kishore
-
KSR Live Show: రాహుల్ గాంధీపై కేసు తప్పదా?.. బీజేపీ నేత కిశోర్ కామెంట్స్
-
KSR Live Show: కూల్చడం కాదు.. ప్రత్యామ్నాయం చూపించాలి
-
అంబేడ్కర్ విగ్రహంపై దాడా?
సాక్షి, న్యూఢిల్లీ: రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ విగ్రహంపై దాడి జరిగిందన్న విషయం తెలుసుకొని జాతీయ ఎస్సీ కమిషన్ ౖచైర్మన్ కిషోర్ మక్వానా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ‘అసలా ఆలోచన ఎలా వచ్చింది? ఎందుకు వచ్చి0ది?’ అని పూర్తి వివరాలు ఆరా తీశారు. ఈ ఘటనకు సంబంధించి వినతిపత్రం ఇవ్వడానికి వచ్చిన వైఎస్సార్సీపీ బృందంతో ఆయన సుదీర్ఘంగా మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ దుండగుల్ని విడిచి పెట్టేది లేదని స్పష్టం చేశారు. ‘అంబేడ్కర్ విగ్రహం జాతీయ సంపద. దానిపై ఎవరూ దాడి చేయకూడదు. అమానుషంగా ప్రవర్తించకూడదు. ఈ ఘటనపై చర్యలు తీసుకుంటాం’ అని చెప్పారు. త్వరలోనే ఏపీకి కమిషన్ నుంచి బృందాన్ని పంపి పూర్వాపరాలు పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి నివేదిక తెప్పించుకుంటామని తెలిపారు. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా బాధ్యులపై కఠినంగా చర్యలు తీసుకుంటామని వైఎస్సార్సీపీ బృందానికి హామీ ఇచ్చారు. విజయవాడ నడి»ొడ్డున వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన అంబేడ్కర్ విగ్రహంపై ఆగస్టు 8న దాడి జరిగిన విషయం విదితమే. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో వైఎస్సార్సీపీ ఎంపీ గురుమూర్తి నేతృత్వంలో మాజీ మంత్రులు ఆదిమూలపు సురే‹Ù, మేరుగ నాగార్జున, నందిగం సురేశ్, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్కుమార్, మాజీ ఎమ్మెల్యే అనిల్కుమార్లతో కూడిన బృందం బుధవారం ఎస్సీ కమిషన్ చైర్మన్తో భేటీ అయింది. ‘అంబేడ్కర్ విగ్రహానికి కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలి. పోలీసుల నిర్లక్ష్యంపై విచారణ జరిపించాలి. త్వరగా దుండగుల్ని పట్టుకొని భవిష్యత్తులో ఇలా జరగకుండా చూడాలి’ అనే మూడు డిమాండ్లతో వినతిపత్రం అందజేసింది. -
అధికార మదం.. ఆర్యవైశ్యులపై ప్రతాపం డబ్బులివ్వలేదని మూసేశారు
తిరుపతి రూరల్: టీడీపీ కూటమి నేతల దృష్టి ఆర్యవైశ్యుల వ్యాపారాలపై పడింది. కష్టనష్టాలకోర్చి వ్యాపారాల ద్వారా ప్రభుత్వానికి పన్నుల ద్వారా ఆదాయాని్నవ్వడమే కాకుండా, పది మందికి ఉపాధి చూపిస్తున్న ఆర్యవైశ్యులను టీడీపీ నేతలు బెదిరింపులకు గురిచేస్తున్నారు. పెద్ద ఎత్తున డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. అడిగినంత ఇవ్వకుంటే అధికారులతో వ్యాపారాలను సీజ్ చేయిస్తున్నారు. వ్యాపారులతో పాటు వందలాది కార్మికుల జీవితాలను రోడ్డు పాలు చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా జిల్లావ్యాప్తంగా పలువురు వ్యాపారులను బెదిరించి, డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.తాజాగా చంద్రగిరి నియోజకవర్గం కుంట్రపాకంలో ఆర్యవైశ్యుల సంఘం నాయకుడు కిషోర్కు చెందిన ఎల్.వి.ఎం రైస్ మిల్లును మూసివేయించారు. గత 19 సంవత్సరాలుగా నిర్వహిస్తున్న ఈ మిల్లులో 200 మంది కార్మికులు పనిచేస్తున్నారు. తిరుపతి రూరల్, రామచంద్రాపురం మండలాల నుంచి ఎంతో మంది రైతులు ధాన్యాన్ని ఈ మిల్లులో బియ్యం చేసుకుని వెళుతుంటారు. ఇటు కార్మికులకు, అటు అన్నదాతలకు బాసటగా నిలిచిన ఈ రైస్ మిల్లుపై చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని కన్ను పడింది.తన బంధువులు, తిరుపతి రూరల్ మండలానికి చెందిన టీడీపీ నేతలు అమిలినేని మధు, చెరుకూరి మధు, శ్రీధర్ నాయుడును రైస్ మిల్లు యజమాని కిషోర్ వద్దకు పంపినట్లు సమాచారం. వారు ముగ్గురూ కిషోర్ దగ్గరకు వెళ్లి పెద్ద మొత్తంలో డబ్బు డిమాండ్ చేసినట్లు తెలిసింది. అంత ఇవ్వలేనని, కొంత ఇస్తానని చెప్పినప్పటికీ వారు అంగీకరించలేదని సమాచారం. దీంతో ఎమ్మెల్యే పులివర్తి నాని వెంటనే అధికారులను రంగంలోకి దించి, అన్ని రకాల అనుమతులతో నడుస్తున్న రైస్ మిల్లుకు బుధవారం అకస్మాత్తుగా విద్యుత్తు సరఫరా నిలిపివేయించి, సీజ్ చేయించినట్లు వ్యాపారవర్గాలు చెబుతున్నాయి.దీంతో రైసు మిల్లు మూతపడింది. 200 మంది కార్మికుల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. మిల్లు యజమాని కిషోర్ రెండుసార్లు ఎమ్మెల్యే పులివర్తి నాని వద్దకు వెళ్లి వేడుకోగా, ఆయన తీవ్రంగా దుర్భాషలాడినట్లు తెలిసింది. తాను లోకేశ్కు అత్యంత సన్నిహితుడినని, తన మాట వినకుంటే జిల్లాలో ఎక్కడా నిన్ను వ్యాపారం చేయనీయను అంటూ కిషోర్ను భయపెట్టినట్లు సమాచారం. దీంతో కిషోర్ కంట నీరు పెట్టుకొని బయటకు వచ్చినట్లు వ్యాపారవర్గాలు తెలిపాయి.వ్యాపారుల ఆగ్రహంవ్యాపారుల్లో ఎవరికి కష్టం వచ్చినా అండగా నిలబడే ఆర్యవైశ్యుల సంక్షేమ సంఘం నాయకుడు, చాంబర్ ఆఫ్ కామర్స్లో ఎగ్జిక్యూటివ్ మెంబర్, తిరుపతి రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అయిన కిషోర్నే వేధించి, ఆయన మిల్లును మూసివేయించడంపై వ్యాపారవర్గాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అధికార పార్టీ దౌర్జన్యాలను అడ్డుకొనేందుకు వ్యాపారులంతా సంఘటితమవుతున్నారు.తమ నేత కిషోర్కు న్యాయం జరిగేంత వరకు బాసటగా నిలుస్తామని చెబుతున్నారు. వ్యాపార సంస్థలను మూసివేయిస్తే ఎంత మంది జీవితాలు రోడ్డున పడతాయన్నది ఆలోచించని ఎమ్మెల్యే పులివర్తి నాని, ఆయన బంధువుల తీరును ప్రజలకు వివరించడంతో పాటు ముఖ్యమంత్రి, మంత్రుల దృష్టికి తీసుకెళ్లేందుకై వారు నిర్ణయించినట్లు సమాచారం.అధికారుల అత్యుత్సాహంఅధికార పార్టీ ఎమ్మెల్యే, ఆయన బంధువుల ఒత్తిడితో ఎల్.వి.ఎం రైస్ మిల్లును మూసివేయించడంలో అధికారులు అత్యుత్సాహం చూపించారు. సాధారణంగా ఏ వ్యాపార సంస్థనైనా సీజ్ చేయాల్సి వస్తే ముందుగా నోటీసు ఇచ్చి, మూడు నెలలు సమయం ఇవ్వాలి. నోటీసుకు యజమాని నుంచి వచ్చే సమాధానంతో పాటు మరికొన్ని నియమాలు పాటించాలి. ఈ నిబంధనలేమీ పాటించకుండానే విద్యుత్తు సరఫరా నిలిపివేసి, మిల్లును సీజ్ చేసేశారు. అందులో పనిచేసే కార్మికుల జీవనోపాధికి ప్రత్యామ్నాయం చూపించాలి్సన కనీస బాధ్యతను కూడా విస్మరించడం విమర్శలకు తావిస్తోంది. -
బెదిరించి, కవ్వించి.. వైఎస్సార్సీపీ కుటుంబంపై టీడీపీ దాడి
