పెరుగుతున్న కోతలు | Increasing the power cuts | Sakshi
Sakshi News home page

పెరుగుతున్న కోతలు

Published Thu, Oct 2 2014 12:08 AM | Last Updated on Tue, Sep 18 2018 8:28 PM

Increasing the power cuts

వికారాబాద్:: విద్యుత్ కోతలు  విధిస్తూ ఇటీవల టీఎస్‌ఎస్‌పీడీసీఎల్ సీఅండ్‌ఎండీ ఆదేశాలు జారీ చేశారు.గతంలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే మున్సిపాలిటీలు,మండల కేంద్రాల(సబ్ స్టేషన్ హెడ్‌క్వార్టర్)లో 8 గంటలు, కార్పొరేషన్లలో 6 గంటలు,గ్రామాల్లో 12 గంటల కోత ఉంటుందని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.ప్రస్తుతం వ్యవసాయానికి 7 గంటల సరఫరా జరుగుతుండగా పెరిగిన డిమాండ్ కారణంగా అయిదు గంటలు మాత్రమే సరఫరా ఆయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి.

 కోతలు ఇలా ఉన్నాయి....
     మున్సిపాలిటీలు, మండల కేంద్రాలు(సబ్ స్టేషన్ హెడ్ క్వార్టర్)...
     ఉదయం 7  నుంచి 11 గంటల వరకు...మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు...

 కార్పొరేషన్లు....
     ఉదయం 5 నుంచి 8 గంటల వరకు ...మధ్యాహ్నం 2  నుంచి సాయంత్రం 5 గంటల వరకు .
 గ్రామాల్లో....
     ఉదయం 6  నుంచి  సాయంత్రం 6 గంటల వరకు (12 గంటల కోత)

 త్రీఫేజ్ విద్యుత్ సరఫరా వివరాలు ఇలా ఉన్నాయి.
 ఏ- గ్రూప్‌లో ఉదయం 3  నుంచి 8 గంటల వరకు,రాత్రి 10  నుంచి 12 గంటల వరకు.
 బీ- గ్రూప్‌లో ఉదయం 8  నుంచి ఒంటి గంట వరకు, రాత్రి 12  నుంచి 2 గంటల వరకు.
 సీ- గ్రూప్‌లో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 6 వరకు, రాత్రి 2 నుంచి 4 గంటల వరకు.
 డీ-గ్రూప్‌లో రాత్రి 10  నుంచి 3 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement