rowdies
-
దాడిశెట్టి రాజాపై టీడీపీ గుండాల దౌర్జన్యం
-
మాజీమంత్రి విడదల రజిని మామ కారుపై పచ్చ గూండాల దాడి
-
విజయనగరం జిల్లా రాజాంలో టీడీపీ గూండాల అరాచకం
-
పెదకూరపాడు నియోజకవర్గంలో టీడీపీ గూండాల అరాచకం
-
తిరుపతిలో టీడీపీ గూండాల అరాచకం
-
జడ్పీటీసీ రమాదేవి ఇంటిని ధ్వంసం చేసిన టీడీపీ గూండాలు
-
మీడియా పై దాడి సిగ్గు చేటు.. కూటమి నేతలపై జర్నలిస్టులు ఫైర్
-
సాక్షి జర్నలిస్టులపై దాడిని ఖండించిన APUWJ
-
టీడీపీ గూండాలపై పోలీసులకు జర్నలిస్టుల ఫిర్యాదు
-
సాక్షి జర్నలిస్టులపై టీడీపీ గుండాల దాడి
-
YSRCP కార్యకర్తపై టీడీపీ గూండాల దాడి
-
ఫీల్డ్ అసిస్టెంట్ కు బెదిరింపులు
-
YSRCP అభిమానులపై టీడీపీ నేతలు దాడి
-
టీడీపీ నేతల పై కాసు మహేష్ రెడ్డి ఫైర్
-
తాడిపత్రిలో టీడీపీ గూండాలు దాడులపై శంకర్ నారాయణ కామెంట్స్
-
తాడిపత్రిలో టీడీపీ గూండాలు దాడులు.. అనంత వెంకట రామిరెడ్డి ఫైర్
-
శ్రీ సత్యసాయి జిల్లా రాప్తాడులో టీడీపీ నేతల దాష్టీకం
-
పోలీసులు చూస్తుండగానే ఈ దారుణం.. ఎక్కడ రక్షణ..?
-
రెడ్ బుక్ కాదు.. బ్లడ్ బుక్
-
పేట్రేగిపోతున్న పచ్చ మూకలు..
-
నెల్లూరులో టీడీపీ అరాచకాలపై చంద్రశేఖర్ రెడ్డి ఫైర్
-
తిరుపతి జిల్లా చంద్రగిరిలో టీడీపీ నేతల దౌర్జన్యం
-
అర్థరాత్రి జేసీబీ లతో టీడీపీ గుండాల దాడి..
-
చిరు వ్యాపారులపై రెడ్ బుక్ దౌర్జన్యం
-
రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న టీడీపీ గూండాల దాడులు, విధ్వంసాలు
-
వైఎస్ఆర్ విగ్రహానికి నిప్పు పెట్టిన దుండగులు
-
యూనివర్సిటీలపై రౌడీయిజం.. ఏయూ వీసీకి బెదిరింపు కాల్
-
తిరుపతి ఎస్వీయూలో టీడీపీ నేతల వీరంగం
-
చంద్రబాబు ఆదేశాలతో పేట్రేగిపోతోన్న పచ్చ రౌడీలు
-
KSR Live Show: మార్గాని భరత్ ప్రచార రథం దగ్ధం
-
ప్రచార రథం కాల్చేయడంపై మార్గాని భరత్ సంచలన వ్యాఖ్యలు
-
టీడీపీ అరాచకం.. రాజమండ్రిలో వైఎస్ఆర్ సీపీ చైతన్య రథం దగ్ధం
-
మార్గాని భరత్ ప్రచార రథానికి నిప్పు పెట్టిన పచ్చ మూకలు
-
YSRCP నేత కుటుంబంపై టీడీపీ నేతల దాడి..
