వికారాబాద్:: విద్యుత్ కోతలు విధిస్తూ ఇటీవల టీఎస్ఎస్పీడీసీఎల్ సీఅండ్ఎండీ ఆదేశాలు జారీ చేశారు.గతంలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే మున్సిపాలిటీలు,మండల కేంద్రాల(సబ్ స్టేషన్ హెడ్క్వార్టర్)లో 8 గంటలు, కార్పొరేషన్లలో 6 గంటలు,గ్రామాల్లో 12 గంటల కోత ఉంటుందని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.ప్రస్తుతం వ్యవసాయానికి 7 గంటల సరఫరా జరుగుతుండగా పెరిగిన డిమాండ్ కారణంగా అయిదు గంటలు మాత్రమే సరఫరా ఆయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి.
కోతలు ఇలా ఉన్నాయి....
మున్సిపాలిటీలు, మండల కేంద్రాలు(సబ్ స్టేషన్ హెడ్ క్వార్టర్)...
ఉదయం 7 నుంచి 11 గంటల వరకు...మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు...
కార్పొరేషన్లు....
ఉదయం 5 నుంచి 8 గంటల వరకు ...మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు .
గ్రామాల్లో....
ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు (12 గంటల కోత)
త్రీఫేజ్ విద్యుత్ సరఫరా వివరాలు ఇలా ఉన్నాయి.
ఏ- గ్రూప్లో ఉదయం 3 నుంచి 8 గంటల వరకు,రాత్రి 10 నుంచి 12 గంటల వరకు.
బీ- గ్రూప్లో ఉదయం 8 నుంచి ఒంటి గంట వరకు, రాత్రి 12 నుంచి 2 గంటల వరకు.
సీ- గ్రూప్లో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 6 వరకు, రాత్రి 2 నుంచి 4 గంటల వరకు.
డీ-గ్రూప్లో రాత్రి 10 నుంచి 3 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు.
పెరుగుతున్న కోతలు
Published Thu, Oct 2 2014 12:08 AM | Last Updated on Tue, Sep 18 2018 8:28 PM
Advertisement
Advertisement