కొవ్వూరు : పోలీస్ కానిస్టేబుల్పై తిరగబడి దౌర్జన్యం చేసిన కేసులో నేరం రుజువు కావడంతో మల్లివెల్లి అమ్మిరాజు అనే వ్యక్తికి సెకండ్ అడిషనల్ అండ్ జ్యూడిషియల్ ఫస్ట్క్లాస్ మేజిస్ట్రేట్ వై.శ్రీలక్ష్మి రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ సోమవారం తీర్పుచెప్పారు.
పోలీసుపై దౌర్జన్యం కేసులో వ్యక్తికి జైలు
Published Tue, Oct 4 2016 2:23 AM | Last Updated on Mon, Sep 4 2017 4:02 PM
కొవ్వూరు : పోలీస్ కానిస్టేబుల్పై తిరగబడి దౌర్జన్యం చేసిన కేసులో నేరం రుజువు కావడంతో మల్లివెల్లి అమ్మిరాజు అనే వ్యక్తికి సెకండ్ అడిషనల్ అండ్ జ్యూడిషియల్ ఫస్ట్క్లాస్ మేజిస్ట్రేట్ వై.శ్రీలక్ష్మి రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ సోమవారం తీర్పుచెప్పారు. ఈ విషయాన్ని ఎస్సై ఎస్.ఎస్.ఎస్. పవన్కుమార్ తెలిపారు. గత ఏడాది మే 21న విధి నిర్వహణలో ఉన్న కానిస్టేబుల్ ఎ.ఏడుకొండలుపై పట్టణానికి చెందిన అమ్మిరాజు తిరగబడ్డారని, దీంతో కానిస్టేబుల్ ఫిర్యాదు మేరకు అప్పట్లో కేసు నమోదు చేసినట్టు ఎస్సై తెలిపారు.
Advertisement
Advertisement