-
ఉమ్మడి కృష్ణా జిల్లాలో వైఎస్ఆర్ సీపీ నేతలపై ఆగని దాడులు
-
అధికార అహంతో రెచ్చిపోతున్న పచ్చ సైకోలు
-
రెచ్చిపోతున్న పచ్చ మూకలు
-
ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం.. రెచ్చిపోతున్న టీడీపీ రౌడీలు
-
ఏపీలో టీడీపీ అరాచకాలు...గవర్నర్ యాక్షన్ తీసుకోవాలి
-
టీడీపీ అరాచకాలు..మరో బీహార్ గా మారిన ఏపీ
-
KSR Live Show: ప్రజాస్వామ్యానికే పెనుముప్పుగా చంద్రబాబు కక్ష సాధింపు
-
రిమ్స్ లో రెచ్చిపోయిన టీడీపీ రౌడీలు..పేషెంట్లను చంపేస్తామంటూ బెదిరింపు
-
రౌడీషీటర్లకు కౌన్సెలింగ్
ఖమ్మంక్రైం: శాసనసభ ఎన్నికల నేపథ్యంలో ఖమ్మం డివిజన్కు చెందిన రౌడీషీటర్లకు టాస్క్ఫోర్స్ ఏసీపీ రెహమాన్ నగరంలోని తన కార్యాలయంలో మంగళవారం ప్రత్యేకంగా కౌన్సెలింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా శాంతి భద్రతలకు, ప్రజల స్వేచ్ఛకు భంగం కలిగిస్తే ఉపేక్షించేది లేదన్నారు. ఎన్నికల నియమావళి అమలులో ఉన్న నేపథ్యంలో అల్లర్లు సృష్టించినా.. వేరే వ్యక్తులను, వర్గాలను రెచ్చగొట్టడం, ప్రజలను ప్రలోభాలకు గురిచేయడం వంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నేర ప్రవృత్తి కలిగిన వారి కార్యకలాపాలు, కదలికలపై పూర్తి నిఘా ఉంటుందని తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినట్లయితే పీడీ యాక్ట్ కేసులు నమోదు చేస్తామన్నారు. కమిషనరేట్ పరిధిలోని పోలీస్స్టేషన్ల వారీగా జాబితా తయారు చేశామన్నారు. కార్యక్రమంలో సీఐ తిరుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
గుంటూరులో గూండాలు
* జోరుగా ప్రైవేటు పంచాయితీలు * నగరంపై రౌడీలు, గూండాల మార్కు దందా * నీటిపై రాతలుగానే పోలీసుల మాటలు నగరంలో రౌడీలు, గూండాల మూకలు చెలరేగిపోతున్నాయి. భూ దందాలు, సెటిల్మెంట్స్, పంచాయితీలు, ఆస్తి గొడవల్లో తలదూర్చి వీరి మార్కు దందా చూపిస్తున్నారు. నగరంలోని దాదాపు అన్ని ఏరియాల్లో చోటామోటా మొదలుకొని పెద్ద స్థాయి వరకూ రౌడీలు, గూండాలు రాజ్యమేలుతున్నారు. కిరాయి హత్యలకు పాల్పడే వారు సైతం నగరంలోనే మకాం వేసి ఉన్నారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. గుంటూరు (పట్నంబజారు): నగరంలోని పట్టాభిపురం, అరండల్పేట, నగరంపాలెం, కొత్తపేట, లాలాపేట, పాతగంటూరు, రూరల్ పోలీసుస్టేషన్లలో కలిసి 300 మందికి పైగా రౌడీషీటర్లు ఉన్నారు. వీరిలో ఏ ప్లస్, ఏ, బీ, సీ కేటగిరీలకు చెందిన వారున్నారు. ఇటీవల కాలంలో రౌడీల దందా పెరిగిపోయింది. చిన్న స్థాయి పంచాయితీల దగ్గర నుంచి స్టేషన్ ఉన్నతాధికారుల వద్ద కూర్చుని సెటిల్మెంట్లు చేస్తున్నారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కొందరు రౌడీషీటర్లుకు అధికారపార్టీ నేతల అండదండలుండటంతో పోలీసులు సైతం ఏమిచేయలేని పరిస్థితి దాపురించింది. దీనితో రౌడీలు ఆడింది ఆట పాడింది పాటగా సాగుతోందని పలువురు అంటున్నారు. ఇటీవల కాలంలో నగరంలో వరుసగా చోసుచేసుకుంటున్న ఘటనలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. పోలీసు నిఘా ఏదీ...? రౌడీషీటర్లుపై పోలీసుల నిఘా