రోడ్డు ప్రమాదంలో అన్నచెల్లెలు మృతి | brother, sister killed in a Road accident | Sakshi

రోడ్డు ప్రమాదంలో అన్నచెల్లెలు మృతి

May 26 2016 9:00 AM | Updated on Aug 30 2018 4:07 PM

పరీక్ష రాయటానికి వెళ్తున్న ఓ యువతి, ఆమె సోదరుడు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.

పరీక్ష రాయటానికి వెళ్తున్న ఓ యువతి, ఆమె సోదరుడు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. తర్లుపాడు మండలంలోని భూపతిపల్లికి చెందిన పులికూరి మరియన్న కుమార్తె ప్రశాంతి(18) గురువారం ఉదయం జరుగనున్న ఇంటర్ సప్లిమెంటరీ పరీక్ష రాయటానికి బయలుదేరింది. ఈ పరీక్షకు తండ్రితో పాటు ప్రశాంతి, సోదరుడు కిశోర్(20) కూడా బయలుదేరాడు.

ముగ్గురూ టూవీలర్‌పై పరీక్ష కేంద్రమైన కంభం పట్టణంలోని సీఎల్‌ఆర్ కళాశాల వద్దకు చేరుకున్నారు. పరీక్ష కేంద్రం ఎదురుగా మరియన్న వాహనం దిగిపోగా అన్నాచెల్లెలు లోపలికి వెళ్లేందుకు యూ టర్న్ తీసుకుంటున్నారు. అదే సమయంలో వేగంగా వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో వారిద్దరూ అక్కడికక్కడే చనిపోయారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement