ఆర్థిక స్వావలంబనే ఆంధ్రాబ్యాంక్‌ లక్ష్యం | Andhra Bank CEO tour at vijayawada | Sakshi
Sakshi News home page

ఆర్థిక స్వావలంబనే ఆంధ్రాబ్యాంక్‌ లక్ష్యం

Oct 10 2016 11:25 PM | Updated on Sep 4 2017 4:54 PM

ఆర్థిక స్వావలంబనే ఆంధ్రాబ్యాంక్‌ లక్ష్యం

ఆర్థిక స్వావలంబనే ఆంధ్రాబ్యాంక్‌ లక్ష్యం

భారతీయుల ఆర్థిక స్వావలంబన కోసమే కేంద్ర ప్రభుత్వం నిర్వహించే వివిధ పథకాలకు అనుగణంగా తమ బ్యాంకు పనిచేస్తోందని ఆంధ్రాబ్యాంక్‌ మేనేజింగ్‌ డైరెక్టర్, సీఈవో సురేష్‌ ఎన్‌.పటేల్‌ అన్నారు. నగరానికి వచ్చిన పటేల్‌ జిల్లాలో వివిధ ప్రాంతాల్లోని బ్యాంక్‌ శాఖల ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమాలను పరిశీలించారు.

విజయవాడ (వన్‌టౌన్‌): భారతీయుల ఆర్థిక స్వావలంబన కోసమే కేంద్ర ప్రభుత్వం నిర్వహించే వివిధ పథకాలకు అనుగణంగా తమ బ్యాంకు పనిచేస్తోందని ఆంధ్రాబ్యాంక్‌ మేనేజింగ్‌ డైరెక్టర్, సీఈవో సురేష్‌ ఎన్‌.పటేల్‌ అన్నారు. నగరానికి వచ్చిన పటేల్‌ జిల్లాలో వివిధ ప్రాంతాల్లోని బ్యాంక్‌ శాఖల ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమాలను పరిశీలించారు. అనంతరం జోనల్‌ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ దేశంలో ప్రప్రథమంగా కృష్ణాజిల్లాలో నగదు రహిత రేషన్‌ పంపిణీ కార్యక్రమంలో భాగంగా 400 రేషన్‌ దుకాణాలు ఆంధ్రా బ్యాంక్‌ సహకారంతో అమలవుతున్నాయన్నారు. వాటిని తాను పరిశీలించానని చెప్పారు. బ్యాంక్‌ మిత్రా ల ద్వారా అందుతున్న సేవలను పరిశీలించి జోనల్‌ కార్యాలయంలో వారితో ముచ్చటించారు. ఫైనాన్షియల్‌ విభాగం జీఎం వినయ్‌వర్మ, విజయవాడ సర్కిల్‌ జీఎం రంగనా«ద్, జోనల్‌ మేనేజర్‌ కృష్ణారావు, సలహాదారు దుర్గాప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement