్తగా ఏర్పాటైన మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో గత మూడేళ్లుగా భారీ ఎత్తున నిర్మాణాలు సాగుతూనే ఉన్నాయి. నెలక్రితం దుండిగల్లో పంచాయతీ అనుమతితో అక్రమంగా నిర్మిస్తున్న కట్టడం విషయం వెలుగుచూడడంతో పురపాలక శాఖ సీరియస్ అయింది. మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్, సీడీఎంఏ సత్యనారాయణ ఇతర అధికారులు సమావేశమై రాష్ట్ర వ్యాప్తంగా అక్రమ నిర్మాణాలపై కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించారు. గ్రామ పంచాయతీ నుంచి గతంలో నిర్మాణ అనుమతి పొందినప్పటికీ, మున్సిపాలిటీలు లేదా కార్పొరేషన్లుగా మారాక ఆయా ప్రాంతాల్లో తిరిగి సంబంధిత విభాగాల అనుమతి పొందాలని, లేని పక్షంలో కూల్చివేస్తామని ప్రభుత్వం ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది. ఈ క్రమంలో సంక్రాంతి పండుగ ముగిసిన వెంటనే పురపాలక శాఖ అధికారులు అక్రమ భవన నిర్మాణాలపై చర్యలు ప్రారంభించారు. ఆయా జిల్లాల టాస్క్ ఫోర్స్ బృందాలు సోమవారం నుంచే భవన నిర్మాణాల కూల్చివేతకు శ్రీకారం చుట్టాయి. హైదరాబాద్ శివార్లలోని జిల్లాల్లో ముందుగా 600 చదరపు గజాల విస్తీర్ణానికి మించి ఉన్న అక్రమ నిర్మాణాలపై ఆయా జిల్లాల టాస్క్ ఫోర్స్ బృందాలు చర్యలకు దిగాయి. కూల్చివేతలను మంగళవారం సైతం కొనసాగించారు. ఇతర జిల్లాల్లో సైతం భారీగా అక్రమ కట్టడాలు రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా ఏర్పాటైన మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో విలీనమైన గ్రామాల్లో రెండేళ్ల కాలంలో నిర్మించిన, నిర్మిస్తున్న కట్టడాల డేటాను అధికారులు సేకరించారు. ఈ మేరకు కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, రామగుండం, ఖమ్మం కార్పొరేషన్లతో పాటు వాటికి ఆనుకొని ఉన్న కొత్త మున్సిపాలిటీల్లో కూడా గ్రామ పంచాయతీ అనుమతి పేరిట భారీగా నిర్మాణాలు జరిగినట్లు గుర్తించారు. వ్యక్తిగత నివాస భవనాలతో పాటు కళాశాలలు, హాస్టళ్లు, స్కూళ్లను బహుళ అంతస్తుల్లో నిర్మించినట్లు కనుగొన్నారు. వీటిలో స్థానిక పట్టణ అథారిటీ, డీటీసీపీ అనుమతి లేకుండా సాగిన నిర్మాణాలన్నింటినీ కూల్చివేయాలని కృత నిశ్చయంతో ఉన్నట్లు పురపాలక శాఖ అధికారి ఒకరు తెలిపారు. -
పద్ధతిగా పట్టణాభివృద్ధి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను పద్ధతి ప్రకారం అభివృద్ధి చేసే ప్రక్రియ రూపుదిద్దుకుంటోంది. పట్టణాలలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మౌలిక సదుపాయాల కల్పనకు సర్కార్ మాస్టర్ప్లాన్ సిద్ధం చేస్తోంది. వానలు, వరదలు వచ్చినా నష్టం కలగకుండా పట్టణాల్లో నాలాల అభివృద్ధి, మురుగునీటి శుద్ధీకరణ ప్లాంట్ల ఏర్పాటు, అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మొదలు పన్ను వసూళ్లకు శాస్త్రీయ విధానాన్ని రూపొందించడం వరకు మాస్టర్ ప్లాన్లో పొందుపరుస్తోంది. జీహెచ్ఎంసీ, శివారు ప్రాంతాలతోపాటు వరంగల్ కార్పొరేషన్, ఇతర పట్టణాల్లో గత రెండేళ్లుగా వర్షాలతో ప్రజలు పడుతున్న కష్టాలు పునరావృతం కాకుండా మాస్టర్ప్లాన్లు రెడీ అవుతున్నాయి. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం అయిన జూన్ 2 నాటికి అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో మాస్టర్ప్లాన్లను సిద్ధం చేయాలని మున్సిపల్ శాఖ మంత్రి కె. తారక రామారావు అధికారులను ఆదేశించినట్లు సమాచారం. రెసిడెన్షియల్, వాణిజ్య, గ్రీన్ జోన్లుగా.. మాస్టర్ ప్లాన్ ప్రకారం నగరాలు, పట్టణాలను నివాస, వాణిజ్య, బఫర్ లేదా గ్రీన్ జోన్లుగా విభజించి అభివృద్ధి చేయాలని మున్సిపల్ శాఖ నిర్ణయించింది. బెంగళూరు, చండీగఢ్ నగరాల తరహాలో నివాస, నివాసేతర ప్రాంతాలను జోన్లుగా విభజించనుంది. మున్సిపాలిటీల్లో ఇప్పటికే ఉన్న విధానాన్ని పూర్తిస్థాయిలో మార్చలేకపోయినా కొత్తగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో జోన్ల వారీగా విభజించి రోడ్లు, డ్రైనేజీలను అభివృద్ధి చేయనుంది. క్రీడా మైదానాలు, ఎగ్జిబిషన్లతోపాటు ప్రజలకు ఉపయోగపడే వాటిని గుర్తించి అభివృద్ధి చేపట్టనుంది. ఈ జోన్లను జీఐఎస్ (జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్)తో అనుసంధానించి భవిష్యత్ అవసరాలకు తగ్గట్లు మౌలికవసతులు అభివృద్ధి చేయనుంది. ప్రయోగాత్మకంగా 17 మున్సిపా లిటీల్లో ఇప్పటికే జీఐఎస్ ఆధారిత మాస్టర్ ప్లాన్లు తయారు చేసి అమలు తీరును పరీక్షించింది. మాస్టర్ ప్లాన్లో రోడ్ నెట్వర్క్, జనాభా, భౌగోళిక అంశాల వంటి 40 అంశాలను పరిగణనలోకి తీసుకోనుంది. పట్టణ ప్రగతి కింద ఇప్పటికే.. పట్టణ ప్రగతి కార్యక్రమం కింద ఇప్పటికే ప్రభుత్వం మున్సిపాలిటీలకు రూ. 2,062 కోట్లు విడుదల చేసింది. జీహెచ్ఎంసీ పరిధిలో రూ. 858 కోట్ల వ్యయంతో 49 నాలాల అభివృద్ధి పనులను 15 ప్యాకేజీల కింద చేపట్టింది. 2,067 పట్టణ ప్రకృతి వనాలు, 400 కి.మీ. మేర రహదారుల వెంట మల్టీలెవల్ అవెన్యూ ప్లాంటేషన్ పనులను పురపాలక శాఖ చేస్తోంది. హైదరాబాద్ సీవరేజ్ ట్రీట్మెంట్ మాస్టర్ ప్లాన్ కోసం రూ. 5 వేల కోట్లు వెచ్చించనుంది. వరంగల్లో వ్యర్థాల బయో మైనింగ్ ప్రాజెక్టుతోపాటు పట్టణాల్లో బయో మైనింగ్, ప్రాసెసింగ్ ప్లాంట్లు, ఎఫ్ఎస్ఏపీలను సిద్ధం చేయనుంది. 38 పట్టణాల్లో రూ. 1,433 కోట్లతో నీటిసరఫరా పథకాలు, రూ. 700 కోట్లతో సమీకృత శాకాహార, మాంసాహార మార్కెట్లు, రూ. 61 కోట్లతో మెహదీపట్నం, ఉప్పల్లో స్కై వాక్ నిర్మాణాలతోపాటు కొత్వాల్గూడ దగ్గర్లో 85 ఎకరాల్లో ఎకో పార్క్ ఏర్పాటు వంటివన్నీ మాస్టర్ ప్లాన్లో భాగమే. 70 పట్టణాల్లో మాస్టర్ ప్లాన్లు రెడీ... రాష్ట్రంలో హైదరాబాద్తోపాటు వరంగల్, కరీంనగర్, రామగుండం, నిజామాబాద్ తదితర కార్పొరేషన్లలో ఇప్పటికే మాస్టర్ ప్లాన్లను సిద్ధం చేశారు. మొత్తంగా 70 నగరాలు, పట్టణాల్లో మాస్టర్ ప్లాన్లు సిద్ధమయ్యాయని, మరో 37 మున్సిపాలిటీలకు సంబంధించిన మాస్టర్ ప్లాన్లను నెల రోజుల్లో సిద్ధం చేసేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని ఓ అధికారి తెలిపారు. -
తెలంగాణలో నగరాలు, పట్టణాల అభివృద్ధికి సర్కారు ప్రణాళికలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను పద్ధతి ప్రకారం అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఆయా ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు మాస్టర్ ప్లాన్ రెడీ చేస్తోంది. వానలకు నగరాలు, పట్టణాలు అతలాకుతలం కాకుండా రూపురేఖలు మార్చాలని సంకల్పించింది. సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు, నిర్మాణాలకు అనుమతి, మునిసిపల్ నిబంధనలు కశ్చితంగా అమలు చేయడంపై దృష్టి పెట్టబోతోంది. జీహెచ్ఎంసీతో పాటు వరంగల్, ఇతర పట్టణాల్లో గత రెండేళ్లుగా వర్షాలతో ఎదురవుతున్న ఇబ్బందులతో పాటు రాష్ట్రంలోని మున్సిపాలిటీల్లో మౌలిక సదుపాయాల కల్పన, భవిష్యత్తు కార్యాచరణకు ప్రణాళికను సిద్ధం చేయాలని అధికారులను మునిసిపల్ శాఖ మంత్రి కె. తారకరామారావు ఆదేశించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఆధునిక వసతులతో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు అధికారులు సమాయత్తమవుతున్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచే పట్టణాలు, నగరాల్లో సౌకర్యాల కల్పన, అభివృద్ధి పనులకు సంబంధించి ప్రణాళికబద్ధమైన కార్యాచరణ ఉండేలా సిద్ధమయ్యారు. రెసిడెన్షియల్, వాణిజ్య,గ్రీన్ జోన్లుగా విభజించి.. మాస్టర్ ప్లాన్ ప్రకారం నగరాలు, పట్టణాలను నివాస, వాణిజ్య, బఫర్ లేదా గ్రీన్ జోన్లుగా విభజించి అభివృద్ధి చేయాలని మున్సిపల్ శాఖ భావిస్తోంది. బెంగళూరు, చండీగఢ్ నగరాల తరహాలో ఆయా ప్రాంతాలను జోన్లుగా విభజించి మాస్టర్ ప్లాన్ ప్రకారం అభివృద్ధి చేయాలనుకుంటోంది. మున్సిపాలిటీల్లో ఇప్పటికే ఉన్న విధానాన్ని పూర్తిస్థాయిలో మార్చలేకపోయినా కొత్తగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో ప్రణాళిక పద్ధతిలో రోడ్లు, డ్రైనేజీలను అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. క్రీడా మైదానాలు, ఎగ్జిబిషన్లతో పాటు ప్రజలకు ఉపయోగపడే వాటిని గుర్తించి తదనుగుణంగా నిర్ణయం తీసుకుంటారు. ఈ జోన్లను జీఐఎస్తో అనుసంధానించి భవిష్యత్ అవసరాలకు తగ్గట్లు మౌలిక వసతులు అభివృద్ధి చేయనున్నారు. ప్రయోగాత్మకంగా రాష్ట్రంలోని 17 మున్సిపాలిటీల్లో జీఐఎస్ (జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్) ఆధారిత మాస్టర్ ప్లాన్లు తయారు చేసి అమలు చేసే పనుల్లో పురపాలక శాఖ పురోగతిలో ఉంది. తర్వాత మిగతా మున్సిపాలిటీలను ప్రాధాన్యత క్రమంలో అభివృద్ధి చేయాలని భావిస్తున్నారు. పట్టణ ప్రగతి కింద ఇప్పటికే.. పట్టణ ప్రగతి కార్యక్రమం కింద ఇప్పటికే రూ. 2,062 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. రూ.858 కోట్లతో 49 నాలాల అభివృద్ధి పనులను 15 ప్యాకేజీల కింద చేపట్టింది. 2,067 పట్టణ ప్రకృతి వనాలు, 400 కిలోమీటర్ల మేర రహదారుల వెంట మల్టీ లెవల్ అవెన్యూ ప్లాంటేషన్ పనులను పురపాలక శాఖ చేస్తోంది. హైదరాబాద్ సీవరేజ్ ట్రీట్మెంట్ మాస్టర్ ప్లాన్ కో సం రూ. 5 వేల కోట్లు వెచ్చించనుంది. వరంగల్ వ్యర్థాల బయో మైనింగ్ ప్రాజెక్టుతో పాటు పట్టణాల్లో బయో మైనింగ్, ప్రాసెసింగ్ ప్లాంట్లు, ఎఫ్ఎస్ఏపీలను సిద్ధం చేయనుంది. కరీంనగర్, రామగుండం, నిజామాబాద్ కార్పొరేషన్లలో మాస్టర్ ప్లాన్లు రెడీ అయ్యాయి. 38 పట్టణాల్లో రూ.1,433 కోట్లతో నీటి సరఫరా పథకాలు, రూ.700 కోట్లతో సమీకృత శాఖాహార, మాంసాహార మార్కెట్లు, రూ.61 కోట్లతో మెహిదీపట్నం, ఉప్పల్లో స్కై వాక్ నిర్మాణాలు, కొత్వాల్ గూడ దగ్గర ఎకో పార్క్ నిర్మించనున్నారు. -
ఏపీలో ఆర్థికంగా వెనుకబడినవారి కోసం కొత్త సంక్షేమ శాఖ
-
AP: అగ్రవర్ణ పేదల సంక్షేమానికి ప్రత్యేక శాఖ
సాక్షి, అమరావతి: ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణ పేదల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శాఖను ఏర్పాటు చేసింది. ఈడబ్ల్యూఎస్ సంక్షేమ (ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు) శాఖను ఏర్పాటు చేస్తూ సాధారణ పరిపాలన శాఖ మంగళవారం ఉత్తర్వులిచ్చింది. ఈ శాఖ పరిధిలోకి కమ్మ,రెడ్డి, బ్రాహ్మణ, క్షత్రియ, కాపు, ఆర్య వైశ్య కార్పొరేషన్లు రానున్నాయి. అలాగే జైన్ల సంక్షేమానికి, సిక్కుల సంక్షేమానికి వేర్వేరు కార్పొరేషన్లను ఏర్పాటు చేస్తూ రెండు జీవోలను జారీ చేసింది. ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో వీటి ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. (చదవండి: Rain Alert: ఏపీలో భారీ వర్షాలు) -
ప్రజాప్రతినిధులకు నో చాన్స్
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్లో సంస్థాగత కమిటీల ఏర్పాటు ప్రక్రియ ఊపందుకుంది. ఈ నెల 2న ఇది ప్రారంభం కాగా 12లోగా గ్రామ పంచాయతీ, మున్సిపల్ వార్డుల స్థాయిలో కమిటీలు పూర్తి చేయాల్సి ఉంది. పార్టీ షెడ్యూల్ ప్రకారం ఈ నెల 20లోగా మండల, మున్సిపల్, పట్టణ కమిటీలు కూడా పూర్తి కావాలి. 20 తర్వాత జిల్లా, రాష్ట్ర కమిటీలను పార్టీ అధినేత కేసీఆర్ సూచనల మేరకు నియమిస్తారు. కేసీఆర్ నిర్ణయం మేరకు గతంలో నియోజకవర్గ, రాష్ట్ర స్థాయి కమిటీలు ఏర్పాటు కాగా, తాజాగా జిల్లా కమిటీలను పునరుద్ధరించాలని నిర్ణయించారు. దీంతో అధికారిక పదవులు దక్కని నేతలు పార్టీ జిల్లా, రాష్ట్ర కమిటీల్లో చోటు కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. ముఖ్య నేతలకు ప్రాధాన్యం... 2017, అక్టోబర్లో నియమించిన టీఆర్ఎస్ రాష్ట్ర కమిటీ నాలుగేళ్లుగా స్వల్ప మార్పులతో కొనసాగుతూ వస్తోంది. ఈ కమిటీలో పార్టీ పార్లమెంటరీ నేత కె.కేశవరావుకు సెక్రటరీ జనరల్ పదవి, 20 మందికి ప్రధాన కార్యదర్శులుగా, 33 మందికి కార్యదర్శులుగా, 12 మందికి సహాయ కార్యదర్శులుగా పదవులు దక్కాయి. వీరిలో ప్రస్తుతం సత్యవతి రాథోడ్కు మంత్రి పదవి, కొందరికి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ దక్కగా, మరికొందరు ఇతర నామినేటెడ్ పదవులు పొందారు. వివిధ సందర్భాల్లో పార్టీలో చేరిన ముఖ్య నేతలు కొందరికి అటు అధికార పదవులు, ఇటు పార్టీ పదవులు లేకపోవడంతో అసంతృప్తి చెందుతున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా కమిటీలు, రాష్ట్ర కమిటీల్లో ఇలాంటి వారికి ప్రాధాన్యత ఇవ్వాలని కేసీఆర్ భావిస్తున్నారు. పార్టీ బలోపేతానికి వీరి సేవలు, అనుభవాన్ని వాడుకునేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఇప్పటికే అధికార పదవులు అనుభవిస్తున్న నేతలకు పార్టీ కమిటీల్లో చోటు లభించే అవకాశం లేదని సమాచారం. త్వరలో నామినేటెడ్ పదవుల భర్తీ? పార్టీ రెండోసారి అధికారంలోకి వచ్చి సుమారు మూడేళ్లు కావస్తున్నా నామినేటెడ్ పదవుల భర్తీ ప్రక్రియ పూర్తిగా జరగలేదు. 50కి పైగా ప్రభుత్వ కార్పొరేషన్లు, మండళ్లలో చైర్మన్, డైరెక్టర్ స్థానాలు కలుపు కొని సుమారు 500 వరకు పదవులు భర్తీ చేయాల్సి ఉంది. త్వరలో వీటి భర్తీని చేపడతామని మంగళవారం జరిగిన ‘గ్రేటర్’టీఆర్ఎస్ భేటీలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ప్రకటించారు. మరో 18 ఎమ్మెల్సీ స్థానాలకు వచ్చే జనవరిలోగా ఎన్నికలు జరగాల్సి ఉంది. దీంతో అధికార, నామినేటెడ్ పదవులతో పాటు పార్టీ పదవులు ఆశిస్తున్న నేతలు కేసీఆర్, కేటీఆర్ దృష్టిలో పడేందుకు తమవంతు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. -
ఏపీ: 47 కార్పొరేషన్లకు 481 డైరెక్టర్ల నియామకం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 47 కార్పొరేషన్లకు 481 డైరెక్టర్లను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి డైరెక్టర్ల వివరాలను శనివారం వెల్లడించారు. ఈ సమావేశంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి వేణుగోపాల కృష్ణ, హోం మంత్రి మేకతోటి సుచరిత, ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్యే మేరుగ నాగార్జున పాల్గొన్నారు. ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో కార్పొరేషన్ ఛైర్మన్ల నియామకం ఊసే లేదన్నారు. రాజ్యసభ సీటు విషయంలో బాబు ఎస్సీలను అవమానించారన్నారు. చంద్రబాబు.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను ఓటు బ్యాంక్గానే చూశారన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్వయంగా డైరెక్టర్ల నియమకంలోనూ పాల్గొని అన్ని వర్గాలకు పెద్దపీట వేశారన్నారు. సామాజిక న్యాయం కార్పొరేషన్ల స్థాయిలో అమలయ్యే విధంగా తయారు చేశారన్నారు. ఎస్సీ, బీసీ, మైనార్టీలకు 58 శాతం పదవులు ఇచ్చామన్నారు. మహిళలకు 52 శాతం అవకాశం కల్పించామన్నారు. ఓసీలకు 42 శాతం పదలిచ్చామని తెలిపారు. బలహీన వర్గాలను ముందుకు తీసుకురావడమే సీఎం జగన్ లక్ష్యమని సజ్జల అన్నారు. బీసీలంటే చంద్రబాబుకు చులకన: మంత్రి వేణుగోపాల కృష్ణ బీసీలంటే చంద్రబాబుకు చులకన అని, వారిని ఓటు బ్యాంక్గానే చూశారని మంత్రి వేణుగోపాల కృష్ణ అన్నారు. బలహీన వర్గాలకు సీఎం జగన్ భరోసా కల్పించారన్నారు. సీఎంకు, సామాన్యుడికి మధ్యలో ఎవరూ లేరన్నారు. మహిళలకు 52 శాతం పదవులు: సుచరిత మహిళలకు సీఎం వైఎస్ జగన్ అధిక ప్రాధాన్యం ఇచ్చారని హోంమంత్రి సుచరిత అన్నారు. కార్పొరేషన్ డైరెక్టర్ల నియామకంలో మహిళలకు 52 శాతం పదవులు ఇచ్చారన్నారు. 31 లక్షల ఇళ్ల పట్టాలన్నీ మహిళల పేరు మీదే ఇచ్చి వారి ప్రాధాన్యం ఏమిటో చెప్పారని సుచరిత అన్నారు. ఎమ్మెల్యే మేరుగ నాగార్జున మాట్లాడుతూ.. బలహీనవర్గాల అభివృద్ధికి పాటుపడుతున్న నాయకుడు సీఎం జగన్ అని అన్నారు. కార్పొరేషన్ డైరెక్టర్ల నిమామకంలో అన్ని వర్గాలకు ప్రాధాన్యం ఇచ్చారని చెప్పారు. ఎంపీ నందిగం సురేష్ మాట్లాడుతూ.. కొంతమంది కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇచ్చిన దాన్ని పదవి అనుకోకుండా బాధ్యతలా పని చేయాలన్నారు. కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టే వారి పట్ల మనమంతా అప్రమత్తంగా ఉండాలని ఎంపీ పేర్కొన్నారు. ఇవీ చదవండి: ఏపీ: సర్కారు ఆస్పత్రులకు ఆరోగ్యశ్రీ నిధులు రెట్టింపు 6న అల్పపీడనం.. ఏపీలో భారీ వర్షాలు -
నామినేటెడ్ పోస్టులెప్పుడు?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడుస్తోంది. ఇప్పటికీ చాలా ప్రభుత్వరంగ సంస్థలు, కార్పొరేషన్లకు కొత్త పాలక మండళ్ల నియామకం జరగలేదు. ఆ నామినేటెడ్ పదవుల కోసం పెద్ద సంఖ్యలో టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు ఎదురుచూస్తున్నారు. వాటిని ఎప్పుడు భర్తీ చేస్తారో, తమకు ఎప్పుడు అవకాశం వస్తుందో అనే ఆశతో కీలక నేతల దృష్టిలో పడేందుకు ప్రయత్నిస్తున్నారు. మరో ఏడాదిన్నర గడిస్తే అసెంబ్లీ ఎన్నికల వాతావరణం మొదలయ్యే అవకాశం ఉండటంతో.. వీలైనంత త్వరగా నామినేటెడ్ పదవుల భర్తీ జరగాలని కోరుతున్నారు. రాష్ట్రస్థాయిలోనే కాకుండా జిల్లాల్లో దేవాలయాలు, మార్కెట్ కమిటీలు, గ్రంథాలయ సంస్థల పదవులు కూడా ఖాళీగా ఉండటంతో.. తమకు అవకాశం ఇవ్వాలంటూ కీలక నేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అయితే హుజూరాబాద్ ఉప ఎన్నిక హడావుడి ముగిశాకగానీ, అక్టోబర్ తర్వాతగానీ నామినేటెడ్ పదవుల భర్తీకి శ్రీకారం చుట్టవచ్చని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అప్పుడప్పుడు ఒకట్రెండు.. టీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చాక పరిమిత సంఖ్యలో మాత్రమే నామినేటెడ్ పదవుల భర్తీ జరిగింది. రాష్ట్రంలో వివిధ కేటగిరీల్లో ప్రభుత్వ రంగ సంస్థలు, చట్టబద్ధమైన కార్పొరేషన్లలో సుమారు 50కి పైగా పాలకమండళ్లు ఉన్నాయి. వాటిలో గణనీయంగానే ఖాళీలు ఉన్నాయి. మహిళా కమిషన్, టీఎస్పీఎస్సీ వంటి సంస్థలకు కోర్టు విధించిన గడువుకు తలొగ్గి నియమకాలు జరిపినట్టు విమర్శలు వచ్చాయి. రైతుబంధు సమితి, అటవీ అభివృద్ధి సంస్థ, మూసీ రివర్ ఫ్రంట్ కార్పొరేషన్, టీఎస్ఐఐసీ, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ తదితరాలకు కొత్త పాలకమండళ్లను నియమించారు. టీఎస్ఐఐసీ, స్పోర్ట్స్ అథారిటీ, వికలాంగుల కార్పొరేషన్కు గతంలో ఉన్న వారినే కొనసాగించారు. ఇటీవల హుజూరాబాద్కు చెందిన బండా శ్రీనివాస్ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్గా నియమితులయ్యారు. సాంస్కృతిక సారథి చైర్మన్గా ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ను మరోమారు నియమించారు. కొన్ని కార్పొరేషన్లకు చైర్మన్ల నియామకం జరిగినా సభ్యులను భర్తీ చేయకపోవడంతో పూర్తిస్థాయిలో కార్యకలాపాలు కొనసాగడం లేదు. భారీగానే ఆశావహులు.. తెలంగాణ ఉద్యమ కాలం నుంచీ పనిచేస్తున్న వారితోపాటు వివిధ సందర్భాల్లో పార్టీలో చేరిన నేతలతో టీఆర్ఎస్లో అన్నిచోట్లా బహుళ నాయకత్వం ఏర్పడింది. సుమారు 60కి పైగా అసెంబ్లీ నియోజకవర్గాల్లో విపక్షాలు బలహీనపడగా.. టీఆర్ఎస్లో ఒక్కో నియోజకవర్గంలో ఇద్దరు ముగ్గురు బలమైన నేతలు ఉన్నారు. శాసనసభ, శాసనమండలి, జెడ్పీ చైర్మన్, మున్సిపల్ మేయర్లు, చైర్మన్లుగా అవకాశాలు కల్పించినా.. ఇంకా రాష్ట్రస్థాయి పదవులను ఆశిస్తున్న నేతల జాబితా భారీగానే ఉంది. వివిధ సందర్భాల్లో పార్టీ అవసరాలతోపాటు సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని పదవులు భర్తీ చేస్తున్నా.. ఖాళీగా ఉన్న పదవులు ఆశావహులను ఆకర్షిస్తున్నాయి. ఆయా నేతలు సీఎం కేసీఆర్, కేటీఆర్లతోపాటు ఇతర కీలక నేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అయితే నామినేటెడ్ పదవుల భర్తీపై పార్టీ అధినేత, సీఎం కేసీఆర్కు స్పష్టమైన అవగాహన ఉందని.. ఎవరికి ఏ తరహా పదవులు ఇవ్వాలో ఆయనకు తెలుసని పార్టీ వర్గాలు అంటున్నాయి. పార్టీ కోసం పనిచేస్తున్న వారికి సరైన సమయంలో అవకాశాలు వస్తాయని పేర్కొంటున్నాయి. ఈ పదవులన్నీ ఖాళీయే.. పలు ప్రభుత్వ శాఖల పరిధిలోని కార్పొరేషన్లకు ఏళ్ల తరబడి పాలకమండళ్లను నియమించలేదు. బేవరేజెస్ కార్పొరేషన్, ఆర్టీసీ, పరిశ్రమల శాఖ పరిధిలో పలు సంస్థలకు పాలకమండళ్ల నియామకం జరగలేదు. మిషన్ భగీరథ, ఎస్టీ కార్పొరేషన్, ఎస్సీ, ఎస్టీ కమిషన్, సాహిత్య అకాడమీ, ఎంబీసీ, స్టేట్ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్, తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ, టెస్కోవంటి సంస్థల పదవులు ఖాళీగా ఉన్నాయి. జిల్లాస్థాయిలో గ్రంథాలయ సంస్థల పాలక మండళ్ల పదవీకాలం ముగిసినా పాతవారినే కొనసాగిస్తూ వస్తున్నారు. కాళేశ్వరం, వేములవాడ, యాదాద్రి తదితర ప్రధాన ఆలయాలు కూడా ఏళ్ల తరబడి పాలక మండళ్లు లేకుండానే ప్రత్యేకాధికారుల పాలనలో కొనసాగుతున్నాయి. రాష్ట్రంలోని 192 వ్యవసాయ మార్కెట్ కమిటీలకు గాను 30 కమిటీలకు పాలకమండళ్లు లేవు. -
పుణేలో పాక్షిక ఆంక్షల సడలింపు
సాక్షి, ముంబై: పుణే, పింప్రి–చించ్వడ్ కార్పొరేషన్ల పరిధిలో లాక్డౌన్ ఆంక్షలను ప్రభుత్వం పాక్షికంగా సడలించింది. ఈ మేరకు ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఉప ముఖ్యమంత్రి, పుణే జిల్లా ఇన్చార్జి మంత్రి అజిత్ పవార్ ఆంక్షల సడలింపు ప్రకటన చేశారు. ఆగస్టు 9వ తేదీ నుంచే ఈ సడలింపులు అమల్లోకి వస్తాయని పవార్ వెల్లడించారు. దీంతో పుణే, పింప్రి–చించ్వడ్ కార్పొరేషన్ల పరిధిలోని వ్యాపార వర్గాలు, సామాన్య ప్రజల్లో ఆనందం వెల్లివిరిసింది. ఈ ఇరు కార్పొరేషన్లలో రికవరీ రేటు గణనీయంగా పెరగడంతో పాటు కరోనా వైరస్ కూడా మెల్లమెల్లగా అదుపులోకి వస్తోంది. దీంతో లాక్డౌన్ ఆంక్షలను పాక్షికంగా సడలించాలని నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పుణే జిల్లా ఇన్చార్జి మంత్రి అజిత్ పవార్ తెలిపారు. సడలించిన నిబంధనల ప్రకారం ఈ రెండు కార్పొరేషన్ల పరిధిలో సోమవారం నుంచి శుక్రవారం వరకు అన్ని రకాల షాపులు ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు తెరిచి ఉంచేందుకు అనుమతి ఉంటుంది. హోటళ్లు రాత్రి 10 గంటల వరకు తెరిచి ఉంచేందుకు అనుమతించనున్నారు. మాల్స్ రాత్రి 8 గంటల వరకు తెరిచి ఉంటాయి. రెస్టారెంట్లు 50 శాతం సామర్థ్యంతో నడుపుకోవచ్చని అజిత్ పవార్ వెల్లడించారు. అయితే, కరోనా టీకా రెండు డోసులు తీసుకున్న వారిని మాత్రమే మాల్స్లోకి అనుమతించాలని పవార్ మాల్స్ యాజమాన్యాలకు సూచించారు. ఒకవేళ ప్రజల నిర్లక్ష్యం వల్ల పాజిటివిటీ రేటు 8 శాతాన్ని దాటితే సడలించిన ఆంక్షలను రద్దు చేస్తామని, మళ్లీ కఠిన ఆంక్షలను అమలు చేసేందుకు వెనుకాడబోమని పవార్ హెచ్చరించారు. ప్రజలు అందరూ మాస్క్ తప్పనిసరిగా ధరించాల్సిందేనని, భౌతికదూరం కచ్చితంగా పాటించాలని పవార్ విజ్ఞప్తి చేశారు. ప్రతీ ఒక్కరూ కోవిడ్ నియమాలను పాటించాలని ఆయన కోరారు. నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అజిత్ పవార్ హెచ్చరించారు. బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించవద్దని పౌరులందరికీ విజ్ఞప్తి చేశారు. ఈ రెండు కార్పొరేషన్ల పరిధిలోని ఉద్యానవనాలు ప్రస్తుతం అమలులో ఉన్న సమయానుసారంగానే తెరిచి ఉంటాయని వెల్లడించారు. పుణే, పింప్రి–చించ్వడ్ ప్రాంతాల్లో ఈత తప్ప మిగతా అన్ని క్రీడలకు అనుమతి ఉంటుందని తెలిపారు. ఇక్కడి ప్రార్థనా మందిరాలు అన్నీ మూసే ఉంటాయని స్పష్టం చేశారు. కాగా, తమ వ్యాపారాలు, కార్యకలాపాల వేళలను మార్చాలని పుణేలోని రెస్టారెంట్ల ఓనర్లు, వ్యాపారులు, మాల్ సిబ్బంది అసోసియేషన్లు డిమాండ్లు చేస్తూ గత కొద్ది రోజులుగా నిరసన కార్యక్రమాలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఇటీవలే రాష్ట్రంలోని 25 జిల్లాల్లో కరోనా ఆంక్షలు సడలించిన ప్రభుత్వం లెవల్–3 జిల్లాలైన పుణే సహా మరో 9 జిల్లాలకు కరోనా ఆంక్షలను సడలించలేదు. కాగా, ప్రస్తుతం పుణేలో పాజిటివిటీ రేటు 3.3 శాతానికి తగ్గిందని అధికారులు తెలిపారు. పింప్రి–చించ్వడ్ కార్పొరేషన్లో కూడా çకరోనా పాజిటివిటీ రేటు 3.7 శాతానికి తగ్గిందని అక్కడి అధికారులు వెల్లడించారు. -
ప్రభుత్వరంగ సంస్థల ఉద్యోగులకు తీపికబురు!
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 61 ఏళ్లకు పెంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని.. రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థలు (కార్పొరేషన్లు), గ్రాంట్–ఇన్–ఇన్స్టిట్యూషన్లు, సొసైటీలు, యునివర్సిటీలు (నాన్ టీచింగ్ స్టాఫ్), రాష్ట్ర ప్రభుత్వ నేతృత్వంలోని ఇతర సంస్థల్లో సైతం అమలు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ ఆదివారం ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో ఈ సంస్థలు తమ ఉద్యోగుల కోసం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును అడాప్ట్ చేసుకున్నాయని సీఎస్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపు కోసం తీసుకొచ్చిన ‘తెలంగాణ పబ్లిక్ ఎంప్లాయిమెంట్ (రెగ్యులేషన్ ఆఫ్ సూపర్అన్యూయేషన్) చట్ట సవరణ’గత మార్చి 30 నుంచి అమల్లోకి వచ్చిందని, ఈ నేపథ్యంలో పైన పేర్కొన్న సంస్థల ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపును సైతం అదే తేదీ నుంచి అమలుపర్చాలని ఆదేశించారు. ఆయా సంస్థల సర్వీసు రూల్స్కు ఈ మేరకు సవరణలు చేపట్టాలని కోరారు. ఇందుకు సంబంధిత అధికారుల నుంచి అనుమతి తీసుకోవాలని తెలిపారు. పదవీ విరమణ వయసు పెంపునకు తీసుకున్న చర్యలపై నిర్దేశిత నమూనాలో రాష్ట్ర ఆర్థిక శాఖకు నివేదించాలని సూచించారు. గత నెల 30 నుంచే ఈ నిర్ణయాన్ని అమలు చేయాలని ఆదేశించడంతో.. గత నెల 31న పదవీ విరమణ చేసిన పైన పేర్కొన్న సంస్థల ఉద్యోగుల సర్వీసు మరో మూడేళ్లు పెరిగింది. మళ్లీ వారు విధుల్లో చేరేందుకు అవకాశం లభించింది. -
బడుగు వర్గాలకే పెద్దపీట: 86 స్థానాల్లో ఎవరెవరు?
సాక్షి, అమరావతి: పురపాలక పదవుల్లో వైఎస్సార్సీపీ తరఫున ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకే సింహభాగం కేటాయిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చరిత్ర సృష్టించారు. చట్టం చెప్పిన దానికన్నా ఎక్కువగా ఈ వర్గాలకు పదవులు దక్కేలా కసరత్తు చేశారు. ఆ మేరకు రాష్ట్రంలోని 86 మున్సిపల్, నగర పంచాయతీ చైర్మన్లు, నగర మేయర్ల పదవుల్లో ఏ స్థానాన్ని ఏ సామాజికవర్గానికి కేటాయించింది.. వివరాలివీ.. -
మున్సిపాలిటీల్లో సంస్కరణలపై సీఎం జగన్ సమీక్ష
సాక్షి, అమరావతి: కార్పొరేషన్లు, మున్సిపాలిటీలలో సంస్కరణలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి బొత్స సత్యనారాయణ, మున్సిపల్ శాఖ కార్యదర్శి శ్యామలరావు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ విజయకుమార్తో పాటు, ఆ శాఖకు చెందిన పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. కార్పొరేషన్లు, మున్సిపాల్టీల్లో సంస్కరణలపై రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలపై సమావేశంలో సీఎం జగన్ చర్చించారు. కార్పొరేషన్లు, మున్సిపాల్టీలను స్వయం సమృద్ధి దిశగా నడిపించాలంటూ కేంద్రం మార్గనిర్దేశం చేసిందన్నారు. ఇతర రాష్ట్రాల్లో ఆస్తి పన్ను విధానాలు, రాష్ట్రంలో ఆస్తి పన్ను విధానాలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. దాంతో పాటు కర్ణాటక, మహారాష్ట్రల్లో అమలు చేస్తున్న ఆస్తి పన్ను విధానాలను వివరించారు. (చదవండి: వైఎస్సార్ ఫొటో ఎందుకు పెట్టకూడదు: హైకోర్టు) ఆయా రాష్ట్రాల్లో నెలవారీ అద్దె ప్రాతిపదికన కాకుండా ఆస్తి విలువ ప్రాతిపదికన పన్నులు విధిస్తున్న అంశాన్ని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఆయా రాష్ట్రాల్లో ఆస్తి విలువలు, దాని నిర్ధారించే విధానాలు, ఆ మేరకు విధిస్తున్న పన్ను తదితర అంశాల గురించి ముఖ్యమంత్రి, అధికారులతో సమావేశంలో చర్చించారు. వాటన్నింటిపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. -
'బలహీన వర్గాలకు బలం సీఎం జగన్'
తాడేపల్లి: బీసీల అభ్యునతికి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతో కృషి చేస్తున్నారని బీసీ సంక్షేమశాఖ మంత్రి శంకరనారాయణ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో బీసీలకు జరిగిన అన్యాయం, వారి కష్టాలు తెలుసుకునేందుకు సీఎం జగన్ అధ్యయన కమిటీ వేశారు. బీసీ,ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు నామినేటెడ్ పదవులు, నామినేటెడ్ వర్కుల్లో, మహిళల పదవుల్లో 50శాతం రిజర్వేషన్ కల్పించారు. స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటివరకు ఏ ప్రభుత్వం చేయని విధంగా ఈ ప్రభుత్వం బీసీలకు పెద్ద పీఠ వేసింది. క్యాబినెట్లో కూడా బీసీలకు పెద్ద పీఠ వేశారు. బీసీల కోసం 28 కొత్త కార్పొరేషన్ల ఏర్పాటుకు ముఖ్యమంత్రి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. బీసీలకు నేడు పండుగ రోజు. అందులో భాగంగా 30వేల జనాభా మించిన కులాలకు కార్పొరేషన్ ఏర్పాటు చేసి చైర్మెన్ , డైరెక్టర్లను నియమిస్తారు. గత ప్రభుత్వం బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంది. అందుకే బీసీలు గత ఎన్నికల్లో టీడీపీకి బుద్ది చెప్పారు. బీసీలంతా వైఎస్ జగన్ వెంట ఉన్నారు. ఆయనకు బీసీలందరి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని శంకర నారాయణ తెలిపారు. బీసీలంటే బిజినెస్ క్యాస్ట్గా టీడీపీ చూసింది - ధర్మాన 2014 ఎన్నికల్లో బీసీలు టీడీపీకి సపోర్ట్ చేస్తే చంద్రబాబు బీసీలను అన్ని విధాలుగా మోసం చేసిందని మంత్రి ధర్మాన కృష్ణదాస్ తెలిపారు. అయితే వైఎస్ జగన్ తన పాదయత్రలో బీసీల బాధలు తెలుసుకొని కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. మాటప్రకారం బీసీల కోసం 28 కార్పొరేషన్లు ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. టీడీపీ బీసీలను బ్యాక్వర్డ్ క్యాస్ట్గా కాకుండా బిజినెస్ క్యాస్ట్గా చూసింది. అందుకే ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పారని ధర్మాన పేర్కొన్నారు. (బీసీ ఉప కులాల కార్పొరేషన్ల ఏర్పాటుపై సీఎం జగన్ సమీక్ష) బలహీన వర్గాల ప్రజలకు జగన్మోహన్ రెడ్డే బలం చంద్రబాబు బీసీలను వాడుకున్నారు తప్ప బీసీల బాగోగులు చూడలేదని ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి అన్నారు. జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో బీసీల కష్టాలు చూశారు. 30వేల జనాభా దాటిన ప్రతి కులానికి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని జగన్ హామీనిచ్చారు. సీఎం అయిన వేంటనే బీసీల సంక్షేమంపై దృష్టి పెట్టారు. మాటలు కాకుండా చెప్పిన ప్రతి హామీని సీఎం జగన్ నిలబెట్టుకుంటున్నారు. గడిచిన ఏడాది కాలంలో సంక్షేమానికి 43వేల కోట్లు ఖర్చు పెడితే అందులో రూ. 22వేల కోట్లు బీసీలకు ఖర్చు పెట్టిన ఘనత వైఎస్ జగన్ది. ప్రతి కులం రాజకీయంగా, సామాజికంగా, ఆర్ధికంగా ఎదగాలని చెప్పే వ్యక్తి జగన్ అని జంగా కృష్ణమూర్తి అన్నారు. ఎమ్మెల్యే జోగి రమేష్ మాట్లాడుతూ.. బీసీలంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్ కాదు.. బ్యాక్ బోన్ క్యాస్ట్ అని భావించిన వైఎస్ జగన్ ప్రభుత్వం ఏడాది కాలంలోనే బీసీ,ఎస్టీ, ఎస్సీ, మైనారిటీల అభ్యున్నతికి అనేక చట్టాలు చేసింది. బలహీన వర్గాల ప్రజలకు జగన్మోహన్ రెడ్డే బలమని అన్నారు. (‘వైజాగ్ ప్రజలను భయపెట్టాలనుకుంటున్నారా’) -
ఆ పోస్టులు నెలాఖరుకల్లా భర్తీ: సీఎం జగన్
సాక్షి, అమరావతి: ఈ నెలాఖరు కల్లా బీసీ కార్పొరేషన్ల ఛైర్మన్లు, డైరెక్టర్ల పోస్టుల భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. బీసీ పరిధిలోని వివిధ ఉప కులాల కార్పొరేషన్ల ఏర్పాటుపై ఆయన సమీక్ష నిర్వహించారు. డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్, మంత్రులు శంకర నారాయణ, బొత్స సత్యనారాయణ, ధర్మాన కృష్ణదాస్, మోపిదేవి, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి హాజరయ్యారు. బీసీల్లోని ఆయా కులాల వారికి ప్రభుత్వ ప్రయోజనాలు అందుతున్నాయా? లేదా? అన్న విషయాన్ని కార్పొరేషన్లు పర్యవేక్షించాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. (‘జగనన్న పచ్చతోరణం’కు పకడ్బందీ ఏర్పాట్లు) అందరికీ పథకాలు అందే విధంగా ప్రధాన బాధ్యతగా నడుచుకోవాలని సీఎం సూచించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటి వరకూ 2,12,40,810 మంది బీసీలకు రూ.22,685.74 కోట్ల రూపాయలను నగదు బదిలీ ద్వారా అందించామని సీఎం పేర్కొన్నారు. బీసీల అభ్యున్నతి కోసం ఇంత ఫోకస్గా గతంలో ఎవరూ, ఎప్పుడూ పని చేయలేదని సీఎం స్పష్టం చేశారు. రూపాయి లంచం, వివక్ష లేకుండా తలుపుతట్టి మరీ పథకాలు అందిస్తున్నామన్నారు. కొత్త వాటితో కలుపుకుని మొత్తంగా 52 కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తున్నాం. గతంలో 69 కులాలకే ప్రాధాన్యత ఇచ్చారని, ఇప్పుడు మొత్తం బీసీ కులాలన్నింటికీ కార్పొరేషన్లలో ప్రాధాన్యత ఇస్తున్నామని సీఎం వైఎస్ జగన్ తెలిపారు. -
79% కేసులు 30 మున్సిపాల్టీల్లోనే..
న్యూఢిల్లీ/తిరువనంతపురం/గువాహటి: భారతదేశంలో ఇప్పటిదాకా నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల్లో 79 శాతం కేసులు కేవలం 30 మున్సిపాల్టీలు/కార్పొరేషన్ల పరిధిలోనే బయటపడ్డాయని మంత్రుల బృందం(జీవోఎం) వెల్లడించింది. 15వ జీవోఎం సమావేశం శుక్రవారం కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్దన్ నేతృత్వంలో జరిగింది. దేశంలో కరోనా తాజా పరిస్థితి, నియంత్రణ చర్యలపై చర్చించారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా బాధితుల్లో 6.92 శాతం మంది మరణించగా, భారత్లో 3.23 శాతం మంది ప్రాణాలు కోల్పోయారని జీవోఎం పేర్కొంది. ఉధృతంగానే కరోనా వ్యాప్తి దేశంలో కరోనా పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్యలో పెరుగుదల ఆగడం లేదు. తాజాగా గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం వరకు 3,976 కేసులు నమోదయ్యాయి. అలాగే కరోనా వల్ల 100 మంది మరణించారు. దీంతో ఇప్పటిదాకా మొత్తం కేసులు 81,970కి, మరణాలు 2,649కి చేరాయని కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. భారత్లో యాక్టివ్ కరోనా కేసులు 51,401. ఇప్పటివరకు 27,919 మంది బాధితులు చికిత్సతో కోలుకున్నారు. ఆసుపత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. రికవరీ రేటు 34.06కు చేరినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలియజేసింది. తాజాగా నమోదైన 100 మరణాల్లో 44 మరణాలు మహారాష్ట్రలోనే సంభవించాయి. గుజరాత్లో 20 మంది, ఢిల్లీలో 9 మంది, పశ్చిమబెంగాల్లో 8 మంది ఉత్తరప్రదేశ్లో ఐదుగురు, మధ్యప్రదేశ్లో ఐదుగురు కన్నుమూశారు. కరోనా కారణంగా సంభవించిన మరణాల్లో 70 శాతానికి పైగా బాధితులకు ఇతర జబ్బులు కూడా ఉన్నట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. 20 లక్షలకుపైగా కరోనా టెస్టులు: ఐసీఎంఆర్ దేశంలో కరోనా వైరస్ నిర్ధారణ కోసం నిర్వహించిన ఆర్టీ–పీసీఆర్ పరీక్షల సంఖ్య 20 లక్షలు దాటినట్లు భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) ప్రకటించింది. శుక్రవారం ఉదయం వరకు 20,39,952 నమూనాలను పరీక్షించినట్లు పేర్కొంది. ఇందులో 92,911 పరీక్షలను గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం వరకు నిర్వహించినట్లు వెల్లడించింది. కరోనా టెస్టుల సామర్థ్యాన్ని పెంచుతున్నామని, ప్రస్తుతం రోజుకు దాదాపు లక్ష టెస్టులు నిర్వహిస్తున్నామని స్పష్టం చేసింది. ప్రత్యేక రైలులో వచ్చిన వారికి కరోనా వెయ్యి మంది వలస కూలీలతో కూడిన మొదటి ప్రత్యేక రైలు ఢిల్లీ నుంచి కేరళకు చేరుకుంది. వీ రిలో ఏడుగురికి కరోనా వైరస్ లక్షణాలు ఉన్నట్లు పరీక్షలో తేలింది. దాంతో వారిని అధికారులు కరోనా కేర్ సెంటర్లకు, ఆసుపత్రులకు తరలించారు. కాగా,కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి లాక్డౌన్ను మరో రెండు వారాలు పొడిగించాలని అ స్సాం ముఖ్యమంత్రి శర్బానంద సోనోవాల్ కేంద్రానికి లేఖరాశారు. లాక్డౌన్ను ఈ నెలాఖరు వరకు పొడిగిస్తూ శుక్రవారం మిజోరం ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. -
ముగిసిన పురపోరు
సాక్షి, హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల్లో గణనీయంగా ఓటింగ్ నమోదైంది. రాష్ట్రంలోని 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్ల పరిధిలో బుధవారం ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించిన పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగలేదని ఎన్నికల సంఘం ప్రకటించింది. 129 పురపాలికల్లో మొత్తం 70.26 శాతం పోలింగ్ నమోదైనట్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) బుధవారం రాత్రి 10.30 గంటలకు ప్రకటించింది. మొత్తంగా చూస్తే ఓటేసిన వారిలో మహిళలు 69.94 శాతం, పురుషులు 68.8 శాతం, ఇతరులు 8.36 శాతం మంది ఓటర్లు ఉన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్ మున్సిపాలిటీలో అత్యధికంగా 93.31 శాతం నమోదు కాగా, మేడ్చల్ జిల్లా నిజాంపేట కార్పొరేషన్లో అత్యల్పంగా 39.65 శాతం ఓటింగ్ నమోదైంది. ఎన్నికలు జరిగిన అన్ని మున్సిపాలిటీల్లోని మొత్తం ఓట్లకు 49,75,093గాను 34,95,322 ఓట్లు పోలయ్యాయి. జిల్లాల వారీగా చూస్తే.. అత్యధికంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో 88.32 శాతం పోలింగ్, అత్యల్పంగా జగిత్యాల జిల్లాలో 50.32 శాతం ఓటింగ్ నమోదైంది. గతంలో గ్రామ పంచాయతీలు, నగరపంచాయతీలుగా ఉన్న కొన్ని మున్సిపాలిటీల్లో పోలింగ్ బాగా జరగ్గా, నగర శివార్లలోని మున్సిపాలిటీల్లో ఓటర్లు కొంతమేర బద్ధకించినట్లు ఓటింగ్ సరళిని బట్టి తెలుస్తోంది. ఎక్కడా కూడా రీపోలింగ్కు ఎన్నికల కమిషన్ ఆదేశించలేదు. టెండర్ ఓట్లు నమోదు అయినట్లు కూడా ఎస్ఈసీ నుంచి ఎలాంటి సమాచారం అందలేదు. ఘర్షణలు.. వాగ్వాదాలు.. : వివిధ రాజకీయ పార్టీల కార్యకర్తల మధ్య పలుచోట్ల స్వల్ప ఘర్షణలు, వాగ్వాదాలు, డబ్బు పంపిణీ ఆరోపణలు, కొన్నిచోట్ల పోలీసులకు ఫిర్యాదు వంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్యులు తమ తమ మున్సిపాలిటీల పరిధిలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. బుధవారం 120 మున్సిపాలిటీల్లోని 2,647 వార్డులకు (80 ఏకగ్రీవాలు మినహాయించి), 9 కార్పొరేషన్లలోని 324 డివిజన్లకు (ఒక ఏకగ్రీవస్థానం కాకుండా) వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులు పోటీపడ్డారు. మొత్తంగా 7,613 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు నిర్వహించారు. వీటి పరిధిలో ఎక్కడైనా రీపోలింగ్ నిర్వహణకు ఎస్ఈసీ నిర్ణయం తీసుకుంటే.. 24న రీపోలింగ్ నిర్వహించి, 25న ఉదయం ఓట్ల లెక్కింపు ప్రారంభించి, ఫలితాలు ప్రకటిస్తారు. కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 10 వార్డుల్లో పైలట్ ప్రాజెక్టు కింద తొలిసారిగా ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీని విజయవంతంగా ఉపయోగించి ఓటేసేందుకు అర్హులైన ఓటర్లను గుర్తించారు. జీహెచ్ఎంసీలోని డబీర్పురా డివిజన్లోనూ ఉప ఎన్నిక జరిగింది. కాగా, బుధవారం సాయంత్రం 5 గంటలకు కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో ఎన్నికల ప్రచారం ముగిసింది. 24న ఈ కార్పొరేషన్లోని 58 డివిజన్లకు (రెండు ఏకగ్రీవాలు మినహా) ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల దాకా పోలింగ్ జరుగుతుంది. 27న ఫలితాలు ప్రకటిస్తారు. బుధవారం ఓటింగ్ సందర్భంగా మొత్తం 2,072 పోలింగ్ కేంద్రాల్లో వీడియో కవరేజీ, 2,406 పోలింగ్ స్టేషన్లలో లైవ్ వెబ్కాస్టింగ్ నిర్వహించారు. భైంసాలో పోలింగ్ ప్రశాంతం భైంసా (ముథోల్): నిర్మల్ జిల్లా భైంసాలో పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. 23 వార్డులకు ఎన్నికలు జరిగాయి. సాయంత్రం 5 గంటల వరకు 64.70 శాతం పోలింగ్ నమోదైంది. ఒక్కనిమిషం వ్యవధిలోనే ఓటర్ల గుర్తింపు ఫేస్ రికగ్నైజేషన్ యాప్ విజయవంతం కుత్బుల్లాపూర్: ఓటర్ల గుర్తింపు ప్రక్రియలో భాగం గా దేశంలోనే తొలిసారిగా కొంపల్లి మున్సిపల్ ఎన్నికల్లో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టిన ఫేస్ రికగ్నైజేషన్ యాప్ విజయవంతమైంది. దూలపల్లి– కొంపల్లి ప్రభుత్వ పాఠశాలల్లో బుధవారం జరిగిన పురపాలిక ఎన్నికల నేపథ్యంలో 13, 15, 16, 21, 22, 23, 24, 27, 31, 32 బూత్లలో పైలెట్ ప్రాజెక్ట్గా ఫేస్ రికగ్నైజేషన్ యాప్ను ఏర్పాటు చేశారు. ఓటు వేసేందుకు వచ్చిన వారిని ఒక్క నిమిషం వ్యవధిలోనే యాప్ ద్వారా గుర్తిస్తూ క్లియరెన్స్ ఇవ్వడంతో వేగంగా ఓటింగ్ ప్రక్రియ పూర్తయింది. పోలింగ్ ప్రశాంతం ఫలించిన పోలీస్ వ్యూహాలు రాష్ట్రవ్యాప్తంగా మున్సి పల్ పోలింగ్ ప్రశాంతంగా ముగిసిం టదని శాంతి భద్రతల విభాగం అడిషనల్ డీజీ జితేందర్ తెలిపారు. 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లకు బుధవారం జరిగిన ఎన్నికల్లో ఎక్కడా గొడవలు తలెత్తలేదన్నారు. మొత్తం 50 వేల మంది పోలీసు సిబ్బంది ఎన్నికల విధులు నిర్వహించారన్నారు. ఏఆర్, సివిల్, టీఎస్ఎస్పీ పోలీసులతోపాటు ఫారెస్టు, ఎక్సైజ్, విద్యుత్, విజిలెన్స్కు చెందిన ఉద్యోగులు కూడా విధుల్లో పాల్గొన్నారని వివరించారు. అక్కడక్కడా చెదురు ముదురు ఘటనలు మినహా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు నమోదు కాలేదన్నారు. ఎన్నికల కోసం పోలీసులు వ్యవహరించిన పలు వ్యూహాలు ఫలితాలనిచ్చాయని పలువురు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. ఓటేసిన మంత్రి కోదాడ / సూర్యాపేట: మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా బుధవారం జరిగిన పోలింగ్లో సూర్యాపేట పట్టణంలోని 44వ వార్డు నెహ్రూనగర్లోని పోలింగ్ కేంద్రంలో మంత్రి జగదీశ్రెడ్డి ఆయన సతీమణి సునిత ఓటు వేశారు. కోదాడలో ఉత్తమ్... సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని 14వ వార్డు పోలింగ్ కేంద్రంలో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పద్మావతి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. విదేశాల నుంచి.. హుజూరాబాద్ రూరల్: మున్సిపల్ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకునేందుకు పలువురు విదేశాల నుంచి స్వస్థలాలకు వచ్చారు. ఖతార్, ఆస్ట్రేలియా, దుబాయ్, న్యూజిలాండ్ల నుంచి స్వదేశాలకు వచ్చి ఓటేశారు. నరేశ్.. శభాష్ నిర్మల్: నిర్మల్ జిల్లా కేంద్రంలోని 37 వార్డులో స్థానికుడైన నరేశ్ రెండు చేతులు లేకున్నా.. బుధవారం తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ఓటును వేయడం ఆనందంగా ఉందన్నారు. ఓటు బహిర్గతం మెట్పల్లి(కోరుట్ల): జగిత్యాల జిల్లా కోరుట్ల మున్సిపాలిటీలోని ఏడో వార్డులో ఓ అభ్యర్థికి వేసిన ఓటు బహిర్గతమైంది. గుర్తుతెలియని ఓటరు ఓటు ను ఫోన్లో చిత్రీకరించాడు. ప్రస్తుతం ఇది వాట్సాప్లో చక్కర్లు కొడుతోంది. ఓటుకు ముక్కు పుడక కామారెడ్డి క్రైం: కామారెడ్డి మున్సిపాలిటీ అడ్లూర్ పరిధిలోని ఇల్చిపూర్లో పంగ లింగం నుంచి ఓటర్లకు పంచుతున్న 33 బంగారు ముక్కు పుడకలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. -
‘మున్సిపాలిటీ’ ఓటర్ల తుది జాబితా ప్రకటన
సాక్షి, హైదరాబాద్: ఎన్నికలు జరగనున్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో ఓటర్ల తుది జాబితాను ప్రకటించారు. 22న జరగనున్న 120 మున్సిపాలిటీలు, 10 కార్పొరేషన్ల పరిధిలో 53,36,605 ఓటర్లున్నట్టు తేలింది. పురుషులు 26,71,694, మహిళలు 26,64, 557, ఇతరులు 354 మంది ఉన్నారు. ఇటీవ ల 120 మున్సిపాలిటీలు, 10 కార్పొరేషన్ల వా రీగా ముసాయిదా జాబితాను ప్రకటించగా, శనివారం ఒక్కో జిల్లా పరిధిలో ఎన్నికలు జరగనున్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఓ టర్ల తుది జాబితాను ప్రకటించారు. అయితే మున్సిపాలిటీల్లో ఓటర్ల తుది జాబితాలను ఆ దివారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనుమతి తో అధికారికంగా ప్రకటించనున్నారు. ఈ నెల 30న ప్రకటించిన ముసాయిదా ఓటర్ల జాబి తా ప్రకారం... ఎన్నికలు జరిగే మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో మొత్తం ఓటర్లు 53,57,260 ఉండగా, వారిలో పురుషులు 26,72,021 మంది, మహిళలు 26,64,885 మంది, ఇతరులు 354 ఉన్నట్టు ప్రకటించా రు. శనివారం అనధికారికంగా వెల్లడించిన వి వరాల ప్రకారం మొత్తం ఓటర్ల సంఖ్య 655 మేర తగ్గినట్టుగా తెలుస్తోంది. మొత్తంగా చూస్తే తుది జాబితాలో మహిళా ఓటర్ల కంటే పురుషుల ఓట్లు 7,137 అధికంగా ఉన్నాయి. -
బీసీలను టీడీపీ వాడుకుని వదిలేసింది
-
కొత్తగా 60 కార్పొరేషన్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని వివిధ వర్గాల సంక్షేమమే లక్ష్యంగా కొత్తగా 60 కార్పొరేషన్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ఇందులో బీసీలకు 57, ఈబీసీలకు 3 కార్పొ రేషన్లు ఉన్నాయి. బీసీల్లో ప్రతి కులానికి కార్పొరేషన్ ఏర్పాటు చేసి వారిని ఆర్థికంగా ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. ఈ నేపథ్యంలో బీసీ సంక్షేమ శాఖ ప్లాన్ ‘ఏ’ కింద 16, ప్లాన్ ‘బీ’ కింద మరో 41 కార్పొరేషన్ల ఏర్పా టుకు ప్రతిపాదనలు రూపొందించింది. ఇవికాకుండా కమ్మ, రెడ్డి, క్షత్రియులకు ప్రత్యేకంగా ఒక్కొక్క కార్పొరేషన్ ప్రతిపాదించారు. ఈ నెల 1న ముఖ్యమంత్రితో బీసీ సంక్షేమ శాఖ సమీక్ష జరగాల్సి ఉండగా.. అనివార్య కారణాల వాయిదా పడింది. త్వరలో జరగబోయే సమీక్షలో కొత్త కార్పొరేషన్ల ఏర్పాటుకు ఆమోదం లభిస్తుందని అధికారులు చెబుతున్నారు. బీసీ–ఏ గ్రూపులో ఆదిమ తెగలు, విముక్తి జాతులు, సంచార, సెమీ సంచార జాతుల వారు, బీసీ–బీ గ్రూపులో వృత్తిపరమైన పనులు చేసుకునే, బీసీ–సీ గ్రూపులో క్రైస్తవ మతంలోకి మారిన వారు, బీసీ–డీ గ్రూపులో ఇతర బీసీ కులాల వారు, బీసీ–ఈ గ్రూపులో ముస్లింలలో వెనుకబడిన కులాలున్నాయి. కాగా.. ప్రస్తుతం రాష్ట్రంలో 30 కార్పొరేషన్లు ఉండగా.. ఇందులో ఈబీసీలకు (కాపు, ఈబీసీ, ఆర్యవైశ్య, బ్రాహ్మణ) కార్పొరేషన్లు ఉన్నాయి. దేవదాయ శాఖ పరిధిలో ఉన్న బ్రాహ్మణ కార్పొరేషన్ మినహా యించి మిగిలిన ఈబీసీల కార్పొరేషన్లు బీసీ సంక్షేమ శాఖ పరిధిలోకే వస్తాయి. -
కార్పొరేషన్లకు జవసత్వాలు
సాక్షి, అమరావతి: వివిధ వర్గాల సంక్షేమానికి ఏర్పాటు చేసిన కార్పొరేషన్లకు జవసత్వాలు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వీటికి నిధుల కేటాయింపులను కూడా ఆయా వర్గాల జనాభాను దృష్టిలో పెట్టుకుని చేయనుంది. 2019–20 ఆర్థిక సంవత్సరానికి ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, దివ్యాంగులు, కాపు, ఈబీసీ, ఎంబీసీ కార్పొరేషన్లకు అనుకున్న స్థాయిలో నిధులు కేటాయించింది. కాపు కార్పొరేషన్కు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు రూ.2 వేల కోట్లు ఇచ్చింది. ఈ కార్పొరేషన్ల ద్వారా రుణాలు ఇచ్చే అధికారం వాటి మేనేజింగ్ డైరెక్టర్లకు ఉంది. లబ్ధిదారుల ఎంపిక నుంచి వారికి రుణాలను అందించడం వరకు మండల పరిషత్లు, బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి కార్పొరేషన్లు సహాయం తీసుకుంటాయి. ప్రస్తుతం 48 కార్పొరేషన్లు ఉన్నాయి. గతంలో ఉన్న 11 బీసీ ఫెడరేషన్లను కూడా వైఎస్సార్సీపీ ప్రభుత్వం కార్పొరేషన్లుగా మార్చింది. కొత్తగా కులాల వారీగా ఏర్పాటు చేసే కార్పొరేషన్లలో ఆయా కులాల వారు సభ్యులుగా చేరాల్సి ఉంటుంది. ఆ సభ్యులకే సబ్సిడీ రుణాలు ఇస్తారు. అయితే.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, దివ్యాంగులు, కాపు, ఈబీసీ, ఎంబీసీ కార్పొరేషన్ల్లో ఆయా వర్గాలకు చెందినవారు సభ్యులుగా ఉండాల్సిన అవసరం లేదు. నేరుగా రుణాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. కుల, ఆదాయ ధ్రువీకరణ ఉంటే సరిపోతుంది. ప్రస్తుతం బీసీ కులాలకు మొత్తం 29 కార్పొరేషన్లు ఉన్నాయి. ఎన్నికల ముందు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి బీసీల్లోని అన్ని కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు బీసీ సంక్షేమ శాఖ కులాల వారీగా జనాభా వివరాలు సేకరించింది. ఇప్పటివరకు కొత్తగా 16 కార్పొరేషన్లు ఏర్పాటు చేసింది. మిగిలిన కార్పొరేషన్లకు ప్రతిపాదనలు.. మిగిలిన కార్పొరేషన్లకు ప్రతిపాదనలు రూపొందుతున్నాయి. రాష్ట్రంలో వెయ్యి జనాభాలోపు చాలా కులాలున్నాయి. వీళ్లకు ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేయడం వల్ల ఉపయోగం ఉండదని అధికారులు సీఎం వైఎస్ జగన్ దృష్టికి తేనున్నారు. ఇక నుంచి ఏర్పాటు చేసే కార్పొరేషన్లను సహకార చట్టం కింద ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అదేవిధంగా పాలకవర్గ సభ్యులపై మరిన్ని బాధ్యతలు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇంతకు ముందులా అలవెన్స్లు తీసుకుంటూ ఆషామాషీగా పనిచేస్తే కుదరదు. ప్రతి సమావేశంలోనూ సరైన నిర్ణయాలు తీసుకుని ప్రభుత్వానికి తగిన సూచనలు ఇవ్వాలి. కార్పొరేషన్ల ద్వారా ఆయా వర్గాల సంక్షేమానికి నూతన విధానాలు అమలు చేయాలి. -
రుణాల పంపిణీకి ఉమ్మడి ప్రణాళిక
సాక్షి, అమరావతి: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపు తదితర కార్పొరేషన్ల ద్వారా రుణాల పంపిణీ విషయంలో ఉమ్మడి ప్రణాళికను అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. అన్ని వర్గాల పేదలకు సబ్సిడీ రుణ సాయాన్ని ఒకేసారి అందించేందుకు చర్యలు తీసుకోవాలని పేర్కొంది. రుణాల పంపిణీ విషయంలో కార్పొరేషన్లు ఇష్టానుసారంగా వ్యవహరించడం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని గుర్తుచేసింది. ఆన్లైన్ బెనిఫిషరీ మానిటరింగ్ సిస్టం ద్వారా అన్ని కార్పొరేషన్లు ఒకేసారి ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానించేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. ఈ మేరకు ఈ నెల 4న జీవో విడుదల చేసింది. డిసెంబరు నాటికి రుణాలు గ్రౌండింగ్ అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తూ, అందుకు తేదీలను కూడా ఖరారు చేసింది. రుణాల పంపిణీ కోసం సెప్టెంబరు నెలాఖరు వరకు దరఖాస్తులను స్వీకరించాలని, ఆ తరువాత లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ప్రారంభం కావాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. ఇలాంటి ఉత్తర్వులు ప్రభుత్వం ఇవ్వడం ఇదే మొదటిసారి. గతంలో రుణాల మంజూరు విషయంలో కార్పొరేషన్లు మార్చిలో నిర్ణయం తీసుకోవడం, మార్చి అయిపోయిన తరువాత ఆర్థిక సంవత్సరం మారిందంటూ పట్టించుకోకుండా వదిలేయడం వంటివి జరిగేవి. అధికారుల ద్వారానే ఎంపిక రుణాలు పొందే లబ్ధిదారులను బ్యాంకు అధికారులు, ఎంపీడీవో, కార్పొరేషన్ల ప్రతినిధులు ఎంపిక చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. గతంలో జన్మభూమి కమిటీల సభ్యులు సంతకాలు చేస్తేనే రుణాలు తీసుకునేందుకు పేదలు అర్హత సాధించేవారు. ఆ పరిస్థితిని ప్రభుత్వం మార్చేసింది. అర్హుల జాబితాను నేరుగా కార్పొరేషన్ ఈడీకి పంపిస్తే, వారు కలెక్టర్ అనుమతి తీసుకుని నిధుల కోసం కమిషనర్కు పంపిస్తారు. దీంతో ప్రక్రియ పూర్తవుతుంది. డిసెంబరులో గ్రౌండింగ్ అయిన యూనిట్లకు జనవరిలో యుటిలైజేషన్ సర్టిఫికెట్లు(యూసీ) ఇవ్వాలి. ఫిబ్రవరిలో యూనిట్ను కార్పొరేషన్ ఈడీ సందర్శించి పరిశీలించాల్సి ఉంటుంది. మార్చిలో నిర్దేశిత ఏజెన్సీ ద్వారా యూనిట్ పనితీరును మరోసారి పరిశీలించాలి. రుణాల పంపిణీకి సంబంధించి ఎస్సీ కార్పొరేషన్ నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపు, ఇతర కార్పొరేషన్ల ద్వారా లబ్ధిదారులకు ఒకేసారి రుణాలు ఇవ్వాలని నిర్ణయించడం మంచి నిర్ణయమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. -
షెడ్యూల్డ్ కులాలకు మూడు కార్పొరేషన్లు
సాక్షి, అమరావతి: షెడ్యూల్డ్ కులాల వారికి మూడు కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తూ ఆదివారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ‘ఆంధ్రప్రదేశ్ మాల సంక్షేమ కార్పొరేషన్’, ‘ఆంధ్రప్రదేశ్ మాదిగ సంక్షేమ కార్పొరేషన్’, ‘ఆంధ్రప్రదేశ్ రెల్లి మరియు ఇతరుల సంక్షేమ కార్పొరేషన్ లిమిటెడ్’ను ఏర్పాటు చేస్తున్నట్లు సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర ఇచ్చిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ ఎన్నికలకు ముందు పలువురు షెడ్యూల్డ్ కులాల వారు చేసిన విజ్ఞప్తి మేరకు స్పందించి కులాల వారీగా ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హామీ ఇచ్చారు. ఈ హామీ మేరకు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత జగన్ ఎస్సీ కో ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎండీకి మూడు కార్పొరేషన్లకు సంబంధించి ప్రతిపాదనలు పంపించాల్సిందిగా ఆదేశాలు ఇచ్చారు. కాగా బీసీల్లో 139 కులాలకు ప్రత్యేకంగా కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. -
99 మున్సిపాల్టీల్లో ప్రత్యేక అధికారుల పాలన
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పాలక వర్గాల పదవీ కాలం ముగియనున్న 99 పురపాలక సంఘాల్లో ప్రత్యేక అధికారుల పాలన ప్రారంభం కానుంది. వచ్చే నెల 2వ తేదీతో వీటి పదవీ కాలం ముగియనుండటంతో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ వివరాలు సేకరిస్తోంది. ఒకటి రెండు రోజుల్లో వీటి వివరాలను ప్రభుత్వానికి నివేదించనుంది. ఎన్నికలు జరిగే వరకు ఆయా పురపాలక సంఘాల్లో ప్రత్యేక అధికారుల పాలన తీసుకొచ్చేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా ఆ శాఖ అధికారులు ప్రభుత్వాన్ని కోరనున్నారు. దీంతో పాలకవర్గాల పదవీ కాలం ముగియనున్న మున్సిపాల్టీల స్థాయికి అనుగుణంగా ప్రత్యేక అధికారుల నియామకాలు జరగనున్నాయి. జాయింట్ కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు– 2, సబ్ కలెక్టర్లు, రెవెన్యూ డివిజనల్ అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమించనున్నారు. ఇప్పటికే 7 కార్పొరేషన్లు, ఒక మున్సిపాల్టీ, మూడు నగర పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలన సాగుతోంది. కాగా, రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు మున్సిపల్ అధికారులు ఎన్నికలు నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటి వరకు 94 మున్సిపాల్టీల్లో కులాల వారీ ఓటర్ల గణనను పూర్తి చేశారు. ఇందులో 85 మున్సిపాల్టీలు, 9 కార్పొరేషన్లు ఉన్నాయి. ప్రత్యేక అధికారుల పాలన గడువు పొడిగింపు రాష్ట్రంలోని 7 కార్పొరేషన్లు, ఒక మున్సిపాల్టీ, 3 నగర పంచాయతీల్లో కొనసాగుతున్న ప్రత్యేక అధికారుల పాలన ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు పొడిగిస్తూ మున్సిపల్ శాఖ ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. వీటి ప్రత్యేక పాలన జూన్ 30న ముగియడంతో ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. శ్రీకాకుళం, విశాఖపట్నం, కాకినాడ, గుంటూరు, ఒంగోలు, తిరుపతి, కర్నూలు కార్పొరేషన్లు, కందుకూరు మున్సిపాల్టీ, రాజాం, నెల్లిమర్ల, రాజంపేట నగర పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలనను పొడిగించారు. -
ఇక మున్సిపోరు
సాక్షి, మహబూబాబాద్: అసెంబ్లీ, సర్పంచ్, ఎంపీ, పరిషత్ ఎన్నికలు విజయవంతంగా పూర్తిచేసిన అధికార యంత్రాంగం త్వరలో మునిసిపల్ ఎన్నికలకు రంగం సిద్ధం చేస్తోంది. ఇప్పటికే వార్డుల వారీగా బీసీ, ఎస్టీ, ఎస్సీ జనభా గణన పూర్తిచేసి ఉన్నాతాధికారులకు నివేదికలు పంపారు. సోమవారం జరిగిన కేబినేట్ మీటింగ్ అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ జూలై నెలలోనే ఎన్నికలు నిర్వహించి పూర్తిచేస్తాం అని ప్రకటించటంతో పట్టణాల్లో ఎన్నికల సందడి నెలకొంది. జిల్లాలో మహబూబాబాద్తో పాటు కొత్తగా ఏర్పాటైన మరిపెడ, డోర్నకల్, తొర్రూర్ పురపాలక సంఘాలు ఉన్నాయి. గ్రామాలు, తండాల విలీనాల నేపథ్యంలో వార్డుల విభజన, రిజర్వేషన్లకు సంబంధించి ఉన్నతాధికారుల మార్గదర్శకాల కోసం అధికారులు ఎదురుచూస్తున్నారు. కొత్త పురపాలక సంఘాల్లో ఇదివరకే వార్డుల విభజన జరిగినా మళ్లీ స్పల్ప మార్పులు, చేర్పులు చేపట్టే అవకాశం ఉంది. వార్డుల పునర్విభజన తప్పదా.. పురపాలక చట్టం మారితే వార్డులు పునర్విభజన చేసే అవకాశం ఉంది. అలాగే రిజర్వేషన్లు సైతం మారనున్నాయి. ప్రస్తుతం కొత్తగా ఏర్పడిన మునిసిపాలిటీల్లో తక్కువగా 9 వార్డులే ఉన్నాయి. మహబూబాబాద్లో 28 వార్డులు ఉన్నాయి. కొత్త చట్టం అమలైతే ఎన్నికలు జూలై నెలలో నిర్వహించటం కష్టమవుతుందని, దానికి చాలా సమయం తీసుకుంటుందని అధికారులు చెబుతున్నారు. ఒక వేళ జూలై నెలలోనే ఎన్నికలు పూర్తిచేయాలంటే ప్రస్తుతం ఉన్న వార్డుల ప్రకారమే ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. అలా అయితే కొత్త మునిసిపాలిటీల్లో 9వార్డులే ఉండటం వల్ల అక్కడ పోటీ తీవ్రంగా ఉండనుంది. అక్కడ వార్డుల సంఖ్య పెంచాలని డిమాండ్ వినిపిస్తోంది. శాస్త్రీయ పద్ధతిలో.. పురపాలక ఎన్నికల నిర్వహణకు ముందు వార్డుల విభజన కీలకం కానుంది. వార్డుల విభజన సరిగా నిర్వహించకపోవడంతో వివిధ పురపాలక సంఘాల పరిధిలోని వార్డుల్లో ఓటర్ల సంఖ్యలో హెచ్చుతగ్గులు ఉన్నాయి. ఒక వార్డులో దాదాపు మూడు వేల మంది ఓటర్లు ఉంటే, మరో చోట వెయ్యి లోపే ఉన్నారు. కొత్త చట్టం అమలులోకి వస్తే అన్ని వార్డుల్లో కొంచెం అటు ఇటు సమానంగా ఓటర్లు ఉండేలా శాస్త్రీయ పద్ధతిలో వార్డుల విభజన చేపట్టాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. రిజర్వేషన్లపై నేతల దృష్టి రాష్ట్రంలో కొత్త పురపాలకలు ఏర్పాటు కావటంతో గతంలో ఉన్న రిజర్వేషన్లనే రోటేషన్ పద్ధతిలో కొనసాగిస్తారా, లేక పంచాయతీ, ప్రాదేశిక ఎన్నికల వలే మొత్తం పురపాలకలను పరిగణలోకి తీసుకుని మళ్లీ రిజర్వేషన్లు ప్రకటిస్తారా అనే ఆంశం ఎన్నికల్లో పోటీచేసే ఆశవాహుల్లో ఉత్కంఠను రేపుతుంది. మునిసిపల్ చైర్మెన్ పదవికి గతంలో మాదిరి ప్రరోక్ష పద్ధతిలో నిర్వహిస్తారా, లేక కొత్త చట్టం ఆమోదం పొందితే ప్రత్యక్ష పద్ధతిలో నిర్వహించే అవకాశం లేకపోలేదని నేతలు గుబులు పడుతున్నారు. ప్రత్యక్ష పద్ధతిలో నిర్వహిస్తే ఎన్నికల బరిలో నిలవటానికి బడా నేతలు సిద్ధమవుతున్నారు. సిద్ధమవుతున్న ఆశావహులు జిల్లాలోని నాలుగు మునిసిపాలిటీల్లో ఎన్నికలు నిర్వహించనున్న నేపథ్యంలో ఆయా మునిసిపాలిటీల్లో వార్డుల నుంచి కౌన్సిలర్లుగా పోటీచేయాలనుకుంటున్న ఆశావహులు తమతమ వార్డుల్లో జనాన్ని మచ్చిక చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. వార్డుల్లో పర్యటిస్తూ ప్రజలకు అవసరమైన పనులు చేసి పెడుతూ మద్దతు కూడగట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. తమ పార్టీలకు చెందిన నేతలతో ఇప్పటికే తాను అభ్యర్థిగా పోటీలో ఉంటూననే సంకేతాలు అందిస్తున్నారు. ఇప్పటి దాకా రిజర్వేషన్లు అనుకూలిస్తే చాలని వారు అనుకున్నారు. వార్డుల విభజన పరిధి, ఓటర్ల సంఖ్యలో మార్పులు జరగుతాయని తెలిసి ఒకింత అయోమయానికి గురవుతున్నారు. ఇది ఎంత వరకు అనుకూలిస్తుందో, ఇబ్బందికరంగా మారుతుందోనని లోలోన ఆందోళన చెందుతున్నారు. -
నెలాఖరులోగా పురపాలక చట్టం!
సాక్షి, హైదరాబాద్: మునిసిపల్ ఎన్నికలకు ప్రభుత్వం వేగంగా పావులు కదుపుతోంది. సాధ్యమైనంత త్వరగా పురపాలక సంఘాలకు ఎన్నికలు నిర్వహించే దిశగా అడుగులు వేస్తోంది. కొత్త మునిసిపల్ చట్టానికి తుదిరూపునిస్తున్న సర్కారు.. ఈ నెలాఖరులోగా దీనికి ఆమోదముద్ర వేయాలని భావిస్తోంది. నూతన చట్టం మనుగడలోకి వచ్చిన అనంతరం ఎన్నికలకు వెళ్లాలని యోచిస్తోంది. వాస్తవానికి ఈ నెలలో పురపోరు నిర్వహిస్తామని గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించినప్పటికీ, కొత్త చట్టం కొలిక్కిరాకపోవడంతో ఆలస్యమైంది. వచ్చే నెల 2వ తేదీతో పురపాలక సంఘాల పాలకవర్గాల పదవీకాలం ముగియనుంది. మున్సిపాలిటీ పాలక కమిటీల గడువు దగ్గరపడుతున్నా.. ఇప్పటివరకు వార్డుల పునర్విభజన, రిజర్వేషన్ల క్రతువు మొదలు పెట్టకపోవడంపై ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం, బీసీ సంఘాలు హైకోర్టును ఆశ్రయించాయి. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటున్న సర్కారు.. అతి త్వరలో మునిసిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలోనే సోమవారం కొత్త పుర చట్టంలో పొందుపరచాల్సిన అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహించిన సమావేశంలోనూ మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై చర్చకు వచ్చినట్లు తెలిసింది. నెలాఖరులోగా కొత్త చట్టం! ముసాయిదా పురపాలక చట్టానికి మునిసిపల్ శాఖ తుదిమెరుగులు దిద్దుతోంది. ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో అధ్యయనం చేసిన అధికారుల బృందాలు కొత్త చట్టానికి పదునుపెడుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ముఖ్యమంత్రి చేసిన సూచనలను కూడా పరిగణనలోకి తీసుకుంటోంది. అధికారుల్లో జవాబుదారీతనం పెంపొందించడం, అవినీతిరహిత పాలన అందించేందుకు చట్టంలో పొందుపరిచే అంశాలపై సోమవారం జరిగిన సమావేశంలో సీఎం వివరించారు. అలాగే ప్రభుత్వ కార్యక్రమాలు, నిధుల వినియోగంలో ప్రజాప్రతినిధులను కూడా భాగస్వాములను చేయాలని సూచించారు. అవినీతి కేంద్రబిందువుగా మారిన పట్టణ ప్రణాళికను పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేసేలా చట్టాన్ని కఠినతరం చేయాలని నిర్దేశించారు. భవన నిర్మాణ అనుమతులు, నిబంధనలు ఉల్లంఘిస్తే అధికారులపై వేటు వేసేలా చట్టంలో చేర్చనున్నట్లు తెలిసింది. ఒకే చట్టమా..వేర్వేరు చట్టాలా? అంతేగాకుండా.. తొలుత అనుకున్నట్లు ఏకీకృత పుర చట్టంగాకుండా.. వేర్వేరు చట్టాలను రూపొందించే అంశాన్ని పరిశీలించాలని ఆదేశించారు. ప్రస్తుతం హైదరాబాద్ మహానగర పాలక సంస్థ (జీహెచ్ఎంసీ), నగర పాలక సంస్థలు, మున్సిపాలిటీలకు వేర్వేరు చట్టాలున్నాయి. వీటన్నింటినీ ఒకే గొడుగు కిందకు తేవాలని గతంలో జరిగిన సమావేశాల్లో సీఎం సూచించారు. తాజాగా పాత చట్టాలనే కొనసాగిస్తూ... మార్పులు, చేర్పులు చేయాలని సూచించినట్లు తెలిసింది. అవసరమైతే ఒకే చట్టాన్ని తీసు కొచ్చి.. ఆయా సంస్థల స్థానిక పరిస్థితులకు అనుగుణంగా సవరణలు చేసే అంశాన్ని పరిశీలించాలని దిశానిర్దేశం చేసినట్లు తెలిసింది. దీనికి అనుగుణంగా ప్రస్తుతం అమలులో ఉన్న చట్టం, చేయాల్సిన సవరణలు ఇతరత్రా అంశాలపై బుధవారం ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్షించనున్నారు. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. ఆగస్టులో పురపోరు.. కొత్త చట్టం కార్యరూపం దాల్చిన అనంతరం పురపోరుకు నగారా మోగించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ నెలాఖరులో జరగనున్న శాసనసభ సమావేశంలో నూతన చట్టానికి ఆమోదముద్ర వేసే అవకాశం కనిపిస్తోంది. అనంతరం వార్డుల పునర్విభజన, అభ్యంతరాలను స్వీకరించిన పిమ్మట మున్సిపోల్స్కు వెళ్లనుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు కూడా సంకేతాలిచ్చారు. సాధ్యమైనంత త్వరగా పురపాలికలకు ఎన్నికలు నిర్వహించాలని భావిస్తున్నామని, కొత్త చట్టం అమలులోకి రావడమే తరువాయి పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని యోచిస్తున్నట్లు అధికారవర్గాలకు తెలియజేశారు. -
500 కొత్త మున్సిపల్ వార్డులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, నగర పాలక సంస్థల్లో కొత్తగా 500 వార్డులు ఏర్పాటుకానున్నాయి. త్వరలోనే ‘మున్సిపోల్స్’ నిర్వహించా లని భావిస్తున్న సర్కారు.. ఈ మేరకు వార్డుల విభజనపై దృష్టి సారించింది. ఈ నెలాఖరు లేదా వచ్చే నెల లో కొత్త మున్సిపల్ చట్టాన్ని తేనుండటంతో ఆలోపు వార్డుల పునర్విభజన ప్రక్రియను పూర్తి చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం అమలులో ఉన్న వార్డుల విభజనలో శాస్త్రీయత లోపించినందున.. ఈసారి పక్కాగా ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఇప్పుడు సగటున 1,500 నుంచి 15 వేల జనాభా వరకు ఒక్కో వార్డు ఉంది. దీన్ని తాజాగా నిర్వహించే పునర్విభజనలో సవరించనున్నారు. జనాభా ప్రాతిపదికన వార్డు లను వర్గీకరిస్తారు. ఈ లెక్కన వార్డుల సంఖ్య గణనీయంగా పెరగనుంది. 2014లో 74 మున్సిపాలిటీల పరిధిలో 1,900 వార్డులున్నాయి. ప్రస్తుతం 142 మున్సిపాలిటీలు/కార్పొరేషన్లు ఉండగా.. వీటిలో వార్డుల సంఖ్య 2,400 కానుంది. వార్డు జనాభాను తక్కువగా నిర్దేశిస్తే ఈ సంఖ్య పెరిగినా ఆశ్చర్యంలేదు. ఇటీవల కొత్తగా ఏర్పాటు చేసిన మున్సిపాలిటీల్లో కొన్నింటిలో మేజర్ గ్రామపంచాయతీలకన్నా కూడా తక్కువ జనాభా ఉంది. మహబూబ్నగర్ జిల్లా అమరచింత జనాభా పదివేల లోపే ఉంది. అలాగే పెద్దపల్లి జిల్లా కేంద్రం జనాభా కూడా దాదాపుగా అంతే. ఈ నేపథ్యంలో ఇక్కడ కనిష్టంగా 11 వార్డులను ఏర్పాటు చేస్తే.. సగటున ఒక్కో వార్డు జనాభా వేయిలోపే రానుంది. కాగా.. ఈ నెలాఖర్లో జరిగే శాసనసభ సమావేశాల్లో నూతన పురపాలక చట్టం ప్రవేశపెట్టిన తర్వాత.. రాష్ట్రవ్యాప్తంగా ఒకేదశలో మున్సిపాలిటీ ఎన్నికలు జరుగు తాయని అధికారులు తెలిపారు. పౌర సేవలన్నీ ఆన్లైన్లో మున్సిపాలిటీలకు ఉన్న చెడ్డపేరును తొలగించే దిశగా కొత్తచట్టానికి సర్కారు పదునుపెడుతోంది. ముఖ్యంగా పట్టణ ప్రణాళికను పారదర్శకంగా మలి చేందుకు నిబంధనలను కఠినతరం చేస్తోంది. నిర్దేశిత కాలవ్యవధిలో బిల్డింగ్ పర్మిషన్ జారీ చేయకపోతే.. ఆటోమేటిక్గా మంజూరు చేసినట్లుగానే భావించేలా చట్టంలో వెసులుబాటు కల్పిస్తోంది. అదేసమయంలో భవన నిర్మాణ అనుమతి ఫైలు క్లియర్ చేయకుండా.. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వహించిన ఉద్యోగిపై జరిమానా/ సస్పెన్షన్ వేటు వేసే కఠిన నిబంధనలను కూడా ఈ చట్టంలో పొందుపరుస్తున్నట్లు సమాచారం. అలాగే పురపాలికల్లో పౌర సేవలన్నింటినీ ఆన్లైన్ చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే కొన్ని సేవలు ఆన్లైన్లో ఉన్నప్పటికీ, మిగతావాటిని కూడా ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకునేలా ఏర్పాట్లు చేస్తోంది. ఇదిలావుండగా, కొత్త చట్టంలో పట్టణ ప్రణాళికకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యతనిస్తోంది. ముఖ్యంగా మాస్టర్ ప్లాన్, జోనల్ రెగ్యులైజేషన్ నిబంధనలను కచ్చితంగా పాటించేలా నియామవళిని పకడ్బందీగా రూపొందిస్తోంది. పదేళ్లు ఒకే రిజర్వేషన్? స్థానిక సంస్థల రిజర్వేషన్లను పదేళ్లపాటు అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఇదే విధానాన్ని వర్తింపజేసింది. ఇదే పద్ధతిని పట్టణ సంస్థలకు వర్తింపజేస్తే ఎలా ఉంటుందనే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకే రిజర్వేషన్ రెండు పర్యాయాలు అమలు చేసే విధానంపై అధ్యయ నం చేస్తోంది. మహారాష్ట్ర తరహాలో పురపాలక సంఘాలకు ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించే అంశంపైనా సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తోంది. -
మళ్లీ.. మహా కార్పొరేషన్లు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మహానగరం మరింతగా విస్తరించనుంది. నాలుగేళ్ల క్రితం వాయిదాపడ్డ కొత్త మున్సిపల్ కార్పొరేషన్ల ఏర్పాటు అంశం మళ్లీ తెరమీదకు వస్తోంది. ఈసారి ఔటర్ రింగురోడ్డు లోపలున్న ప్రాంతాలన్నింటితో కలిపి రెండు కొత్త కార్పొరేషన్ల ఏర్పాటు చేయాలన్న అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. 2008కి ముందున్న హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(ఎంసీహెచ్)ను పునరుద్ధరించి, కొత్తగా హైదరాబాద్ ఈస్ట్, హైదరాబాద్ వెస్ట్ మున్సిపల్ కార్పొరేషన్లను ఏర్పాటు చేయాలన్న ఆలోచనతో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. ఔటర్ రింగురోడ్డు లోపలున్న ప్రాంతాలన్నింటిని ఇటీవలే మున్సిపాలిటీలుగా మార్చిన ప్రభుత్వం వాటన్నింటికి త్వరలోనే ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. అయితే రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో కొత్తగా ఏర్పడ్డ మున్సిపాలిటీలను కార్పొరేషన్ల పరిధిలోకి తీసుకువచ్చే ఆలోచనతో ఉండటం వల్లే ఎన్నికల ప్రక్రియ ప్రారంభించలేదన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ముచ్చటగా మూడు కార్పొరేషన్లు రోజురోజుకూ విస్తరిస్తున్న శివారు ప్రాంతాలకు మెరుగైన పాలన అందించే లక్ష్యంగానే ఢిల్లీ, ముంబైలలో పలు కొత్త మున్సిపల్ కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. నగర శివారులోని ఎనిమిది మున్సిపాలిటీలను హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో విలీనం చేశారు. అయితే గడిచిన పన్నెండు సంవత్సరాల్లో జీహెచ్ఎంసీ జనాభా కోటి దాటడంతోపాటు శివారు పంచాయతీలన్నీ జనసాంద్రతతో కిటకిటలాడే పరిస్థితి నెలకొంది. దీంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం జీహెచ్ఎంసీని మూడు కార్పొరేషన్లుగా మార్చాలన్న ఆలోచన చేసినప్పటికీ సాకారం కాలేదు. ఇటీవలే పంచాయతీ నుండి మున్సిపాలిటీలుగా అప్గ్రేడ్ అయిన బోడుప్పల్, ఫిర్జాదిగూడ, పోచారం, మణికొండ, నార్సింగి, బండ్లగూడ, శంషాబాద్, తుక్కుగూడ, ఆదిబట్ల, తుర్కయంజాల్, పెద్దఅంబర్పేట, జిల్లెలగూడ, బడంగ్పేట, జల్పల్లి, జవహర్నగర్, దమ్మాయిగూడ, నాగారం, నిజాంపేట, గుండ్లపోచంపల్లి, కొంపల్లి తదితర ప్రాంతాలన్నింటినీ ఇప్పుడు కొత్త కార్పొరేషన్ల పరిధిలోకి తీసుకువచ్చే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది. మూడు కమిషనరేట్లకు సమాంతరంగా... నగరాన్ని ఇప్పటికే హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్లుగా విభజించిన నేపథ్యంలో మున్సిపల్ కార్పొరేషన్లను సైతం మూడుగా విభజించాలన్న అంశాన్ని సీనియర్ అధికారులు ప్రస్తావిస్తున్నారు. అయితే, హైదరాబాద్ సికింద్రాబాద్లతో కూడిన పాత హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్తోపాటు హైదరాబాద్ ఈస్ట్ మున్సిపల్ కార్పొరేషన్లో కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, మల్కాజిగిరి, ఉప్పల్, మేడ్చల్, ఎల్బీనగర్ నియోజకవర్గాలను, హైదరాబాద్ వెస్ట్లో మహేశ్వరం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి తదితర ప్రాంతాలను చేర్చాలన్న ప్రతిపాదనలు అధికార యంత్రాంగం వద్ద ఇప్పటికే ఉన్నాయి. జీహెచ్ఎంసీ విస్తీర్ణం ఇప్పటికే 625 చ.కి.మీ. ఉండగా, ఔటర్ రింగురోడ్డు పరిధిలోని ప్రాంతాలన్నీ కలిపితే మరో 600 చ.కి.మీ. కానుంది. జనాభా సైతం కోటిన్నర దాటిపోనుంది. ఈ మేరకు యాభై లక్షల మంది జనాభా, 400 చ.కి.మీ.లకు ఒక్క మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు అంశం శాస్త్రీయంగా కూడా సరైనదేనని స్థానిక పరిపాలనలో విశేష అనుభవం ఉన్న అధికారులు చెబుతున్నారు. సార్వత్రిక ఎన్నికల కోడ్ ముగియగానే కొత్త మున్సిపల్ యాక్ట్ అమలుతోపాటే కొత్త కార్పొరేషన్ల ఏర్పాటు అంశంపై ప్రభుత్వం మరింత స్పష్టతనిచ్చే అవకాశం కనిపిస్తోంది. -
పట్టణాల్లో కురవని 'అమృత్'
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అటల్ మిషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్(అమృత్) పథకం పనులు ముందుకు సాగడం లేదు. ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే కొన్ని సంస్థలకే టెండర్లు దక్కేలా నిబంధనలు రూపొందించడం, ఆ సంస్థలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడం, రక్షిత మంచినీటి పథకాల నిర్మాణాలకు అవసరమైన స్థలాలను ప్రభుత్వం కేటాయించలేకపోవడంతో ‘అమృత్’ పథకం పడకేసింది. నగరాలు, పట్టణాలను పట్టిపీడిస్తున్న రక్షిత మంచినీరు, మురుగునీటి సరఫరా సమస్యలు ‘అమృత్’ పథకంతో పరిష్కారం అవుతాయని ప్రజలు ఆశించారు. అయితే, తొలిదశలో విడుదలైన నిధులను మున్సిపాల్టీలు, నగర పాలక సంస్థలు పూర్తిస్థాయిలో ఖర్చు చేయలేకపోయాయి. రెండో దశలో చేపట్టనున్న పథకాలకు నిధులు విడుదల చేయాలని అందచేసిన ప్రతిపాదనలకు మోక్షం కలగడం లేదు. దీంతో సమస్యలన్నీ అపరిష్కృతంగానే మిగిలిపోయాయి. ఆంధ్రప్రదేశ్లో అమరావతితోపాటు 31 నగర పాలక సంస్థలు, మున్సిపాల్టీలను ‘అమృత్’ అమలుకు కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. కనీసం లక్ష జనాభా కలిగిన నగరాలు, పట్టణాల్లో ఈ పథకాన్ని అమలు చేయాలని కేంద్రం నిబంధన విధించింది. విశాఖపట్నం, కాకినాడ, రాజమహేంద్రవరం, విజయవాడ, గుంటూరు, తిరుపతి, నెల్లూరు, కర్నూలు, కడప, అనంతపురం, ఒంగోలు వంటి కార్పొరేషన్లతోపాటు మచిలీపట్నం, గుడివాడ, ఆదోని, నరసరావుపేట, చిలకలూరిపేట వంటి చిన్న మున్సిపాల్టీలను అమృత్ పథకం కింద ఎంపిక చేశారు. ఈ పథకం అమలుకు కేంద్రం ఐదేళ్లపాటు విడతల వారీగా నిధులను విడుదల చేస్తుంది. తొలిదశలో రూ.2,717 కోట్లను విడుదల చేసింది. ఇందులో ఇప్పటిదాకా రూ.400 కోట్లు ఖర్చు పెట్టారు. అయినా పనులు ఆశించిన స్థాయిలో జరగలేదు. విశాఖపట్నంలో పాతపైపుల స్థానంలో కొత్తవి ఏర్పాటుకు, నివాస గృహాలకు కుళాయిలు, మురుగునీటి శుద్ధిప్లాంట్ నిర్మాణాలకు నిధులు విడుదల కాగా, నిర్మాణ సంస్థలు పనుల్లో జాప్యం చేస్తున్నాయి. 75 వేల కుళాయిలను ఏర్పాటు చేయాల్సి ఉండగా, ఇప్పటిదాకా 23 వేల కుళాయిలనే ఏర్పాటు చేశారు. రాజమహేంద్రవరంలో రూ.82 కోట్లతో ఇంటింటికీ కుళాయిలు, పార్కుల సుందరీకరణ, ఎస్టీపీ ప్లాంట్ నిర్మాణాలకు ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. ఇందులో రూ.17.80 కోట్లతో నిర్మించనున్న ఎస్టీపీ ప్లాంట్ పనులు ఇటీవలే ప్రారంభమయ్యాయి. నిధులున్నా.. పనులేవీ? గుంటూరు జిల్లా తెనాలిలో రక్షిత మంచినీటి పథకం అమల్లో భాగంగా ఇచ్చే కుళాయి కనెక్షన్లు మందకొడిగా సాగుతున్నాయి. దీనికోసం అమృత్ పథకం కింద రూ.9 కోట్లు మంజూరయ్యాయి. ఈ నిధులతో పట్టణంలోని 21,748 గృహాలకు రక్షిత మంచినీటి కుళాయి కనెక్షన్లు ఇవ్వాలని నిర్ణయించగా, 12 వేల కనెక్షన్లు మాత్రమే ఇచ్చారు. మరో రెండు నెలల్లో ఒప్పందం కాలపరిమితి ముగియనుంది. మచిలీపట్నం మున్సిపాల్టీకి రూ.37.25 కోట్ల నిధులు మంజూరయ్యాయి. ఈ నిధులతో నాలుగు ఓవర్హెడ్ ట్యాంకులు, 9,158 కుళాయిలు, 156.465 కిలోమీటర్ల మేర డిస్ట్రిబ్యూషన్ పైప్లైన్లు, 8.42 కిలోమీటర్ల మేర పంపింగ్ మెయిన్ల ఏర్పాటు వంటి పనులు ఇప్పటికీ పూర్తికాలేదు. తిరుపతిలో రూ.72 కోట్లతో కొత్త పైప్లైన్ల నిర్మాణం, ఐదు రిజర్వాయర్ల నిర్మాణాలు చేపట్టాల్సి ఉంది. మూడేళ్ల నుంచి ఈ పనులు కొనసాగుతూనే ఉన్నాయి. ఖరారు కాని టెండర్లు ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే కొన్ని నిర్మాణ సంస్థలకే టెండర్లు దక్కేలా నిబంధనలు విధించారు. దాంతో కొన్ని సంస్థలకు ఐదారు నగరాల్లోని పనులు గంపగుత్తుగా లభించాయి. ఆ సంస్థలు సకాలంలో పనులు పూర్తి చేయలేకపోతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకు 25 రక్షిత మంచినీటి పథకాలకు సంబంధించిన పనులకు టెండర్లు ఆహ్వానిస్తే 23 పథకాల నిర్మాణ పనులు ఇంకా నిర్మాణ దశలోనే ఉన్నాయి. మూడు ప్రాజెక్టులకు టెండర్లు ఖరారు కాలేదు. 60 పార్కుల సుందరీకరణకు టెండర్లు ఆహ్వానిస్తే 56 పార్కులకు టెండర్లు ఖరారయ్యాయి. వీటిలో 41 పార్కుల పనులు కేవలం 30 నుంచి 40 శాతం వరకు పూర్తయ్యాయి. ఇక మురుగునీటి శుద్ధిప్లాంట్ల నిర్మాణాలకు నిర్మాణ సంస్థలు ముందుకు రాకపోవడంతో నగరాలు, పట్టణాల్లో మురుగునీటి సమస్య వేధిస్తోంది. -
‘రుణ’మెప్పుడో..!
ఆదిలాబాద్రూరల్: స్వయం ఉపాధి పథకంలో భాగంగా బీసీ, ఎస్సీ కార్పొరేషన్, గిరిజన సంక్షేమ శాఖ ద్వారా అందజేసే రుణాల కోసం నిరుద్యోగ యువత ఎదురుచూస్తోంది. రుణాల మంజూరుకు ఇప్పటికైనా మోక్షం లభిస్తుందో లేదోనని ఆందోళన వ్యక్తమవుతోంది. గతంలో రుణాల పంపిణీ ప్రారంభమైనట్లే అయి ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో నిలిచిపోయిన విషయం తెలిసిందే. దీంతో కార్పొరేషన్ రుణాల పంపిణీకి ఎన్నికల కోడ్ అడ్డుగా మారడంతో చెక్కులు అందుబాటులో ఉన్నా పంపిణీ చేయలేదు. అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా సబ్సిడీ రుణాలు అందించేందుకు ఎన్నికల కమి షన్ నిరాకరించిన విషయం తెలిసిందే. దీంతో లబ్ధిదారులు నిరాశ చెందారు. బీసీ కార్పొరేషన్లో 2015–16 ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో సుమా రు 2వేలకుపైగా వివిధ రుణాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీటిలో ప్రభుత్వం 472 మందికి మాత్రమే అందజేసింది. 2017–18 ఆర్థిక సంవత్సరంలో జిల్లా వ్యాప్తంగా 15,800 మంది స్వయం ఉపాధి రుణాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 13వేల మందిని అర్హులుగా గుర్తించారు. ఎస్సీ కార్పొరేషన్లో వివిధ రుణాల కోసం సుమారు 6,300 మంది లబ్ధిదారులు దరఖాస్తు చేసుకున్నట్లు ఆ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. అందని ద్రాక్షే.. బీసీ కార్పొరేషన్ రుణాలు అందని ద్రాక్షగానే మారుతున్నాయి. స్వయం ఉపాధి కోసం సబ్సిడీ రుణాలు తీసుకుందామని ఆశించిన వారి ఆశలు అడియాసలు అవుతున్నాయి. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి బీసీ కార్పొరేషన్ ద్వారా సబ్సిడీ రుణాలకు రెండు సార్లు మాత్రమే దరఖాస్తులు స్వీకరించారు. 2015–16 ఆర్థిక సంవత్సరంలో సబ్సిడీ రుణాలకు దరఖాస్తులు స్వీకరించిన ప్రభుత్వం అందులో కొందరికే రూ.లక్షలోపు రుణాలు అందజేసింది. వీటికి సంబంధించిన సబ్సిడీని 2018 మార్చిలో విడుదల చేసింది. జిల్లాలో సుమారు 472 మందికి రూ.80 వేల సబ్సిడీని లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసింది. అనంతరం 2016–17 ఆర్థిక సంవత్సరంలో రుణాలకు దరఖాస్తులు ఆహ్వానించలేదు. 2017–18లో దరఖాస్తులు ఆహ్వానించి, అర్హులను గుర్తించినా ఫలితం లేకుండా పోయింది. 2017–18 ఆర్థిక సంవత్సరానికి గాను రాష్ట్రంలో వెనుకబడిన తరగతుల లబ్ధిదారులు కార్పొరేషన్ రుణాలకు దరఖాస్తు చేసుకోవాలని మార్చి 24న నోటిఫికేషన్ జారీ చేసింది. మొదట ఏప్రిల్ 4 వరకు దరఖాస్తులకు గడువు విధించింది. చాలామంది రుణాల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉందని బీసీ సంఘాల నేతలు ప్రభుత్వాన్ని కోరడంతో ఏప్రిల్ 21 వరకు గడువు పొడిగించి దరఖాస్తులు స్వీకరించారు. 2011 జనాభా లెక్కాల ప్రకారం జిల్లాలో సుమారు 2,70,321 మంది బీసీ జనాభా ఉండగా కార్పొరేషన్, ఫెడరేషన్ ద్వారా 15,800 దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 13వేల మందిని అర్హులుగా గుర్తించారు. 2016–17 ఆర్థిక సంవత్సరంలో దరఖాస్తులను స్వీకరించకపోవడంతో నిరుద్యోగ బీసీ లబ్ధిదారులు ఆందోళన చెందారు. గ్రామసభలు, వార్డు సభలు నిర్వహించి 13వేల మంది లబ్ధిదారులను ఎంపిక చేసి వారిని అర్హులుగా ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు గుర్తించారు. కాగా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా సుమారు 6,300 మంది లబ్ధిదారులు వివిధ రుణాల కోసం దరఖాస్తు చేసుకున్నా గతంలో ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో ఏ ఒక్కరికీ మంజూరు ఇవ్వలేదు. కోడ్ ఎత్తి వేసి వారం రోజులు గడుస్తున్నా లబ్ధిదారులకు రుణాల మంజూరులో ఎలాంటి ప్రకటనలో రాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. 750 మందికి పంపిణీ జిల్లాలో బీసీ కార్పొరేషన్ ద్వారా 15,800 లబ్ధిదా రులు వివిధ రుణాలకు ఫెడరేషన్, కార్పొరేషన్ ద్వారా దరఖాస్తు చేసుకోగా ఇందులో 13వేల మందిని లబ్ధిదారులను అర్హులుగా గుర్తించారు. ఇందులో రూ.లక్ష లోపు యూనిట్లను కేటగిరి–1, రూ.లక్ష నుంచి రూ.2లక్షలలోపు యూనిట్లను కేట గిరి–2, రూ.2లక్షలకుపై యూనిట్లను కేటగిరి– 3గా నిర్ణయించారు. జిల్లాలో పూర్తిస్థాయిలో లబ్ధి దారులను గుర్తించేలోపు ఆగస్టు 15న రూ.50వేల యూనిట్లను అందించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. దీంతో జిల్లాలో ఆగస్టు 15న 100 మందికి రూ.50 వేలు వంద శాతం సబ్సిడీపై చె క్కులను పంపిణీ చేశారు. రూ.లక్ష యూనిట్లకు దరఖాస్తు చేసుకున్న వారిని గుర్తించి రూ.50 వేల యూనిట్లలోనికి మార్చి జిల్లా వ్యాప్తంగా 750 మందికి చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం మరో 1400 మందికి చెక్కుల పంపిణీ సిద్ధం చేసినా కోడ్ అమలులోకి రావడంతో పంపిణీకి బ్రేక్ పడింది. దీంతో సబ్సిడీ రుణా ల పంపిణీ నిలిచిపోయింది. రుణాల పంపిణీని ప్రారంభించకపోతే మళ్లీ జనవరిలో సర్పంచ్ల ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చి రుణాలు నిలిచిపోయే అవకాశం ఉందని లబ్ధిదారులు పేర్కొంటున్నారు. ఎస్సీ కార్పొరేషన్లో 6,566 మంది దరఖాస్తులు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాకముందు నుంచి ఎస్సీ కార్పొరేషన్లో వివిధ రుణాల కోసం లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. నోటిఫికేషన్ విడుదల కావడంతో దరఖాస్తుల స్వీకరణ గడువును మూడు సార్లు పెంచారు. ఇప్పటి వరకు ఆయా రుణాల కోసం ఆన్లైన్లో 6,566 దరఖాస్తులు వచ్చిన్నట్లు ఆ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఇదిలా ఉండగా ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో ఐటీడీఏ ద్వారా జిల్లాలోని నిరుద్యోగ గిరిజనులకు అందజేసే రుణాలకు సంబంధించి కనీసం దరఖాస్తులను కూడా స్వీకరించలేదు. స్వయం ఉపాధి రుణాల కోసం దరఖాస్తులను స్వీకరించేందుకు ఏప్రిల్లో ప్రణాళిక విడుదల కావాల్సి ఉన్నప్పటికీ అధికారులు, ప్రభుత్వం నిర్లక్ష్యంతో అక్టోబర్లో విడుదల కావడంతో తాము నష్టపోవాల్సి వచ్చిందని పలువురు నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. జనవరిలో సర్పంచ్ల ఎన్నికల కోడ్ ! ఆయా కార్పొరేషన్లలో స్వయం ఉపాధి రుణాల కోసం దరఖాస్తులు చేసుకున్న లబ్ధిదారులకు రుణాల పంపిణీలో జాప్యం జరిగితే జనవరిలో సర్పంచ్ల ఎన్నికలు జరగనున్నందున కోడ్ అమలులోకి వస్తే మళ్లీ రుణాల పంపిణీకి బ్రేక్ పడే అవకాశం ఉంది. ప్రభుత్వం ఆలోపు అర్హత కలిగిన లబ్ధిదారులకు రుణాల పంపిణీ ప్రారంభిస్తే బాగుంటుందని లబ్ధిదారులు పేర్కొంటున్నారు. ఈలోగా రుణాల పంపిణీ జరగకపోతే లబ్ధిదారులకు ఎదురు చూపులు తప్పేలా లేవని లబ్ధిదారులు పేర్కొంటున్నారు. -
కార్పొరేషన్లకు డైరెక్టర్లేరీ?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కార్పొరేషన్లు, నామినేటెడ్ పదవులకు పదవీకాలం పూర్తికావస్తోంది. రాష్ట్రంలోని 50 కార్పొరేషన్లకు చైర్మన్లను మాత్రమే నియమించారు. ప్లానింగ్ కమిషన్ బోర్డు, మిషన్ భగీరథకు ముఖ్యమంత్రి చైర్మన్గా ఉండటం వల్ల, వీటికి వైస్ చైర్మన్లను నియమించారు. వీటిలో కమిషన్లకు మినహా కార్పొరేషన్లకు డైరెక్టర్లను నియమించలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై, టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు పూర్తయింది. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అవకాశాన్ని బట్టి, అవసరాన్ని బట్టి కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన వెంటనే నియామకమైన కార్పొరేషన్లతో పాటు ఉన్నత విద్యామండలి, ప్రెస్ అకాడమీకి రెండోసారి కూడా సీఎం నియమించారు. అయితే పలు కార్పొరేషన్లకు రెండేళ్ల కాలపరిమితితోనే చైర్మన్ల నియామకం చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటైన ఏడాది, రెండేళ్ల తర్వాత నియామకమైన వాటిలో కొన్నింటికి ఇప్పటికే పదవీకాలం పూర్తయింది. మరికొన్ని ఒకటి, రెండు నెలల్లోనే పూర్తికాబోతున్నాయి, కార్పొరేషన్లకు దశలవారీగా చైర్మన్లను నామినేట్ చేయడంతో, అదే పద్ధతిలో చైర్మన్ల పదవులకు పదవీకాలం పూర్తి అవుతున్నది. పోటీపడుతున్న ఆశావహులు... కార్పొరేషన్లకు పదవీకాలం పూర్తవుతున్న నేపథ్యంలో తమకు అవకాశం ఇవ్వాలంటూ పార్టీ నేతలు పోటీపడుతున్నారు. కార్పొరేషన్ల చైర్మన్లు దాదాపుగా 50 వరకు నియామకమైతే, వాటిలో ఎక్కువగా టీఆర్ఎస్లో సుదీర్ఘంగా పనిచేసినవారికే అవకాశం దక్కింది. ఉద్యమకాలంలోనూ, పార్టీలోనూ క్రియాశీలంగా, విశ్వాసంగా పనిచేసిన నాయకులకే సీఎం కేసీఆర్ అవకాశం కల్పించారు. తెలంగాణ రాష్ట్రావిర్భావానికి కొద్దిగా ముందుగానో, ఆవిర్భావం సందర్భంగానో చాలామంది ఇతర పార్టీల నేతలు టీఆర్ఎస్లో చేరారు. ఇలా కొత్తగా చేరినవారికి కార్పొరేషన్ల పదవుల్లో చాలా తక్కువ అవకాశాలు వచ్చాయి. పార్టీలో కొత్తగా చేరిన నాయకులతో పాటు, నామినేటెడ్ పదవులకోసం చాలా మంది టీఆర్ఎస్ నాయకులు అవకాశాలకోసం ఎదురుచూస్తున్నారు. కార్పొరేషన్ చైర్మన్లకు పదవీకాలం పూర్తికావస్తుండటంతో ఇలాంటి ఆశావహుల్లో ఆశలు పెరుగుతున్నాయి. ఏదైనా కార్పొరేషన్కు అవకాశం కావాలంటూ ఈ నాయకులు ప్రయత్నాలను తీవ్రతరం చేశారు. నామినేటెడ్ పదవుల్లో అవకాశం కల్పించాలంటూ మంత్రులు కేటీఆర్, హరీశ్రావు, ఎంపీలు కవిత, సంతోష్రావు, ప్రభుత్వంలోని సీనియర్ మంత్రుల దగ్గరకు క్యూలు కడుతున్నారు. ఉద్యమకాలంలో పార్టీకోసం ఎంతోకాలం పనిచేశామని, పార్టీ పిలుపులను క్షేత్రస్థాయిలో అమలుచేయడానికి ఎన్నో వ్యయ ప్రయాసలకు గురయ్యామంటూ టీఆర్ఎస్ పాతనేతలు వివరిస్తున్నారు. తాము పడిన కష్టనష్టాలను, వ్యయ ప్రయాసలను గుర్తుచేసి, నామినేటెడ్ పదవిని ఇవ్వాలంటూ వీరు అభ్యర్థిస్తున్నారు. అధికారం రాకముందు, అధికారం వచ్చిన తర్వాత టీఆర్ఎస్లో చేరిన నాయకులుకూడా తమ అర్హతలను బట్టి, అవకాశాలకొరకు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్, టీడీపీ, ఇతర పార్టీల నుంచి టీఆర్ఎస్లో చేరే సమయంలో తమ పరిస్థితి, టీఆర్ఎస్లో చేరిన తర్వాత తాము చేసిన కృషిని వీరు గుర్తుచేస్తున్నారు. పార్టీలో కష్టపడుతున్నామని, భవిష్యత్తులోనూ పార్టీకోసం అదేవిధంగా, విధేయంగా పనిచేస్తామంటూ పార్టీ ముఖ్యులను ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు. డైరెక్టర్లేరీ...? రాష్ట్రంలో దాదాపుగా 50 కార్పొరేషన్లుకు చైర్మన్లను మాత్రమే భర్తీ చేశారు. వీటిలో డైరెక్టర్ల నియామకాన్ని చేయలేదు. ఒక్కొక్క కార్పొరేషన్కు అవసరాన్ని బట్టి కనిష్టంగా ఏడుగురికి తగ్గకుండా నియమించుకునే వీలుంది, అవసరాన్ని బట్టి కొన్నింటికి 20 మందిని కూడా డైరెక్టర్లను నియమించుకునే అవకాశముంది. కార్పొరేషన్ డైరెక్టర్లుగా అవకాశం కావాలంటూ నియోజకవర్గ స్థాయి నేతలు ఆశించారు. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీచేసే అవకాశం రాని, పోటీచేయడానికి ఆసక్తిలేని నాయకులు ఏదో ఒక అవకాశం రాకపోతుందా అని ఈ నాలుగేళ్లు ఎదురుచూశారు. కార్పొరేషన్లకు డైరెక్టర్లను నియమిస్తే ఇప్పటికే అన్నింటిలో కలిపి దాదాపుగా 1000 మంది నాయకులకు నామినేటెడ్ పోస్టు ల్లో అవకాశాలు దక్కేవని అంటున్నారు. డైరెక్టర్లను నియమించకుండానే, చైర్మన్లకు పదవీకాలం పూర్తికావడంపై క్షేత్రస్థాయి నాయకులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. -
కార్పొరేషన్లకు నిధులు విడుదల చేయాలి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని కార్పొరేషన్లకు నిధులను విడుదల చేయాలని మేయ ర్లు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం హరిత ప్లాజాలో రాష్ట్ర ఆర్థిక సంఘం అధ్యక్షు డు జి.రాజేశంగౌడ్ ఆధ్వర్యంలో కార్పొరేషన్ల మేయర్లు, కమిషనర్ల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలువురు మేయర్లు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ యాజమాన్యాలు, ఫ్యాక్టరీలు, తదితర సంస్థల నుంచి నూరు శాతం ఆస్తి పన్ను వసూలుకు ప్రభుత్వం కార్పొరేషన్లకు అనుమతివ్వాలని కోరారు. పట్టణ స్థానిక సంస్థలు తమ నివేదికల్ని రాష్ట్ర ఆర్థిక కమిషన్కు పంపించాలని, అందుకనుగుణంగా ప్రభుత్వానికి సిఫారసు చేస్తామని రాజేశంగౌడ్ చెప్పారు. కార్యక్రమంలో జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్, వరంగల్, కరీంనగర్, రామగుండం, నిజామాబాద్, ఖమ్మం కార్పొరేషన్ల మేయర్లు ఎన్.నరేందర్, సర్దార్ రవీందర్సింగ్, లక్ష్మీనారాయణ, సుజాత శ్రీశైలం, డాక్టర్ పాపాలాల్, మునిసిపల్ పరిపాలన డైరెక్టర్ టీకే శ్రీదేవి, జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్(ఫైనాన్స్) జయరాజ్ కెన్నెడి, ఆ కార్పొరేషన్ల కమిషనర్లు వీపీ గౌతమ్, కె.శశాంక, డి.జాన్ శాంసన్, సందీప్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
గోళ్లపాడుకు గ్రీన్ షాక్..!
ఖమ్మం: గోళ్లపాడు చానల్ ఆధునికీకరణ పనులకు మళ్లీ ఆటంకం ఏర్పడింది. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు శుద్ధి చేసిన నీటినే నదులు, వాగుల్లోకి వదలాలని జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు జారీ చేయడంతోఫిల్టర్బెడ్ నిర్మాణం చేపడితేనే కాల్వ ఆధునికీకరణ పనులు ముందుకు సాగనున్నాయి. దీంతో నిర్మాణానికి నిధులు మంజూరై.. పనులు పూర్తయితేనే చానల్ ఆధునికీకరణ పనులు ముందుకెళ్లనున్నాయి. ప్రజాప్రతినిధులు చానల్ నిర్మాణ పనులు త్వరితగతిన జరిగేందుకు ఫిల్టర్బెడ్ నిర్మాణానికి నిధులు తీసుకొస్తేనే గోళ్లపాడు చానల్ కోసం ఎదురుచూస్తున్న త్రీటౌన్ పరిధిలోని పదివేల కుటుంబాల ఇబ్బందులు తొలగే అవకాశం ఉంది. దశాబ్దాల చరిత్ర నాలుగైదు దశాబ్దాల క్రితం గోళ్లపాడు చానల్ను తవ్వించారు. అప్పట్లో నగరం తక్కువ విస్తీర్ణం, అతి తక్కువ జనాభాతో ఉండేది. ఖమ్మం శివారులోని పంట పొలాలకు మున్నేరు నీరు అందించేందుకు దీనిని ఏర్పాటు చేశారు. దానవాయిగూడెం నుంచి పంపింగ్ వెల్రోడ్, సుందరయ్యనగర్, ప్రకాశ్నగర్, ధంసలాపురం ప్రాంతాల్లోని పంట పొలాలకు ఈ కాలువ ద్వారా నీరు అందించేవారు. కాలక్రమేణా జనాభా పెరిగి పట్టణం కాస్తా నగర స్థాయికి చేరింది. ఈ క్రమంలోనే గోళ్లపాడు చానల్పై అనేక మంది పేదలు ఇళ్లు నిర్మించుకున్నారు. పంట కాలువ కాస్తా నగరం విస్తరించటంతో మురికి కాలువగా రూపాంతరం చెందింది. సారథినగర్ నుంచి ప్రకాశ్నగర్ వరకు దీని విస్తీర్ణం 4.75 కిలోమీటర్ల మేర ఉంటుంది. ఈ కాలువపై సుమారు 10వేల కుటుంబాలు నివాసాలు ఏర్పాటు చేసుకున్నాయి. అయితే ఇక్కడి వారు ప్రస్తుతం మురికి కూపంలో జీవనం సాగిస్తున్నారు. వర్షం పడితే ఇళ్లలోకే మురికి నీరు చేరుతుంది. కాలువపై జీవిస్తుండటంతో అనేక మంది రోగాల బారినపడి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి తమకు పక్కా ఇళ్లు నిర్మించాలని, అప్పటి వరకు తమను ఇబ్బందులకు గురిచేయొద్దని నిర్వాసితులు కోరుతున్నారు. నిధులు మంజూరు చేసిన సీఎం ఫిబ్రవరి 15న అక్కడికి వచ్చిన సీఎం కేసీఆర్ గోళ్లపాడు చానల్ వల్ల కలిగే ఇబ్బందులను గుర్తించారు. చానల్ ఆధునికీకరణ పనులకు నిధులు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. ఈ మేరకు 2016–17 ఆర్థిక సంవత్సరంలో ఖమ్మం కార్పొరేషన్కు ప్రత్యేకంగా కేటాయించిన రూ.100కోట్ల నిధుల్లో.. రూ.56కోట్లు గోళ్లపాడు చానల్ పనులకు కేటాయించారు. టెండర్ల ప్రక్రియ పూర్తి కావడంతో 2016, నవంబర్ 13న ఖమ్మంలో పర్యటించిన రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ గోళ్లపాడు చానల్ ఆధునికీకరణ పనులకు శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత పనుల పురోగతి కొద్దిగా మందగించింది. గోళ్లపాడు ఆధునికీకరణ వల్ల ఇళ్లు కోల్పోయే నిర్వాసితులకు న్యాయం చేసే విషయంలో జాప్యం జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఇలా పనులు ప్రారంభం కాకముందే మరో షాక్ తగిలింది. గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు ఇప్పుడు గోళ్లపాడు చానల్ ద్వారా వచ్చే మురుగు నీటిని ఫిల్టర్ చేస్తేనే.. ఆ నీటిని మున్నేరులో వదిలే అవకాశం ఉంది. దీంతో ఇప్పుడు ఫిల్టర్బెడ్ నిర్మాణంపై అటు పాలకవర్గం, స్థానిక ప్రజాప్రతినిధులు దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఫిల్టర్బెడ్ నిర్మాణం కోసం రూ.20కోట్ల మేరకు వ్యయం కానుండటంతో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఈ నిధులను తెప్పించే పనిలో నిమగ్నమైనట్లు సమాచారం. ఏదేమైనా ఇప్పటికే ఆలస్యమవుతున్న గోళ్లపాడు చానల్కు ఇదో ఆటంకంగా మారింది. -
పురపాలికల ఖజానా గుల్ల
► పడిపోయిన ఆస్తి పన్నుల వసూళ్లు ► 72 పురపాలికల్లో 53 శాతం పన్నులే వసూలు ► మున్సిపల్ కమిషనర్లపై ప్రభుత్వం సీరియస్ ► నెలాఖరులోగా 100 శాతం వసూళ్లకు ఆదేశం సాక్షి, హైదరాబాద్: పెద్ద నోట్ల రద్దు ప్రభావంతో రాష్ట్రంలోని పురపాలికల ఖజానా వెలవెలబోతోంది. పురపాలికల ప్రధాన ఆదాయ వనరులైన ఆస్తి పన్నుల వసూళ్లు తలకిందులయ్యాయి. మరో 20 రోజుల్లో 2016–17 ఆర్థిక సంవత్సరం ముగియనుండగా, 72 పురపాలికల్లో 53 శాతం ఆస్తి పన్నులు మాత్రమే వసూలయ్యాయి. జీహెచ్ఎంసీ మినహా రాష్ట్రంలోని ఇతర 72 మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో గృహ సముదాయాల నుంచి మొత్తం రూ.340.70 కోట్ల ఆస్తి పన్నులు వసూలు కావాల్సి ఉండగా, రూ.180.74 కోట్లే వసూలయ్యాయి. మరో రూ.159.96 కోట్ల బకాయిలు ఉంది. జీహెచ్ఎంసీలో సైతం 60 శాతమే ఆస్తి పన్నులు వసూలయ్యాయి. రూ.1,500 కోట్లకు గాను రూ.900 కోట్లను మాత్రమే జీహెచ్ఎంసీ వసూలు చేయగలిగింది. రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తూ గత నవంబర్ 8న కేంద్రం తీసుకున్న నిర్ణయంతో నగర, పట్టణ ప్రాంతాల్లో వ్యాపారాలు కుదేలై వ్యాపార, వాణిజ్య సముదాయాల నుంచి ఆస్తి పన్నుల వసూళ్లు భారీగా పతనమయ్యాయని పురపాలక శాఖ అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. ఇతర వసూళ్లూ అంతంతే... జీహెచ్ఎంసీ మినహాయిస్తే రాష్ట్రంలోని ఇతర పురపాలికల్లో ట్రేడ్ లైసెన్స్ ఫీజు, అడ్వర్టైజ్మెంట్ పన్నులు, షాపుల అద్దెల వసూళ్లూ అంతంత మాత్రమే. రూ.12.42 కోట్ల ట్రేడ్ లైసెన్స్ ఫీజుకు గాను రూ.4.25 కోట్లు(34శాతం) మాత్రమే వసూలయ్యాయి. రూ.3.44 కోట్ల ప్రకటనల పన్నులకు గాను రూ.1.18 కోట్లు(34.42శాతం), రూ.143.38 కోట్ల షాపుల అద్దెలకు గాను రూ.105.03 కోట్లు(26.74శాతం) మాత్రమే వసూలయ్యాయి. జీహెచ్ఎంసీ మినహా రాష్ట్రంలోని ఇతర పురపాలికల్లో రూ.91.65 కోట్ల ఆస్తి పన్నులు వసూలు కావాల్సి ఉండగా, రూ.10.33 కోట్లు మాత్రమే వసూలయ్యాయి. 66 పురపాలికల్లో వసూళ్ల శాతం 30కే పరిమితమైంది. 100 శాతం వసూలు చేయాల్సిందే... ఆస్తి పన్నులు, ఇతర రుసుముల వసూళ్లలో పురపాలికలు వెనకబడిపోవడం పట్ల ప్రభుత్వం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ నెలాఖరులోగా 100 శాతం వసూళ్లు సాధించాల్సిందేనని మున్సిపల్ కమిషనర్లను ఆదేశిస్తూ పురపాలక శాఖ డైరెక్టర్ టీకే శ్రీదేవి ఉత్తర్వులు జారీ చేశారు. వసూళ్ల కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని సూచించారు. ఆస్తి పన్నుల వసూళ్లపై రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు నిరంతరం సమీక్షిస్తున్నారని తెలిపారు. శాతాల వారీగా ఆస్తి పన్నుల వసూళ్లు సాధించిన పురపాలికల (జీహెచ్ఎంసీతో కలిపి) సంఖ్య 80 శాతానికి పైగా వసూళ్లు సాధించిన పురపాలికలు 2 80–50 శాతంలోపు వసూళ్లు సాధించిన పురపాలికలు 39 50–30 శాతంలోపు వసూళ్లు సాధించిన పురపాలికలు 27 30 శాతం లోపు వసూళ్లు సాధించిన పురపాలికలు 5 -
‘అక్రమ’మే అధికం..!
మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది జీఐఎస్(జియోగ్రఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్) సర్వే చేపట్టింది. ఖమ్మం కార్పొరేషన్లో అనుమతి ఉన్న నిర్మాణాల కంటే అనుమతి లేనివే అధికంగా ఉన్నట్లు తేలింది. అనుమతి తీసుకుని నిర్మాణాలు చేపట్టగా.. అందులో అదనంగా నిర్మించిన కట్టడాలు కూడా బయటపడ్డాయి. దీంతో అనుమతి లేకుండా నిర్మించిన కట్టడాలపై కార్పొరేషన్ అధికారులు జీఐఎస్ సర్వే నిబంధనల ప్రకారం నూరు శాతం అపరాధ రుసుము వసూలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. జీఐఎస్ సర్వే చేపట్టకముందు కార్పొరేషన్ పరిధిలోని రికార్డుల ప్రకారం 29వేల నిర్మాణాలు ఉండేవి. సర్వే చేపట్టిన తర్వాత మొత్తం 62వేల నిర్మాణాలు ఉన్నట్లు లెక్క తేల్చారు. ఖమ్మం కార్పొరేషన్లో విలీనమైన తొమ్మిది పంచాయతీలను మినహాయించి కేవలం స్పెషల్ గ్రేడ్గా ఉన్న సమయంలో 11 రెవెన్యూ డివిజన్ల పరిధిలోనే సర్వే చేపట్టడం గమనార్హం. కార్పొరేషన్గా మారకముందు రెవెన్యూ డివిజన్ల పరిధిలో అధికారిక లెక్కల ప్రకారం 19వేల నిర్మాణాలు మాత్రమే ఉన్నాయి. ఎక్కువ ఇళ్ల నిర్మాణాలు స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీగా ఉన్న సమయంలో 11వ వార్డులోనే జరగడం గమనార్హం. దీంతో ఆయా నిర్మాణాలపై అపరాధ రుసుము వసూలు చేసేందుకు రెవెన్యూ అధికారులు సిద్ధమవుతున్నారు. రూ.2కోట్లకుపైగా ఆదాయం జీఐఎస్ పూర్తి చేసిన తర్వాత అనుమతులు తీసుకున్న వాటికంటే.. అదనంగా చేపట్టిన నిర్మాణాలు నగరంలో 5,200 ఉన్నట్లు గుర్తించారు. ఆయా నిర్మాణాల యజమానుల వద్ద నుంచి పెరిగిన పన్నుతోపాటు జీఐఎస్ అపరాధ రుసుము నూరు శాతం వసూలు చేయాలని నిర్ణయించారు. వీటి ద్వారా కార్పొరేషన్కు రూ.కోటి మేర ఆదాయం లభించనున్నట్లు తెలుస్తోంది. కార్పొరేషన్ పరిధిలో అసలు అనుమతులు లేకుండా ఉన్న నిర్మాణాలు 25వేలకు పైగానే ఉన్నట్లు గుర్తించారు. దీంతోపాటు అసలు అనుమతులు లేకుండా చేపట్టిన నిర్మాణాలకు సైతం అపరాధ రుసుము వసూలు చేయాలని భావిస్తున్నారు. దీంతో అపరాధ రూ.కోటి మేర లభించే అవకాశాలున్నాయి. జీఐఎస్ సర్వే పుణ్యమా అని కార్పొరేషన్కు రూ.2కోట్ల మేర ఆదాయం లభించనుంది. ప్రస్తుతం కార్పొరేషన్కు ఆస్తి పన్ను రూపంలో రూ.13కోట్ల మేర ఆదాయం లభిస్తుండగా.. ఈ ఏడాది మరో రూ.2కోట్ల మేర ఆదాయం లభించనుంది. -
కొత్త బార్ పాలసీ రెడీ
నిబంధనలు సిద్ధం చేసిన ఎకై ్సజ్ శాఖ పాతవారికే బార్లు మున్సిపాలిటీలో కొత్తబార్లు వచ్చే అవకాశం తిరుపతి క్రైం: ఎకై ్సజ్ శాఖ ఎట్టకేలకు నూతన బార్ పాలసీ సిద్ధం చేసింది. పాత బార్ యజమానులకు అనుకూలంగా కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ దృష్ట్యా బార్లను పాతవారికే ఇవ్వాలని నిర్ణరుుంచి, కొత్త నిబంధనలు తయారు చేశారు. మున్సిపాలిటీల్లో కొత్తబార్లు జిల్లాలో 6 మున్సిపాలిటీలు, 2 కార్పొరేషన్లు ఉన్నారుు. నూతన బార్ పాలసీ వల్ల వీటిలో 7 నుంచి 10 వరకు బార్లు పెరగనున్నారుు. కొత్త వాటికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. ప్రస్తుతం జిల్లాలో చిత్తూరు, తిరుపతి పరిధిలో 27 బార్లు ఉన్నారుు. కొత్త నిబంధనలకు అనుగుణంగా బార్ లెసైన్సలను జారీ చేయాలని నిర్ణరుుంచారు. లెసైన్సలు తీసుకోవడానికి ఇష్టపడిన వ్యాపారుల స్థానంలో కొత్తవారికి లాటరీ పద్ధతిలో బార్లు కేటారుుస్తారు. బార్ విస్తీర్ణం 150 నుంచి 200 చదరపు మీటర్లకు పెంచారు. ఆపై పెరిగే ప్రతి 100 చ.మీటర్ల విస్తీర్ణానికి లెసైన్స ఫీజులో 10శాతం అదనంగా చెల్లించాలి. ప్రస్తుతం బార్ యజమానులు కాలపరిమితి వరకు రూ.35 లక్షలు చెల్లిస్తున్నారు. వినియోగదారులు అడిగితే సీసాలు ఓపెన్ చేయకుండా ఇవ్వాలి. పార్కింగ్ స్థలం, కిచెన్ ఉండాలి. లెసైన్స ఫీజు లక్ష నుంచి 4 లక్షలకు పెంచనున్నారు. -
సంక్షేమం, కార్పొరేషన్ల కలిపివేతలో మార్పులు
హన్మకొండ అర్బన్ : అన్ని సంక్షేమ శాఖ లు, కార్పొరేషన్లు ఒకే గొడుగు కిందికి తేవాలని నిర్ణయించిన ప్రభుత్వం తాజాగా కొన్నిమార్పులు చేసింది. బీసీ సంక్షేమ, బీసీ కార్పొరేషన్, దళిత సంక్షేమం, కార్పొరేషన్, మైనార్టీ సంక్షేమం, కార్పొరేషన్, ఎస్టీ సంక్షేమం, కార్పొరేషన్లను రెండింటిని ఒకే అధికారి పరిధిలోకి తేవాలని నిర్ణయిం చింది. ఈ మేరకు ప్రతిపాదనలు పంపాల ని జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. కాగా బీసీ సంక్షేమం, కార్పొరేషన్లో ఇప్పటికే ఉమ్మడి జాబితాను ప్రభుత్వానికి పంపారు. -
పార్కులకు అమృత్ నిధులు
కరీంనగర్: అమృత్ పథకానికి ఎంపికైన జిల్లాలోని కరీంనగర్, రామగుండం కార్పొరేషన్ల పరిధిలో పార్కుల అభివృద్ధి కోసం నిధులు మంజూరయ్యాయి. జీవో నెం.589 ద్వారా ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ ఎంజీ గోపాల్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. కరీంనగర్కు రూ.69 లక్షలకు రూ.57 లక్షలు మంజూరయ్యాయి. అందులో 50 శాతం కేంద్రప్రభుత్వ వాటా రూ.28 లక్షలు, 20శాతం రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.11.40 లక్షలు, కార్పొరేషన్ వాటా 30 శాతం 29.10 లక్షలు. రామగుండంకు రూ.1.08 కోట్లకు రూ.కోటి మంజూరు కాగా అందులో 50 శాతం కేంద్రప్రభుత్వ వాటా రూ.50 లక్షలు, 20శాతం రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.20 లక్షలు పోను కార్పొరేషన్ వాటా 30 శాతం రూ.29.10 లక్షలు జమచేయాల్సి ఉంటుంది. ఈ నిధులు ఫైనాన్స్ విభాగం ద్వారా మున్సిపాలిటీల ఖాతాల్లో జమ అవుతాయని జీవోలో పేర్కొన్నారు. -
పేదల రుణాలకు ఏదీ స్వాతంత్ర్యం?
