విజయవాడ: నగరంలోని వన్టౌన్ పంజా సెంటర్లో రౌడీలు హల్చల్ సృష్టించిన ఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. గతరాత్రి ఓ హోటల్లో పనిచేస్తున్న సిబ్బందిపై రౌడీలు కర్రలతో దాడిచేశారు. ఈ దాడిలో హోటల్లో పనిచేస్తున్న ఈశ్వర్ అనే వ్యక్తికి గాయాలయ్యాయి. దాంతో బాధితులు వన్టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. గాయపడిన ఈశ్వర్ని చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.