పూర్తిగా కొరవడిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గతంలో పలువురు అధికారులు యాంటీ రౌడీ స్వా్కడ్ (ఏఆర్ఎస్)తో ఎప్పటికప్పుడు రౌడీల కదలికలపై దృష్టి సారించేవారు. ప్రస్తుతం అటువంటి ప్రత్యేక బృందం లేదని తెలుస్తోంది. నగరంలోని శివారు కాలనీలు స్థావరాలుగా చేసుకుని కొందరు రౌడీలు కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. గుంటూరులో రైల్వేస్టేషన్, బస్టాండ్ల వద్ద అర్ధరాత్రి కూడా అరాచకాలు సృష్టిస్తున్నారు. ఏదైమైనా పోలీసు ఉన్నతాధికారులు రౌడీల కదలికలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కౌన్సెలింగ్ డల్..... ఆయా స్టేషన్ పరిధిలో ఉన్న రౌడీషీటర్లుకు ప్రతి ఆదివారం కౌన్సెలింగ్ నిర్వహించటంతో పాటు వారి సంతకాలు సైతం తీసుకోవాల్సి ఉంటుంది. స్టేషన్ అధికారులు కౌన్సెలింగ్లు ఇవ్వటంలేదని తెలుస్తోంది. ప్రతి ఆదివారం స్టేషన్కు రాకుండా.. సిబ్బందికి కాసులు చెల్లిస్తున్నారనే ఆరోపణలున్నాయి. కొన్ని స్టేషన్లలో నేరుగా సిబ్బందే రౌడీలకు సమాచారాన్ని అందజేస్తున్నారు. ఈస్ట్ సబ్డివిజన్ పరిధిలోని ఒక పోలీసుస్టేషన్లో ప్రతి ఆదివారం రౌడీషీటర్లు సంతకాలు తీసుకుని రైటర్ డబ్బులివ్వాలని, లేకపోతే మాంసం తెచ్చిపెట్టాలంటూ ప్రతి వారం ఇబ్బందులకు గురి చేయటంతో నేరుగా స్టేషన్ ఉన్నతాధికారికే ఫిర్యాదు చేయటం గమనార్హం. రౌడీయిజాన్ని సహించం.. నగరంలో రౌడీకార్యకలాపాలు సాగిస్తే ఎట్టి పరిస్థితులలోనూ ఉపేక్షించం. వారి కార్యకలాపాలపై ఎప్పటికప్పుడు నిఘా ఉంచుతున్నాం. అసాంఘిక పనులు, దౌర్జన్యాలు చేస్తే చర్యలు చేపడతాం. పోలీసు స్టేషన్లలో ప్రతి వారం కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నాం. సత్ప్రవర్తన లేకపోతే రౌడీషీటర్లను తీవ్రంగా పరిగణిస్తాం. – భాస్కరరావు, అడిషనల్ ఎస్పీ -
మామూలు ఇవ్వలేదని...
విజయవాడ : బెజవాడలో నివురుగప్పిన నిప్పులా ఉన్న రౌడీయిజం మరోమారు విజృంభించింది. రూ.200 మామూలు ఇవ్వలేదని ఓ కూలీపై నలుగురు కలిసి దాడిచేసిన ఘటన కలకలం రేపింది. మాచవరం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయనగరం జిల్లాకు చెందిన కన్నూరి బుల్లబ్బాయి 20 ఏళ్ల క్రితం పొట్టకూటి కోసం నగరానికి వచ్చాడు. నగరంలోని మొగల్రాజపురంలోని బోయపాటి మాధవరావు వీధి చర్చి వద్ద ఉంటున్నాడు. భవన నిర్మాణ పనులకు వెళ్తూ రోజుకూలీగా జీవనం సాగిస్తున్నాడు. ఈ నెల ఆరోతేదీన మొగల్రాజపురం కొండపై నివసించే నానాజీ ఇంటిపని నిమిత్తం పాకలపాటి సురేష్ ఇంటి ముందు ఇసుక కుప్పను వేశారు. అదేరోజు సాయంత్రం నానాజీ ఇసుకను తన ఇంటి వద్దకు మోయటానికి బుల్లబ్బాయితో కిరాయి మాట్లాడుకున్నాడు. బుల్లబ్బాయి ఇసుక మూటలను కొండపైకి మోస్తున్న సమయంలో పాకలపాటి సురేష్ వచ్చి తన ఇంటి ముందు ఇసుకగుట్ట వేయటానికి మీరెవరు.. ఇసుక గుట్ట వేసినందుకు, ఇంటి ముందు నుంచి రవాణా చేస్తున్నందుకు తనకు రూ.200 మామూలు ఇవ్వాలంటూ బుల్లబ్బాయిపై రుబాబు చేశాడు. దీనిని గమనిస్తున్న స్థానికులు సురేష్కు నచ్చజెప్పటానికి ప్రయత్నించినా వినకుండా బుల్లిబాబుపై దౌర్జన్యానికి ఒడిగట్టాడు. అతనితోపాటు మరో నలుగురు కలిసి పెద్దపెద్ద బాదులు, కర్రలతో నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే బుల్లబ్బాయిని చితకబాదారు. ఈ దాడిలో బుల్లబ్బాయి తలకు, కన్నుకు తీవ్ర గాయాయ్యాయి. ఈ వ్యవహారం అంతా అదే ప్రాంతంలో ఉన్న ఓ కిరాణా దుకాణం ముందు ఉన్న సీసీ టీవీలో నమోదైంది. దీనిపై వెంటనే బాధితుడు మాచవరం పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. తనపై సురేష్తో పాటు గోపయ్య, కుమార్, కల్యాణ్ అనే వ్యక్తులు దాడిచేశారని పేర్కొన్నాడు. ఈ మేరకు కేసు నమెదు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు తీసుకుంటున్నామని పోలీసులు తెలిపారు. సురేష్పై గతంలో ఫిర్యాదులు సురేష్పై గతంలోనూ మాచవరం పోలీస్స్టేషన్లో పలు కేసులు నమోదయ్యాయని స్థానికులు తెలిపారు. అధికార పార్టీ నేతల అందదండలతో స్థానికంగా ఉండే చిరు వ్యాపారుల నుంచి రూ.20, రోజువారీ కూలీల వద్ద రూ.30 కూడా మామూళ్లు వసూలు చేసేవాడని పలువురు వివరించారు. కేసును నీరుగార్చే ప్రయత్నం బాధితుడు బుల్లబ్బాయి ఫిర్యాదుపై పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, నిందితులు అధికార పార్టీకి చెందిన కార్పొరేటర్ భర్తకు అనుచరులని, స్థానిక టీడీపీ నేతలు జోక్యం చేసుకుని నిందితులను ఇంతవరకు అరెస్ట్ చేయలేదని సీపీఐ నగర కార్యదర్శి దోనేపూడి శంకర్ ఆధ్వర్యంలో పలువురు నాయకులు, కార్యకర్తలు సోమవారం మాచవరం పోలీస్స్టేషన్ వద్ద నిరసన తెలిపారు. దాడి చేసిన నేపథ్యంపై సీసీ టీవీ ఫుటేజ్ సాక్ష్యంగా ఉన్నా నిందితులను ఇంతవరకు అరెస్ట్ చేయకపోవటం దారుణంగా ఉందని పేర్కొన్నారు. నిందితులను వెంటనే అరెస్ట్ చేయకుంటే ఉద్యమిస్తామని తెలిపారు. నిందితులపై రౌడీషీట్ తెరుస్తాం నిందితుల కోసం గాలింపు చర్యలు ఉధృతం చేశాం. త్వరలోనే వారిని అరెస్ట్ చేస్తాం. నిందితుల కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. నిందితుల్లో మొదటి ముద్దాయిపై గతంలో కూడా పలు కేసులు ఉన్నాయి. వీటిని పరిశీలించి ప్రధాన నిందితులైన సురేష్, గోపయ్యలపై రౌడీషీట్ తెరుస్తాం. - ఉమామహేశ్వరరావు, సీఐ -
బెజవాడలో రౌడీమూకల అలజడి
రూ.200 మామూలు కోసం కూలీపై మూకుమ్మడి దాడి గుణదలలో ఈ నెల 6న ఘటన పరారీలో నిందితులు రాజకీయ నేతల అండతో చెలరేగుతున్న రౌడీలు పనిచేయని పోలీసు కౌన్సెలింగ్లు విజయవాడ : బెజవాడలో రౌడీల అలజడి మళ్లీ మొదలైంది. నిన్నమొన్నటి వరకు రాజకీయ పార్టీల ముసుగులో ఉండి దందాలు సాగిస్తున్న నేతలు బహిరంగంగా దందాలకు పాల్పడుతున్నారు. ఒకప్పుడు రాష్ట్రంలోనే రౌడీయిజానికి పేరుగాంచిన బెజవాడ ఇప్పుడు రాష్ట్ర రాజధానిగా మారింది. ఇలాంటి తరుణంలో మళ్లీ చాపకింద నీరులా నేర సంస్కృతితో రౌడీల ఆగడాలు మొదలవటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. చిన్నపాటి విషయమై ఒక వ్యక్తిని నలుగురు కలిసి కర్రలతో దాడిచేసి తీవ్రంగా గాయపర్చిన ఘటన నగరంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రౌడీమామూలు రూ.200 ఇవ్వలేదనే ఏకైక కారణంతో ఈ దాడి చేయటం గమనార్హం. ఈ ఘటన పోలీసుల్లోనూ కలకలం సృష్టించింది. రాజకీయ పార్టీల ముసుగులో దందాలు నగరంలో అనేక ప్రాంతాల్లో రాజకీయ పార్టీల ముసుగులో రౌడీలు దందాలు సాగిస్తున్నారు. రియల్ ఎస్టేట్ లావాదేవీలు, వివాదాలు, పేకాట నుంచి కాల్మనీ వరకు అన్నింటిలో రౌడీల పాత్ర సుస్పష్టం. ఏదైనా ఘటన జరిగిన వెంటనే హడావుడిగా కేసులు నమోదు చేసి రౌడీషీట్ తెరిచి దాని విషయం మళళ్లీ పోలీసులు మరిచిపోతున్నారు. ఈ క్రమంలో కేసులు నమోదు కాని ఘటనలు అనేకం. కొన్నేళ్ల కిత్రం రౌడీ కార్యకలాపాలపై పోలీసులు ఉక్కుపాదం మోపటంతో వైట్ కాలర్ నేరాలు పెరిగాయి. అయితే వైట్ కాలర్ నేరాల్లోనూ రౌడీల పాత్ర ఉంటోంది. తగ్గిన పోలీసు నిఘా... గతంలో రౌడీషీటర్లపై ఉక్కుపాదం మోపిన కమిషనరేట్ పోలీసులు రౌడీల కార్యకలాపాలపై ప్రస్తుతం దృష్టి పూర్తిగా తగ్గిం చారు. ముఖ్యంగా రాజధాని నేపథ్యంలో పోలీసులకు పెరిగిన తీవ్ర పని ఒత్తిడితో ప్రతీ వారం స్టేషన్లలో కౌన్సెలింగ్ కార్యక్రమాలు, రౌడీషీటర్లపై ఏఎన్ఎస్ (యాంటీ గూండా స్క్వాడ్) నిఘా లాంటివి తగ్గిపోయాయి. దీంతో ప్రశాంతంగా ఉన్న నగర వాతావరణంలో మళ్లీ రౌడీల అలజడి కనిపిస్తోంది. విజయవాడ కమిషనరేట్ పరిధిలో సుమారు 400 మంది వరకు రౌడీషీటర్లు ఉన్నారు. వారిలో 40 శాతం మంది రౌడీ కార్యకలాపాలకు దూరంగా ఉండగా మిగిలినవారు రాజ కీయ పార్టీల ముసుగులో దందాలు సాగి స్తూనే ఉన్నారు. ఇంకా ఖల్నాయక్, నెల టూరి శివ, మట్టపల్లి దుర్గా శివప్రసాద్ నగర బహిష్కరణలో ఉన్నారు. ఈ క్రమంలో రౌడీషీటర్ల కార్యకలాపాలు, దందాలపై ఆయా స్టేషన్ల పరిధిలోని సీఐలు నిఘా ఉంచాలి. ఏఎన్ఎస్ పోలీసులు రౌడీల ఆగడాలు, బెది రింపుల గురించి సమాచారం తెలిస్తే ముందస్తుగా బైండోవర్ కేసులు నమోదు చేయాలి. కానీ నగరంలో ఇవేమీ జరగటం లేదు. దీంతో ఈ నెల ఆరో తేదీన గుణదల ప్రాం తంలో రౌడీమూకలు ఒక వ్యక్తిపై దాడి చేశాయి. -
బోరబండలో రెచ్చిపోయిన రౌడీలు
హైదరాబాద్: బోరబండలో రౌడీలు రెచ్చిపోయారు. మద్యానికి డబ్బులివ్వలేదన్న కారణంతో ఓ యువకుడిని చిదకబాదారు. అవమానం తట్టుకోలేక బాధితుడు ఆత్మాయత్నం చేశాడు. ఒంటిపై కిరోసిన్ పోసుకుని ప్రాణాలు తీసుకునేందుకు ప్రయత్నించాడు. తీవ్రగాయాలపాలైన అతడిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అతడు ప్రాణాలు వదిలాడు. బాధితుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. యువకుడి మరణానికి కారకులైన రౌడీలపై కఠిన చర్యలు తీసుకోవాలని మృతుడి కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. -
బెజవాడలో రౌడీల హల్చల్.. హోటల్పై దాడి
-
బెజవాడలో రౌడీల హల్చల్.. హోటల్పై దాడి
విజయవాడ: నగరంలోని వన్టౌన్ పంజా సెంటర్లో రౌడీలు హల్చల్ సృష్టించిన ఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. గతరాత్రి ఓ హోటల్లో పనిచేస్తున్న సిబ్బందిపై రౌడీలు కర్రలతో దాడిచేశారు. ఈ దాడిలో హోటల్లో పనిచేస్తున్న ఈశ్వర్ అనే వ్యక్తికి గాయాలయ్యాయి. దాంతో బాధితులు వన్టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. గాయపడిన ఈశ్వర్ని చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.