పంద్రాగస్టు నాడు ఆస్తుల పంపిణీలతో... నాడు కళకళ.. నేడు వెలవెల సబ్సిడీ నిధులకు సంకెళ్లు వేసిన ప్రభుత్వం కష్టాల కడలిలో కార్పొరేషన్లు పంద్రాగస్టు అంటే నిరుపేదల ముఖాల్లో సంతోషం వెల్లివిరిసేది.. పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో అందరి సమక్షంలో ప్రజా ప్రజాప్రతినిధులు, అధికారుల చేతుల మీదుగా రుణం పొందుతామనే ఆనందం వారిలో కనిపించేది.. ఇదంతా గతం.. ప్రస్తుతం నాటి కల... నేడు కలగా మారింది.. ‘మా రుణాలకు స్వాతంత్య్రం ఎప్పుడొస్తుంది’ అని పేదలు ప్రశ్నిస్తున్నారు. కడప రూరల్: నిరుపేదల సంక్షేమం అనగానే ఎస్సీ, ఎస్టీ, బీసీ, కాపు, మైనార్టీ, క్రైస్తవ, స్టెప్ కార్పొరేషన్లు గుర్తుకొస్తాయి. ఈ శాఖల ద్వారా నిరుపేదలైన అర్హులకు రాష్ట్ర ప్రభుత్వం రుణాలను అందించాల్సి ఉంది. కాగా పాలకులు బ్యాంకు లింకేజీ సబ్సిడీ రుణాల లక్ష్యాలను ఘనంగా ప్రకటిస్తున్నారు. అయితే అమలు మాత్రం చేయడం లేదు. తమ వాటాగా ప్రభుత్వం సబ్సిడీ నిధులను సకాలంలో విడుదల చేయనందున 2015-16 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కొన్ని శాఖల ద్వారా కొంత మంది మాత్రమే రుణాలు పొందగలిగారు. మరి కొన్ని శాఖలకు ఒక్క పైసా కూడా రానందున ఇంత వరకు ఏ ఒక్కరూ రుణం పొందలేక పోయారు. నిర్వీర్యంగా కార్పొరేషన్లు 2016-2017 ఆర్థిక సంవత్సరంలోకి అడుగుపెట్టి నెలలు గడుస్తున్నప్పటికీ.. కార్పొరేషన్లలో ప్రగతి లేక నిర్వీర్యంగా మారుతున్నాయి. గతంలో రుణాలను పంపిణీ చేసినా, చేయకపోయినా స్వాతంత్య్ర దినోత్సవం నాడు మాత్రం తప్పనిసరిగా ఆస్తుల పంపిణీ కార్యక్రమం ద్వారా పెద్ద ఎత్తున రుణాలను అర్హులకు అందించే వారు. ఇప్పుడా పరిస్థితి ఏమాత్రం కనిపించడం లేదు. చెప్పుకోవాలి కాబట్టి తప్పని పరిస్థితుల్లో ఏవో అలా ఇచ్చేస్తున్నారనే అభిప్రాయం అందరిలో కలుగుతోంది. కార్పొరేషన్ల స్థితిగతుల ప్రగతిని పరిశీలిస్తే ఇలా ఉన్నాయి. జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా బ్యాంకు లింకేజి కింద 1846 యూనిట్లను అందుకు గాను సబ్బిడీతో కలిపి రూ 23.24 కోట్లు అవసరం (అందులో సగం సబ్సిడీ ఉంటుంది). అయితే ప్రభుత్వం బ్యాకెండ్ సబ్సిడీ విధానాన్ని ఉన్నఫలంగా ప్రవేశ పెట్టింది. అంటే మొదట బ్యాంకర్లు సబ్సిడీతో కలిపి మొత్తం రుణాన్ని అర్హులకు అందజేయాలి. రెండేళ్ల తరువాత యూనిట్ ఉంటే లబ్ధిదారునికి సబ్సిడీని అందిస్తారు. ఇటీవల ప్రభుత్వం సబ్సిడీని విడుదల చేసినప్పటికీ బ్యాంకర్లు ఎంత మందికి రుణాలు అందించారో తెలియని పరిస్థితి ఏర్పడింది. అలాగే ఎన్ఎస్కేఎఫ్డీసీ కింద 51 యూనిట్లను 55 మంది లబ్ధిదారులకు అందించాలి. అయితే ఇంత వరకూ ఎవరికీ రుణం మంజూరు కాలేదు. ఎన్ఎస్ఎఫ్డీసీ రుణాలను 195 యూనిట్లను 195 మందికి అందించాల్సి ఉండగా.. వీటిని మాత్రం అధికారులు కొంత మందికి అందిస్తున్నారు. ఎస్టీ కార్పొరేషన్ వారు 224 యూనిట్లను 268 మంది లబ్ధిదారులకు అందజేయాలి. అందుకోసం సబ్సిడీతో కలిపి మొత్తం రూ 3.02 కోట్లు (అందులో సగం సబ్సిడీ ) అవసరం కాగా సబ్సిడీ విడుదల కానందున ఎవరూ రుణం పొందలేదు. బీసీ కార్పొరేషన్ ద్వారా దాదాపు 1800 యూని ట్లు అంతే మందికి అందాల్సి ఉండగా, 1300 మంది రుణాలు పొందారు. ఇక బీసీలకు చెందిన ఫెడరేషన్ల ప్రగతి కూడా నత్తనడకన సాగుతోంది. కొత్తగా ఏర్పడిన కాపు కార్పొరేషన్ వలన 1854 యూనిట్లను అంతే మందికి అందజేయాలి. అందుకోసం కేవలం సబ్సిడీకి మాత్రమే 5.68 కోట్లు అవసరం కాగా ఇప్పటి వరకు రూ 2.82 కోట్లు మంజూరు కావడంతో గ డిచిన మే నెలాఖరు వరకు 924 మంది మాత్రమే రుణాలు పొందగలిగారు. తరువాత మరెవరికీ రుణం అందలేదు. ఇక అన్ని వర్గాలకు చెందిన స్టెప్ పూర్తిగా నిర్వీర్యమైంది. రెండేళ్ల నుంచి ఆ శాఖ ద్వారా ఎవరికీ రుణాలు మంజూరు కాలేదు. -
రుణాలను మంజూరు చేయాలి
హుజూర్నగర్ : ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా 2015–16 ఆర్థిక సంవత్సరానికి గాను రుణాలు పొందేందుకు ఎంపికైన లబ్ధిదారులకు సబ్సిడీ నగదును మంజూరు చేయాలని డీసీసీ అధికార ప్రతినిధి ఎండి.అజీజ్పాషా కోరారు. ఆదివారం స్థానికంగా జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. స్వయం ఉపాధి కోసం ఆయా వర్గాలకు చెందిన లబ్ధిదారులను ఎంపిక చేసి 5 నెలలు గడిచినా నేటి వరకు వారి ఖాతాల్లో నగదు జమ చేయలేదన్నారు. స్వయం ఉపాధి రుణాలు ఇచ్చేందుకు బడ్జెట్లో కేటాయింపులు చేసినట్లు ప్రభుత్వం ప్రకటిస్తున్నా కార్పొరేషన్లు మాత్రం నగదు మంజూరు కాలేదని చెపుతున్నాయన్నారు. ప్రతి ఏడాది రెండు సార్లు లబ్ధిదారుల ఎంపిక జరగాల్సి ఉనా మొదటి విడత లబ్ధిదారులకే ఇంత వరకూ రుణాలు మంజూరు కాలేదన్నారు. సమావేశంలో నాయకులు కోల మట్టయ్య, ఎస్కె.అహ్మద్హుస్సేన్, జాల గురవయ్య, ఎండి.జహీరాబేగం, నాగరాజు, వెంకటేశ్వర్లు, ఎల్.నాగేశ్వరరావు, యోహాన్ పాల్గొన్నారు. 17హెచ్జడ్ఆర్01 – సమావేశంలో మాట్లాడుతున్న అజీజ్పాషా -
రుణాలను మంజూరు చేయాలి
హుజూర్నగర్ : ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా 2015–16 ఆర్థిక సంవత్సరానికి గాను రుణాలు పొందేందుకు ఎంపికైన లబ్ధిదారులకు సబ్సిడీ నగదును మంజూరు చేయాలని డీసీసీ అధికార ప్రతినిధి ఎండి.అజీజ్పాషా కోరారు. ఆదివారం స్థానికంగా జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. స్వయం ఉపాధి కోసం ఆయా వర్గాలకు చెందిన లబ్ధిదారులను ఎంపిక చేసి 5 నెలలు గడిచినా నేటి వరకు వారి ఖాతాల్లో నగదు జమ చేయలేదన్నారు. స్వయం ఉపాధి రుణాలు ఇచ్చేందుకు బడ్జెట్లో కేటాయింపులు చేసినట్లు ప్రభుత్వం ప్రకటిస్తున్నా కార్పొరేషన్లు మాత్రం నగదు మంజూరు కాలేదని చెపుతున్నాయన్నారు. ప్రతి ఏడాది రెండు సార్లు లబ్ధిదారుల ఎంపిక జరగాల్సి ఉనా మొదటి విడత లబ్ధిదారులకే ఇంత వరకూ రుణాలు మంజూరు కాలేదన్నారు. సమావేశంలో నాయకులు కోల మట్టయ్య, ఎస్కె.అహ్మద్హుస్సేన్, జాల గురవయ్య, ఎండి.జహీరాబేగం, నాగరాజు, వెంకటేశ్వర్లు, ఎల్.నాగేశ్వరరావు, యోహాన్ పాల్గొన్నారు. 17హెచ్జడ్ఆర్01 – సమావేశంలో మాట్లాడుతున్న అజీజ్పాషా -
కార్పొరేషన్లకు కాసుల గలగల!
సాక్షి, హైదరాబాద్: ఇటీవలి మున్సిపల్ ఎన్నికల్లో ఇచ్చిన ఓ హామీని టీఆర్ఎస్ ప్రభుత్వం నిలబెట్టుకుంది. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్కు రూ.300 కోట్లు, ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లకు తలా రూ.100 కోట్ల నిధులను బడ్జెట్లో కేటాయించింది. మరోవైపు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)కి మాత్రం నిధుల్లో కోతలు పెట్టింది. యాదగిరిగుట్ట, వేములవాడ ఆలయాల అభివృద్ధి పట్ల సీఎం కేసీఆర్ చూపిన ప్రత్యేక చొరవకు తగినట్లుగా ఈ రెండు ఆలయాల అథారిటీలకు చెరో రూ.100 కోట్లు కేటాయించారు. గత బడ్జెట్తో పోల్చితే 2016-17కి సంబంధించిన బడ్జెట్లో చెప్పుకోదగిన అంశాలు ఇవే. ఈసారి బడ్జెట్ సందర్భంగా నిర్వహించిన పథకాల పునర్వ్యవస్థీకరణ ప్రభావం పురపాలకశాఖపై స్పష్టంగా కనిపించింది. జలమండలి, హెచ్ఎండీఏ, మెట్రో రైలు ప్రాజెక్టులకు గత బడ్జెట్లకు ప్రణాళిక పద్దు కింద జరిపిన కేటాయింపులను తాజా బడ్జెట్లో ప్రణాళికేతర పద్దు కిందికి మార్చారు. ప్రణాళికా వ్యయం కింద హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్, సీవరేజీ బోర్డు (జలమండలి)కి రూ.1,000 కోట్లు, హైదరాబాద్ మెట్రో రైలుకు రూ.200 కోట్లు, హెచ్ఎండీఏకు రూ.650 కోట్లు, 14వ ఆర్థిక సంఘం కింద మున్సిపాలిటీలకు రూ.325.23 కోట్లను కేటాయించారు. ఈ పద్దు కింద గత బడ్జెట్లో జీహెచ్ఎంసీ రోడ్ల అభివృద్ధికి రూ.250 కోట్లు, హరితహారానికి రూ.25 కోట్లను కేటాయించగా... ఈసారి వీటికి మొండిచెయ్యి చూపారు. మరిన్ని ప్రధాన కేటాయింపులు * ఓఆర్ఆర్ ప్రాజెక్టు కోసం హెచ్ఎండీఏ రూ.235 కోట్ల రుణం * మున్సిపల్ డెవలప్మెంట్ ప్రాజెక్టుకు రూ.140 కోట్లు * రాష్ట్ర ఆర్థిక సంఘం కింద మున్సిపాలిటీలకు రూ.191.86 కోట్లు, కేంద్ర పథకాలైన అమృత్కు రూ.121.63 కోట్లు, స్వచ్ఛ భారత్కు రూ.61.09 కోట్లు. * స్మార్ట్సిటీ ప్రాజెక్టుకు నిధులు రూ.132.28 నుంచి రూ.66.36 కోట్లకు తగ్గింపు -
మార్చి 6న ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మరోసారి ఎన్నికల నగరా మోగింది. గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పొరే షన్లు, అచ్చంపేట నగర పంచాయతీలకు మార్చి 6వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదివారం ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. సోమవారం ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది. మున్సిపల్ ఎన్నికల చ ట్టంలో ప్రభుత్వం మార్పులు చేసి గతంలో 21 (మూడు వారాలు) రోజుల పాటు ఉండే ఎన్నికల ప్రక్రియను 14 రోజులకు (రెండు వారాలు) కుదించింది. ఎన్నికల నిర్వహణ మధ్యలో సెలవులు వచ్చినా పని దినాలుగానే ప్రకటిస్తారు. ఈ ఎన్నికల్లో ఓటర్లు ‘నోటా’ అవకాశాన్ని ఉపయోగించుకునే అవకాశం కల్పించనున్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ వి.నాగిరెడ్డి విడుదల చేసిన ఎన్నికల షెడ్యూలు ఇదీ.. ఎన్నికల ప్రకటన: నేడు. ఇదే రోజు నుంచి నామినేషన్ల స్వీకరణ నామినేషన్ల దాఖలుకు ఆఖరి తేదీ: ఫిబ్రవరి 24 నామినేషన్ల పరిశీలన: ఫిబ్రవరి 25 నామినేషన్ల ఉప సంహరణకు ఆఖరి రోజు: ఫిబ్రవరి 26 పోలింగ్ తేదీ: మార్చి 6 రీ పోలింగ్: మార్చి 8 (అవసరం అయితేనే) ఓట్ల లెక్కింపు: మార్చి 9 -
కార్పొరేషన్లలో స్పెషల్ ఆఫీసర్ల పాలన పొడిగింపు
విజయవాడ: ఐదు కార్పొరేషన్లలో స్పెషల్ ఆఫీసర్ల పాలన పొడిగింపునకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు బుధవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తిరుపతి, కాకినాడ, గుంటూరు, కర్నూలు, ఒంగోలులో కార్పొరేషన్లలో ప్రత్యేకాధికారుల పాలనను పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వీటితో పాటుగా ప్రకాశం జిల్లా కందకూరు, కడప జిల్లాలోని రాజంపేట నగర పంచాయతీలో ప్రత్యేకాధికారుల పాలనను ప్రభుత్వం పొడిగించింది. -
వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లకు లైన్ క్లియర్
హైదరాబాద్: వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ల ఎన్నికలకు లైన్ క్లియర్ అయింది. డివిజన్ల రిజర్వేషన్లను తెలంగాణ ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ మేరకు టీఆర్ఎస్ సర్కార్ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం వరంగల్, ఖమ్మం జిల్లాల డివిజన్లు, అందులోని రిజర్వేషన్లు పరిశీలిస్తే.. వరంగల్: మొత్తం 58 డివిజన్లు ఎస్టీ జనరల్-01, ఎస్టీ మహిళ-1, ఎస్సీ జనరల్-05, ఎస్సీ మహిళ-04, బీసీ జనరల్-10, బీసీ మహిళ-09, జనరల్ మహిళ-15, అన్ రిజర్వడ్-13 ఖమ్మం: మొత్తం 50 డివిజన్లు ఎస్టీ జనరల్ -01, ఎస్టీ మహిళ-01, ఎస్సీ జనరల్-03, ఎస్సీ మహిళ 03, బీసీ జనరల్-09, బీసీ మహిళ-08, జనరల్ మహిళ-13, అన్ రిజర్వడ్-12 -
పట్నానికి ప్రగతి వెలుగులు
► భారీ ఎత్తున మౌలిక వసతుల కల్పనపై సర్కారు దృష్టి ► కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో వేల కోట్లతో ప్రాజెక్టులు చేపట్టేందుకు సిద్ధం ► ప్రణాళికలు రూపొందించాల్సిందిగా సీఎం కేసీఆర్ ఆదేశాలు ► హైదరాబాద్కు మంచినీటి రిజర్వాయర్లు నిర్మించాలి ►ప్రతి ఇంటికీ తాగునీరు అందించడమే లక్ష్యంగా పనిచేయాలి ► నిజామాబాద్, కరీంనగర్లో భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ ► పట్టణాలు, నగరాలు ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చెందాలి ► అక్రమ కట్టడాలను నియంత్రించాల్సిందిగా అధికారులకు ఆదేశాలు సాక్షి, హైదరాబాద్: నగరాలు, పట్టణాల్లో భారీ ఎత్తున మౌలిక సదుపాయాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. గ్రేటర్ హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్, ఖమ్మం, కరీంనగర్, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లతోపాటు 62 మున్సిపాలిటీల్లో మంచినీటి సరఫరా, డ్రైనేజీల నిర్వహణ, సీవరేజ్ పనులు, రహదారుల నిర్మాణాలకు పలు ప్రాజెక్టులు చేపట్టేందుకు కసరత్తు చేస్తోంది. వచ్చే 35 ఏళ్ల వరకు సరిపడ రీతిలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రణాళికలు రూపొందించాలని నిర్ణయిం చింది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ఆదేశాలతో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ పరిధిలోని జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, జల మండలి, పబ్లిక్ హెల్త్ విభాగాలు గత కొద్ది రోజులుగా ఈ మేరకు ప్రాథమిక నివేదికలు సిద్ధం చేస్తున్నాయి. ఈ ప్రాజెక్టులకు దేశీయ, విదేశీ ఆర్థిక సంస్థల నుంచి వేల కోట్ల రుణాలు సమీకరించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. సోమవారం ముఖ్యమంత్రి తన క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమీక్షలో హైదరాబాద్, ఇతర నగరాలు, పట్టణాల్లో మౌలిక వసతుల కల్పనపై మరోసారి విస్తృతంగా చర్చించారు. నిధులిచ్చేందుకు సిద్ధం మౌలిక సదుపాయాల కోసం కార్యాచరణ రూపొందించాలని, తగిన నిధులు సమకూర్చడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా సీఎం అధికారులకు తెలిపారు. హైదరాబాద్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. నగరానికి మంచి నీటి రిజర్వాయర్లు నిర్మించడంతోపాటు ప్రతీ ఇంటికి మంచినీటి సరఫరా చేసేలా కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. నిజామాబాద్, కరీంనగర్లో అండర్గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేయాలన్నారు. నగరాలు, పట్టణాలు ప్రణాళికబద్ధంగా అభివృద్ధి చెందాలని, అక్రమ నిర్మాణాలు, కట్టడాలను నియంత్రించాలని స్పష్టంచేశారు. పట్టణ ప్రాంతాల్లో బలహీన వర్గాలకు గృహ సముదాయాల నిర్మాణానికి అవసరమైన ప్రతిపాదనలు కూడా సిద్ధం చేయాలని పేర్కొన్నారు. ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు డి.శ్రీనివాస్, సీఎంవో ముఖ్య కార్యదర్శి నర్సింగ్రావు, ఆర్థిక శాఖ కార్యదర్శి రామకృష్ణారావు, మున్సిపల్ శాఖ కార్యదర్శి ఎంజీ గోపాల్, జీహెచ్ఎంసీ కమిషన ర్ సోమేశ్కుమార్, పురపాలక శాఖ సంచాలకుడు జనార్దన్ రెడ్డి, వరంగల్ కమిషనర్ సర్ఫరాజ్ అహమ్మద్ ఈ భేటీలో పాల్గొన్నారు. రుణాల కోసం వేట.. మౌలిక వసతుల కోసం చేపట్టే ప్రాజెక్టులకు భారీ ఎత్తున రుణాలను సమీకరించేందుకు ప్రభుత్వం యత్నిస్తోంది. పట్టణ ప్రాంత వాటర్గ్రిడ్ ప్రాజెక్టు అవసరాల కోసం రూ.10 వేల కోట్ల రుణాలను సమీకరించాలని నిర్ణయించింది. ఇందులో రూ.2 వేల కోట్ల రుణాన్ని ఇచ్చేందుకు హడ్కో సంసిద్ధత వ్యక్తం చేయగా.. మిగిలిన రూ.8 వేల కోట్లను ఇన్ఫ్రాస్ట్రక్చర్ లీజింగ్ అండ్ ఫైనాన్స్ సర్వీసెస్(ఐఎల్ఎఫ్ఎస్) నుంచి పొందేందుకు ప్రయత్నాలు చేస్తోంది. సోమవారం ఐఎల్ఎఫ్ఎస్ ప్రతినిధులతో కూడా సీఎం చర్చలు జరిపారు. గ్రేటర్ హైదరాబాద్ నగర శివార్లలో రేడియల్ రోడ్లు, నగరంలో రహదారుల నిర్మాణం, మూసీ ప్రక్షాళనతోపాటు ఇతర పనుల కోసం రూ.20 వేల కోట్లతో కొత్త ప్రాజెక్టులకు ప్రభుత్వం రూపకల్పన చేస్తోంది. అలాగే వరంగల్, నిజామాబాద్, ఖమ్మం, కరీంనగర్, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లలో రోడ్లు, భూగర్భ డ్రైనేజీ, సీవరేజీ సదుపాయాల కోసం రూ.6 వేల కోట్లతో పనులు చేయాలని ప్రాథమికంగా నిర్ణయించింది. ఈ ప్రాజెక్టులకు కావాల్సిన రూ.26 వేల కోట్లను ‘బ్రిక్స్’ బ్యాంక్ నుంచి సమీకరించేందుకు ప్రతిపాదనలు సిద్ధమైనట్లు సమాచారం. -
కార్పొరేషన్లుగా మూడు పట్టణాలు
మారనున్న మచిలీపట్నం, విజయనగరం, శ్రీకాకుళంల హోదా సాక్షి, విజయవాడ బ్యూరో: రాష్ట్రంలో మూడు పురపాలక సంఘాలు కార్పొరేషన్లుగా అప్గ్రేడ్ కానున్నాయి. మచిలీపట్నం, విజయనగరం, శ్రీకాకుళం మున్సిపాల్టీలను సాధ్యమైనంత త్వరగా కార్పొరేషన్లుగా మార్చడానికి పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ కసరత్తు చేస్తోంది. ఈ మూడింటి పరిధిలో భారీ ప్రాజెక్టులు ఏర్పాటు కానున్న నేపథ్యంలో వాటి సామర్థ్యం పెంచాలని(కెపాసిటీ బిల్డింగ్) నిర్ణయించింది. మచిలీపట్నంలో పోర్టుతోపాటు నౌకాశ్రయ ఆధారిత పరిశ్రమలు, పోర్టు సిటీని నిర్మించడానికి ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. అందుకే మచిలీపట్నాన్ని నగరంగా మార్చనుంది. పరిశ్రమలకు ప్రోత్సాహం రెండున్నర లక్షల జనాభా ఉన్న విజయనగరం మున్సిపాల్టీ ఇకపై కార్పొరేషన్గా అవతరించనుంది. లక్షన్నర జనాభా ఉన్న శ్రీకాకుళం మున్సిపాల్టీని కార్పొరేషన్గా మార్చడం ద్వా రా చుట్టుపక్కల ఏర్పాటు చేసే పరిశ్రమలకు ప్రోత్సాహం లభిస్తుందని అంచనా వేస్తోంది. కాగా కొత్తగా నాలుగు పట్టణాభివృద్ధి సంస్థ(ఉడా)ల ఏర్పాటుకు కసరత్తు పూర్తయింది. నెల్లూరు, కర్నూలు, అనంతపురంతోపాటు ఉభయ గోదావరి జిల్లాల కోసం గోదావరి ఉడా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. -
మున్సిపాలిటీలు.. మురికికూపాలు!
♦ సమ్మె మొదలై 10 రోజులు గడిచినా పట్టించుకోని ప్రభుత్వం ♦ పోరాటం ఉద్ధృతం చేయాలని జేఏసీ నిర్ణయం ♦ పట్టణాల్లో గుట్టలుగా పేరుకుపోతున్న వ్యర్థాలు ♦ అంటువ్యాధులు ప్రబలుతాయని ప్రజల ఆందోళన సాక్షి, విజయవాడ బ్యూరో: రాష్ట్రంలో కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు మురికి కూపాలుగా మారుతున్నాయి. కార్మికులు సమ్మె కొనసాగిస్తుండడంతో శుభ్రపరిచేవారు లేక ఎక్కడికక్కడ చెత్త పేరుకుపోతోంది. మరికొన్ని రోజులు ఇదే పరిస్థితి కొనసాగితే అంటువ్యాధులు ప్రబలడం ఖాయమని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న మున్సిపల్ కార్మికుల సమ్మె సోమవారం నుంచి మరింత ఉద్ధృతం కానుంది. తాజా ఉద్యమ కార్యాచరణను జేఏసీ నేతలు ఖరారు చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్ల ముట్టడితో పాటు ధర్నాలు, రాస్తారోకోల వంటి ప్రత్యక్ష ఆందోళనలు చేపట్టేందుకు మున్సిపల్ కార్మికులు సన్నద్ధమవుతున్నారు. ఉద్యమంలో భాగంగా జేఏసీ నేతలు సోమవారం విజయవాడలో రాజకీయ పార్టీల ప్రత్యేక రౌండ్టేబుల్ సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ కార్మికుల సమ్మె 11వ రోజుకు చేరింది. విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, తిరుపతి, రాజమండ్రి నగర పాలక సంస్థలతో పాటు 113 మున్సిపాలిటీల్లో మొత్తం 40 వేల మందికి పైగా కార్మికులు సమ్మెలో పాల్గొంటున్నారు. వేతనాల పెంపుపై ప్రభుత్వం ప్రకటన చేసే వరకూ సమ్మె విరమించేది లేదని రాష్ట్ర మున్సిపల్ ఉద్యోగులు, కార్మికుల ఐక్య కార్యాచరణ కమిటీ(జేఏసీ) నేతలు రంగనాయకులు, కె. ఉమామహేశ్వరరావు స్పష్టం చేస్తున్నారు. ఆందోళన చేస్తున్న మున్సిపల్ కార్మికులపై ఇప్పటికే నెల్లూరు, ప్రకాశం, విశాఖ, గుంటూరు, కృష్ణా, కడప జిల్లాల్లో కేసులు నమోదయ్యాయి. ఈ నెల 17న ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయాన్ని ముట్టడించిన కార్మికులను పోలీసులు అరెస్ట్ చేశారు. అయినా ప్రభుత్వం వీరి డిమాండ్ల పరిష్కారంపై దృష్టి పెట్టడం లేదు. పట్టణాల్లో దుర్గంధం మున్సిపల్ కార్మికుల సమ్మె కారణంగా మున్సిపాల్టీల్లో చెత్త టన్నుల కొద్దీ పేరుకుపోయింది. విజయవాడ, గుంటూరు, రాజమండ్రి, తిరుపతి నగరాల్లో ప్రధాన వీధులు సైతం దుర్గంధాన్ని వెదజల్లుతున్నాయి. ఏపీలో మొత్తం కార్పొరేషన్లు: 13 మున్సిపాలిటీలు: 74 నగర పంచాయతీలు: 26 సమ్మెలో ఉన్న ఉద్యోగులు, కార్మికులు: 40వేలు -
సమ్మెకు సైరన్!
- నేటి నుంచి మునిసిపల్ కార్మికుల సమ్మె - పారిశుద్ధ్యం, నీటి సరఫరాకు ఇబ్బందులు తలెత్తే అవకాశం - ఆందోళనలో ప్రజలు చిత్తూరు(అర్బన్): తమ దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించాలంటూ జిల్లాలోని రెండు కార్పొరేషన్లు, ఆరు మునిసిపాలిటీల్లో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులు సమ్మె బాటపట్టనున్నారు. రాష్ట్ర కార్మిక సంఘనాయకుల పిలుపు మేరకు పారిశుద్ధ్య కార్మికులు సమ్మెలోకి వెళ్లనున్నారు. తమ సమస్యలు తీర్చేవరకు నిరవధిక సమ్మె చేస్తామని గురువారం జిల్లాలోని అన్ని మునిసిపల్, కార్పొరేషన్ల కమిషనర్లకు, అధికారులకు కార్మికులు సమ్మె నోటీసులు జారీచేశారు. కార్మికుల సమ్మె ఫలితంగా నగరాల్లో, పట్టణాల్లో పారిశుద్ధ్య పనులు ఎక్కడికక్కడే నిలిచిపోనున్నాయి. జిల్లాలోని చిత్తూరు, తిరుపతి కార్పొరేషన్లతో పాటు పలమనేరు, పుంగనూరు, మదనపల్లె, నగరి, పుత్తూరు, శ్రీకాళహస్తి మునిసిపాలిటీల్లో దాదాపు 1,100 మంది శాశ్వత ప్రాతిపదికన, 3 వేల మందికి పైగా తాత్కాలిక పద్ధతిన కార్మికులు పారిశుద్ధ్య పనులు నిర్వహిస్తున్నారు. ఉదయం నుంచి రాత్రులు సైతం రోడ్లపై చెత్తను తీయడం, కాలువల్లో పూడికలు తీయడం లాంటి పనులను చేస్తున్నారు. అయితే కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ఏడాది కాలంగా ప్రభుత్వానికి పలుమార్లు వినతులు అందచేసినా ఎలాంటి ప్రయోజనం లేదు. కొన్ని మునిసిపాలిటీల్లో పారిశుద్ధ్య కార్మికులకు మద్దతుగా ఇంజనీరింగ్ విభాగంలో పనిచేస్తున్న వీధి దీపాల నిర్వహణ, నీటి కొళాయిల ఆపరేటర్లు సమ్మెలోకి వెళ్లనున్నారు. తాగునీటి సరఫరాపై సమ్మె ప్రభావం పడనుంది. ఇవీ డిమాండ్లు... - జీవో నెం - 263ను పునరుద్ధరించి 1994 నుంచి పదవీ విరమణ చేసిన పారిశుద్ధ్య కార్మికుల పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలి. - పారిశుద్ధ్య పనుల్లో జీవో నెం - 581ను అమలు చేసి గ్లోబల్ టెండర్లను రద్దు చేయాలి. - 1993 కంటే ముందు నుంచి టైమ్స్కేల్ కింద పనిచేస్తున్న ఉద్యోగులను ఎలాంటి నిబంధనలు లేకుండా వెంటనే పర్మినెంట్ చేయాలి. కాంట్రాక్టు కార్మికులను సైతం పర్మినెంట్ చేయాలి. - దశాబ్దాల కాలంగా కార్మికులు నివసిస్తున్న మునిసిపల్ క్వార్టర్స్ను రెంట్ఫ్రీ క్వార్టర్స్గా పరిగణించి కార్మికులకు అప్పగించాలి. - కార్మికులకు వాషింగ్ అలవెన్స్, కుట్టుకూలీ పెంచాలి. వ్యక్తిగత జీపీఎఫ్ నెంబర్లు కేటాయించాలి. - ప్రభుత్వ సెలవు దినాల్లో కార్మికులకు పూర్తిగా సెలవులు అమలు చేయాలి. - సీడీఎంఏ కార్యాలయం హైదరాబాద్ నుంచి విజయవాడకు తరలించాలి. -
మీరు బతికే ఉన్నారా?
‘ఆసరా’ కావాలంటే నిరూపించుకోవాల్సిందే * మూడు నెలలకోసారి ‘మీసేవ’లో నమోదు * వచ్చే నెల నుంచి బ్యాంకు, పోస్టల్ ఖాతాల్లోకే పింఛన్లు * తొలుత కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో లబ్ధిదారుల నుంచి వివరాల సేకరణ సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ప్రతి నెలా పింఛను కావాలంటే లబ్ధిదారులు ఇకపై మూడు నెలలకోసారి తాము బతికున్నట్లు నిరూపించుకోవాల్సిందే! అప్పుడే పింఛను పొందగలుగుతారు. అయితే పింఛను కోసం అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరగాల్సిన పనిలేకుండా నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలోనే జమ చేస్తారు. వచ్చే నెల నుంచి పట్టణాలు, నగరాల్లో, ఆ తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో ఈ తరహా విధానాన్ని అమలు చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, బీడీ, గీత కార్మికులు సహా మొత్తం 35.79 లక్షల మంది ప్రతి నెలా సామాజిక పింఛన్లు పొందుతున్నారు. ఈ డబ్బుల కోసం వారు ప్రభుత్వ కార్యాలయాల వద్ద గంటల తరబడి లైన్లో నిలబడాల్సి వస్తోంది. కొన్ని చోట్ల రోజుల తరబడి తిరుగుతున్న దాఖలాలున్నాయి. ఇకపై పింఛన్లను నేరుగా బ్యాంకు/పోస్టాఫీస్ ఖాతాల ద్వారా అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ విధానం వల్ల లబ్ధిదారుల్లో ఎంత మంది బతికున్నారో/చనిపోయారో తెలియని పరిస్థితి నెలకొనే అవకాశముంది. ఒకవేళ లబ్ధిదారులు మరణించినప్పటికీ డబ్బులు మాత్రం బ్యాంకు ఖాతాలో జమ అవుతూనే ఉంటాయని, ఆ మొత్తాన్ని వారి కుటుం బసభ్యులు ఏటీఎం ద్వారా తీసుకునే అవకాశముందని అధికారులు గ్రహించారు. పింఛను సొమ్ము పక్కదారి పట్టకుండా ప్రతి మూడు నెలలపాటు పింఛన్ను బ్యాంకు ఖాతాల్లో జమచేస్తారు. ఇలా చేయడం వల్ల లబ్ధిదారుల్లో ఎవరైనా చనిపోతే తెలిసిపోతుందని, తద్వారా పింఛను సొమ్ము పక్కదారి పట్టకుండా చూడగలమని అధికారులు చెబుతున్నారు. ‘కరీంనగర్ జిల్లాలో గత మూడు నెలల్లోనే 21,362 మంది లబ్ధిదారులను పింఛన్ల జాబితా నుంచి తొలగించారు. ఇందులో అనర్హులతోపాటు చనిపోయిన వాళ్లు కూడా చాలా మంది ఉన్నారు’ అని జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి ఒకరు తెలిపారు. ఇప్పటికే నిజామాబాద్, నల్లగొండ, మహబూబ్నగర్ జిల్లాల్లో చాలా చోట్ల పోస్టాఫీస్ ఖాతాల ద్వారా డబ్బులను పంపిణీ చేస్తున్నారు. కరీంనగర్ జిల్లాలో వచ్చే నెల నుంచి లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోనే నేరుగా డబ్బులు జమ చేసేలా అధికారులు చర్యలు చేపట్టారు. అందులో భాగంగా పింఛను డబ్బులు తీసుకునేందుకు వస్తున్న సమయంలోనే లబ్ధిదారుల నుంచి బ్యాంకు ఖాతాల వివరాలు సేకరిస్తోంది. గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు, ఎంపీడీవో కార్యాలయ సిబ్బంది ఆ వివరాలు సేకరించే పనిలో పడ్డా రు. మున్సిపాలిటీ, కార్పొరేషన్లలో బిల్ కలెక్టర్లు, పురపాలక సిబ్బంది ఈ పని చేస్తున్నారు. వివరాల సేకరణ కార్యక్రమం గ్రామాల్లో కొంత మందకొడిగా జరుగుతోంది. గ్రామీణ లబ్ధిదారుల నుంచి ఆశించిన మేరకు వివరాలు రావడం లేదని గ్రహించిన గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు తొలుత మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలోనే జూలై నుంచి ఈ విధానాన్ని అమలు చేసేందుకు సిద్ధమయ్యారు. ప్రతి మూడు నెలలకోసారి ప్రతి మూడు నెలలకోసారి లబ్ధిదారుడు తాను బతికే ఉన్నానంటూ సర్టిఫికెట్ తెచ్చి చూపించేలా కొత్త నిబంధన రూపొందించారు. ఇందుకోసం తహశీల్దార్/మున్సిపాలిటీ/ఆస్పత్రుల చుట్టూ తిరగాల్సిన పనిలేకుండా దగ్గర్లోని మీ సేవా/ఆధార్ కేంద్రాల్లో బయోమెట్రిక్ యంత్రాలను అందుబాటులో ఉంచాలని నిర్ణయించారు. తద్వారా సామాజిక పింఛను లబ్ధిదారులు ఆయా కేంద్రాలకు వెళితే... అక్కడున్న సిబ్బంది లబ్ధిదారుల వేలి ముద్రలను సరిపోల్చుతారు. బయోమెట్రిక్ యంత్రాల్లో పొందుపర్చిన వేలి ముద్రలతో సరిపోతే లబ్ధిదారుడు ‘బతికే ఉన్నట్లుగా’ నమోదు చేసి సమాచారాన్ని అధికారులకు తెలియజేస్తారు. -
మేయర్ పీఠం ఎవరిదో..
- కాషాయ కూటమికి ఖరారైన ఏఎంసీ పీఠం - 29న కార్పొరేటర్లతో సమావేశం - నవీముంబై రేసులో ముందున్న ఎన్సీపీ - సంఖ్యాబలం కోసం జోరుగా ప్రయత్నాల సాక్షి, ముంబై: కార్పొరేషన్ల ఎన్నికలు, ఫలితాల తంతు పూర్తి కావడంతో మేయర్, డిప్యూటీ మేయర్ పదవుల పై పార్టీలు దృష్టి సారించాయి. ఔరంగాబాద్లో అత్యధికంగా 52 స్థానాలు కైవసం చేసుకున్న శివసేన, బీజేపీ అధికారంలో కూర్చోవడం ఖాయమని తేలిపోయింది. 113 స్థానాల్లో శివసేనకు 29, బీజేపీకి 23 మొత్తం 52 స్థానాలు కైవసం చేసుకుని కాషాయ కూటమి పెద్ద పార్టీగా అవతరించింది. మేజిక్ ఫిగర్కు ఇంకా ఐదుగురు కార్పొరేటర్ల మద్దతు కావాలి. దీంతో గెలిచిన కొందరు స్వతంత్ర అభ్యర్థుల కోసం ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయి. దీనికి సంబంధించి శనివారం ఉదయం బీజేపీ, శివసేన నాయకుల మధ్య ప్రాథమిక చర్చలు జరిగాయి. ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఎక్కువ స్థానాలు వచ్చిన పార్టీకి మేయర్, తక్కువ వచ్చిన పార్టీకి డిప్యూటీ మేయర్ పదవులు దక్కనున్నాయి. ఎవరు, ఎంత కాలం ఏ పదవుల్లో కొనసాగాలనే విషయంపై తుది సమావేశం త్వరలో జరగనుంది. అంతకు ముందుగానే మేయర్, డిప్యూటీ మేయర్ పదవుల ఎన్నిక విషయంపై చర్చించేందుకు ఈ నెల 29న కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లతో సమావేశం నిర్వహించనున్నారు. ‘నవీముంబై’ ఎన్సీపీదే..? నవీముంబై కార్పొరేషన్లో మేయర్, డిప్యూటీ మేయర్ పదవులు ఎస్సీలకు రిజర్వు కావడంతో వాటిని ఎవరికి కేటాయిస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఇక్కడ నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) మొత్తం 111 స్థానాల్లో 52 గెలుచుకుని పెద్ద పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. ఇక్కడ మేజిక్ ఫిగర్ కావాలంటే 56 స్థానాలు తప్పనిసరి. దీంతో నలుగురు ఇండిపెండెంట్ల సాయంతో అధికార పీఠాన్ని దక్కించుకోవాలని ఎన్సీపీ ప్రయత్నిస్తోంది. 44 స్థానాలు దక్కించుకున్న శివసేన, బీజేపీ కూటమి కూడా అధికార పీఠాన్ని దక్కించుకోవాలని తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇందుకోసం గెలిచిన ఇద్దరు స్వతంత్రులు, 10 స్థానాలు దక్కించుకున్న కాంగ్రెస్ పార్టీతో మంతనాలు జరపాలని యోచిస్తున్నట్లు సమాచారం. అది సాధ్యం కాకపోయినా అధికారం కోసం ఇండిపెండెంట్లను లాక్కునేందుకు ఇరు పార్టీలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. మొత్తం అధికారం ఎన్సీపీకే దక్కడం దాదాపు ఖాయమైనప్పటికీ మేయర్, డిప్యూటీ మేయర్ పదవులు ఎవరిని వరిస్తాయనే విషయం త్వరలో తేలనుంది. మేయర్ పదవులకు మే తొమ్మిదో తేదీన ఎన్నికలు జరగనున్నాయి. -
ఖాళీ స్థలాలకు పన్ను వసూళ్లలో నిర్లక్ష్యం
అనంతపురం టౌన్ : నగర, పురపాలక సంఘాలు ప్రైవేటు స్థలాలకు పన్ను విధించడంలోనూ, విధించిన పన్ను వసూలు చేయడంలోనూ నిర్లక్ష్యం వహిస్తున్నారు. అనంతపురం కార్పొరేషన్తో పాటు జిల్లాలోని పురపాలక సంఘాల్లో ఖాళీ స్థలాల పన్ను (వీఎల్టీ) వసూలు డిమాండ్ రూ.2.15 కోట్లు ఉండగా ఇప్పటి వరకు వసూలు చేసింది రూ.18.28 లక్షలు మాత్రమే. పన్ను వసూలుపై అధికారులు పూర్తి స్థాయిలో దృష్టి పెట్టడం లేదు. అనంతపురం నగర పాలక సంస్థతో పాటు జిల్లాలోని 11 పురపాలక సంఘాల పరిధిలో చాలా ప్రైవేటు ఖాళీ స్థలాలు ఉన్నాయి. వీటిని గుర్తించి వీఎల్టీ విధించాల్సి ఉన్నా మొక్కుబడిగా కొన్ని స్థలాలకు పన్ను విధించారు. అవీ కూడా స్థల యజమానులు స్వయంగా వచ్చి పన్ను వేయించుకున్నవే కావడం గమనార్హం. విధించిన పన్ను వసూలుపైన దృష్టి పెట్టడం లేదు. ప్రైవేటు స్థలాలకు వీఎల్టీ విధించాలని ప్రభుత్వం కచ్చితంగా సూచించింది. అయితే ఎక్కడా ప్రభుత్వ సూచనలు అమలు కావడం లేదనేందుకు ఈ విషయంలో కనీస ప్రగతి లేకపోవడం నిదర్శనంగా నిలుస్తోంది. కళ్యాణదుర్గం, పుట్టపర్తి, మడకశిర మునిసిపాలిటీల్లో ఒక స్థలానికి కూడా పన్ను విధించలేదనేది అధికార నివేదిక తెలియజేస్తోంది. వీఎస్టీతో యజమానికి ప్రయోజనం ప్రైవేటు ఖాళీ స్థలాలకు వీఎస్టీ విధించడం ద్వారా సంబంధిత స్థల యజమానికి ప్రయోజనంగా ఉంటుంది. స్థలానికి పన్ను విధించే సమయంలో స్థల విస్తీర్ణాన్ని రికార్డుల్లో పక్కగా నమోదు చేస్తారు. వీఎస్టీ ఉన్న స్థలాలు కనీసం ఒక్క అడుగు కూడా దానికి అటు ఇటుగా ఉన్నవారు ఆక్రమించుకునేందుకు వీలు ఉండదు. స్థల యజమానులు దూర ప్రాంతాల్లో ఉంటారు. అలాంటి వారు తమ స్థలాలకు పన్ను చెల్లించడం ద్వారా సంస్థ తరఫున స్థలానికి రక్షణ పొందే అవకాశం లభిస్తుంది. ఎవరైనా ఆక్రమిస్తే సంస్థలో ఫిర్యాదు చేస్తే రికార్డులను పరిశీలించి ఆక్రమణదారులపై చర్యలు తీసుకుంటారు. -
ఆన్లైన్లో ఆస్తి పన్నుల స్వీకరణ
సాక్షి, హైదరాబాద్: నగర, పురపాలక సంఘాలు ఇకపై ఆన్లైన్లో ఆస్తి పన్నులు వసూలు చేయనున్నాయి. పురపాలక శాఖ కమిషనరేట్ వెబ్సైట్(www.cdma.gov.in) ద్వారా ఆన్లైన్ లో పన్నులను చెల్లించవచ్చు. ఈ మేరకు పురపాలక శాఖ సంచాలకులు బి.జనార్దన్ రెడ్డి ఎస్బీహెచ్ అధికారులతో ఒప్పందం కుదుర్చుకున్నారు. పురపాలక సంఘాల్లోని పన్నులు చెల్లింపు కౌంటర్ల వద్ద ఈడీసీ యంత్రాలను ఏర్పాటు చేసి క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా పన్నులు వసూలు చేయనున్నారు. -
పెత్తనం కాంట్రాక్టర్లదే
రెండు కార్పొరేషన్లలో అధికారులు, పాలకవర్గ సభ్యులతో కుమ్మక్కు రెండు నెలలుగా వేతనాల్లేక కార్మికుల ఇబ్బందులు ఏకపక్షంగా టెండర్ల ప్రక్రియ సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : జిల్లాలోని రెండు కార్పొరేషన్లలో కాంట్రాక్టర్ల హవానే కొనసాగుతోంది. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో తొమ్మిదేళ్లుగా ఒకే గ్రూపు శానిటేషన్ పనులు చేపడుతున్న విషయం తెలిసిందే. రామగుండం నగరపాలక సంస్థలోనూ దాదాపు ఇదే తంతు కొనసాగుతోంది. ఇక్కడా కొందరు కాంట్రాక్టర్లదే పెత్తనం నడుస్తోంది. నగర పాలక సంస్థకు చెందిన కొందరు పాలక వర్గ సభ్యులు, అధికారుల సహకారంతో కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు, కార్మికులకు సకాలంలో వేతనాలివ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారు. గత రెండు నెలలుగా ఆయా ఉద్యోగులకు వేతనాలివ్వకపోవడమే ఇందుకు నిదర్శనం. పీఎఫ్, ఈఎస్ఐ చెల్లింపుల్లోనూ ఇదే తంతు ! బ్యాంకుల ద్వారానే ఔట్సోర్సింగ్ ఉద్యోగులు, కార్మికులకు వేతనాలు చెల్లించాలని ఐదేళ్ల క్రితం ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అప్పట్లో హడావుడిగా కార్మికులందరికి బ్యాంకుల్లో ఖాతాలు తెరిచి కొద్దికాలంపాటు ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు బ్యాంకుల ద్వారా వేతనాలు చెల్లించినప్పటికీ మూడేళ్లుగా ఈ ప్రక్రియను అర్ధాంతరంగా నిలిపివేశారు. దీంతో వేతనాల చెల్లింపుల విషయంలో కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. చివరకు పీఎఫ్, ఈఎస్ఐ ప్రీమియం మొత్తాన్ని కూడా సకాలంలో చెల్లించడం లేదు. ఫలితంగా కార్మికులు వైద్య సేవలను సైతం పొందలేని దుస్థితి నెలకొంది. అంతా ఏకపక్షమే..! రామగుండం నగర పాలక సంస్థలో టెండర్ల ప్రక్రియ పూర్తిగా ఏకపక్షంగా సాగుతుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. గతంలో టెండర్ల ప్రక్రియ లేకుండానే కాంట్రాక్టర్లకు ఔట్సోర్సింగ్ కార్మికుల కొనసాగింపు పనులను అప్పగించారు. కార్పొరేషన్లో ఎంత మంది కార్మికులు పనిచేస్తున్నారు... ఎంత మంది గైర్హాజరయ్యారనే వివరాలు సైతం బహిర్గతం కాకుండా అధికారులు, కాంట్రాక్టర్లు జాగ్రత్తపడ్డారు. కార్పొరేషన్లో మొత్తం 485 మంది ఔట్సోర్సింగ్ ఉద్యోగులు కాగా, వీరిలో 361 మంది పారిశుధ్య కార్మికులున్నారు. రోజుకు సగటున 50 కార్మికులు విధులకు గైర్హాజరవుతున్నప్పటికీ వారంతా హాజరైనట్లుగా రికార్డుల్లో చూపుతూ ఆ మొత్తాన్ని కాంట్రాక్టర్లు, అధికారులు, కొందరు పాలకవర్గ సభ్యులు పంచుకు తింటున్నట్లు ఆరోపణలున్నాయి. ఇటీవల కాంట్రాక్టు ముగియడంతో గత నెల 23న ఈ-ప్రొక్యూర్మెంట్ ద్వారా 10 పనులకు రూ.317.15 లక్షల వ్యయం అంచనాలతో టెండర్లు నిర్వహించారు. పరిపాలనా కారణాలతో ఈ టెండర్లను వాయి దా వేసిన నగర పాలక సంస్థ కమిషనర్ మల్లిఖార్జునుడు ఈ-ప్రొక్యూర్మెంట్ ద్వారా తాజాగా టెండర్లను ఆహ్వానించగా, పలు కాంట్రాక్టు సం స్థలు అందులో పాల్గొన్నాయి. షెడ్యూల్ ప్రకా రం ఈనెల 14న టెండర్లను తెరవాల్సి ఉండగా, కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్కు సంబంధించిన శానిటేషన్ టెండర్లలో జరిగిన అవకతవకలు ఇటీవల వెలుగుచూడడంతో రామగుం డం కార్పొరేషన్ అధికారుల్లోనూ వణుకు మొదలైంది. తాత్కాలికంగా టెండర్లు తెరిచే ప్రక్రియను వాయిదా వేసిన అధికారులు గత పక్షం రోజులుగా టెండర్ల షెడ్యూళ్లను పరిశీలించే పనుల్లో నిమగ్నమవడం గమనార్హం. -
ఊపందుకుంటున్న నియామకాలు..ఉజ్వల కెరీర్కు వ్యూహాలు
దేశంలో ప్రైవేట్ రంగంలో నియామకాల ప్రక్రియ ఊపందుకుంటోంది. కార్పొరేట్ సంస్థలు వచ్చే ఆర్థిక సంవత్సరం (2015-16)లో భారీఎత్తున నియామకాలకు ప్రణాళికలు రూపొందిస్తున్నాయి. దాంతో కొత్త సంవత్సరంలో కోర్సులు పూర్తి చేసుకోబోయే విద్యార్థులు ఉజ్వల అవకాశాలు అందుకోవచ్చంటున్నారు నిపుణులు. అయితే, కంపెనీలు తమ అవసరాలకు అనుగుణంగా విద్యార్థుల్లో ఎంప్లాయబిలిటీ స్కిల్స్ కోణంలో ఎన్నో అంశాలను పరిగణనలోకి తీసుకుంటున్నాయి. ఊరిస్తున్న కొలువుల పరుగులో ముందుండేందుకు, ఉజ్వల కెరీర్ను సొంతం చేసుకునేందుకు నిపుణులు అందిస్తున్న సూచనలు, సలహాలు.. ‘2015-16 ఆర్థిక సంవత్సరం.. అన్ని రంగాల్లో ఉద్యోగార్థులకు ఆశావహంగా నిలవనుంది. కారణం.. దేశంలోని కార్పొరేట్ కంపెనీలు తమ వ్యాపార విస్తరణ దిశగా అడుగులు వేస్తుండటమే. ఇప్పటికే టీసీఎస్, విప్రో, కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్ తదితర సంస్థలు 2015-16 సంవత్సరానికి సంబంధించి తమ విస్తరణపై స్పష్టత ఇచ్చాయి. భారీ సంఖ్యలో నియామకాలు చేపడతామని పేర్కొన్నాయి. తాజా ప్రతిభావంతులను ఆకట్టుకునేందుకు క్యాంపస్లవైపు దృష్టి సారిస్తున్నాయి. తాజాగా ఐఐఎంలు సహా ప్రముఖ బీస్కూల్స్లో 2015 సమ్మర్ ఇంటర్న్షిప్ ఆఫర్స్ సంఖ్య పెరగడమే ఇందుకు నిదర్శనం. మరెన్నో సంస్థలు పూర్తి స్థాయి నియామకాల దిశగా ప్రాంగణ నియామ కాలు చేపడుతున్నాయి. సంస్థలు భారీ సంఖ్యలో అవకాశాలు అందిస్తున్నా.. నైపుణ్యాలు, కంపెనీ అవసరాల విషయంలో ఎక్కడా రాజీ పడట్లేదు. కాబట్టి ఔత్సాహికులు రెజ్యుమే నుంచి రియల్ టైమ్ నాలెడ్జ్ వరకు అన్ని విషయాల్లో ప్రతిభా పాటవాలు చూపితేనే ఆఫర్ లెటర్ చేతికందుతుంది. ఇందుకోసం అభ్యర్థులు దృష్టి సారించాల్సిన ముఖ్యాంశాలపై నిపుణుల సూచనలు.. స్వీయ విశ్లేషణ ఇష్టమైన కెరీర్ను సొంతం చేసుకునే విషయంలో ముందుగా దృష్టి సారించాల్సిన అంశం.. స్వీయ విశ్లేషణ. భవిష్యత్ కెరీర్కు సంబంధించి అవగాహన పెంచుకోవాలి. తమ వాస్తవ నైపుణ్యాలు, సహజ ఆసక్తులు ఏంటో పరిశీలించాలి. అప్పుడే కోరుకుంటున్న ఉద్యోగంపై స్పష్టత వస్తుంది. ఫలితంగా ఎంపిక ప్రక్రియలో ముందుండేలా సంసిద్ధులయ్యేందుకు మార్గాలు కూడా తెలుస్తాయి. ముఖ్యంగా విద్యార్థుల అకడమిక్ నేపథ్యంతో సంబంధం లేకుండా సాఫ్ట్స్కిల్స్ను ముఖ్య నైపుణ్యంగా సాఫ్ట్వేర్ సంస్థలు పరిగణిస్తున్నాయి. కాబట్టి క్యాంపస్ రిక్రూట్మెంట్స్లో పాల్గొంటున్న సాఫ్ట్వేర్ సంస్థలు తమ వైపు మొగ్గు చూపేలా అభ్యర్థులు ముందుగానే సిద్ధం కావాలి. ఎంచుకున్న రంగంలో భవిష్యత్తులో ఏ మేరకు నిలదొక్కుకోగలమనే విషయంలోనూ దీర్ఘకాలిక ప్రణాళిక ఉండాలి. ఆసక్తి, అభిరుచులకు అనుగుణంగా ప్రస్తుతం క్యాంపస్ రిక్రూట్మెంట్ ప్రక్రియలో చిన్న తరహా కంపెనీలు మొదలు బహుళ జాతి సంస్థల వరకు అనేక రంగాలకు చెందిన చిన్నా,పెద్దా కంపెనీలు పాల్గొంటున్నాయి. దాంతో సహజంగానే విద్యార్థులు పేరున్న సంస్థలవైపు మొగ్గు చూపుతారనడంలో సందేహం లేదు. కానీ కెరీర్లో ఉన్నత శిఖరాలను అధిరోహించాలంటే.. ఆసక్తి, అభిరుచులకు పెద్దపీట వేయాలని నిపుణులు సూచిస్తున్నారు. అందుకు అనుగుణంగా కంపెనీలను, ఉద్యోగాలను ఎంపిక చేసుకోవడం మంచిది. అలా చేయాలంటే ఆయా కంపెనీలు నిర్వహించే ఎంపిక విధానాలపై అవగాహన పెంచుకొని సంసిద్ధులు కావాలి. బలాలు, బలహీనతలు అభ్యర్థులు తమకు సరితూగే రంగాన్ని ఎంచుకున్నాక తక్షణమే దృష్టిపెట్టాల్సిన మరో ముఖ్యాంశం.. వ్యక్తిగత బలాలు, బలహీనతలు. తామెంచుకున్న రంగంలో రాణించేందుకు ఇప్పటికే తమకున్న నైపుణ్యాలు ఏవి, ఇంకా పొందాల్సిన నైపుణ్యాలు ఏంటి? అని ప్రశ్నించుకుంటూ.. తమ బలాలు, బలహీనతలపై విశ్లేషణ చేసుకోవాలి. ఫలితంగా భవిష్యత్తులో నిర్వహించే విధుల్లో మంచి పనితీరు ప్రదర్శించడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా తమ డొమైన్ ఆధారంగా కెరీర్ కోరుకునే అభ్యర్థులు ఈ విషయంలో మరింత శ్రద్ధ వహించాలి. తరగతి గదుల్లో నేర్చుకున్న పరిజ్ఞానం.. వాస్తవ పరిస్థితులు, కంపెనీల వాస్తవ అవసరాలకు మధ్య ఎంతో వ్యత్యాసం ఉంటుంది. ఈ తేడాలను గుర్తించి ముందడుగు వేయాలి. సెల్ఫ్ బ్రాండింగ్.. ఎంతో కీలకం ప్రస్తుత పోటీ ప్రపంచంలో నిలదొక్కుకోవాలంటే.. అత్యంత ఆవశ్యకమైన అంశం సెల్ఫ్ బ్రాండింగ్ లేదా సెల్ఫ్ మార్కెటింగ్. అంటే.. ఒక అభ్యర్థి ఇతరులతో పోల్చితే తనకున్న నైపుణ్యాలను మరింత మెరుగైన రీతిలో ఎదుటి వారికి తెలియజేయడం. అదే విధంగా తనలోని నైపుణ్యాల గురించి వీలైనంత ఎక్కువ మందికి తెలియజేసేలా వ్యవహరించడం. దీనికి అనువైన సాధనాలు.. సోషల్ మీడియా వెబ్సైట్స్. వీటి ద్వారా అభ్యర్థులు తమ నైపుణ్యాలను వెల్లడించి తద్వారా అవకాశాలను అందుకోవచ్చు. ఇంటర్న్షిప్స్.. జాబ్ ఆఫర్కు మార్గం వచ్చే ఆర్థిక సంవత్సరంలో కంపెనీలు చేపట్టే నియామకాల్లో విజయం సాధించేందుకు ప్రస్తుతం విద్యార్థులు చేయాల్సిన మరో ముఖ్యమైన పని.. ఇంటర్న్షిప్స్. ఇందుకోసం విద్యార్థులు తమ కోర్సుకు సరితూగే ఏదో ఒక సంస్థలో ఇంటర్న్షిప్స్ చేయడం ఉపయుక్తం. దీనివల్ల అకడమిక్స్తోపాటు సమాంతరంగా ఇండస్ట్రీ నాలెడ్జ్ కూడా లభిస్తుంది. కోర్సు పూర్తయ్యేనాటికి జాబ్ రెడీ స్కిల్స్ విషయంలో ఇతరుల కంటే ముందుండేందుకు ఎంతో ఆస్కారం ఉంటుంది. అంతేకాకుండా ఇంటర్న్షిప్స్లో మంచి పనితీరు కనబరిస్తే అదే సంస్థలో శాశ్వత నియామకం సొంతం చేసుకునే వీలుంది. ఐఐఎంలు, ఐఐటీలు, ఇతర ప్రముఖ ఇన్స్టిట్యూట్లలో క్యాంపస్ నియామకాలను పరిశీలిస్తే ఇంటర్న్షిప్ చేసిన సంస్థల నుంచి ఫైనల్ ఆఫర్ పొందిన వారి సంఖ్య 50 నుంచి 60 శాతం ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని విద్యార్థులు వచ్చే వేసవిలో సమ్మర్ ఇంటర్న్షిప్ చేసేందుకు ఉద్యుక్తులవడం ఎంతో ఉపకరిస్తుంది. క్యాంపస్ ప్లేస్మెంట్స్లో ఇలా ప్రస్తుతం దేశవ్యాప్తంగా పలు ఇన్స్టిట్యూట్లలో క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఊపందుకుంటున్నాయి. ఇప్పటికే కొన్ని ప్రముఖ విద్యా సంస్థలలో ప్లేస్మెంట్స్ ముగిశాయి. మిగతావాటిలో నవంబర్, డిసెంబర్లల్లో పూర్తి స్థాయిలో జరగనున్నాయి. ఆయా కోర్సుల చివరి సెమిస్టర్లో ఉన్న విద్యార్థులకు నిర్వహిస్తున్న ఈ ప్లేస్మెంట్ ప్రక్రియలో విజయం సాధించాలంటే.. అభ్యర్థులు ఎన్నో అంశాలపై కసరత్తు చేయాలి. సదరు ఇన్స్టిట్యూట్కు వస్తున్న కంపెనీలు, తమ నేపథ్యానికి సరితూగే సంస్థలు, అవి ఆఫర్ చేస్తున్న ఉద్యోగాలు-నిర్వర్తించాల్సిన విధులు, ఎంపిక ప్రక్రియలో అవి నిర్దేశించే నిబంధనలు తదితర అంశాలపై పూర్తి అవగాహన ఏర్పరచుకోవాలి. అభ్యర్థులు ఈ అంశాలన్నింటిపైనా స్పష్టత ఏర్పరచుకున్నాక.. సదరు కంపెనీల నేపథ్యం, ప్రస్తుత పనితీరు, కంపెనీ మార్కెట్ వ్యవహారాలు, భవిష్యత్తు ప్రణాళికలపైనా సమాచారం సేకరించుకుంటే ఒక అడుగు ముందున్నట్లే. ఇది ఇంటర్వ్యూలో విజయానికి ఎంతో ఉపకరిస్తుంది. ఇంటర్వ్యూ.. ప్రశ్న- సమాధానం కాదు ఇంటర్వ్యూ అనగానే విద్యార్థుల్లో ఒక రకమైన బిడియం, ఆందోళన సహజం. చాలామంది ఇంటర్వ్యూ అంటే.. ప్రశ్న - సమాధానం అనే అభిప్రాయంతో ఉండటమే ఇందుకు కారణం. వాస్తవానికి ఇప్పుడు కంపెనీల దృక్పథం మారింది. విద్యార్థులకు ఆహ్లాదకర వాతావరణం కల్పిస్తున్నాయి. కొశ్చన్ అండ్ ఆన్సర్కు బదులు చిన్నపాటి డిబేట్ మాదిరిగా ఇంటర్వ్యూను నిర్వహిస్తున్నాయి. తద్వారా అభ్యర్థుల్లో విషయ పరిజ్ఞానం, కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంటర్ పర్సనల్ స్కిల్స్.. ఇలా మరెన్నో నైపుణ్యాలను తెలుసుకుంటున్నాయి. ఇటు అభ్యర్థులు కూడా తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తీకరించేందుకు వీలు కలుగుతోంది. అయితే అభ్యర్థులు కొంత అప్రమత్తంగా ఉండాలి. తెలియని అంశాల గురించి చర్చకు తెరదీస్తే చిక్కుల్లో పడినట్లే. కాబట్టి ఇంటర్వ్యూలో చర్చ జరుగుతున్న తీరును, తద్వారా కంపెనీ ప్రతినిధులు కోరుకుంటున్న అంశాలను సునిశితంగా గమనించాలి. రాత పరీక్ష, సాంకేతిక పరీక్ష ద్వారా అభ్యర్థిలోని సబ్జెక్ట్ నాలెడ్జ్పై స్పష్టత పొందిన కంపెనీలు ఇంటర్వ్యూలో.. సామాజిక అంశాలపైనా చర్చించే అవకాశం ఉంటుంది. ఆయా అంశాలు తెలియకపోతే.. తెలియదని నిజాయతీగా ఒప్పుకోవాలి. సూటిగా రెజ్యుమే రెజ్యుమే.. ఉద్యోగ సాధన దిశగా తొలి ఆయుధం. ఎంపిక ప్రక్రియలో మలి దశకు పిలుపు అనేది రెజ్యుమేపైనే ఆధారపడి ఉంటోంది. కాబట్టి ఈ విషయంలోనూ జాగ్రత్తగా వ్యవహరించాలి. రెజ్యుమే అంటే.. రెండు, మూడు పేజీలు నింపాల్సిన రోజులు పోయాయి. తమ కెరీర్ ఆబ్జెక్టివ్, ఇప్పటివరకు సాధించిన విజయాలపై ఒక్క పేజిలో సూటిగా, స్పష్టంగా తెలియజేయాలి. సరళమైన భాషలో ఉండేలా రెజ్యుమేను రూపొందించాలి. ఇలా అన్ని దశల్లోనూ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తే.. కోరుకున్న కొలువును దక్కించుకోవచ్చు. అభ్యర్థులు చేస్తున్న పొరపాట్లు ప్రస్తుత పోటీ ప్రపంచంలో కార్పొరేట్ కొలువులను సొంతం చేసుకోవాలనే ఉత్సాహంతో ఉన్న అభ్యర్థులు.. కొన్ని పొరపాట్లు చేసి అవకాశాలను చేజార్చుకుంటున్నారు. సాధారణంగా అభ్యర్థులు చేస్తున్న పొరపాట్లు.. పే ప్యాకేజ్కు ఆకర్షితులు కావడం: ప్రస్తుతం పలువురు అభ్యర్థులు లక్షల రూపాయాల్లో లభిస్తున్న పే ప్యాకేజ్లను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటున్నారు. ఈ క్రమంలో తమ సహజ ఆసక్తులను పట్టించుకోవడం లేదు. దీనివల్ల దీర్ఘకాలంలో నష్టం వాటిల్లుతుంది. లోపిస్తున్న స్పష్టత: అభ్యర్థుల కోణంలో కనిపిస్తున్న మరో ప్రధానమైన పొరపాటు స్పష్టత లేమి. తమ నేపథ్యం, దానికి అనుగుణంగా లభించే అవకాశాలు, భవిష్యత్తు లక్ష్యాలపై చాలామంది అభ్యర్థుల్లో అవగాహన లోపిస్తోంది. కానీ కంపెనీలు అభ్యర్థుల విషయంలో ఎంతో స్పష్టతతో వ్యవహరిస్తున్నాయి. విధుల గురించి అవగాహన లేమి: అభ్యర్థులకు తాము చేరదలచుకున్న సంస్థల విషయంలో స్పష్టత ఉన్నప్పటికీ.. ఉద్యోగ విధుల విషయంలో అవగాహన పొందలేకపోతున్నారు. కానీ నేటి పోటీ ప్రపంచంలో భవిష్యత్తులో నిర్వహించే బాధ్యతల విషయంలో ముందస్తు అవగాహన కూడా చాలా అవసరం. పుస్తక పరిజ్ఞానానికే పరిమితం కావడం: ఇది కూడా నేటి ఉద్యోగార్థులు చేస్తున్న మరో పొరపాటు. కేవలం పుస్తక పరిజ్ఞానానికే పరిమితమై.. రియల్టైం నాలెడ్జ్ పెంచుకునే దిశగా కృషి చేస్తున్న వారి సంఖ్య చాలా స్వల్పం. కంపెనీలు థియరిటికల్ నాలెడ్జ్తోపాటు రియల్ టైం నాలెడ్జ్ ఉన్నవారికే ప్రాధాన్యం ఇస్తున్నాయి. ‘కమ్యూనికేషన్’ స్కిల్స్ లేమి: కమ్యూనికేషన్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్ పెంచుకోవడంపైనా అభ్యర్థులు చూపిస్తున్న శ్రద్ధ తక్కువే. కానీ కార్పొరేట్ సంస్కృతిలో.. బృందాలతో కలిసి పనిచేయాల్సిన వాతావరణంలో వివిధ నైపుణ్యాలను పెంచుకోవడం ఎంతో అవసరం. మౌలిక రంగంలో మెరుగైన అవకాశాలు ప్రస్తుతం ఐటీతోపాటు పురోగమిస్తున్న రంగం.. మౌలిక రంగం. ప్రభుత్వ, ప్రై వేటు.. రెండు రంగాల్లోనూ పలు నిర్మాణ కార్యకలాపాలు విస్తరిస్తున్నాయి. ఈ రంగంలో నియామకాల సంఖ్య భారీగా పెరగనుంది. అభ్యర్థులు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి. కేవలం ఒక మేజర్కే పరిమితం కాకుండా.. అనుబంధ విభాగాల్లో నైపుణ్యం సాధిస్తే మరిన్ని అవకాశాలు లభిస్తాయి. ఉదాహరణకు సివిల్ ఇంజనీరింగ్ అభ్యర్థులు ఈ రంగంలో ఆవిష్కృతమవుతున్న నూతన సాఫ్ట్వేర్స్పై అవగాహన పొందితే ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. - జగదీశ్ రెడ్డి, హెడ్- హెచ్.ఆర్., జీఎంఆర్ ఇన్ఫ్రా ప్యూర్ సైన్స్లో డీప్ నాలెడ్జ్ ఫార్మాస్యూటికల్, లైఫ్ సెన్సైస్ తదితర ప్యూర్ సైన్స్ సంస్థలలో కెరీర్ సొంతం చేసుకోవాలనుకునే అభ్యర్థులు నిరంతరం ఆయా అంశాలపై పరిజ్ఞానం పెంచుకోవాలి. ఈ రంగాల్లో నిరంతరం పరిశోధనలు జరుగుతూ కొత్త అంశాలు ఆవిష్కృతమవుతున్నాయి. వీటి గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటుండాలి. అభ్యర్థులను నియమించుకునే క్రమంలో నాలెడ్జ్కు కంపెనీలు పెద్దపీట వేస్తాయి. అదే విధంగా విధుల్లో చేరిన అభ్యర్థులు కేవలం తమ విభాగానికే పరిమితం కాకుండా.. సంస్థలోని ఇతర విభాగాల పనితీరుపైనా అవగాహన పొందితే భవిష్యత్తు మరింత ఆశాజనకంగా ఉంటుంది. - అజ్దాన్ ఖాన్, వైస్ ప్రెసిడెంట్- హెచ్.ఆర్., సన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఈ-కామర్స్.. టెక్నికల్ + జనరల్ ఆన్లైన్ షాపింగ్ కార్యకలాపాల వెబ్సైట్లు విస్తరిస్తున్న నేపథ్యంలో నేటి యువత ఉపాధి అవకాశాలకు ప్రధాన వేదికగా ఈ-కామర్స్ రంగం నిలుస్తోంది. ఈ-కామర్స్ సంస్థల్లో టెక్నికల్, జనరల్ అన్ని విభాగాల్లోనూ ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయి. కావాల్సిందల్లా సబ్జెక్ట్ నాలెడ్జ్తోపాటు కమ్యూనికేషన్ స్కిల్స్. - బి.ఎస్. సుమంత్,టెక్నికల్ రిక్రూటర్, లింక్డ్ ఇన్ -
కార్పొరేషన్లు, బోర్డులకు ప్రాధాన్యం
మండ్య: పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు మొదట కార్పొరేషన్లు, బోర్డు ల నియామకంలో ప్రాధాన్యం ఇస్తామని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు. పాండవపుర తాలూకా బన్నంగాడి గ్రామంలోని జూనియర్ కళాశాల ఆవరణలో శనివారం ఏర్పా టు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్పొరేషన్లు, బోర్డుల్లో నియమాకాలకు ప్రాధాన్యం ఇవ్వాలని పార్టీ ఆదేశించిందని తెలిపారు. ఈ క్రమంలోనే అభ్యుర్థులను నియమించడానికి అన్ని చర్య లూ తీసుకున్నామన్నారు. త్వరలోనే జాబితా విడుదల చేస్తామని చెప్పా రు. బోర్డుల నియామకం అనంతరం మంత్రి వర్గ విస్తరణను చేపడతామని వివరించారు. నిజాయితీగా విధులు నిర్వహిస్తున్న ఐఏఎస్ అధికారి రశ్మి మహేష్పై జరిగిన దాడిపై విచారణ చేసేందుకు ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. ఇప్పటికే ఆమె దాడి చేసిన వారిని గుర్తించి అరెస్ట్ చేశామన్నారు. అధికారుల నివేదిక వచ్చిన తర్వాత నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. బెంగళూరు నగరంపై ఉగ్రవాదులు దృష్టిసారించిన విషయంపై విలేకరులు అడిగిన ప్రశ్నకు సీఎం స్పందిస్తూ ఐసీఎస్ ఉగ్రవాదులు బెంగళూరును టార్గెట్ చేసిన విషయం తెలిసిందన్నారు. ఉగ్రవాదుల దాడికి ఎదుర్కోవడానికి అన్ని చర్యలూ ప్రభుత్వం తీసుకుంటుందని వివరించారు. -
పదవుల పందేరం
► నేడు చర్చించనున్న కేపీసీసీ చీఫ్, సీఎం ► 72 కార్పొరేషన్లకు అధ్యక్షులు, 14 మండళ్లకు ఉపాధ్యక్షులను నియమించే అవకాశం ► 20 మంది ఎమ్మెల్యేలకు దక్కనున్న అధ్యక్ష పదవులు బెంగళూరు : రాష్ట్రంలోని కార్పొరేషన్లు, బోర్డులకు అధ్యక్షుల నియామకానికి ముహూర్తం దగ్గర పడుతుండడంతో ఆశావహుల మధ్య పోటీ ఎక్కువవుతోంది. సోమవారమే దీనిపై ముఖ్యమంత్రి కసరత్తు చేసినప్పటికీ, కేపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ జీ. పరమేశ్వర తుమకూరు పర్యటనలో ఉన్నందున, ఆయనతో చర్చించే అవకాశం లేకుండా పోయింది. బుధవారం ఉభయులూ దీనిపై తుది నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. రాష్ట్రంలోని 72 కార్పొరేషన్లు, మండళ్లకు అధ్యక్షులను నియమించాల్సి ఉంది. 14 మండళ్లకు ఉపాధ్యక్షులను కూడా నియమించే అవకాశం ఉంది. మొత్తమ్మీద 650 మంది డెరైక్టర్లను కూడా నియమించాల్సి ఉంటుంది. 20 మంది ఎమ్మెల్యేలకు అధ్యక్ష పదవులు వరించే అవకాశాలున్నాయని చెబుతున్నారు. తొలుత ఎమ్మెల్యేలకు ఈ పదవులను కట్టబెట్టరాదని పార్టీలో వాదనలు వినిపించినప్పటికీ, మంత్రి వర్గ విస్తరణ సందర్భంగా ఒత్తిడిని తగ్గించుకోవడానికి ఎమ్మెల్యేల్లో కొందరికైనా అవకాశం కల్పించక తప్పదని సీఎం నచ్చజెప్పగలిగారు. మొత్తమ్మీద 70 శాతం పదవులు పార్టీ నాయకులు, కార్యకర్తలకు, 30 శాతం పదవులను ఎమ్మెల్యేలకు కట్టబెట్టాలని నిర్ణయించారు. తుది జాబితా సిద్ధమయ్యాక అధిష్టానం అనుమతి కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఈ నెలాఖరుకు నియామకాల తంతును ముగించాలని సీఎం భావిస్తున్నారు. -
పెరుగుతున్న కోతలు
వికారాబాద్:: విద్యుత్ కోతలు విధిస్తూ ఇటీవల టీఎస్ఎస్పీడీసీఎల్ సీఅండ్ఎండీ ఆదేశాలు జారీ చేశారు.గతంలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే మున్సిపాలిటీలు,మండల కేంద్రాల(సబ్ స్టేషన్ హెడ్క్వార్టర్)లో 8 గంటలు, కార్పొరేషన్లలో 6 గంటలు,గ్రామాల్లో 12 గంటల కోత ఉంటుందని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.ప్రస్తుతం వ్యవసాయానికి 7 గంటల సరఫరా జరుగుతుండగా పెరిగిన డిమాండ్ కారణంగా అయిదు గంటలు మాత్రమే సరఫరా ఆయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. కోతలు ఇలా ఉన్నాయి.... మున్సిపాలిటీలు, మండల కేంద్రాలు(సబ్ స్టేషన్ హెడ్ క్వార్టర్)... ఉదయం 7 నుంచి 11 గంటల వరకు...మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు... కార్పొరేషన్లు.... ఉదయం 5 నుంచి 8 గంటల వరకు ...మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు . గ్రామాల్లో.... ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు (12 గంటల కోత) త్రీఫేజ్ విద్యుత్ సరఫరా వివరాలు ఇలా ఉన్నాయి. ఏ- గ్రూప్లో ఉదయం 3 నుంచి 8 గంటల వరకు,రాత్రి 10 నుంచి 12 గంటల వరకు. బీ- గ్రూప్లో ఉదయం 8 నుంచి ఒంటి గంట వరకు, రాత్రి 12 నుంచి 2 గంటల వరకు. సీ- గ్రూప్లో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 6 వరకు, రాత్రి 2 నుంచి 4 గంటల వరకు. డీ-గ్రూప్లో రాత్రి 10 నుంచి 3 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు. -
కోల్డ్ వార్!
పదవుల పందేరానికి కసరత్తు అరగంటకు పైగా సీఎం, కేపీసీపీ చీఫ్ సమావేశం ఉప ముఖ్యమంత్రి పదవిపై ప్రస్తావించిన పరమేశ్వర ఇది సమయం కాదని వారించిన సిద్ధు కాసేపు వాగ్వాదం అర్ధంతరంగా ముగిసిన చర్చలు సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్రంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో పాటు పార్టీ నాయకులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కార్పొరేషన్లు, బోర్డుల నియామకాలకు కసరత్తు ప్రారంభమైంది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కేపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ జీ. పరమేశ్వరలు సోమవారం ఓ హోటల్లో దీనిపై అర గంటకు పైగా చర్చించినట్లు తెలిసింది. ఈ సందర్భంగా పరమేశ్వర ఉప ముఖ్యమంత్రి పదవి గురించి ప్రస్తావించినప్పుడు, ముఖ్యమంత్రి వారించినట్లు సమాచారం. అంతేకాకుండా ఈ పదవిపై బహిరంగంగా మాట్లాడవద్దని కూడా సీఎం సూచించినట్లు తెలిసింది. ఈ సమావేశాన్ని బోర్డులు, కార్పొరేషన్ల పదవులకు మాత్రమే పరిమితం చేద్దామని ఆయన చెప్పడంతో ఇద్దరి మధ్య కాసేపు విభేదాలు తలెత్తినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దిగ్విజయ్ సింగ్ బుధవారం బెల్గాంకు వస్తున్నందున, ఆలోగా పార్టీ తరఫున జాబితాను సిద్ధం చేయాలని సీఎం పరమేశ్వరకు సూచించారు. అయితే సీఎంగా మీరిస్తున్న జాబితాలో ఎప్పటి నుంచో కాంగ్రెస్ను నమ్ముకున్న వారి పేర్లు లేవని తనకు సమాచారం అందిందని పరమేశ్వర నిష్టూరమాడారు. దీనికి సీఎం సమాధానమిస్తూ పార్టీలో పాత వారు, కొత్త వారు అనే విభాగాలు లేవని, పార్టీకి ఎవరు ఎక్కువగా సేవ చేశారనేది ఎంపికకు ప్రాతిపదిక కావాలని సూచించినట్లు తెలిసింది. 60 మంది పేర్ల ఖరారు ఇద్దరి మధ్య మనస్పర్థలు పొడ సూపడంతో సమావేశాన్ని అర్ధంతరంగా ముగించినట్లు తెలిసింది. మెట్రో రైలు పనులను పరిశీలించాలనే నెపంతో సీఎం వెళ్లిపోయినట్లు తెలిసింది. ఆయన ముందు ద్వారం నుంచి పరమేశ్వర వెనుక ద్వారం నుంచి నిష్ర్కమించారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈలోగానే కార్పొరేషన్లు, బోర్డుల అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులకు 60 మంది పేర్లను ఖరారు చేసినట్లు తెలిసింది. -
మొదలైన ‘స్థానిక’ ప్రచారం
చెన్నై, సాక్షి ప్రతినిధి : రాష్ట్రంలోని కోయంబత్తూరు, తిరునెల్వేలి, తూత్తుకుడి కార్పొరేషన్లకు మేయర్లు, 8 మునిసిపాలిటీలకు చైర్పర్సన్లు, ఖాళీగా ఉన్న 3,075 వార్డులకు ఉప ఎన్నికల నిర్వహణపై గత నెల 28వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది. నామినేషన్లు, ఉపసంహరణ పర్వం పూర్తయింది. గత పార్లమెంటు ఎన్నికల్లో ఘోరపరాభవంతో చతికిలపడిన కాంగ్రెస్, డీఎంకే, పీఎంకే, ఎండీఎంకే తదితర పార్టీలన్నీ స్థానిక సంస్థలకు ముఖం చాటేశాయి. తమ పార్టీ ఈ ఎన్నికల్లో పోటీచేయడం లేదని ప్రకటించాయి. దీంతో రాష్ట్రంలో అధికారంలో ఉన్న అన్నాడీఎంకే, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలు మాత్రమే రంగంలో నిలిచా యి. మోడీ రాకతో రాష్ట్రంలో బలంపుంజుకున్న రాష్ట్ర బీజేపీ స్థానిక ఎన్నికల్లో సత్తా చాటుకునేందుకు సిద్ధమైంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళిసై సౌందరరాజన్ కోయంబత్తూరులో శనివారం తన ప్రచారాన్ని ప్రారంభించారు. స్థానిక ఎన్నికలను బహిష్కరించిన పార్టీలన్నీ తమకు మద్దతు ఇవ్వాల్సిందిగా తమిళిసై పిలుపునిచ్చారు. అన్నాడీఎంకేయేతర పార్టీలన్నీ బీజేపీ అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలని ఆమె కోరారు. బీజేపీ అభ్యర్థులను బెదిరింపులకు గురిచేయడం లేదా కిడ్నాపులకు పాల్పడడం వంటి చేష్టలకు అన్నాడీఎంకే పాల్పడుతోందని తన ప్రచారంలో ఆరోపణలను సంధిస్తున్నారు. బీజేపీది జన బలం, అన్నాడీఎంకేది ధనబలమని ఆమె విమర్శనాస్త్రాలు గుప్పిస్తున్నారు. శనివారం తిరుపూరు, కోవైలో, ఆదివారం కడలూరు, విరుదాచలం, సోమవారం తూత్తుకూడి, 16న రామనాథపురంలో తమిళిసై ప్రచారం చేయనున్నారు. మరో వైపు బీజేపీ తమిళనాడు శాఖ మాజీ అధ్యక్షుడు, కేంద్రమంత్రి పొన్ రాధాకృష్ణన్ శనివారం తూత్తుకూడి, రామనాథపురం, ఆదివారం కోవై, 15,16 తేదీల్లో కన్యాకుమారిలో పర్యటిస్తారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి హెచ్ రాజా శనివారం తిరుపూరు, ఆదివారం రామనాధపురం, 16న కోవైలో ప్రచారం చేస్తారు. చెన్నై కార్పొరేషన్ 35 వ వార్డు అభ్యర్థి తరపున బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వానతి శ్రీనివాసన్ ప్రచారం ప్రారంభించారు. నేటి నుంచి సీఎం జయ ప్రచారం ప్రతిపక్ష బీజేపీ ప్రచారంలో దూసుకుపోతుం డగా అన్నాడీఎంకే అధినేత్రి, ముఖ్యమంత్రి జయలలిత ఆదివారం తూత్తుకూడి నుంచి తన ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. ఆదివారం మధ్యాహ్నం 2.30 గంటలకు హెలికాప్టర్లో తూత్తుకూడికి చేరుకుంటారు. అక్కడి నుంచి ఆదివారం కోయంబత్తూరులో ప్రచారం నిర్వహిస్తారు. ఆ తరువాత ఎక్కడికి వెళ్లే ఖరారు కావాల్సి ఉంది. -
కార్పొరేషన్లలో బదిలీలకు రంగం సిద్ధం
15 రోజుల్లో ఉద్యోగుల వివరాలు తెలపాలంటూ ఉన్నతాధికారుల ఆదేశాలు రాజకీయ రంగు పులుముకుంటున్న మున్సిపల్ ఉద్యోగుల బదిలీలు కార్పొరేషన్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అధికార పార్టీ వ్యూహాలు తిరుపతి కార్పొరేషన్: కార్పొరేషన్, మున్సిపల్ ఉద్యోగుల బదిలీలకు తెలుగుదేశం పార్టీ నాయకులు రంగంలోకి దిగారు. త్వరలో జరగనున్న కార్పొరేషన్ ఎన్నికల్లో ఎలాగైనా అధికారం నిలుపుకునేందుకు అధికార పార్టీ నాయకులు పావులు కదుపుతున్నారు. జిల్లాలోని తిరుపతి, చిత్తూరు కార్పొరేషన్లతో పాటు ఆరు మున్సిపాలిటీల్లో పనిచేస్తున్న ఉద్యోగులను ఉన్న ఫలంగా బదిలీలు చేసేందుకు డెరైక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. అందులో భాగంగానే సోమవారం జీవోఎంఎస్.నెం.186 ఫైనాన్స్ (డీసీఎం-2) డిపార్ట్.తేదీ 05.09.2014 ఉత్తర్వులు జారీ చేశారు. ఈమేరకు ఆర్వోసీ.నెం.11163/2014/కే1-2 తేదీ 06.09.2014 పేరిట సర్క్యులర్ను విడుదల చేశారు. అది కూడా బదిలీకానున్న ఉద్యోగులకు సంబంధించిన పూర్తి వివరాలను ఈనెల 15వ తేదీలోగా పంపించాలంటూ సంబంధిత మున్సిపల్, కార్పొరేషన్ల కమిషనర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈనెల 30కి ఉన్న బదిలీల గడువును అక్టోబర్ 10 వరకు పొడిగించారు. అదే నెల 11 నుంచి బదిలీలపై నిషేధం ఉంటుందని ఆదేశాల్లో పేర్కొన్నారు. మెడికల్ అండ్ హెల్త్ డిపార్టుమెంట్లో పనిచేసే ప్రత్యేక డాక్టర్లు, లెక్చరర్లకు ప్రత్యేక గైడ్లైన్స్ ఇవ్వనున్నారు. ఏ ఉద్యోగులు ఎక్కడికి.. ప్రస్తుతం జూనియర్ అసిస్టెంట్లు, సీనియర్ అసిస్టెంట్లు, సూపరింటెండెంట్లు, అకౌంటెంట్లు, రెవెన్యూ అధికారులు, ఎవరైతే 23 సంవత్సరాలు పూర్తిచేసుంటారో వారిని బదిలీ చేసేందుకు ఉన్నతాధికారులు దృష్టి సారించారు. ఈవివరాలను పూర్తిస్థాయిలో తమకు అందించాలని డీఎంఏ కార్యాలయం నుంచి స్పష్టమైన ఆదేశాలు రావడంతో ఇక్కడి మున్సిపల్, కార్పొరేషన్ కమిషనర్లు ఆ పనిలో తలమునకలై ఉన్నారు. విశ్వసనీయ స మాచారం మేరకు కార్పొరేషన్లో పనిచేసే రికార్డు అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ వరకు జిల్లాలోనే బదిలీలు ఉంటాయి. సీనియర్ అసిస్టెంట్ స్థాయి ఉద్యోగులకు అనంతపురం రీజియన్ పరిధిలో బదిలీ చేస్తారు. సూపరింటెండెంట్, అకౌంటెంట్, రెవెన్యూ అధికారులు, మేనేజర్లకు రాష్ట్ర స్థాయిలో బదిలీలు ఉంటాయి. వీరితో పాటు ఇంజినీర్లు, డీఈ స్థాయి అధికారులను ఈఎన్సీ విభాగం, ఏఈలను ఎస్ఈ అధికారులు బదిలీ చేయనున్నారు. అసిస్టెంట్ సిటీప్లానర్, టౌన్ప్లానింగ్ సూపర్వైజర్, బిల్డింగ్ ఇన్స్పెక్టర్లను డెరైక్టర్ ఆఫ్ టౌన్ప్లానింగ్ విభాగపు ఉన్నతాధికారులు బదిలీలు చేయనున్నారు. ఇందులో డెప్యూటేషన్పై వచ్చిన సెక్రటేరియట్ ఉద్యోగులను బదిలీల నుంచి మినహాయించారు. సర్వీసు రూల్స్ ఆమోదానికి ఓకే సాధారణంగా కార్పొరేషన్లలో సర్వీసు రూల్స్కు ఆమోదం లేకపోవడం వల్ల ఇక్కడి ఉద్యోగులకు బదిలీలు ఉండవు. అయితే ప్రస్తుతం సర్వీసు రూల్స్ను ఒకటి రెండు రోజుల్లో ఆమోదించేందుకు ఫైల్ సిద్ధంగా ఉంది. మాట వినని వారికి బెదిరింపులు తమకు అనుకూలమైన ఉద్యోగులను నిబంధనలకు విరుద్ధంగా అదే స్థానంలో కూర్చోబెట్టేందుకు ఒత్తిళ్లు తెస్తున్నారు. మొన్న జరిగిన ఎన్నికల్లో తమ పార్టీ (అధికార)కి పనిచేయని, మాట వినని, తాము చెప్పినట్టు నడుచుకోని ఉద్యోగులను ఇక్కడి నుంచి సాగనంపేందుకు సిద్ధమయ్యారు. పైగా పరోక్షంగా వేధింపులకు పాల్పడుతూ, విజిలెన్స్, ఏసీబీ అధికారుల పేరుతో ఫోన్ ద్వారా బెదిరింపులకు పాల్పడుతున్నారని ఉద్యోగులే బహిరంగంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఇటీవల కర్నూలు నుంచి బదిలీపై ఇక్కడికి వచ్చిన ఏసీపీ స్థాయి అధికారి వేధింపులు తాళలేక సెలవుపై వెళ్లిపోయినట్టు సమాచారం. అదే బాటలో ఉద్యోగ, కార్మిక సంఘం రాష్ట్ర నాయకుడిగా గుర్తింపు పొందిన ఓ అధికారితో పాటు పలువురు కీలకమైన ఉద్యోగులు కూడా వెళ్లిపోయేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ పరిణామాలు మున్సిపల్ ఉద్యోగులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. -
తెలంగాణ పీఠాలపై కొలువుదీరిన అభ్యర్థులు
మున్సిపాలిటీ, కార్పోరేషన్ పీఠాలకు గురువారం జరుగుతున్న ఎన్నికలు రసవత్తరంగా మారాయి. తెలంగాణలోని మూడు కార్పోరేషన్లు, 52 మున్సిపాలిటీల్లో చైర్ పర్సన్ల అభ్యర్థుల ఎన్నిక ప్రక్రియ వాడివేడిగా కొనసాగింది. దీంతో, గెలిచినా ఎలాంటి పదవులు లేకుండా ఖాళీగా ఉన్న స్థానిక ప్రజా ప్రతినిధులంతా ఇప్పుడు కొత్త పదవులతో కొలువుదీరుతున్నారు. నల్గొండ, సూర్యపేటల్లో మున్సిపాలిటీల్లో కోరంలేక ఎన్నిక వాయిదా పడింది.తెలంగాణ రాష్ట్రంలో వివిధ మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో ఛైర్మన్లు, వైస్ ఛైర్మన్లు, మేయర్లుగా ఎన్నికైన వారి వివరాలు ఇలా ఉన్నాయి.. నగరపాలక సంస్థల విజేతలు రామగుండం-కొంకటి లక్ష్మీనారాయణ(టీఆర్ఎస్) కరీంనగర్- రవీందర్ సింగ్(టీఆర్ఎస్) నిజామాబాద్-ఆకుల సుజాత(టీఆర్ఎస్) పురపాలక సంఘాల విజేతలు ఆదిలాబాద్ జిల్లా కాగజ్ నగర్-సీపీ పద్మావతి-టీఆర్ఎస్ భైంసా-సబీయా బేగం-ఎంఐఎం ఆదిలాబాద్-మనీషా-టీఆర్ఎస్ నిర్మల్-గణేష్-టీఆర్ఎస్ మంచిర్యాల-వసుంధర-టీఆర్ఎస్ బెల్లంపల్లి-సునీతారాణి టీఆర్ఎస్ రంగారెడ్డి జిల్లా వికారాబాద్- బి.సత్యనారాయణ- కాంగ్రెస్ బడంగ్ పేట్-నర్సింహ గౌడ్-కాంగ్రెస్ తాండూరు-విజయలక్ష్మి-టీఆర్ఎస్ పెద్ద అంబర్ పేట-ధనలక్ష్మి-టీడీపీ ఇబ్రంహీపట్నం-కె. భరత్ కుమార్-టీడీపీ మెదక్ జిల్లా మెదక్-మల్లికార్జున గౌడ్-టీఆర్ఎస్ గజ్వేల్-భాస్కర్-టీఆర్ఎస్ జోగిపేట-కవిత-కాంగ్రెస్ నిజామాబాద్ జిల్లా కామారెడ్డి-పిప్రి సుష్మ- కాంగ్రెస్ బోధన్-ఎల్లయ్య-టీఆర్ఎస్ వరంగల్ జిల్లా భూపాలపల్లి-సంపూర్ణ-టీఆర్ఎస్ నర్సంపేట-రామచంద్రయ్య-కాంగ్రెస్ జనగామ-ప్రేమలతా రెడ్డి-టీఆర్ఎస్ కరీంనగర్ జిల్లా హుస్నాబాద్-చంద్రయ్య-టీఆర్ఎస్ సిరిసిల్ల -పావని-టీఆర్ఎస్ జమ్మికుంట-రామస్వామి-టీఆర్ఎస్ హుజూరాబాద్-విజయ్ కుమార్-టీఆర్ఎస్ కోరుట్ల- శీలం వేణుగోపాల్-టీఆర్ఎస్ మహబూబ్ నగర్ జిల్లా వనపర్తి-పి. రమేశ్ గౌడ్-టీడీపీ కల్వకుర్తి-శ్రీశైలం-కాంగ్రెస్ మహబూబ్ నగర్-రాధా అమర్-కాంగ్రెస్ గద్వాల-పద్మావతి-కాంగ్రెస్ అయిజ-రాజేశ్వరి-టీఆర్ఎస్ నల్గొండ భువనగిరి-లావణ్య-బీజేపీ హుజూర్ నగర్-వెంకయ్య-కాంగ్రెస్ మిర్యాలగూడ-నాగలక్ష్మి-కాంగ్రెస్ కోదాడ-అనిత-కాంగ్రెస్ దేవరకొండ-మంగ్యానాయక్-కాంగ్రెస్ ఖమ్మం జిల్లా సత్తుపల్లి-స్వాతి-టీడీపీ ఇల్లెందు-మడత రమ-కాంగ్రెస్ కొత్తగూడెం-గీత-కాంగ్రెస్ -
త్వరలో నామినేటెడ్ పోస్టుల భర్తీ
ఏఐసీసీ నిర్ణయం ఆధారంగా అధ్యక్షులు, ఉపాధ్యక్షుల ఎంపిక సంస్థాగత ఎన్నికలకు రోడ్ మ్యాప్ రూపొందించాం వచ్చే ఏడాది జులైలో కేపీసీసీ నూతన అధ్యక్షుడి ఎంపిక సోనియాగాంధీ సూచించేంత వరకూ ఆ స్థానం నాదే కేపీసీసీ అధ్యక్షుడు జీ. పరమేశ్వర్ సాక్షి, బెంగళూరు : బోర్డులు, కార్పొరేషన్ల నామినేటెడ్ పోస్టుల ఎంపిక త్వరలో ఉంటుందని కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (కేపీసీసీ) అధ్యక్షుడు జీ. పరమేశ్వర్ వెల్లడించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్రంలో 110 బోర్డులు, కార్పొరేషన్లు ఉన్నాయన్నారు. వీటిలో దాదాపు 30 శాతం సంస్థలకు ఐఏఎస్, ఐపీఎస్ వంటి ఉన్నత స్థాయి అధికారులు అధ్యక్షులు, ఉపాధ్యక్షులుగా ఉండాలన్నారు. మిగిలిన 70 శాతం అన్ అఫిషియల్స్ అధ్యక్షులుగా, ఉపాధ్యక్షులుగా ఉండవచ్చున్నారు. ఈ స్థానాలు చాలా కాలంగా పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. పార్టీ రాష్ట్ర శాఖ రాజకీయ వ్యవహారాల ఇన్ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ సమక్షంలో రెండు రోజుల పాటు జరిగిన సమీక్ష సమావేశంలో నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయాల్సిందిగా మెజారిటీ కార్యకర్తలు అభిప్రాయపడ్డారన్నారు. దిగ్విజయ్ సింగ్ కూడా సాధ్యమైనంత త్వరగా భర్తీ చేయాల్సిందిగా సూచించారన్నారు. అందువల్ల ఈ విషయంపై ఇక ఆలస్యం చేయకుండా త్వరగా నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తామన్నారు. అయితే బోర్డులు, కార్పొరేషన్ల అధ్యక్షులు, ఉపాధ్యక్షుల నియామకానికి సంబంధించి ఏఐసీసీ అంతిమ నిర్ణయం తీసుకోనుండగా ఈ సంస్థల 1,265 సభ్యులను మాత్రం తామే ఎంపిక చేస్తామన్నారు. అధ్యక్షులుగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా ఉండవచ్చునన్నారు. రోడ్ మ్యాప్ రూపొందించాం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర శాఖ సంస్థాగత ఎన్నికల కోసం నూతన రోడ్ మ్యాప్ రూపొందించినట్లు పరమేశ్వర్ తెలిపారు. దీని ప్రకారం డిసెంబర్ వరకూ పార్టీ కార్యకర్తల నమోదు ప్రక్రియ (మెంబర్షిప్ డ్రైవ్) ఉంటుందన్నారు. తర్వాత బూత్, డీసీసీ అధ్యక్షులు తదితర ఎన్నికలు ఉంటాయన్నారు. చివరిగా వచ్చే ఏడాది జులైలో కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడి ఎంపిక ఉంటుందన్నారు. తనకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వడం హై కమాండ్ నిర్ణయంపై ఆధారపడి ఉంటుందన్నారు. అయితే ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ సూచించేంతవరకూ తాను ఇదే పదవిలో కొనసాగుతానని స్పష్టం చేశారు. రాష్ట్రంలో పార్టీ బలోపేతం చేసే దిశగా అక్టోబర్ 2 నుంచి రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్రలు నిర్వహించనున్నామన్నారు. అదేవిధంగా దేశంలో మొదటిసారిగా అదే నెలలో ‘రాష్ట్ర స్థాయిలో ప్రదేశ్కాంగ్రెస్ కమిటీ కన్వెన్షన్’ను కర్ణాటకలో ఏర్పాటుచేయాలని భావిస్తున్నామన్నారు. ఇందుకు సోనియా, రాహుల్గాంధీలను కూడా ఆహ్వానించనున్నామన్నారు. ఇక నవంబర్ 19న రాష్ట్రస్థాయి మహిళా కన్వెన్షన్, అటు తర్వాత ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ తదితర విభాగాల కన్వెన్షన్లను బెంగళూరు, హుబ్లీ, ధార్వాడ తదితర చోట్ల నిర్వహించనున్నట్లు పరమేశ్వర్ తెలిపారు. -
జలం.. గరళం
జలం మాటున గరళం గొంతులో దిగుతోంది. రక్షితనీరు కరువై ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతోంది. కలుషిత నీటితో డయేరియా, టైపాయిడ్, కలరా, కామెర్లు వంటి వ్యాధుల బారినపడుతున్నారు. ఇప్పటికే జిల్లాలో విషజ్వరాలు, డయేరియా విశ్వరూపం చూపుతున్నాయి. ఆస్పత్రులన్నీ కిటకిటలాడుతున్నాయి. వర్షాకాలంలో ఈ వ్యాధులు మరింత ప్రబలే {పమాదముంది. సాక్షి, కరీంనగర్ : జిల్లాలో కరీంనగర్, రామగుండం కార్పొరేషన్లు, కోరుట్ల, మెట్పల్లి, సిరిసిల్ల, జగిత్యాల మున్సిపాలి టీలు, వేములవాడ, పెద్దపల్లి, హుస్నాబాద్, హుజూరాబాద్, జమ్మికుంట నగర పంచాయతీలు, 1207 గ్రామ పంచాయతీలున్నాయి. జిల్లాకేంద్రం మొదలు మారుమూల పల్లె వరకు అన్ని చోట్లా తాగునీటిలో ఫ్లోరిన్ అధికంగా ఉంది. సాధారణంగా నీటిలో 0.5 నుంచి 1.5మిల్లీగ్రాముల ఫ్లోరిన్ ఉండాలి. కానీ, 700కు పైగా గ్రామా ల్లో ఫ్లోరిన్ 2మి.గ్రా.పైనఉంది. వాటిలో 200 ఆవాస ప్రాంతాల్లో ఫ్లోరిన్ 3 మి.గ్రా శాతం పైనే ఉంది. కరీంనగర్ శివారు ప్రాంతంలో ఉన్న జిల్లా పోలీసు శిక్షణ కేంద్రం, బైపాస్ వద్ద ఎల్లమ్మగుడి, విద్యానగర్లోని పోలీస్ శిక్షణ కాలేజీ ప్రాంతాల్లో ఫ్లోరిన్ ఎక్కువగా ఉంది. బెజ్జంకి మండలం కాసిం పేట, గుండ్లపల్లి, జంగపల్లి, దాచారం, పోతా రం, భీమదేవరపల్లి మండలం మల్లారం, మాణిక్యాపూర్, రంగయ్యపల్లి, బోయిన్పల్లి మండలం గుండ్రపల్లి, వరదవెల్లి, కొత్తపేట, అనంతపల్లి, చందుర్తి మండలం కిష్టంపేట, ఎనగల్, చిగురుమామిడి మండలం సీతారాంపూర్, చిగురుమామిడి, లంబాడపల్లి, ధర్మారంలో పత్తిపాక, ఎల్కతుర్తిలో తిమ్మాపూర్, ఎల్కతుర్తి, ఇల్లంతకుంటలో తిప్పాపూర్, రహీంఖాన్పేట, వల్లంపట్ల, ముస్కానిపేట, గొల్లపల్లి, అనంతారం, వంతడ్పుల, గంభీరావుపేటలో దమ్మన్నపేట, సముద్రాలలింగాపూర్, గంగాధర లో ఉప్పరమల్యాల, నాగిరెడ్డిపూర్, వెంకటయ్యపల్లి, గొల్లపల్లి మండలం గుంజపడుగు, హుస్నాబాద్లో అక్కనపేట, జిల్లెలగడ్డ, గుడాటిపల్లి తది తర గ్రామాల్లో ఫ్లోరిన్ శాతం 3మి.గ్రా పైనే ఉంది. నెరవేరని లక్ష్యం జిల్లాలో ఏడు వందలకు పైగా గ్రామాల్లో.. ప్రజలు స్వచ్ఛమైన తాగునీటికి నోచుకోవడం లేదని అధికారిక లెక్కలే స్పష్టం చేస్తున్నాయి. తాగునీటి నాణ్యత రోజురోజుకు లోపిస్తోంది. జిల్లా కేంద్రంలో ఉన్న ఏకైక నీటి నాణ్యత పర్యవేక్షణ ప్రయోగశాల పేరుకే పరిమితమైంది. ఈ ప్రయోగశాలలో ఇద్దరే ఉద్యోగులు ఉన్నారు. ఒకరు జూనియర్ అసిస్టెంట్ ప్రకాశ్, ఇంకొకరు శాంపిల్ టేకర్ (నమూనాలు సేకరించే వ్యక్తి). వీరిద్దరే జిల్లా అంతటా తిరగాలి. గ్రామాల్లో ఉన్న బావులు, ఓవర్హెడ్ ట్యాంకులు, నల్లాలు, బోర్వెల్స్ (చేతిపంపులు), చెరువుల నుంచి నీటి నమూనాలు సేకరించాలి. వాటిని జిల్లా కేంద్రానికి తీసుకొచ్చి నాణ్యత పరీక్షించాలి. ప్రతి నెల 60 బ్యాక్టీరియా, 30 కెమికల్ పరీక్షలు నిర్వహించాలనే లక్ష్యం ఉండగా.. సిబ్బంది లేకపోవడంతో రెండు కలిపి 40కి మించడం లేదు. వీరు ఏ ప్రాంతానికి వెళ్లినా ఇక్కడ కార్యాలయానికి తాళమే. ప్రభుత్వం నుంచి వచ్చే నివేదికలపై ఎప్పటికప్పుడు స్పందించాల్సి ఉంటుంది. ఆఫీసు పనితోపాటు రిపోర్టుల కోసం ప్రకాశ్ కార్యాలయానికే పరిమితమయ్యారు. నీటి నమూనా సేకరించే వ్యక్తి నెలంతా తిరిగి పరీ క్షలు నిర్వహించలేకపోతున్నారు. ప్రైవేట్ విద్యాసంస్థలు, ఆస్పత్రులు, ఇతర కార్యాల యాలు నీటిని ఈ ప్రయోగశాలకు తీసుకొచ్చి నాణ్యత పరీక్షలు నిర్వహించుకుంటున్నాయి. వర్షాకాలం కావడంతో కలుషితనీటితో ఇంకా వ్యాధులు ప్రబలే ప్రమాదముంది. సిబ్బంది కొరత : ప్రకాశ్, నీటినాణ్యత పర్యవేక్షణ ప్రయోగశాల సగానికిపైగా గ్రామాల్లో రక్షితనీరు అందడం లేదు. ఆయా గ్రామాల ప్రజలకు ఎన్నోసార్లు చెప్పాం... అయినా వారు అదే నీరు తాగుతున్నారు. నీటినాణ్యత పరీక్ష నిర్వహించే సిబ్బం ది కొరత ఉండడంతోనే ఆశించిన విధంగా పరీక్షలు చేయలేకపోతున్నాం. మరో శాంపిల్ టేకర్, టెక్నీషియన్, ల్యాబ్ అసిస్టెంట్, క్లర్క్, కంప్యూటర్ ఆపరేటర్ అవసరమున్నారు. సరిపడా సిబ్బంది ఉంటే.. జిల్లావ్యాప్తంగా నీటి నాణ్యత పరీక్షలు చేసే వీలుంది. -
ఇక ఉద్వాసనే!
లోక్సభ ఫలితాల ప్రభావం .. విజయానికి సహకరించని, పని తీరు సరిగాలేని మంత్రులపై వేటు! జాబితాలో ఆరుగురు త్వరలో మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణ అసంతప్తి నేతలకు బోర్డులు, కార్పొరేషన్ల అధ్యక్ష పదవులు ప్రతిభకు పెద్ద పీట.. అన్ని జిల్లాలకు ప్రాధాన్యత లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపునకు సహకరించని, పని తీరు సరిగాలేని అమాత్యులకు ఉద్వాసన పలకడానికి అధిష్టానం సిద్ధమైంది. ప్రస్తుతానికి ఈ జాబితాలో శ్రీనివాస ప్రసాద్, శామనూరు శివ శంకరప్ప, ఖమరుల్ ఇస్లాం, ప్రకాశ్ హుక్కేరి, అంబరీశ్, కిమ్మనె రత్నాకర్ ఉన్నారు. సమీప భవిష్యత్తులో ముఖ్యమైన ఎన్నికలేవీ లేనందున, మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణకు ఇంతకు మించిన తరుణం ఉండదని కాంగెస్ భావిస్తోంది. ఒక వేళ అసంతప్తి తలెత్తితే బోర్డులు, కార్పొరేషన్ల అధ్యక్ష పదవులను కట్టబెట్టాలనే ఆలోచనలో కూడా ఉంది. సాక్షి ప్రతినిధి, బెంగళూరు : లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల విజయానికి సరైన సహాయ సహకారాలు అందించని మంత్రులపై వేటు వేయాలని అధిష్టానం యోచిస్తోంది. వీరితో పాటే పని తీరు బాగా లేని మంత్రులకు కూడా ఉద్వాసన పలకనుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని ఇటీవల పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్ నేత ృత్వంలో మంత్రుల పని తీరును బేరీజు వేశారు. ప్రస్తుతానికి ఆరుగురు మంత్రుల నెత్తిపై కత్తి వేలాడుతోంది. మంత్రులు శ్రీనివాస ప్రసాద్, శామనూరు శివ శంకరప్ప, ఖమరుల్ ఇస్లాం, ప్రకాశ్ హుక్కేరి, అంబరీశ్, కిమ్మనె రత్నాకర్ పదవులను కోల్పోయే అవకాశాలున్నాయని సమాచారం. వీరిలో ప్రకాశ్ హుక్కేరి మొన్న జరిగిన ఎన్నికల్లో లోక్సభకు ఎన్నికయ్యారు. మంత్రి వర్గంలో ఇప్పటికే మూడు ఖాళీలున్నాయి. కనుక కొత్తగా తొమ్మిది మందికి అవకాశం లభించవచ్చు. సమీప భవిష్యత్తులో ముఖ్యమైన ఎన్నికలేవీ లేనందున, మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణకు ఇంతకు మించిన తరుణం ఉండదని అధిష్టానం భావిస్తోంది. ఒక వేళ అసంత ృప్తి తలెత్తితే బోర్డులు, కార్పొరేషన్ల అధ్యక్ష పదవులను కట్టబెట్టాలనే ఆలోచన కూడా ఉంది. పునర్వ్యవస్థీకరణలో అనుభవం, సామర్థ్యానికి ప్రాధాన్యత ఇవ్వనున్నారు. సామాజిక వర్గం, ప్రాంతం లాంటి వాటిని పక్కన పెట్టి ప్రతిభకు పెద్ద పీట వేయాలని నిర్ణయించారు. ఇదే సమయంలో మంత్రి వర్గంలో అన్ని జిల్లాలకు ప్రాతినిధ్యం కలిగేలా జాగ్రత్తలు తీసుకోనున్నారు. ఎగువ సభల ఎన్నికలకు అభ్యర్థుల ఎంపిక, కార్పొరేషన్లు, బోర్డుల నియామకాలపై చర్చించడానికి దిగ్విజయ్ సింగ్ ఈ నెలాఖరుకు ఇక్కడికి రానున్నారు. ఇదే సమయంలో మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణపై కూడా తుది నిర్ణయం తీసుకోనున్నారు. మల్లిఖార్జునకు స్థానం తోటలు, ఉద్యాన వనాల శాఖ మంత్రి శ్యామనూరు శివశంకరప్ప వయో భారంతో బాధ పడుతున్నారు. ఆయన స్థానంలో కుమారుడు ఎస్ఎస్. మల్లిఖార్జునకు స్థానం కల్పిస్తామని అధిష్టానం హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఆయన తప్పుకోవడానికి సిద్ధమయ్యారు. రెవెన్యూ శాఖ మంత్రి వీ. శ్రీనివాస ప్రసాద్ అనారోగ్యంతో బాధ పడుతున్నారు. దీని వల్ల కీలకమైన రెవెన్యూ శాఖ అచేతనంగా పడి ఉంది. కరువు, వరదల సమయాల్లో ఆయన పర్యటనలకు వెళ్లే స్థితిలో లేరు. మునిసిపల్ శాఖ మంత్రి ఖమరుల్ ఇస్లాం అనేక శాఖలతో సతమతమవుతున్నారు. ఆయన పని తీరు బాగా లేదని పార్టీలో పెదవి విరుస్తున్నారు. గుల్బర్గ జిల్లా ఇన్చార్జి మంత్రిగా కొనసాగుతున్న ఆయనకు అక్కడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. గృహ నిర్మాణ శాఖ మంత్రి, నటుడు అంబరీశ్ ఇటీవల తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. సరిగ్గా విధులు నిర్వర్తించడం లేదనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఆయన ఇన్చార్జి మంత్రిగా వ్యవహరిస్తున్న మండ్యలో లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి, నటి రమ్య ఓటమి పాలైంది. దీనికి ఆయన బాధ్యత వహించాలనే మాటలు కూడా పార్టీలో వినిపిస్తున్నాయి. పాఠశాలల విద్యా శాఖ మంత్రి కిమ్మనె రత్నాకర్ అతి మంచితనమే ఆయన కొంప ముంచేట్లుంది. విద్యా శాఖ లోటు పాట్లను తెలుసుకోవడంలో విఫలమయ్యారనే ఆరోపణలున్నాయి. శివమొగ్గ జిల్లాలోని సొంత నియోజక వర్గం తీర్థహళ్లిలోనే ఎక్కువ రోజులుంటారని సొంత పార్టీ వారే విమర్శిస్తుంటారు. -
కారు జోరు
ఉద్యమ ఖిల్లాలో కారు వేగంగా దూసుకెళ్లింది. పురపాలక ఎన్నికల్లో అనూహ్య ఫలితాలను నమోదు చేసింది. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అంచనాలను తలకిందులు చేసింది. మోడీ హవాతో పుంజుకున్న బీజేపీ సైతం బోణీ కొట్టింది. ఫలితంగా కాంగ్రెస్ చేతిలో ఉన్న మున్సిపాలిటీలన్నీ ఈసారి చెల్లాచెదురయ్యాయి. జిల్లాలో టీడీపీ అడ్రస్ గల్లంతైంది. సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : జిల్లాలోని రెండు కార్పొరేషన్లు, నాలుగు మున్సిపాలిటీలు, ఐదు నగర పంచాయతీలకు జరిగిన ఎన్నికల్లో ఆరు చోట్ల టీఆర్ఎస్ ఆధిక్యత చాటుకుంది. మూడు చోట్ల కాంగ్రెస్ పార్టీ పట్టు నిలుపుకుంది. మరో చోట రెండు పార్టీలు సమ ఉజ్జీలుగా నిలదొక్కుకున్నాయి. ఒక చోట బీజేపీ తమ సత్తా చాటుకుంది. టీఆర్ఎస్ పుంజుకోవటంతో పాటు బీజేపీ సత్తా చాటడంతో మిశ్రమ ఫలితాలు వెలువడ్డాయి. రెండు కార్పొరేషన్లతో పాటు నాలుగు మున్సిపాలిటీలు, అయిదు నగర పంచాయతీల్లో స్పష్టమైన ఆధిక్యతను చాటుకోవటంలో మూడు పార్టీలు విఫలమయ్యాయి. ఎనిమిది పట్టణాల్లో మేజిక్ ఫిగర్కు సరిపడే మెజారిటీ స్థానాలు ఏ పార్టీ దక్కించు కోలేకపోయింది. జమ్మికుంట, హుస్నాబాద్ నగర పంచాయతీలను టీఆర్ఎస్ కైవశం చేసుకోగా, జగిత్యాల మున్సిపాలిటీని అత్యధిక మెజారిటీతో కాంగ్రెస్ హస్తగతం చేసుకుంది. మిగతా ఎనిమిది చోట్ల హంగ్ ఫలితాల కారణంగా ఛైర్మన్లు, మేయర్ల ఎంపిక ఉత్కంఠ రేపటం ఖాయమైంది. ఉద్యమ ప్రభావంతో పాటు తెలంగాణ తెచ్చిన క్రెడిట్ను టీఆర్ఎస్ ఖాతాలో వేసేందుకు పట్టణ ఓటర్లు మొగ్గు చూపారు. అందుకే జిల్లా మొత్తంలో అత్యధిక స్థానాలను ఆ పార్టీ తమ ఖాతాలో వేసుకుంది. - మొత్తం 326 డివిజన్లు, వార్డులకు ఎన్నికలు జరిగితే 121 స్థానాల్లో టీఆర్ఎస్ విజయ కేతనం ఎగరేసింది. 111 స్థానాలతో కాంగ్రెస్ రెండో స్థానంలో నిలిచింది. బీజేపీ 25 స్థానాలను గెలుచుకోగా, టీడీపీ 11 సీట్లకు పరిమితమైంది. మిగతా 58 స్థానాల్లో ఇండిపెండెంట్లు, ఇతర పార్టీల అభ్యర్థులు గెలుపొందారు. - టీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, ఈటెల రాజేందర్, విద్యాసాగర్రావు, కేటీఆర్ తమ సెగ్మెంట్లలో అభ్యర్థుల ఎంపిక మొదలు ఎన్నికలను సవాలుగా స్వీకరించటంతో ఫలితాలు గులాబీ గుప్పిట్లో చేరాయి. కరీంనగర్తో పాటు హుజూరాబాద్, జమ్మికుంట, హుస్నాబాద్, సిరిసిల్ల, మెట్పల్లి పట్టణాల్లో టీఆర్ఎస్ మెజారిటీ స్థానాలు కైవశం చేసుకుంది. - ముఖ్య నేతల మధ్య గ్రూపు తగాదాలు, అభ్యర్థుల ఎంపికలో ఒంటెత్తు పోకడలు కాంగ్రెస్ పార్టీని దెబ్బతీశాయి. అన్నీ తానై అన్నట్లుగా అభ్యర్థుల ఎంపికలో చక్రం తిప్పిన కరీంనగర్ ఎంపీ పొన్నం ప్రభాకర్కు పుర ఫలితాలు షాక్ ఇచ్చాయి. - టిక్కెట్ల కేటాయింపులో మిగతా నేతలతో పెరిగిన విభేదాలు కరీంనగర్లో పార్టీ ఓట్లకు గండి కొట్టాయి. - తెలంగాణ ఇచ్చిన ఘనత తమకే దక్కుతుందని, అభివృద్ధి పనులన్నీ తమ హయాంలోనే జరిగాయని కాంగ్రెస్ చేపట్టిన ప్రచారానికి నగరాల్లో ఆశించిన స్పందన లభించలేదు. - రామగుండం కార్పొరేషన్తో పాటు మాజీ మంత్రి జీవన్రెడ్డికి పట్టు ఉన్న జగిత్యాల, మాజీ మంత్రి జువ్వాడి రత్నాకర్రావు ప్రాబల్యమున్న కోరుట్ట పట్టణాల్లో మాత్రమే కాంగ్రెస్ పార్టీ ఆధిక్యతను ప్రదర్శించింది. - పుర ఫలితాల్లో టీడీపీ పత్తా లేకుండా పోయింది. ఒక్కచోట కూడా ఎక్కువ స్థానాలు గెలుచుకోలేకపోయింది. కనీసం పరువు నిలబెట్టుకునే సంఖ్యలో వార్డులు, డివిజన్లను సాధించుకోలేపోయింది. పార్టీ ఎన్నికల కమిటీ అధ్యక్షుడు ఎల్.రమణ సొంత సెగ్మెంట్ జగిత్యాలలో 5 వార్డులు, పార్టీ జిల్లా అధ్యక్షుడు విజయరమణారావు ప్రాతినిథ్యం వహిస్తున్న పెద్దపల్లిలో 3 వార్డులకు పరిమితమైంది. తెలంగాణపై అనుసరించిన ద్వంద్వ వైఖరితోనే ఆ పార్టీ చావుదెబ్బ తింది. పోటీ చేసేందుకు అభ్యర్థులు దొరకని విచిత్ర పరిస్థితిని చవిచూశారు. చివరకు బీజేపీతో పొత్తు, సీట్ల సర్దుబాటుతో కొన్ని చోట్ల అభ్యర్థులను పోటీకి దింపినప్పటికీ.. ఫలితాల్లో ఘోరంగా దెబ్బతిన్నారు. - పొత్తులో భాగంగా టీడీపీకి ఊపిరి పోసేందుకు ప్రయత్నించిన బీజేపీ జిల్లాలో బోణి కొట్టింది. టీడీపీతో పోలిస్తే రెండింతలకు మించి 25 స్థానాలు గెలుచుకుంది. ఎక్కువ దృష్టి కేంద్రీకరించిన వేములవాడలో అత్యధికంగా తొమ్మిది వార్డులను గెలుచుకొని నగర పంచాయతీకి గురి పెట్టింది. - కరీంనగర్ జిల్లా కేంద్రంలో ప్రాబల్యమున్న ఎంఐఎంకు ఈ సారి ఫలితాలు షాక్కు గురి చేశాయి. జిల్లా కేంద్రంలో ఆ పార్టీకి కేవలం రెండు డివిజన్లు దక్కాయి. ఏకంగా ఆ పార్టీ ముఖ్య నాయకులు పోటీ చేసిన డివిజన్లలోనూ ఓటమి తప్పించుకోలేకపోయింది. జిల్లాలో తొలిసారిగా 22 స్థానాల్లో అభ్యర్థులను పోటీకి దింపిన వైఎస్సార్సీపీ ఒక్క సీటును గెలుచుకోలేకపోయింది. -
మంత్రి వర్గ విస్తరణ
ముగ్గురికి చోటు కొందరికి శాఖల మార్పు బోర్డులు, కార్పొరేషన్ల అధ్యక్షుల నియామకం ‘లోక్సభ’ ఫలితాల తర్వాత కార్యాచరణ నీటి ఎద్దడి నివారణకు రూ. 516 కోట్లు ‘రేషన్’ పంపిణీ కాకుంటే అధికారులపై చర్యలు మైసూరు, న్యూస్లైన్ : రాష్ర్ట మంత్రి వర్గాన్ని త్వరలో విస్తరించనున్నట్లు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు. లోక్సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత మంత్రి వర్గంలో ముగ్గురికి చోటు కల్పించడంతో పాటు బోర్డులు, కార్పొరేషన్లకు అధ్యక్షులను నియమిస్తామని వెల్లడించారు. ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనడానికి గురువారం రాత్రి ఇక్కడికి వచ్చిన ఆయన స్థానిక రామకృష్ణ నగరలోని తన నివాసంలో శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. ఇటీవల పార్టీ పెద్దలు కొందరు మంత్రి వర్గ విస్తరణతో పాటు కొందరు మంత్రుల శాఖల మార్పు గురించి మీడియా ద్వారా తమ అభిప్రాయాలను చెప్పారని అన్నారు. అయితే ప్రస్తుతం ఎన్నికల నియమావళి అమలులో ఉన్నందున, దీనిపై తానేమీ మాట్లాడదలచుకోలేదని తెలిపారు. మంత్రి వర్గ విస్తరణతో పాటు బోర్డులు, కార్పొరేషన్ల అధ్యక్షుల నియామకాలపై అధిష్టానంతో చర్చించాల్సి ఉందని చెప్పారు. దీనిపై ఇదివరకే ఆయా జిల్లాల నాయకుల నుంచి అభిప్రాయాలను సేకరించామన్నారు. కాగా తాగు నీటి సమస్య పరిష్కారానికి రూ.516 కోట్లను ప్రభుత్వం విడుదల చేసిందని తెలిపారు. 1,250కి పైగా గ్రామాల్లో నెలకొన్న నీటి ఎద్దడిని ఎదుర్కోవడానికి ఈ నిధులు ఖర్చు చేస్తారని చెప్పారు. అనంతరం ఆయన తన నివాసం వద్ద గుమికూడిన ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. ఎన్నికల నియమావళి అమలులో ఉన్నందున, ప్రస్తుతం ఎలాంటి హామీలు ఇవ్వలేనని పేర్కొన్నారు. నియమావళి తొలగిపోయిన తర్వాత సమస్యలపై స్పందిస్తానని హామీ ఇచ్చారు. అంతకు ముందు ఆయన జిల్లా అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. తాగు నీటికి ఇబ్బందులు ఎదురు కాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. చౌక దుకాణాల ద్వారా సరుకులు సక్రమంగా పంపిణీ కాకపోతే సంబంధిత అధికారులపై నిర్దాక్షిణ్యంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
20 కార్పొరేషన్ల విభజన
సాక్షి, హైదరాబాద్: రాష్ర్ట విభజన నేపథ్యంలో తొలి విడతగా అత్యవసర సేవలందించే 20 కార్పొరేషన్లను విభజించి, అపాయింటెడ్ డే అయిన జూన్ 2 నుంచే రెండు రాష్ట్రాల్లో అమల్లోకి తేవాలని అధికారులు నిర్ణయించారు. దీంతో ఆర్టీసీ, పౌర సరఫరాలు, జెన్కో, ట్రాన్స్కో వంటి కీలక సంస్థలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలవారీగా విడిపోనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.కె. మహంతి ఉత్తర్వులు జారీ చేశారు. అపాయింటెడ్ డే తర్వాత ఇరు రాష్ట్రాల్లో ప్రజలకు రేషన్ పంపిణీ, రవాణా, విద్యుత్, విత్తనాలు, మందుల సరఫరా తదితర సేవల్లో ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసేందుకు వీలుగా 20 కార్పొరేషన్లను రెండుగా విభజించాలని నిర్ణయించినట్లు ఉత్తర్వుల్లో సీఎస్ స్పష్టం చేశారు. ఇందుకోసం వెంటనే ఈ కార్పొరేషన్ల పాలకమండళ్లు సమావేశమై విభజన తీర్మానాలను ఆమోదించాలని పేర్కొన్నారు. కంపెనీలు, కో-ఆపరేటివ్ సొసైటీల చట్టాల ప్రకారం విభజన ద్వారా తెలంగాణ పేరుతో కొత్తగా కార్పొరేషన్లను ఏర్పాటు చేయాలని, ప్రస్తుతమున్న వాటిని ఆంధ్రప్రదేశ్కు కేటాయించాలని వివరించారు. ప్రామాణిక నిర్వహణ విధానాల మేరకు ఇరు రాష్ట్రాల్లోనూ ఇవి పనిచేయనున్నట్లు సీఎస్ తెలిపారు. వెంటనే కార్పొరేషన్ల ఆదాయ, వ్యయాల పట్టికలను చార్టెడ్ అకౌంటెంట్తో పరిశీలన చేయించి, ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ నుంచి సర్టిఫికెట్ పొందేందుకు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్న ప్రకారం ఈ కార్పొరేషన్ల ఆస్తులు, అప్పులను జనాభా నిష్పత్తి ప్రకారం, అలాగే ఉద్యోగులను జిల్లాల నిష్పత్తి మేరకు పంపిణీ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో మార్క్ఫెడ్, విత్తనాభివృద్ధి కార్పొరేషన్ లిమిటెడ్, వేర్హౌసింగ్ కార్పొరేషన్, సివిల్ సప్లయిస్ కార్పొరేషన్, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, జెన్కో, ట్రాన్స్కో, సంప్రదాయేతర ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ, అటవీ అభివృద్ధి కార్పొరేషన్ లిమిటెడ్, పోలీసు గృహ నిర్మాణ సంస్థ, గృహ నిర్మాణ సంస్థ, నీటి వనరుల అభివృద్ధి సంస్థ, సాగునీటి అభివృద్ధి సంస్థ, పట్టణ ఆర్థిక, మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ, బేవరేజెస్ కార్పొరేషన్, విద్య, సంక్షేమ, మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ, ఆర్టీసీ, రహదారుల అభివృద్ధి సంస్థ, పర్యాటకాభివృద్ధి సంస్థలు రెండుగా చీలనున్నాయి. ప్రస్తుతమున్న చోట నుంచే రెండు రాష్ట్రాల కార్పొరేషన్లు పని చేస్తాయి. -
కౌంటింగా.. వెయిటింగా?
కరీంనగర్ కార్పొరేషన్, న్యూస్లైన్ : జిల్లాలోని రెండు కార్పొరేషన్లు, నాలుగు మున్సిపాలిటీలు, ఐదు నగరపంచాయతీల్లో గత నెల 30న ఎన్నికలు జరిగాయి. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 2న కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు వెల్లడించాల్సి ఉంది. కానీ ఈ నెల 6, 11న రెండు విడతల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు, 30న సాధారణ ఎన్నికలు ఉన్నాయి. మున్సిపల్ ఎన్నికల ఫలితాలను ప్రకటిస్తే వాటి ప్రభావం తర్వాత జరిగే ఎన్నికలపై ఉంటుంద ని, అందువల్ల ఎన్నికలు ముగిసేంత వరకు ఫలితాలు నిలిపివేయాలని రాజకీయ పార్టీలు హైకోర్టును ఆశ్రయించాయి. అంతకుముందే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాలను మే 7వ తేదీకి వాయిదా వేసిన హైకోర్టు, మున్సిపల్ ఎన్నికల ఫలితాలను పెండింగ్ పెట్టడం కుదరదని పేర్కొంది. ఈ నెల 9న ఫలితాలను వెల్లడించాలని స్పష్టం చేసింది. దీంతో రాజకీయ పార్టీలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. ఎన్నికల ఫలితాలు హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారమే ఈ నెల 9న వెల్లడించాలా.. లేదా సార్వత్రిక ఎన్నికల అనంతరం వెలువరించాలా అనే అంశంపై సోమవారం సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఇప్పటికే ఒకసారి విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ఎన్నికల కమిషన్కు పలు ప్రశ్నలు వేసింది. వాటికి ఎన్నికల కమిషన్ సమాధానం చెప్పాల్సి ఉంది. ఈవీఎంల భద్రతపై ఎన్నికల కమిషన్ అనుమానం వ్యక్తం చేయడంతో భద్రత ఎందుకు కల్పించలేరని, ఫలితాలు వాయిదా వేస్తే నష్టం ఏమిటో వివరంగా తెలుపాలని కోర్టు సూటిగా ప్రశ్నించింది. మొత్తం మీద సార్వత్రిక ఎన్నికలు పూర్తయ్యే వరకు మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వాయిదా పడతాయనే అభిప్రాయమే వ్యక్తమవుతోంది. దీంతో మున్సిపల్ బరిలో నిలిచిన అభ్యర్థులు మరింత టెన్షన్కు గురవుతున్నారు. సుప్రీంకోర్టు తీర్పు వాయిదాకే మొగ్గుచూపినపక్షంలో నెల పాటు వారికి మరింత ఆందోళన తప్పదు. -
30న మునిసిపల్ ఎన్నికలు
ఎన్నాళ్ల నుంచో వేచి చూస్తున్న మునిసిపల్ ఎన్నికలకు నగారా మోగింది. ఎట్టకేలకు మునిసిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. మార్చి 30వ తేదీన ఒకే రోజు రాష్ట్రవ్యాప్తంగా అన్ని మునిసిపాలిటీలు, కార్పొరేషన్లకు ఎన్నికలు జరుగుతాయి. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ ఉంటుంది. ఈ విషయాన్ని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమాకాంత్రెడ్డి విలేకరుల సమావేశంలో వెల్లడించారు. మొత్తం 146 మునిసిపాలిటీలు, 10 కార్పొరేషన్లకు ఎన్నికలు జరుగుతాయి. వీటి ఫలితాలు ఏప్రిల్ 2వ తేదీన వెల్లడిస్తారు. ప్రచార ఖర్చు మునిసిపాలిటీలకు లక్ష, కార్పొరేషన్లకు లక్షన్నర పరిమితిగా విధించారు. నామినేషన్ల ప్రక్రియ ఈనెల 10వ తేదీన ప్రారంభమై 14వ తేదీ వరకు ఉంటుంది. మార్చి 15న నామినేషన్ల పరిశీలన, 18న ఉపసంహరణకు చివరి రోజు. పార్టీ గుర్తులపైనే జరిగే ఈ ఎన్నికలలో మొత్తం 11వేల ఈవీఎంలు ఉపయోగిస్తారు. ఏదో కారణంతో మున్సిపల్ ఎన్నికలు వాయిదా పడుతూ వచ్చాయని, ఈ విషయంలో హైకోర్టు సీరియస్ అయ్యిందని ఆయన చెప్పారు. ఎన్నికల ఆలస్యానికి ప్రభుత్వానిదే బాధ్యత అని ఆయన స్ఫష్టం చేశారు. హైకోర్టు తమకు డెడ్ లైన్ విధించిందని, అందుకే త్వరగా ఎన్నికలు నిర్వహిస్తున్నామని తెలిపారు. -
మున్సిపల్ ఎన్నికలపై హైకోర్టు సీరియస్:రమాకాంత్ రెడ్డి
-
30న మునిసిపల్ ఎన్నికలు