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: టీడీపీలో చేరతారా లేక కుల, గ్రామ బహిష్కరణ చేయమంటారా అని బెదిరించినా, భయపెట్టినా లొంగలేదని ఒక కుటుంబంపై టీడీపీ వర్గీయులు దాడిచేసి ఐదుగురిని గాయపరిచారు. ప్రకాశం జిల్లా కొండపి మండలం మిట్టపాలెం ఎస్సీ కాలనీలో గురువారం రాత్రి టీడీపీ వర్గీయులు ఈ దారుణానికి దిగారు. బాధితుల కథనం ప్రకారం వైజాగ్లో ఉద్యోగం చేసుకునే ఈ కాలనీ వాసి గడ్డం కిషోర్ ఇటీవల ఇంటికి వచ్చాడు. వీరి కుటుంబాన్ని టీడీపీలో చేరాలని అదే కాలనీకి చెందిన టీడీపీ నాయకుడు ఐనంపూడి రమేష్ 2019 నుంచి డిమాండ్ చేస్తున్నాడు. ఆయన భయపెట్టినా, బెదిరించినా కిషోర్ కుటుంబం వైఎస్సార్సీపీలోనే కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి 10.30 గంటల సమయంలో కిషోర్ తన ఇంటి గేటు వద్ద ఉండగా ఆ కాలనీకి చెందిన గడ్డం మధు అనే యువకుడు సిమెంటు రాయి తెచ్చి కిషోర్ ఇంటి తడికపైకి విసిరాడు. రాయి ఎందుకు విసిరావంటూ కిషోర్ కేకలు వేశాడు. తరువాత 11.40 గంటలకు టీడీపీ నాయకుడు ఐనంపూడి రమేష్ సుమారు 15 మందిని తీసుకొచ్చి కేకలు వేశాడు. బయటకు వచ్చిన కిషోర్ కుటుంబసభ్యులపై దాడిచేశారు. కిషోర్ భార్య హెమీమాను జుట్టు పట్టుకుని లాగటంతోపాటు ఆమె చేతివేలిని గడ్డం వెంకటేశ్వర్లు అనే వ్యక్తి కొరికి గాయపరిచాడు. కిషోర్ అక్క దాసరి ఎస్తేరమ్మ, తల్లి గడ్డం కొండమ్మ, బావ నాగరాజుపైన దాడిచేసి గాయపరిచారు. కిషోర్ను మురుగు కాలువలో పడేసి పొడవాటి వస్తువుతో కొట్టి గాయపరిచారు. ఆ ప్రాంతంలో వీధిలైట్లను కూడా ఆపేసి ఈ దాడికి దిగారు. ఈ దాడిని చిత్రీకరించేందుకు ప్రయత్నించిన కిషోర్ మేనకోడలు దాసరి ప్రవల్లిక సెల్ఫోన్ లాక్కుని ధ్వంసం చేశారు. బాధితులకు కొండపి ఏరియా ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం ఒంగోలు జీజీహెచ్కి తరలించారు. ఐనంపూడి రమేష్, గడ్డం వెంకటేశ్వర్లు, లక్కిపోగు సుధాకర్, ఐనంపూడి భాస్కర్, గడ్డం మధు, గడ్డం మరియమ్మ, గడ్డం నిర్మల, గడ్డం ఆకాష్, మరికొందరు తమపై దాడిచేసినట్లు కిషోర్ చెప్పారు. ఇరువర్గాలకు గాయాలయ్యాయని, రెండువర్గాలపై కేసులు నమోదు చేస్తామని ఎస్.ఐ. కృష్ణబాజిబాబు చెప్పారు. దాడికి గురైనవారి మీద కూడా కేసు పెడతామని ఎస్.ఐ. పోలీసులు చెప్పడంతో వైఎస్సార్సీపీ వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు పక్షపాత«ంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. -
1,300 కిలోల పేలుడు పదార్థాల పట్టివేత
మహబూబాబాద్ రూరల్ : పోలీసులు 1300 కిలోల పేలుడు పదార్థాలను పట్టుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరిని అరెస్ట్ చేయగా, మరొకరు పరారయ్యారు. బుధవారం మహబూబాబాద్ టౌన్ పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ రాంనాథ్ కేకన్ ఈ కేసు వివరాలు వెల్లడించారు. మరిపెడ ఎస్సై తాహేర్ బాబా ఆధ్వర్యంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. వీరారం క్రాస్రోడ్డు వద్ద పోలీసులను గమనించిన బొలెరో వాహన డ్రైవర్ పారిపోయేందుకు ప్రయత్నించాడు. దీంతో అనుమానం వచ్చి వెంటనే వాహనం ఆపి తనిఖీ చేయ గా, అందులో బాక్సులు కనిపించాయి. అందులో పేలుడు పదార్థాలకు సంబంధించిన జిలెటిన్ స్టిక్స్, ఎలక్ట్రానిక్ డిటోనేటర్లు లభించాయి. జగిత్యాల జిల్లా వెలగటూరు మండలం జయదేవపేట గ్రామానికి చెందిన కస్తూరి కుమార్, మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం దంటకుంట తండాకు చెందిన బాదావత్ కిశోర్లను అదుపులోకి తీసుకున్నారు. కుమార్కు వెంకటరమణ ఎంటర్ ప్రైజెస్ పేరు మీద లైసెన్స్ ఉంది. ఆ లైసెన్స్ ప్రకారం కేవలం నిర్ణీత పరిధిలో మాత్రమే పేలుడు పదార్థాలను అమ్ముకోవాలి. కానీ తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో అక్రమంగా పేలుడు పదార్థాలను అనుమతి లేని వారికి అమ్ముతూ పట్టుబడ్డారు. కాగా, ఈ ఘటనలో జగిత్యాల జిల్లా వెలగటూరు మండలం జయదేవపేట కస్తూరి సారయ్య పరారీలో ఉన్నాడని ఎస్పీ తెలిపారు. ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ జోగుల చెన్నయ్య, తొర్రూరు డీఎస్పీ సురేష్, మరిపెడ సీఐ హతీరాం, ఎస్సై తాహేర్ బాబా, పోలీసు సిబ్బంది క్రాంతికుమార్, వెంకన్న పాల్గొన్నారు. -
1 నుంచి సీఈవో క్లబ్స్ ఇండియా సదస్సు
న్యూఢిల్లీ: సీఈవో క్లబ్స్ ఇండియా తమ వార్షిక సదస్సును మార్చి 1 నుంచి 3 వరకు న్యూఢిల్లీలో నిర్వహించనుంది. ఇందులో 150 పైచిలుకు కంపెనీల చీఫ్ ఎగ్జిక్యూటివ్లు పాల్గోనున్నారు. మెడ్ప్లస్ హెల్త్ సరీ్వసెస్ వ్యవస్థాపకుడు మధుకర్ గంగాడి, స్టార్ హాస్పిటల్స్ ఎండీ గోపీచంద్ మన్నం, నాంగియా ఆండర్సన్ ఇండియా చైర్మన్ రాకేష్ నాంగియా తదితరులు వీరిలో ఉంటారని సీఈవో క్లబ్స్ ఇండియా జాతీయ అధ్యక్షుడు కిశోర్ కొత్తపల్లి తెలిపారు. కొత్త సవాళ్లు, అవకాశాలు, కలిసి పనిచేసేందుకు ఆస్కారమున్న అంశాలు మొదలైన వాటి గురించి చర్చించేందుకు, వివిధ రంగాల సీఈవోలు, ఎంట్రప్రెన్యూర్లు, ఆవిష్కర్తలు, లీడర్లు మొదలైన వారితో కనెక్ట్ అయ్యేందుకు ఇది ఉపయోగపడగలదని పేర్కొన్నారు. 1977లో అమెరికాలో నెలకొలి్పన సీఈవో క్లబ్స్ ఇంటర్నేషనల్ కింద 2008లో హైదరాబాద్లో సీఈవో క్లబ్స్ ఇండియా ఏర్పడింది. -
ఐఆర్సీటీసీ ఆధ్వర్యంలో ‘సప్త జ్యోతిర్లింగ దర్శన్’
రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): ఐఆర్సీటీసీ ఆధ్వర్యంలో ఈ నెల 18న సప్త జ్యోతిర్లింగ దర్శన యాత్ర ప్రత్యేక పర్యాటక రైలు నడపనున్నారు. ఈ విషయాన్ని ఐఆర్సీటీసీ జేజీఎం డీఎస్జీపీ కిశోర్ మంగళవారం విజయవాడ రైల్వేస్టేషన్లోని ఐఆర్సీటీసీ కార్యాలయంలో విలేకరులకు చెప్పారు. ఈ యాత్రతో పాటు స్టాట్యూ ఆఫ్ యూనిటీ పేరుతో ఏపీ, తెలంగాణలోని యాత్రికుల కోసం ప్రత్యేక రైలు నడపనున్నట్లు తెలిపారు. విజయవాడ నుంచి బయలుదేరే ఈ రైలుకు ఖమ్మం, కాజీపేట, సికింద్రాబాద్, నిజామాబాద్, నాందేడ్, పూర్ణ స్టేషన్ల్లో ఆగనుంది. 12 రాత్రులు, 13 పగళ్లు సాగే ఈ యాత్రలో ఉజ్జయిని, మహాకాళేశ్వర దేవాలయం, ఓంకారేశ్వర జ్యోతిర్లింగ దర్శనం, స్టాట్యూ ఆఫ్ యూనిటీ, ద్వారకాదిస్ దేవాలయం, నాగేశ్వర్ జ్యోతిర్లింగం, సోమనాథ్ జ్యోతిర్లింగం, త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగం, నాసిక్, భీమశంకర్ జ్యోతిర్లింగం దర్శనం, గ్రిషినేశ్వర్ జ్యోతిర్లింగ దర్శనం తదితర పూణ్యక్షేత్రలు, పర్యాటక, చారిత్రక ప్రదేశాలను దర్శించుకోవచ్చు. యాత్రలో ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజన సదుపాయం, పర్యాటక ప్రదేశాలను దర్శించుకునేందుకు రోడ్డు మార్గంలో రవాణా సదుపాయం, రాత్రుళ్లు బస ఏర్పాట్లు ఉంటాయి. 3 కేటగిరీల్లో ఉండే ఈ ప్యాకేజీలో ఒక్కొక్కరికి ఎకానమీ (స్లీపర్ క్లాస్) రూ. 21,000, స్టాండర్డ్ (3 ఏసీ) రూ.32,500, కంఫర్ట్ (2 ఏసీ) రూ. 42,500 ధరగా నిర్ణయించారు. ఆసక్తి ఉన్న వారు ఐఆర్సీటీసీ వెబ్సైట్ లేదా విజయవాడ కార్యాలయం 8287932312, 9281495848 నంబర్లకు సంప్రదించాలి. -
యూత్ఫుల్ ప్రేమకథ
కిశోర్ కేఎస్డీ, దియా సితెపల్లి జంటగా నటిస్తున్న చిత్రం ‘ప్రేమకథ’. టాంగాప్రోడక్షన్స్ ఎల్ఎల్పీ, సినీ వ్యాలీ మూవీస్ పతాకాలపై విజయ్ మట్టపల్లి, సుశీల్ వాజపిల్లి, శింగనమల కల్యాణ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ను దర్శకుడు హరీష్ శంకర్ విడుదల చేసి, లుక్ బాగుందని, ఈ సినిమా విజయం సాధించాలని చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ‘‘వైవిధ్యమైన లవ్స్టోరీతో నేటితరం యువ ప్రేక్షకులకు నచ్చేలా ఈ చిత్రం ఉంటుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: రథన్ , సహనిర్మాత: ఉపేంద్ర గౌడ్ ఎర్ర. -
ఏకే ఫ్లవర్ కాదు ఫైర్ బోల్ట్!
అర్నవ్ కిశోర్కు ఆటలు అంటే ప్రాణం. స్పోర్ట్స్మెన్, ఫిట్నెస్ ప్రేమికులకు ఉపయోగపడే గాడ్జెట్లను సృష్టించాలనేది తన భవిష్యత్ లక్ష్యంగా ఉండేది. వేరబుల్ టెక్ కంపెనీ ‘ఫైర్–బోల్ట్’తో తన కలను నిజం చేసుకున్నాడు కిశోర్. స్మార్ట్ వేరబుల్ మార్కెట్ను తగిన అధ్యయనం చేసిన తరువాత మార్కెట్ వ్యూహాలు రచించుకున్నాడు. అప్పటికే చైనాలోని దిగ్గజ టెక్ కంపెనీలు మన మార్కెట్లోకి వచ్చాయి. వాటితో పోటీ పడడం అంత సులభం ఏమీ కాదు. మంచి టైమ్ రావాలంటే ఆ టైమ్ ఎప్పుడు వస్తుందో ఓపిగ్గా ఎదురుచూడాలి. అర్నవ్ కిశోర్ అదే చేశాడు. సరిౖయెన సమయం చూసి మార్కెట్లోకి దిగి విజయం సాధించాడు. తొలి సంవత్సరం....‘మన టైమ్ వచ్చేసింది’ అనుకున్నాడు. రెండో సంవత్సరం....‘ఈ ఫైర్ ఇలాగే కొనసాగాలి’ అనుకున్నాడు. గత సంవత్సరం ఫైర్–బోల్ట్ నాయిస్ మన దేశంలోనే అతి పెద్ద స్మార్ట్వాచ్ బ్రాండ్గా అవతరించింది. ఆన్లైన్లోనే కాదు ఆఫ్లైన్ లోనూ సరసమైన ధరల్లో అందుబాటులో ఉండేలా చేయడమే కాదు, ఇన్నోవెటివ్, మార్కెట్–ఫస్ట్ ఫీచర్స్ కూడా కంపెనీ ఉత్పత్తులు విజయం సాధించడానికి ప్రధాన కారణం. కంపెనీ ప్రాడక్ట్ లైన్లోనికి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్(ఐవోటి) డివైజ్లు, వైర్లెస్ ఇయర్ ఫోన్లు...మొదలైనవి వచ్చి చేరాయి. ఇండియన్ మార్కెట్లో విజయం సాధించిన అర్నవ్ అంతర్జాతీయ స్థాయిలో విజయం సాధించాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాడు. వ్యాపారవేత్త అయిన తండ్రి నుంచి కిశోర్ నేర్చుకున్న పాఠం... ‘నిరాశతో ప్రయాణాన్ని ఆపవద్దు. పరుగెత్తక పోయినా సరే, నడిస్తే చాలు. ప్రయాణంలోనే ఎన్నో విషయాలను నేర్చుకుంటాం. మంచి,చెడులను తెలుసుకుంటాం’. నిజానికి ప్రయాణ ప్రారంభంలోనే అర్నవ్ కిశోర్కి కోవిడ్ హాయ్ చెప్పి భయపెట్టింది. సంక్షోభ సమయంలో వ్యాపారవేత్త డీలా పడకూడదు. కిశోర్ ఆ సమయంలోనూ అధైర్య పడలేదు. వెనకడుగు వేయలేదు. ‘ట్రెండ్స్ ఆఫ్ బ్యాండ్’ ఏమిటి? ‘పాపులారిటీ కోల్పోయిన బ్యాండ్స్ ఏమిటి?’ అనే అంశంపై అవగాహన ఉన్న కిశోర్ 2021లో కొత్త స్ట్రాటజీతో ముందుకు వచ్చాడు. టెంప్టింగ్ ట్యాగ్తో నింజా సిరీస్ స్మార్ట్ వాచ్లను తీసుకువచ్చి విజయం సాధించాడు. ‘రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్(ఆర్ అండ్ డీ), డిజైన్ మార్కెట్లో మాకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని కలిగించాయి’ అంటాడు కిశోర్. యంగ్ ఎంటర్ప్రెన్యూర్గా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డ్లు అందుకున్నాడు అర్నవ్ కిశోర్. సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్గా అర్నవ్ కిశోర్ ఇప్పుడు చేయాల్సింది....ఎప్పటిలాగే ఆట తెలివిగా ఆడటం. అతి ఆత్మవిశ్వాసం ఉంటే ఆట తారు మారు అవుతుంది. ఇలాంటి విషయాలు అర్నవ్ కిశోర్కు తెలియనివేమీ కాదు. ఎందుకంటే ఈ యువ వ్యాపారవేత్త తండ్రి నుంచి ఎన్నో విలువైన పాఠాలు నేర్చుకున్నాడు. టెక్నాలజీ, ఫిట్నెస్, ఎంటర్ప్రెన్యూర్షిప్, స్పోర్ట్స్...అనేవి అర్నవ్ కిశోర్(ఏకే) కలల ప్రపంచం. వాటిని మిళితం చేసి ‘ఫైర్–బోల్ట్’ స్టార్టప్ సృష్టించాడు. ఇది మన దేశంలోనే అతి పెద్ద వేరబుల్ టెక్ బ్రాండ్గా అవతరించింది. అంతర్జాతీయ స్థాయిలో దూసుకుపోతుంది. ‘మంచి టైమ్ సెట్ చేసుకోవడం మన చేతుల్లోనే ఉంది’ అంటాడు ఏకే... (చదవండి: బీర్ వ్యర్థాలతో..బిస్కెట్లు, చిక్కిలు, లడ్డులా..) -
ప్రొద్దుటూరులో దారుణం.. ఒకరు మృతి
-
మాజీ మంత్రి నవ కిషోర్ దాస్ హత్యలో కీలక పరిణామం
భువనేశ్వర్: మాజీ మంత్రి నవ కిషోర్ దాస్ హత్యలో కీలక పరిణామం శుక్రవారం చోటుచేసుకుంది. దాదాపు నాలుగు నెలల తర్వాత ఒడిశా క్రైమ్ బ్రాంచ్ 540 పేజీలకు పైగా చార్జ్షీట్ దాఖలు చేసింది. ఈ విషాద ఘటనలో ప్రధాన నిందితుడు గోపాల్ కృష్ణ దాస్ (53) వ్యతిరేకంగా ఆయుధాల చట్టం ప్రకారం 307, 302, 27 (1) సెక్షన్లు కింద అభియోగాలు నమోదు చేశారు. పాత వైరం కారణంగా నిందితుడు దారుణ హత్యకు పాల్పడినట్లు విచారణలో ధ్రువీకరించినట్లు చార్జ్షీటులో వెల్లడించారు. జనవరి 29న హత్య ఈ ఏడాది జనవరి 29న మంత్రి అధికారిక కార్యక్రమం పర్యటనలో నడి రోడ్డమీద జన సందోహం మధ్య నిందితుడు తుపాకీ గురిపెట్టి పేల్చడంతో మంత్రి అక్కడిక్కడే కుప్పకూలిపోయిన సంఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలం, శాసీ్త్రయ బృందం పరిశీలన నివేదికల ఆధారంగా నిందిత ఏఎస్ఐ గోపాల కృష్ణ దాస్ని విధుల నుంచి బహిష్కరించారు. మంత్రితో బ్రజ్రాజ్నగర్ ఠాణా ఇన్చార్జి ఇన్స్పెక్టర్ (ఐఐసీ) పి.కె.స్వంయి మరో సిబ్బంది జీవన్ కుమార్ నాయక్ని హత్య చేసేందుకు నిందితుడు విఫలయత్నం చేసినట్లు ఝార్సుగుడ ఎస్డీజేఎం కోర్టులో చార్జ్షీట్ దాఖలు చేసినట్లు క్రైమ్ బ్రాంచ్ మీడియాకు తెలియజేసింది. ముందస్తు ప్రణాళికతోనే... నిందితుడు ఏఎస్ఐ గోపాల్కృష్ణ దాస్ తెలివిగా ముందస్తు ప్రణాళికతో ఈ నేరానికి పాల్పడ్డాడని క్రైం బ్రాంచ్ తెలిపింది. అతని మానసిక పరిస్థితి స్థిరంగా, సాధారణమైనదిగా గుర్తించినట్లు పేర్కొన్నారు. ఎటువంటి మానసిక అనారోగ్య లక్షణాలు దర్యాప్తులో బయటపడనట్లు వివరించింది. సంచలనాత్మక హత్య సంఘటనకు సంబంధించిన అన్ని రకాల సాక్ష్యాలను పరిశీలించి విశ్లేషించింది. ఈ నేపథ్యంలో మౌఖిక, దస్తావేజులు, మెడికో–లీగల్, సైబర్ ఫోరెన్సిక్ మరియు బాలిస్టిక్ నివేదికలను క్రైం శాఖ లోతుగా సమీక్షించింది. ఈ సమీక్షలో నిందితుడు గోపాల్ కృష్ణ దాస్ దివంగత మంత్రి నవ కిషోర్ దాస్ మరియు అతని అనుచరులతో తనకు ప్రాణాపాయం ఉన్నట్లు భావించి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. మంత్రి అనుచర వర్గాలు తరచు ఆయనకు ప్రాణాపాయ హెచ్చరికలు జారీ చేస్తుండడంతో మంత్రిపై వ్యక్తిగత ద్వేషం బలపడి మానసిక వేదనతో మంత్రిని నిలువునా హత్య చేసి తొలగించాలని నిర్ణయించుకున్నట్లు విచారణలో స్పష్టమైంది. అభద్రతా భావంతోనే మంత్రి హత్యకు పాల్పడినట్లు పేర్కొన్నారు. దీనికోసం పక్కాగా ప్రణాళిక సిద్ధం చేసుకుని బెడిసి కొట్టని వ్యూహంతో తుపాకీ గురి పెట్టి ఘటనా స్థలంలో మంత్రిని కుప్పకూల్చినట్లు క్రైం శాఖ తెలిపింది. ఛార్జ్షీట్ దాఖలు చేసినప్పటికీ, కొన్ని నివేదికలు, వివరణలను పొందడం కోసం దర్యాప్తు కొనసాగుతున్నట్లు తెలిపారు. మానసిక రోగి: కుటుంబ సభ్యులు నిందితుడి కుటుంబ సభ్యులు గోపాల్ కృష్ణదాస్ చాలాకాలంగా మానసిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. కొంతకాలంగా బైపోలార్ డిజార్డర్తో బాధపడుతున్నాడని అంటున్నారు. అయితే అనుబంధ చికిత్స కొనసాగుతుందని దర్యాప్తు వర్గాలు విచారణలో పేర్కొన్నాయి. మానసిక ఇబ్బందుల విషయం ధ్రువీకరించేందుకు వైద్య విద్య మరియు శిక్షణ డైరెక్టర్ ఆధ్వర్యంలో ప్రత్యేక వైద్య బోర్డును ఏర్పాటు చేశారు. ఈ బోర్డు అనుబంధ పరీక్షలను నిర్వహించి, నిందితుడిలో మానసిక అనారోగ్యానికి సంబంధించిన లక్షణాలు లేవని స్పష్టం చేసింది. స్థానికులు, సహోద్యోగుల వాంగ్మూలం వైద్య బోర్డు అభిప్రాయానికి చేరువగా ఉన్నట్లు క్రైమ్ శాఖ తెలిపింది. నిందితుడు సాదాసీదాగా కలిసిమెలిసి తిరుగాడే వ్యక్తిగా తోటి వ్యక్తుల వాంగ్మూలం దర్యాప్తు బృందం నమోదు చేసింది. ఇలా పరిసరాల పరిశీలన, అనుబంధ విశ్లేషణలో నిందితుని మానసిక పరిస్థితి చాలా సాధారణంగా ఉందని, ఎటువంటి అసాధారణత లేదని నిర్ధారించారు. విచారణకు నిందితుడు సంతృప్తికరంగా సహకరించారని, అడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానమిచ్చారని క్రైమ్ బ్రాంచ్ అధికారులు తెలిపారు. అధికారిక రివాల్వరే హత్యాస్త్రం విధి నిర్వహణలో ఉండగా పోలీసు ఏఎస్ఐ గోపాల్ కృష్ణ దాస్ హత్యకు పాల్పడ్డాడు. ఈ సందర్భంగా తన దగ్గర ఉన్న అధికారిక రివాల్వర్తో సిటింగు ఆరోగ్య – కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి నవ కిషోర్ దాస్ను జన సందోహం మధ్య కాల్చి నడిరోడ్డు మీద కుప్పకూల్చేశాడు. ఈ హత్య వెనుక కుట్ర ఉందని రాష్ట్రంలోని ప్రతిపక్షాలు నిలువెత్తున ఆరోపించాయి. విచారణ చేపట్టి చార్జిషీట్ దాఖలు చేసిన క్రైమ్ బ్రాంచ్ విచారణలో కుట్ర కోణం జాడ లేనట్లు వెల్లడించింది. 10 బృందాలతో దర్యాప్తు సిటింగ్ మంత్రి హత్య జరిగిన రోజు నుంచే క్రైమ్ బ్రాంచ్, బ్రజరాజ్నగర్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. లోతైన దర్యాప్తు కోసం క్రైమ్ బ్రాంచ్ 10 బృందాలను ఏర్పాటు చేసింది. హత్య వ్యూహం పూర్వాపరాలను ఆరా తీసేందుకు రాష్ట్రంలో ఝార్సుగుడ, భువనేశ్వర్, బరంపురం మరియు పలు ఇతర రాష్ట్రేతర ప్రాంతాలు సందర్శించి దర్యాప్తు బృందాలు పూర్వాపరాలు ఆరా తీశాయి. ఈ నేపథ్యంలో దర్యాప్తు వర్గాలు 89 మంది సాక్షులను ప్రశ్నించారు. తుపాకీలు, లైవ్ కాట్రిడ్జ్లు, ఖాళీ కాట్రిడ్జ్లు ఇతరేతర పలు రుజువుపూరిత ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. ఇదీ జరిగింది ఝార్సుగూడ జిల్లాలో మంత్రి కార్యక్రమం పురస్కరించుకుని నిందిత ఏఎస్ఐ గోపాల్ కృష్ణదాస్ని ట్రాఫిక్ క్లియరెన్స్ డ్యూటీ కోసం నియమించారు. ఈ అవకాశాన్ని వ్యూహాత్మకంగా మలచుకుని తన దగ్గర ఉన్న 9 ఎంఎం సర్వీస్ పిస్టల్ని ఉపయోగించి అతి సమీపం నుంచి మంత్రిపై కాల్పులు జరిపాడు. రక్తపు మడుగులో కూరుకుపోయిన మంత్రిని హెలికాప్టర్లో హుటాహుటిన భువనేశ్వర్కు తరలించారు. అయితే అంతర్గత రక్తస్రావం కారణంగా చికిత్స పొందుతూ మంత్రి తుదిశ్వాస విడిచాడు. నిందితుడు 2013లో ఝార్సుగుడ జిల్లాలో పోలీసు ఉద్యోగం పొందాడు. తన ఉద్యోగ జీవితంలో నిందిత గోపాల కృష్ణ దాస్ శ్రేష్టమైన పనితీరుకు తొమ్మిది రివార్డులు, 18 ప్రశంసా పత్రాలు పొందడం విశేషం. అతని కుటుంబం బరంపురం శివారులోని జలేశ్వరఖండిలో ఉంటుంది. విచారణలో భాగంగా నిందితుడికి మానసిక ఆరోగ్య పరీక్షలు నిర్వహించేందుకు రాష్ట్రేతర (బెంగుళూరు) నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరోసైన్సెస్కు తీసుకెళ్లాలన్న అభ్యర్థనను స్థానిక కోర్టు తిరస్కరించింది. -
పేదలకు ఇళ్లివ్వడంలో ఏపీ నంబర్–1
సాక్షి, అమరావతి: పేదలందరికీ పక్కా ఇళ్లు ఇవ్వడంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే నంబర్–1 స్థానంలో ఉందని కేంద్ర గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి కౌశల్ కిశోర్ చెప్పారు. అర్హులైన వారందరికీ గృహ నిర్మాణం కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అద్భుతమని ప్రశంసించారు. అధికారిక పర్యటనలో భాగంగా విజయవాడకు వచ్చిన మంత్రి కిశోర్ ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే.. అత్యధికంగా ఏపీలోనే పేదల ఇళ్ల నిర్మాణం దేశంలోనే అత్యధికంగా ఏపీలో జరుగుతోంది. కేంద్రం నుంచి ఈ రాష్ట్రానికే అత్యధికంగా ఇళ్ల నిర్మాణ అనుమతులు ఇచ్చాం. ఇంకా అదనంగా అనుమతులు కావాలని కోరారు. వాటినీ అనుమతిస్తాం. అదే విధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తాం. కేంద్రం నుంచి రావాల్సిన నిధులను సకాలంలో మంజూరయ్యేలా చూస్తాం. హౌసింగ్ మిషన్ కింద దేశంలోని ప్రతి పేదవాడికి ఇల్లు సమకూర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆ దిశగా అడుగులు వేస్తున్నాయి. ఇళ్ల పట్టాల పంపిణీ అభినందనీయం ఇళ్ల పథకం అమలులో భాగంగా రాష్ట్రంలో పెద్ద ఎత్తున ప్రభుత్వమే ఇళ్ల పట్టాలు పంపిణీ చేసింది. ఇది ఎంతో అభినందనీయమైన అంశం. ప్రభుత్వాలు కేవలం ఇళ్లు కట్టుకోవడానికి సాయం చేస్తే స్థలం లేని, కొనలేని దుస్థితిలో ఉన్న నిరుపేదలు ఇంటిని నిర్మించుకోలేరు. అయితే, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వమే ఇళ్ల స్థలాలను ఉచితంగా పంపిణీ చేస్తోంది. పేదలందరికీ పక్కా గృహాల కల్పనకు ఇది ఎంతో దోహదపడుతోంది. లోక్సభ ఎన్నికల్లో బీజేపీదే విజయం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తిగా స్థానిక పరిస్థితుల ప్రభావం ఉంటుంది. లోక్సభ ఎన్నికల్లో ప్రజల ఆలోచనా వి«దానం మారుతుంది. 2018 ఎన్నికల్లో మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్తాన్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఇదే రాష్ట్రాల్లో 2019 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ మెజారిటీ సీట్లు గెల్చుకుంది. వచ్చే లోక్సభ ఎన్నికల్లోనూ ప్రజలు ఆత్మనిర్భర్ భారత్కే పట్టం కడతారు. బీజేపీ సొంతంగా 300 సీట్లతో కేంద్రంలో తిరిగి ప్రభుత్వం ఏర్పాటుచేస్తుంది. గృహ నిర్మాణంపై అధికారులతో కేంద్ర మంత్రి సమీక్ష దేశంలోని పేదలందరికీ 2024 సంవత్సరానికి పక్కా ఇళ్లు నిర్మించి ఇవ్వాలన్నది ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆశయమని కేంద్ర మంత్రి కౌశల్ కిశోర్ చెప్పారు. ఆయన మంగళవారం విజయవాడలో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో గృహ నిర్మాణం తీరును వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో మాట్లాడి తెలుసుకున్నారు. అధికార కార్యక్రమాల్లో భాగంగా సమీక్షకు హాజరుకాలేకపోయిన మంత్రి జోగి రమేశ్ తన సందేశాన్ని కేంద్ర మంత్రికి పంపారు. ఇళ్ల నిర్మాణం సకాలంలో పూర్తిచేయటానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ కేంద్ర మంత్రికి వివరించారు. లబ్ధిదారులకు ఇసుక ఉచితంగా ఇస్తున్నామని, సిమెంటు, ఐరన్ ఇతర నిర్మాణ సామగ్రిని మార్కెట్ ధరకంటే తక్కువకు అందిస్తున్నామని తెలిపారు. ఈ సమీక్షలో రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ చైర్మన్ దవులూరి దొరబాబు, ఎండీ లక్షీ షా, నవరత్నాలు ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ నారాయణమూర్తి పాల్గొన్నారు. జగనన్న కాలనీని పరిశీలించిన కేంద్ర మంత్రి ఇబ్రహీంపట్నం: ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని గాజులపేట వద్ద ఉన్న జగనన్న కాలనీని కేంద్ర మంత్రి కౌశల్ కిశోర్ మంగళవారం పరిశీలించారు. లబ్ధిదారులతో నేరుగా మాట్లాడారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ సహకారంతో సొంతింటి కల నెరవేరిందని లబ్ధిదారులు ఆయనకు వివరించారు. -
మామిడి మియాజాకిలో అత్యంత పోషక విలువలు
-
‘సాక్షి’ పాత్రికేయులకు హైబిజ్ పురస్కారాలు
సాక్షి, హైదరాబాద్: ‘సాక్షి డెస్క్ సాగుబడి’ ఇన్చార్జి పంతంగి రాంబాబు, సాక్షి టీవీ న్యూస్ కాస్టర్ కిషోర్ హైబిజ్ టీవీ మీడియా పురస్కారాలను అందుకున్నారు. హైటెక్స్లో బుధవారం జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో హోం మంత్రి మహమూద్ అలీ నుంచి రాంబాబు ఉత్తమ ప్రింట్ అగ్రికల్చరల్ జర్నలిస్ట్ పురస్కారాన్ని అందుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రకృతి వ్యవసాయం, సేంద్రియ ఇంటిపంటలు, సిరిధాన్యాల వ్యాప్తి దిశగా ఆయన ప్రతి మంగళవారం సాక్షి దినపత్రికలో ప్రచురితమయ్యే ‘సాగుబడి’ పేజీని నిర్వహిస్తున్నారు. సాక్షి టీవీ న్యూస్ కాస్టర్ కిషోర్తో పాటు వివిధ పత్రికలు, సోషల్ మీడియా సంస్థలు, శాటిలైట్ చానళ్ల పాత్రికేయులు, ఫొటో, వీడియో జర్నలిస్టులు కూడా పురస్కారాలు అందుకున్నారు. కార్యక్రమంలో ఎంపీ డాక్టర్ రంజిత్ రెడ్డి, సాక్షి మీడియా గ్రూప్ డైరెక్టర్ మార్కెటింగ్ కేఆర్పీ రెడ్డి, ఈవీ నర్సింహారెడ్డి – ఐఏఎస్ (వీసీ–ఎండీ టీఎస్ ఐఐసీ), నరేంద్ర రామ్ నంబుల (సీఎండీ – లైఫ్ స్పాన్ ప్రైవేట్ లిమిటెడ్), పి.చక్రధర రావు (ప్రెసిడెంట్–ఐపీఈఎంఏ, పౌల్ట్రీ ఇండియా), ఎం.రవీందర్ రెడ్డి (డైరెక్టర్ మార్కెటింగ్–భారతి సిమెంట్స్),వి.రాజశేఖర్ రెడ్డి (జనరల్ సెక్రటరీ–క్రెడాయ్), ఎం.రాజ్గోపాల్ (ఎండీ– హై బిజ్ టీవీ, తెలుగు నౌ), డాక్టర్ జె.సంధ్యారాణి (సీఈవో–హై బిజ్ టీవీ, తెలుగు నౌ) తదితరులు పాల్గొన్నారు. -
‘సాక్షి సాగుబడి' రాంబాబు, 'సాక్షి టీవీ' కిషోర్ లకు ఉత్తమ జర్నలిస్టు అవార్డులు
సాక్షి, హైదరాబాద్: ‘సాక్షి సాగుబడి’ ఇన్చార్జ్ పంతంగి రాంబాబు బుధవారం హైటెక్స్లో జరిగిన హైబిజ్ టీవీ మీడియా అవార్డ్స్ ఫంక్షన్లో తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలి చేతుల మీదుగా ఉత్తమ ప్రింట్ అగ్రికల్చరల్ జర్నలిస్ట్ పురస్కారాన్ని అందుకున్నారు. 37 ఏళ్లుగా పాత్రికేయుడిగా సేవలందిస్తున్న రాంబాబు గతంలో విశాలాంధ్ర, ఆంధ్రభూమి డైలీలో పనిచేశారు. గత 15 ఏళ్లుగా సాక్షిలో పనిచేస్తూ తెలుగు రాష్ట్రాల్లో ప్రకృతి వ్యవసాయం, సేంద్రియ ఇంటిపంటలు, సిరిధాన్యాల వ్యాప్తికి విశేష కృషి చేస్తూ ట్రెండ్ సెట్టర్గా పేరుగాంచారు. ప్రతి మంగళవారం సాక్షి దిన పత్రికలో ప్రచురితమయ్యే ‘సాగుబడి’ పేజీని దశాబ్దకాలంగా రైతు జన రంజకంగా నిర్వహిస్తున్నారు. పన్నెండేళ్లుగా సేంద్రియ ఇంటిపంటలపై కథనాలు రాస్తూ ప్రాచుర్యంలోకి తెస్తున్న ఆయన గత సంవత్సరంగా ‘సాక్షి ఫన్డే’లో ప్రపంచవ్యాప్తంగా అర్బన్ అగ్రికల్చర్ పోకడలపై కాలమ్ రాస్తున్నారు. ప్రకృతి వ్యవసాయోద్యమ పితామహుడు పద్మశ్రీ పురస్కార గ్రహీత సుభాష్ పాలేకర్, స్వతంత్ర శాస్త్రవేత్త, పద్మశ్రీ పురస్కార గ్రహీత డా. ఖాదర్ వలి, మట్టి సేద్య నిపుణుడు పద్మశ్రీ పురస్కార గ్రహీత చింతల వెంకటరెడ్డి వంటి ఉద్ధండుల విశేష కృషిని తెలుగు ప్రజలకు విస్తృతంగా అందుబాటులోకి తేవటంలో రాంబాబు కృషి చేస్తున్నారు. అదేవిధంగా, గ్రామీణులు, రైతు శాస్త్రవేత్తలు ఆవిష్కరించిన అనేక యంత్ర పరికరాలను వెలుగులోకి తేవడంలో విశేష కృషి చేసినందుకు నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ (ఎన్.ఐ.ఎఫ్.) 2017లో జాతీయ పురస్కారాన్ని న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో సాక్షి పత్రిక తరఫున రాంబాబు స్వీకరించిన విషయం తెలిసిందే. చేవెళ్ల ఎంపీ జి. రంజిత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సాక్షి టీవీ న్యూస్ కాస్టర్ కిషోర్ తో పాటు వివిధ పత్రికలు, సోషల్ మీడియా సంస్థలు, శాటిలైట్ ఛానళ్లలో సేవలందిస్తున్న పాత్రికేయులు, ఫోటో, వీడియో జర్నలిస్టులు పలువురు పురస్కారాలు అందుకున్నారు. ఇక సాక్షి టీవీలో సీనియర్ ప్రజంటర్ గా చేస్తోన్న DV నాగ కిషోర్ ఉత్తమ న్యూస్ ప్రజంటర్ గా అవార్డు అందుకున్నారు. 23 సంవత్సరాలుగా టెలివిజన్ రంగంలో న్యూస్ ప్రెజంటర్గా, అలాగే సీనియర్ జర్నలిస్ట్ గా పనిచేస్తున్నారు కిషోర్. రాజకీయ, సామాజిక అంశాలకు సంబంధించిన డిబేట్ లను సాక్షి టీవీ వేదికగా నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో పీజీతో పాటు ఎం.కాం., ఎంబీఏ చదువుకున్న కిషోర్, గతంలో రేడియో ప్రజంటర్ గా కూడా పని చేశారు. కర్ణాటక, రాజస్థాన్, ఢిల్లీతో పాటు పలు రాష్ట్రాల్లో రిపోర్టింగ్ చేసిన అనుభవం కిషోర్ కు ఉంది. తాజాగా కర్ణాటక ఎన్నికలపై క్షేత్ర స్థాయిలో పర్యటించి గ్రౌండ్ రిపోర్టులు అందించారు కిషోర్. చదవండి: రోజుకు రూ. 1500.. ఎకరంన్నరలో ఏటా 4 లక్షలు! ఇలా చేస్తే లాభాలే! విద్యార్థులకు స్కాలర్ షిప్లు.. ఆర్థికంగా వెనుకబడిన మీడియా సిబ్బంది కుటుంబంలో చురుకైన విద్యార్థులకు హై బిజ్ టీవీ ఆసరాగా నిలిచింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి అలాంటి 10 మంది స్టూడెంట్స్ ను ఎంపిక చేసి వారికి రూ. 25 వేల స్కాలర్ షిప్ ఇచ్చింది. రెసొనెన్స్ జూనియర్ కాలేజీల(ఐఐటీ-జేఈఈ, నీట్) సహకారంతో ఈ ఆర్థిక సాయాన్ని అందించింది. ఈ సందర్భంగా రెసొనెన్స్ విజయగాథను తెలియజేసే కాఫీ టేబుల్ బుక్ ను మంత్రి మహమూద్ అలీ ఆవిష్కరించారు. స్కాలర్ షిప్ పొందిన విద్యార్థుల వివరాలు: ఎన్. సాయిప్రియ - పదో తరగతి (10 జీపీఏ) - జడ్పీ స్కూల్ తలమడుగు, ఆదిలాబాద్ జిల్లా (D/O అశోక్ - రిపోర్టర్, ఆంధ్రజ్యోతి) ఇస్క పునీత్ అభిషేక్, ఇంటర్ (94.5%), హైదరాబాద్ (S/O రాజేశ్ బాబు - సూర్య డెయిలీ) ఎం. త్రిశూల్, 9వ తరగతి (10 జీపీఏ), ప్రేరణ కాన్సెప్ట్ స్కూల్, నల్లగొండ (S/O శ్రీనివాస్ - హన్స్ ఇండియా) ఎం. వేద సహస్ర, ప్రస్తుతం 9వ తరగతి, భాష్యం వనస్తలిపురం, గ్రేడ్ ఏ-1 (D/O శ్రీనివాస్ - వీ6 కెమెరామెన్) ఎం. హాసిని, 6వ తరగతి, శ్రీ చైతన్య టెక్నో, మెహదీపట్నం, ఏ+ (D/O పూర్ణచందర్ - ఆర్ఎండి విభాగం, టైమ్స్ ఆఫ్ ఇండియా) షేక్ రమీజా, బీఎస్సీ (అగ్రికల్చర్) 3వ సంవత్సరం, మల్లారెడ్డి యూనివర్సిటీ, ఏ+ (D/O షేక్ మస్తాన్ - ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి ఎడిషన్) పి. జైవంత్, 9వ తరగతి, భద్రాచలం పబ్లిక్ స్కూల్, ఏ1 (S/0 పీవీ సత్యనారాయణ - హన్స్ ఇండియా, ఖమ్మం) ఎ. స్రవంతి, ఎంబీబీఎస్, ప్రభుత్వ మెడికల్ కాలేజీ, నల్లగొండ (D/O శ్రీనివాస్ - జీ24 ఎక్స్ కెమెరామెన్) హజి హాసిని, పదో తరగతి, టీఎస్ఎస్ డబ్ల్యూ రెసిడెన్షియల్ స్కూల్, ఎకర్ల (D/O గోపీకుమార్, ఎక్స్ ప్రజా శక్తి, కామారెడ్డి) పి. శరణ్య, 5వ తరగతి, సెయింట్ ఆన్స్ తార్నాక, ఏ+ (D/O ప్రవీణ్, వాయిస్ ఆఫ్ వర్డ్స్) చదవండి: ప్రకృతిని, ఆవులను నమ్ముకున్నారు.. 40 సెంట్లు.. రూ.3 లక్షలు! హెచ్.ఎం.ఎ-2023 కార్యక్రమానికి డాక్టర్ రంజిత్ రెడ్డి (ఎంపీ), ఈవీ నర్సింహారెడ్డి - ఐఏఎస్ (వీసీ & ఎండీ టీఎస్ ఐఐసీ), నరేంద్ర రామ్ నంబుల (సీఎండీ - లైఫ్ స్పాన్ ప్రైవేట్ లిమిటెడ్), పి. చక్రధర్ రావు (ప్రెసిడెంట్ -ఐపిఈఎంఏ, పౌల్ట్రీ ఇండియా), ఎం. రవీందర్ రెడ్డి (డైరెక్టర్ మార్కెటింగ్ - భారతి సిమెంట్స్), వి. రాజశేఖర్ రెడ్డి (జనరల్ సెక్రటరీ - క్రెడాయ్), ఎం. రాజ్ గోపాల్ (ఎండీ - హై బిజ్ టీవీ, తెలుగు నౌ), డాక్టర్ జె. సంధ్యారాణి (సీఈవో - హై బిజ్ టీవీ, తెలుగు నౌ) తదితరులు హాజరయ్యారు. -
జాతీయత కొరవడిన పార్టీ.. స్వార్థ ప్రయోజనానికే పెద్దపీట
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమర్థ సారథ్యంలో అప్రతిహతంగా పురోగమిస్తున్న భారత్ కీర్తి బావుటా విశ్వ వినీలాకాశంలో ఇప్పుడు మరింత పైఎత్తున ఎగురుతోంది. మొట్ట మొదటి సారిగా జీ–20 అధ్యక్ష హోదా చేపట్టి విశ్వవేదికపై తన సత్తాను భారత్ మరో మారు చాటి చెప్పింది. ఐరోపా యూనియన్ సహా 19 దేశాలు సభ్యులుగా ఉన్న గొప్ప వేదిక ఇది. ప్రపంచ జీడీపీలో 90 శాతం, అంతర్జాతీయ వాణిజ్యంలో 80 శాతం, ప్రపంచ జనాభాలో మూడింట రెండు వంతులు జీ–20 దేశాలవే. ప్రపంచ ఆర్థిక వ్యవహారాల్లో జీ–20 పాత్ర ఏమిటో దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు. ఇతర దేశాల తలరాతను శాసిస్తూ లాభార్జనే ధ్యేయమైన రెండు ఆర్థిక నమూనాలు ఇప్పుడు ప్రపంచంలో కొనసాగుతున్నాయి. ఆధిపత్యం చలాయిస్తూనే తమ ఉత్పత్తులతో విదేశా లను ముంచెత్తే పాశ్చాత్య నమూనా ఒక వైపు, ఆర్థికంగా బలహీనంగా ఉన్న దేశాలకు అప్పుల వలవేసి దివాలా తీయించే చైనా నయా వలసవాద నమూనా మరొక వైపు ఉన్నాయి. దీనికి పూర్తి భిన్నంగా విశ్వ మానవ సౌభ్రాతృత్వ స్ఫూర్తితో భారత్ ముందుకు సాగుతోంది. కోవిడ్ కష్ట కాలంలో ప్రపంచాన్ని భారత్ ఆదుకున్న తీరే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం. ఇటువంటి భారత్ జీ–20కి నాయకత్వ స్థానంలో ఉండి చేయగలిగింది ఎంతో ఉంది. డిసెంబర్ ఒకటో తేదీన జీ–20 అధ్యక్ష హోదా స్వీకరించిన భారత్, వచ్చే 12 నెలల కాలంలో దేశవ్యాప్తంగా 200 పైగా సమావేశాలు నిర్వ హించాలని నిశ్చయించింది. అందుకోసం రాజకీయాలకు అతీతంగా అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షులకు డిసెంబర్ 5న ఒక సన్నాహక సమావేశానికి కేంద్రం ఆహ్వానం పలికింది. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ, డీఎంకే అధినేత స్టాలిన్ సహా దాదాపు అన్ని పార్టీల అధ్యక్షులు హాజరైన ఆ సమావేశానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం డుమ్మా కొట్టారు. దేశాన్ని ఉద్ధరిస్తానని ‘భారాసా’గా పేరు మార్చుకున్న తెరాస అధ్యక్షుడు యావత్ దేశానికి గర్వకారణమైన ఒక కీలక సమావేశాన్ని బహిష్కరించి దేశం పట్ల తన చిత్తశుద్ధిని చాటుకున్నారు. జాతీయ ప్రాధాన్యం కలిగిన అంశాల విషయంలో ఆ పార్టీ నిబద్ధత ఏ పాటిదో ఆదిలోనే అర్థమయ్యింది. దేశ హితం కన్నా కేవలం స్వార్థ రాజకీయ ప్రయోజనానికే పెద్దపీట వేయడం ఇందుకు కారణం. వచ్చే ఏడాది సెప్టెంబర్లో జరగనున్న జీ–20 దేశాల శిఖరాగ్ర సమావేశానికి వ్యూహాలపై చర్చలు జరిపేందుకు, సూచనలు స్వీకరించేందుకు ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి హాజరుకాని కేసీఆర్, అందుకు కారణాలేమిటో చెప్పగలరా? సొంత లాభాపేక్షే తప్ప తెలంగాణ ప్రజానీకం బాగోగుల గురించి ఆయనకు ఏమాత్రం పట్టింపులేదని దీనివల్ల స్పష్టంగా తెలియడం లేదా? కేంద్ర ప్రభుత్వం ఆయనను ఆహ్వానించినప్పటికీ, సమావేశానికి కావాలనే హాజరు కాకపోవడం... జాతీయ రాజకీయాల్లో కీలక, క్రియాశీలక పాత్ర పోషించాలనుకుంటున్న కేసీఆర్కు ఎంత మాత్రం తగని పని. జాతీయ రాజకీయాల్లో రాణించడానికి కావలసిన కలుపుగోలుతనం ఇదేనా? చారిత్రక అవకాశాలను ఇలా చేజేతులా వదిలేసుకోవడం కేసీఆర్కు అలవాటైన పనే. జీ–20 సమావేశాలు రాష్ట్ర ప్రభుత్వాల ముందు అనేక అవకాశాల తలుపులు తెరవబోతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వంతో కలిసి తమ రాష్ట్రాల్లో తాజా పెట్టుబడులకు బాటలు వేయడానికి మంచి అవకాశం లభిస్తోంది. తెలంగాణకు చెందిన అనేకమంది సౌదీ అరేబియాలో ప్రవాసం ఉంటున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని హైదరాబాద్లో దౌత్య కార్యాలయం ఏర్పాటు చేయాల్సిందిగా సౌదీ అరేబియాను తెలంగాణ ప్రభుత్వం అభ్యర్థించింది. కేంద్ర ప్రభుత్వంతో కలిసి సౌదీ అరేబియా రాజకీయ నాయకత్వంతో చర్చలు జరిపి సానుకూల ఫలితం రాట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం ఈ వేదికను ఉపయోగించుకునే అవకాశం ఉంది. జీ –20 అధ్యక్ష హోదా భారత్కు దక్కడంతో ఎంతో స్ఫూర్తి పొందిన సిరిసిల్ల పట్టణానికి చెందిన హరిప్రసాద్, స్వయంగా జీ–20 లోగో నేసి ప్రధానమంత్రికి పంపించారు. హరిప్రసాద్ వంటి వారి నుంచి స్ఫూర్తి పొంది తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దేశ హితం కోసం కాకపోయినా.. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యానైనా కేంద్రంతో కలిసి ముందడుగు వేస్తారా? (క్లిక్ చేయండి: సందేహాలు తీరకుండా చర్యలెలా?) - కిశోర్ పోరెడ్డి తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి -
రాహుల్... భారతీయాత్మ ఇదీ!
భారతదేశం వివిధ భాషలు, ఆహార– ఆహార్యాలు, ప్రాంతాలు, కుల – మత – వర్గాలు, సంస్కృతీ సంప్రదాయాల సంగమస్థలి. భారతీ యాత్మకు ఇదే నిదర్శనం. భారత్పై దండయాత్రలు చేసిన విదేశీయ శక్తులన్నీ ఈ వైవిధ్యాన్ని ఉపయో గించుకొని, విభజించి పాలించు విధానం ద్వారానే ఆధిపత్యం చలాయించాయి. ఆనాటి దురాక్రమణ దారులే కాదు, ఇప్పటి కొన్ని విదేశీ శక్తులు సైతం ఈ దేశ సమగ్రతను విచ్ఛిన్నం చేసే దుర్బుద్ధితో ప్రజల మధ్య విభేదాలు రాజేస్తున్నాయి. స్వాతం త్య్రానంతరం అనేక రాజకీయ పార్టీలు తమ కంటూ ఓటు బ్యాంకులు సృష్టించుకోవడానికి ఈ తరహా విచ్ఛిన్నకర రాజకీయాలనే అనుసరించాయి, నేటికీ అనుస రిస్తున్నాయి. మన దేశంలో రెండు రకాల రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు ఉన్నారు. దేశ విభిన్నత్వాన్ని కాపాడుతూనే సమైక్యతకు పాటుపడేవారు ఒకరకం. జాతీయ సమైక్యతా భావనను తుంగలో తొక్కి విభేదాలను విద్వేషాల స్థాయికి తీసుకెళ్లి, పబ్బం గడుపుకొనేవారు రెండోరకం. లక్షలాది భారతీయుల ఉచకోతకు, కోట్లాది మంది నిరాశ్రయులు కావడానికి దారితీసిన దేశ విభజన వంటి విషాద ఘటనల నుంచి వారింకా ఎలాంటి పాఠాలు నేర్చుకోలేదు. నేర్చుకోరు. కాంగ్రెస్ వారసుడు రాహుల్ గాంధీ రెండో తరహా నాయకుల కోవకు చెందినవారు. కుటుంబ పాలన నిలబెట్టుకోవడానికి తన పార్టీ ఇన్నాళ్లూ అనుసరిస్తూ వచ్చిన విధానానికి భిన్నమైన రీతిలో ఆయన పాదయాత్ర చేపట్టారు. దేశ విభజనకు కారణమైన వయోవృద్ధ కాంగ్రెస్ పార్టీ ‘భారత్ జోడో యాత్ర’ పేరుతో ఇప్పుడు సాగుతున్న నాటకానికి సూత్రధారి కావడమే విచిత్రం, విస్మయకరం. దేశాన్ని కలిపి ఉంచుతున్నది ఏమిటో, ఎందుకో – రాహుల్ గాంధీకి పట్టదు, పట్టింపు లేదు. ఆయన ముత్తాత, దేశ ప్రథమ ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ వేసిన బాటలోనే ఆయన పయనిస్తున్నారు. దేశాన్ని ఒకటి చేస్తున్న దేమిటో తెలుసుకోవడానికి, కనీసం అర్థం చేసుకోవడానికీ ఆనాడు నెహ్రూ ప్రయత్నించలేదు. ‘‘ఏదో వారిని (ప్రజల్ని) కలిపి ఉంచుతోంది. భారత్ విభిన్న నైసర్గిక, ఆర్థిక, సాంస్కృతిక స్వరూప – స్వభావాలు కలిగి ఉన్నది. అనేక వైరుధ్యాలు! అయినప్పటికీ – ఏవో తెలియని గట్టి బంధాలు వారందరినీ కలిపి ఉంచుతున్నాయి’’ – అని స్వాతంత్య్రానికి ఏడాది ముందు ప్రచురించిన ‘ద డిస్కవరీ ఆఫ్ ఇండియా’ పుస్తకంలో ఆయన పేర్కొన్నారు. అంతవరకు బాగానే ఉంది. కానీ, జవహర్లాల్ నెహ్రూ చేసిన తీవ్ర తప్పిదాలకు భారత్ భారీ మూల్యం చెల్లించుకోవలసి వచ్చింది. ఆయన, ఆయన వారసులు తీసుకున్న అనేక చర్యలు దేశంలో విభజన బీజాలే నాటాయి. దేశాన్ని కలిపి ఉంచుతున్న బలమైన బంధం ఏమిటన్నది నెహ్రూకు అర్థంగాక పోవడం వల్లనే కశ్మీర్ సమస్య ఆరని కుంపటి అయ్యింది. భారతీయత కన్నా ఒక మతమే మిన్న అనీ, దేశ భిన్నత్వాన్ని కాపాడాలంటే ఆ మతానికే అగ్ర ప్రాధాన్యం ఇవ్వక తప్పదన్న దురవగాహనే వారిని ముందుకు నడిపింది, దేశాన్ని వెనక్కి నడిపింది. ఆ దరవ గాహనతోనే నెహ్రు, కశ్మీర్ సమస్యను అంత ర్జాతీయం చేశారు. ఎనిమిదేళ్లనాడు నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చేదాకా – కశ్మీర్లో సీమాంతర ఉగ్రవాదం కరాళ నృత్యం చేసింది. కశ్మీర్ విషయంలో కాంగ్రెస్ తçప్పులు చేసినందువల్లే రెండు మత వర్గాల మధ్య దూరం మరింత పెరిగింది. దాని ఓటుబ్యాంకు రాజకీయాలతో సమస్య ముదిరింది. ఇందుకు పూర్తి బాధ్యత కాంగ్రెస్దే. ఈ బాధ్యతను అది స్వీక రిస్తుందా? ఇది జోడోనా లేక తోడోనా? నెహ్రూ విధానాన్ని వ్యతిరేకిస్తూ నిరంకుశ నిజాం కబంధ హస్తాల నుంచి హైదరాబాద్ సంస్థానానికి విముక్తి కల్పించడానికి సర్దార్ పటేల్ గట్టి చర్యలు చేపట్టకపోయి ఉంటే... దేశం మధ్యలో తెలంగాణ మరో అగ్ని గుండమయ్యేది. రాహుల్ కుటుంబ సారథ్యంలోని కాంగ్రెస్ పార్టీ రాజకీయ లబ్ధి కోసం దేశ ప్రజల మధ్య కులమతాలు, ప్రాంతాలు, భాషలంటూ విభజన రేఖలు గీసింది. మహిళల అభ్యున్నతి గురించి రాహుల్ తరచూ మాట్లాడుతుంటారు. ఇతర మతాలకు చెందిన మహిళలతో సమానంగా ముస్లిం మహిళలకూ హక్కులు కల్పిస్తూ సుప్రీంకోర్టు తీర్పు చెప్పినప్పుడు – రాహుల్ తండ్రి, అప్పట్లో ప్రధానిగా ఉన్న రాజీవ్ గాంధీ దాన్ని అటకెక్కించారు. దేశ ప్రజలందరినీ ఒకే గాటన కట్టే దిశలో ముందడుగు వేసే బదులు, భిన్న మతాలు, విభిన్న సంస్కృతీ– సంప్రదాయాలు, ఆచార–వ్యవహారాలు అంటూ వారి మధ్యన మరింత ఎత్తున గోడలు కట్టారు. లింగాయత్లు–హిందువులు; రాజ్పుత్లు–ఇతరులు; హిందువులు–ముస్లింలు; దళితులు–అగ్ర కులాలు అంటూ వివిధ వర్గాల మధ్య చిచ్చు పెట్టి, తమాషా చూడట మొక్కటే పరమ పవిత్ర కర్తవ్యంగా ఆ పార్టీ భావిస్తోంది. తన ‘తోడో’ రాజకీయాల కోసం అందివచ్చే ఎలాంటి అవకాశాన్నీ కాంగ్రెస్ పార్టీ విడిచిపెట్టడం లేదు. 130 కోట్ల మందికి పైగా భారతీయులు భక్తి – శ్రద్ధలతో దేశ స్వాతంత్య్ర అమృతోత్సవాలు జరుపుకొంటున్న వేళ... భారత్ ఒక దేశం కాదు, జాతీ కాదు, కేవలం రాష్ట్రాల సమాహారం మాత్రమేనంటూ వింత, వితండ వాదనను రాహుల్ తెరమీదకు తెచ్చారు. నెహ్రూ పేర్కొన్నట్లు – దేశ ప్రజలందరినీ కలిపి ఉంచుతున్న బలమైన బంధం– భారతీయత – అంటే ఏమిటన్నది అర్థం చేసుకోగలిగితే– ‘జోడో’ లక్ష్యం సాధించే దిశగా సాగిపోవడం, గమ్యం చేరడం రాహుల్ గాంధీకి పెద్ద కష్టమేమీ కాదు! (క్లిక్ చేయండి: భారత్ జోడో పాదయాత్రతో కొత్త ఉత్సాహం) - కిశోర్ పోరెడ్డి బీజేపీ తెలంగాణ రాష్ట్ర శాఖ అధికార ప్రతినిధి -
వెల్లివిరుస్తున్న కొత్త క్రీడా సంస్కృతి!
సమగ్రాభివృద్ధిలో క్రీడల పాత్ర ఎంతో ఉందని ఐక్యరాజ్య సమితి ఉద్ఘాటించింది. జాతి నిర్మాణంలో క్రీడలది కీలక పాత్ర అనీ, క్రీడలకూ, అభివృద్ధికీ మధ్య అవినాభావ సంబంధం ఉందనీ కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం కూడా మనసా, వాచా, కర్మణః నమ్మటం వల్లనే ఇపుడు భారత దేశంలో కొత్త క్రీడా సంస్కృతి వెల్లి విరుస్తోంది. స్వతంత్ర భారతదేశ చరిత్రలో ప్రభుత్వాలు కనీసం ఊహించనైనా ఊహించని వినూత్న క్రీడా పథకాలతో దేశంలో క్రీడారంగ స్వరూప స్వభావాలు పూర్తిగా మారి పోయాయి. సెప్టెంబర్ 29న అహ్మదాబాద్లో 36వ జాతీయ క్రీడలను ప్రారంభిస్తూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేసిన స్ఫూర్తిదాయక ప్రసంగం – దేశంలో అపూర్వ స్ధాయిలో క్రీడా రంగాన్ని అభివృద్ధి చేయాలన్న ఆయన సంకల్పాన్ని చాటి చెప్పింది. ఈ ఏడాది జాతీయ క్రీడా పోటీల్లో భారత సాయుధ దళాలకు చెందిన క్రీడాకారులతో పాటు 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన దాదాపు 7,000 మంది అథ్లెట్లు 36 రకాల క్రీడాంశాల్లో తమ ప్రతిభా పాటవాలు ప్రదర్శించారు. దేశంలో క్రీడల అభివృద్ధికి ప్రధాని మోదీ ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నారు. అంతర్జాతీయ క్రీడలు జరిగే ప్రతిసారీ ఆయన ఆటగాళ్లను వ్యక్తిగతంగా కలిసి, వెన్నుతట్టి ప్రోత్స హిస్తారు. గతంలో ఏ ప్రధానమంత్రీ క్రీడాకారుల మనసులపై ఇంత ప్రభావం చూపలేదు. గెలిచినప్పుడే కాకుండా... ఓడిపోయినా మోదీ స్వయంగా ఫోన్ చేసి మాట్లాడడం మన అంతర్జాతీయ క్రీడాకారులను అబ్బురపరుస్తోంది. ప్రధాని స్వయంగా మాట్లాడడం మనో నిబ్బరాన్ని పెంచుతోందని ఒలింపిక్ బ్యాడ్మింటన్ మెడలిస్టు పీవీ సింధూ చెప్పారు. నైపుణ్యానికి బదులు బంధుప్రీతి, అవినీతీ భారత క్రీడా రంగాన్ని పట్టి పీడిస్తూ వెనక్కి లాగాయని క్రీడోత్సవాల ఆరంభం సందర్భంగా మోదీ అన్న మాట నూటికి నూరుపాళ్లూ నిజం. అథ్లెట్ల కోచింగ్, ఆట సామగ్రి, టోర్నమెంట్ల ఖర్చులు, విద్య, పోషకాహారం, పాకెట్ మనీ వంటి అవసరాల్ని చారిత్రాత్మక ‘ఖేలో ఇండియా’ పథకం ద్వారా తీరుస్తుండటంతో – వేలాది మంది క్రీడాకారులు ఎంతో ప్రయోజనం పొందుతున్నారు. క్రీడాకారులు, వారి తల్లిదండ్రులపై ఆర్థిక భారం తగ్గింది. ‘టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీం’ (టాప్స్) కారణంగా ఒలింపిక్లో దేశ విజయావకాశాలు మెరుగు పడుతున్నాయి. స్త్రీ, పురుష హాకీ టీమ్లతో పాటు 13 క్రీడాంశాల్లో 104 టాప్స్ కోర్ గ్రూప్ అథ్లెట్లకు ఈ పథకం ద్వారా ప్రోత్సాహం లభిస్తోంది. 2024 పారిస్, 2028 లాస్ ఏంజిలిస్ గేమ్స్ వంటి భారీ క్రీడోత్సవాలకు సన్నద్ధం కావడానికి వీలుగా 12 క్రీడాంశాల్లో మరో 269 టాప్స్ డెవలప్ మెంట్ గ్రూప్ అథ్లెట్లకూ ప్రోత్సాహం అందజేస్తున్నారు. తెలంగాణకు చెందిన పలువురు క్రీడాకారులు ఖేలో ఇండియా, టాప్స్ పథకాల ద్వారా ప్రయోజనం పొందుతున్నారు. (క్లిక్ చేయండి: ములాయం ప్రాభవం కొనసాగేనా?) కేంద్ర ప్రభుత్వం వినూత్న పథకాలు తెస్తుంటే, తెలంగాణ ప్రభుత్వం తనవంతు తోడ్పాటు అందజేయకపోవడంతో క్రీడాకారులు ఇబ్బంది పడుతున్నారు. ఈ జాతీయ క్రీడల్లో తెలంగాణ పెద్దగా ప్రభావం చూపకపోవడానికి కేసీఆర్ ప్రభుత్వం క్రీడల పట్ల చూపిన నిర్లక్ష్యమే ప్రధాన కారణం. కనీసం క్రీడా రంగంలోనైనా మోదీ నుంచి కేసీఆర్ స్ఫూర్తి పొందాలి. (క్లిక్ చేయండి: ‘పార్టీ’టైమ్... కాసింత కామెడీగా!) - కిశోర్ పోరెడ్డి బీజేపీ తెలంగాణ శాఖ అధికార ప్రతినిధి -
Tara: హీరోయిన్ కావడానికి బాలిక పడిన కష్టాలేంటి?
ఓ పదేళ్ల బాలిక సినిమా హీరోయిన్ కావాలనే లక్ష్యంతో ఇండస్ట్రీకి వచ్చి ఎన్ని కష్టాలు అనుభవించింది? చివరికు తన లక్ష్యాన్ని ఎలా నెరవేర్చుకొంది అనే చిత్ర కథాంశంతో తెరకెక్కుతున్న చిత్రం ‘తార’. కేరాఫ్ కంచర పాలెం ఫేమ్ కిషోర్ హీరోగా, సత్యకృష్ణ హీరోయిన్గా నటిస్తున్నారు. వి.ఆర్.పి క్రియేషన్స్ పతాకంపై పి. పద్మావతి సమర్పణలో యం.బి (మల్లి బాబు) ను దర్శకుడిగా పరిచయం చేస్తూ.. వెంకటరమణ పసుపులేటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం సినిమా పూజా కార్యక్రమాలు హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోలో ఘనంగా జరిగాయి .ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా వచ్చిన దర్శకుల సంఘం అధ్యక్షులు కాశీ విశ్వనాథ్ తొలి ముహూర్తపు సన్ని వేశానికి క్లాప్ నివ్వగా, నటుడు, నిర్మాత సాయి వెంకట్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు.గూడ రామకృష్ణ ఫస్ట్ డైరెక్షన్ చేశారు. అనంతరం చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దర్శకుడు మల్లి బాబు మాట్లాడుతూ.. అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే విధంగా రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని అక్టోబర్ 14 నుంచి ఒంగోలు, విజయవాడ, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో రెగ్యులర్ షూటింగ్ తో సింగిల్ షెడ్యూల్లో పూర్తి చేస్తాం. మంచి కథను సెలెక్ట్ చేసుకొని మేము తీస్తున్న ఈ చిత్రాన్ని ప్రేక్షకులందరూ ఆదరించి ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను’ అన్నారు. ‘మా బ్యానర్లో వస్తున్న నాలుగో చిత్రమిది. గత చిత్రాలను ఆదరించినట్లే ‘తార’ను కూడా ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’అన్నారు నిర్మాత పసుపులేటి వెంకటరమణ. ఈ చిత్రంలో బేబీ తుషార, బేబీ నాగ హాసిని, మాస్టర్ హర్ష వర్ధన్, అజయ్ ఘోష్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. -
‘నేను c/o నువ్వు’లాంటి చిత్రాలు ఇంకా రావాలి
రత్న కిషోర్, సన్య సిన్హా, సాగారెడ్డి, సత్య, ధన, గౌతమ్ రాజ్ నటీనటులుగా సాగారెడ్డి తుమ్మ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న చిత్రం ‘నేను c/o నువ్వు'. ఆగాపే అకాడమీ పతాకంపై అతవుల, శేషిరెడ్డి, దుర్గేష్ రెడ్డి, కె .జోషఫ్లు సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రం నుండి విడుదలైన మోషన్ పోస్టర్, టీజర్, ట్రైలర్ కు ప్రేక్షకులనుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని సెప్టెంబర్ 30 న గ్రాండ్ గా విడుదల అవుతుంది. ఈ సందర్బంగా చిత్ర యూనిట్ సినీ, రాజకీయ ప్రముఖులకు, పాత్రికేయులకుప్రీమియర్ షోను ప్రదర్శించడం జరిగింది. షో అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో నిర్మాతలు , రాజకీయ నాయకులు మాట్లాడుతూ.. ‘సినిమా చాలా బాగుంది. మనం ఈ మధ్య కులం పేరుతో ఇంకా పరువు హత్యలు జరుగుతుండడం మనం చూస్తునే ఉన్నాం. కాబట్టి ఇలాంటి సందేశాత్మక చిత్రాలు థియేటర్స్ కు కచ్చితంగా రావాలి.ఈ సినిమాల వలన ప్రేక్షకులలో ఇంకా అవగాహన పెరుగుతుంది’ అన్నారు. -
తీర్థ యాత్రలకు ప్రత్యేక పర్యాటక రైళ్లు
సాక్షి, అమరావతి: దక్షిణమధ్య రైల్వే వచ్చే ఏడాది నుంచి ఆధ్యాత్మిక, ఆహ్లాదాన్ని పంచే విధంగా ప్రత్యేక పర్యాటక రైళ్లను నడుపుతున్నట్లు ఐఆర్సీటీసీ డిప్యూటీ జనరల్ మేనేజర్ (టూరిజం) కిషోర్ తెలిపారు. గురువారం విజయవాడలోని రైల్వే కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. రవాణాతో పాటు భోజన,వసతి సౌకర్యాలతో అతి తక్కువ ధరలకు ప్యాకేజీలను రూపొందించామన్నారు. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ప్రయాణం ఉంటుందన్నారు. ప్రత్యేక ఐసోలేషన్ వార్డును సైతం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్యాకేజీ వివరాలు ఇలా.. వైబ్రెంట్ గుజరాత్: విజయవాడ నుంచి ఉత్తరభారత దేశ యాత్రలో భాగంగా సోమనాథ్, ద్వారక, నాగేశ్వర్, బెట్ ద్వారక, అహ్మదాబాద్తో పాటు గుజరాత్లోని స్టాట్యూ ఆఫ్ యూనిటీ (సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం), సబర్మతి ఆశ్రమం, ఆక్షరధామ్ దేవాలయం సందర్శించవచ్చు. పది రాత్రులు, 11రోజుల ప్రయాణంలో స్లీపర్ క్లాస్ ధర రూ.10,400, త్రీ టైర్ ఏసీ రూ.17,330గా నిర్ణయించారు. వచ్చే నెల21వ తేదీ మధ్యాహ్నం విజయవాడ నుంచి బయలుదేరే రైలు సందర్శనీయ స్థలాలు పర్యటించి 31–01–2022 సాయంత్రానికి గమ్యస్థానానికి చేరుకుంటుంది. భారత్ దర్శన్ ప్యాకేజీ.. విశాఖపట్నం నుంచి గోవా–హంపీకి ప్రత్యేక రైలును ఏర్పాటు చేశారు. ఈ రైలు ఫిబ్రవరి 12వ తేదీన బయలుదేరి 18వ తేదీ (ఆరు రాత్రులు, 7 రోజులు) తిరిగి విశాఖ చేరుకుంటుంది. స్లీపర్ క్లాస్ ధర రూ.6,620, త్రీ టైర్ ఏసీ రూ.8,090గా నిర్ణయించారు. ఉత్తరభారత్ దర్శన్.. ఉత్తరభారత్ దర్శన్తో పాటు వైష్ణోదేవి దర్శనంతో కలిపి ఆగ్రా, అమృతసర్ స్వర్ణదేవాలయం, హరిద్వార్, మధుర చుట్టి వచ్చేలా ఎనిమిది రాత్రులు, తొమ్మిది రోజులతో ప్యాకేజీని తీసుకొచ్చారు. మార్చి 19వ తేదీ రాజమండ్రిలో బయలుదేరే ఈ రైలు తిరిగి 27వ తేదీకి గమ్యస్థానానికి చేరుకుంటుంది. స్లీపర్ క్లాస్ ధర రూ.8,510, త్రీ టైర్ ఏసీ రూ.10,400గా నిర్ణయించారు. వీక్లీ తిరుమల: విజయవాడ, రాజమండ్రి–సామర్లకోట నుంచి ప్రతి శుక్రవారం తిరుపతికి వెంకటేశ్వర స్వామి దర్శనంతో రైలు ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయన్నారు. వీటి టికెట్ ధర రూ.3220, రూ.3380గా నిర్ణయించామన్నారు. www. irctctourism.com వెబ్సైట్లో టికెట్లు బుక్ చేసుకోవచ్చన్నారు. మరిన్ని వివరాలకు 8287932312లో సంప్రదించాలని సూచించారు. -
అక్షరాలా ‘నడిచే’ విజ్ఞాన సర్వస్వం రాంభట్ల!
ప్రముఖ కవి, విమర్శకుడు, చిత్రకారుడు, పత్రికా రచయిత, సంపాదకుడు, తొలి తెలుగు కార్టూనిస్ట్ కవి (‘శశవిషాణం’), వేదాల గురించి సృజనాత్మకంగా ఆలోచించి విస్తృతంగా రాసిన పరిశోధకుడు, ‘కన్యాశుల్కం’ నిపుణుడు, మార్క్సిస్టు మేధావి, తెలుగులో జర్నలిజం అధ్యయన కేంద్రానికి మొట్టమొదటి ప్రధాన అధ్యాపకుడు, రాంభట్ల కృష్ణమూర్తి. ఆయన శతజయంతి సంవత్సరమిది. పుట్టింది ఎక్కడో తూర్పు తీరంలో అయినప్పటికీ, రాంభట్లగారు తన జీవితంలో అత్యధిక భాగం గడిపింది హైదరాబాద్లోనే. నిజానికి, రాంభట్ల ఒక స్వయంనిర్మిత సౌధం! హైదరాబాద్లోని శ్రీకృష్ణ దేవరాయాంధ్ర భాషానిలయం లాంటి గ్రంథాలయాల్లోనే ఆయన తెలుగుసంస్కృత సాహిత్య అధ్యయనం సాగింది. మాతృభాష తెలుగులోనూ, స్వయంకృషితో నేర్చుకున్న ఇంగ్లిష్లోనూ, కొద్దోగొప్పో పాఠశాలల్లో చదువుకున్న ఉర్దూలోనూ రాంభట్లగారు తర్వాతి కాలంలో పాండిత్యం సంపాదించడం విశేషం. తరుణ యవ్వనంలో రాంభట్ల ఆర్య సమాజ్ ప్రభావంలో వేదాల గురించి తెలుసుకునే ప్రయత్నం మొదలుపెట్టారు. ‘అందరికీ విద్య జ్ఞానప్రాప్తి సత్యప్రకాశం’ అనే దయా నంద సరస్వతి ఆదర్శం రాంభట్లను ప్రభావితం చేసింది. చివరివరకూ ఆయన తన వృత్తి నాలుగు విషయాలు నేర్చుకోవడమూ ఆ నేర్చుకున్నదాన్ని నలుగురికి నేర్పడమేనని నమ్మి, దాన్నే ఆచరించారు. వాస్తవానికి రాంభట్ల జీవనం మేలిమలుపు తిరిగింది ఆ నవయవ్వన దశలోనే. ఆయన దయానంద సరస్వతి దగ్గరే వేద మంత్రాల ప్రతిపదార్థ తాత్పర్యాల దగ్గరే ఆగిపోలేదు! ఫ్రెడ్రిక్ రాసెన్, ఫ్రాంజ్ బాప్, రుడాల్ఫ్ ఫాన్ రాత్, ఫ్రెడ్రిక్ మ్యాక్స్ మ్యూలర్ల రచనలు చదవడానికి ఆయన పడరానిపాట్లు పడ్డారు. ఏమాత్రం తీరిక చిక్కినా మ్యాక్స్ మ్యూలర్ సంకలించిన ‘ద సేక్రెడ్ బుక్స్ ఆఫ్ ద ఈస్ట్’ చదువుతుండేవారు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అచ్చువేసిన ఈ సంకలనం మొత్తం రాంభట్లగారికి నిత్యపారాయణీయం. కానీ, జర్మన్ ఇండాలజిస్టుల దగ్గరా ఆయన ఆగిపోలేదు. జవహర్లాల్ నెహ్రూ, శ్రీపద అమృత డాంగే, రాహుల్ సాంకృత్యాయన్ తదితరులు చూపిన బాటలో రుగ్వేద కాలపు గణసమాజాన్ని ఊహించే సాహసానికి ఆయన చిన్ననాటనే తెగించారు! తంత్ర సంస్కృతి గురించి సంపాదించిన పరిజ్ఞానం రాంభట్లని భౌతికవాదం వైపు నడిపించింది. ప్రాచీన ఆచారాల్లో నిబిడీకృతమయివున్న తాంత్రిక భావనలను వెతికే దిశగా అది దారితీసింది. సామెతలూ, ఊళ్ల పేర్ల వెనక దాగిన అర్థాలను విశ్లేషించడానికి ఈ భౌతికవాదమే తోవ చూపించింది. అదే ఆయన్ని తాపీ ధర్మారావు లాంటి బహుముఖ ప్రజ్ఞావంతుడికి చేరువ చేసింది. ఆ ఆలోచన క్రమమే రాంభట్లని మార్క్సిజం వైపు నడిపించింది. ఈ మేధోపరిణామమే ఆయన్ని గ్రంథస్థమయిన చరిత్ర రచనకు మించి ఆలోచించే సాహసిగా పదును పెట్టింది. అదే, తనను అరుదయిన మేధావిగా మార్చింది. 1940 దశకంలో వెలువడుతూ ఉండిన నిజాం అధికార పత్రిక ‘మీజాన్.’ ఇది, ఉర్దూ, ఇంగ్లిష్, తెలుగు భాషల్లో వచ్చేది. తెలుగు పత్రికకు అడివి బాపిరాజు సంపాదకులు. ఆయన దగ్గర సహాయ సంపాదకులుగా చేసే శ్రీనివాస చక్రవర్తి సంస్కృత రూపకాల్లో దిట్ట. ఆయనకు ఆధునిక తెలుగు నాటకాల్లో ‘కన్యాశుల్కం’ అంటే తగని మక్కువ. రాంభట్లకయితే కన్యాశుల్కమంటే ప్రాణం! చక్రవర్తిగారు రాంభట్లకి ఆర్యసమాజ్ రోజులనుంచీ పరిచయస్తులు. ఆయన ద్వారానే అడివి బాపిరాజుతో రాంభట్లకు పరిచయమయింది. బాపిరాజు గారు రాంభట్లను ఎప్పుడూ ‘మైడియర్ యంగ్మ్యాన్!’ అని గిరీశం ఫక్కీలో పలకరించేవారట. (రాంభట్ల మమ్మల్నందర్నీ ‘ఏం ఫ్రెండూ!’ అనే పలకరించేవారు!) కన్యాశుల్కమే వారిని కట్టిపడేసింది. ఆ కన్యాశుల్కం నాటకమే రాంభట్లను అభ్యుదయ రచయితగా మార్చింది. దాని రచయిత గురజాడే సామాజిక, ప్రాంతీయ మాండలికాల పట్ల ఆయనలో ఆసక్తి కలిగించారు. గురజాడనుంచే, బాధితులపట్ల పక్షపాతం కలిగి వుండాలనే నీతిని రాంభట్ల నేర్చుకున్నారు. అదే అభ్యుదయ రచయితల సంఘం ప్రణాళిక రచనలో ‘శ్రామికవర్గ పక్షపాతం’గా ప్రతిఫలించింది. ‘మృచ్ఛకటికం కన్యాశుల్కం’, ‘గిరీ శంశకారుడు’, ‘వసంతసేనమధురవాణి’ అనే అంశాలను తులనాత్మకంగా అధ్యయనం చెయ్యడం రాంభట్ల ప్రవృత్తిలోనే భాగంగా మారిపోయింది! ఫ్రెడ్రిక్ ఎంగెల్స్ ద్విశత జయంతి సంవత్సరంలో చెప్పుకోవలసిన ఓ విశేషం ఉంది ఎంగెల్స్ రచన ‘ఆరి జిన్ ఆఫ్ ఫ్యామిలీ’ని రాంభట్ల వారానికి ఒకసారయినా చదివేవారు! విభిన్న అధ్యయనరంగాల్లో విస్తృతమయిన పరిజ్ఞానం కలిగివుండి, ఏ ‘రెఫరెన్సూ’ లేకుండానే గళగ్రాహిగా మాట్లాడుతూవుండే వ్యక్తులను సంచార విజ్ఞాన సర్వస్వాలుగా పిలవడం కద్దు. అయితే, రాంభట్లని సంచార విజ్ఞాన సర్వస్వం అన డం కన్నా, నడిచే విజ్ఞాన సర్వస్వం అనడమే భావ్యమని నా నమ్మకం. ఎందుకంటే, ఆయన అక్షరాలా ‘నడిచే’ విజ్ఞాన సర్వస్వమే! 1970–80లలో, హైదరాబాద్ పురవీథుల్లో రాం భట్ల, చిన్నపాటి శిష్యబృందాన్ని వెంటపెట్టుకుని, కిలోమీటర్ల తరబడి నడుస్తూ కనిపించేవారు. వేదవేదాంగాలు మొదలుకుని ఫ్రాయిడియన్ సైకోఎనాలిసిస్ వరకూ ఫ్రీ సై్టల్ లెక్చర్ దంచుతూ రాంభట్లగారు నడుస్తూవుంటే, మేమందరం ఆయన వెంట అబ్బురపడుతూ నడిచిపోతూండేవాళ్లం. సరమఅపాల మొదలుకుని గిల్గ మేష్ఎంకిడు వరకూ ఎందరెందరి ప్రస్తావనో వస్తూవుండేది. కాస్త ఖాళీగా వుండే ఇరానీ రెస్టారెంట్ కనిపించే వరకూ ఈ వాకథాన్ సాగుతూ వుండేది. ఎక్కడయినా ‘అడ్డా బిఠాయించామంటే’ చర్చనీయాంశం ఓ కొలిక్కివచ్చే వరకూ ‘బైఠక్’ కొనసాగాల్సిందే! ఈ చర్చ ఎప్పుడూ వన్వే ట్రాఫిక్లా జరిగేదికాదు. నిజానికి రాంభట్లగారే అలా జరగనిచ్చేవారు కారు. ఒకవేళ అలా జరిగే ప్రమాదం కనబడితే, అప్పటిదాకా తాను చెప్తూవచ్చిన వాదాన్ని తానే ఖండించడం మొదలుపెట్టేవారాయన! ‘వాదానువాద సంవాద ప్రతివాదా’లనే తర్క ప్రక్రియల గురించి సహచరులకు వివరిస్తూ చర్చను మోడరేట్ చేసేవారాయన. ఆయన పాతకాలపు ‘చండామార్కుల మార్కు’ గురువు కారు. తన కన్నా పాతిక ముప్ఫైయేళ్లు చిన్నవారయిన శిష్యులందరినీ ప్రేమగా ‘ఫ్రెండూ!’ అని పిలిచే ఆధునిక గురువు. ఏథెన్స్ వీథుల్లో సోక్రటిస్ నిర్వహించాడని చెప్పే ‘ఎలింకస్’ తరహా సంచార చర్చాగోష్ఠులను రాంభట్ల ఏళ్ల తరబడి కొనసాగించారు. నాకు తెలిసి, తెలుగునాట ఇలాంటి కార్యక్రమం చేపట్టిన మరో వ్యక్తి లేరు! అదీ రాంభట్ల విశిష్టత. శతజయంతి వేళ మనం స్మరించుకోవలసిన ముఖ్యమైన అంశం ఇదే. రాంభట్లగారు రాసింది బహుతక్కువ. ఆ రాసిన పది పుస్తకాలూ కూడా మార్కెట్లో దొరకడం లేదు. ఈ శతజయంతి సందర్భంగానైనా తన లభ్య రచనల సర్వస్వం వెలువడితే బావుంటుంది. రాంభట్లగారి ‘ఫ్రెండ్స్’ వింటున్నారా? (ఫిబ్రవరి 22 ఉదయం విశాఖపట్నం పబ్లిక్ లైబ్రరీలో రాంభట్ల కృష్ణమూర్తి శత జయంతి సభ సందర్భంగా..) వ్యాసకర్త సీనియర్ జర్నలిస్టు మందలపర్తి కిశోర్ -
కిషోర్ కుటుంబసభ్యులను పరామర్శించిన ఆర్కే
-
పెళ్లింట విషాదం
కామారెడ్డి జిల్లా: కామారెడ్డి పట్టణంలో శుక్రవారం విషాదం చోటుచేసుకుంది. రైలు పట్టాలు దాటుతుండగా ప్రమాదవశాత్తూ రైలు ఢీకొని ఓ వ్యక్తి మృతిచెందాడు. మృతుడు కామారెడ్డి మండలం దేవునిపల్లి గ్రామానికి చెందిన మంగళి కిషోర్గా గుర్తించారు. మంగళి కిషోర్కు రెండు రోజుల క్రితమే వివాహం జరిగింది. ఈ ఘటనతో పెళ్లింట విషాదం అలుముకుంది. పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అతడు జాబ్ చెయ్యడు.. ఆమె ఇల్లు చూసుకోదు
మంచి సంప్రదాయాన్ని మొక్కలా నాటి, ఆ మొక్కకు రోజూ నీళ్లుపోస్తున్నారు ఈ నవ దంపతులు! అమ్మాయి, అబ్బాయి పరిచయం కావడం, ఆ పరిచయం స్నేహంగా పరిణమించడం, స్నేహం నుంచి ప్రేమ రెక్కలు విచ్చుకోవడం రొటీన్. అలాంటి రొటీన్ ప్రేమల్లో చాలావరకు పెళ్లి పీటల మీదకు చేరవు. పెళ్లిపీటలను చేరిన ప్రేమల్లోనూ ఆ తర్వాత అంతా రొటీనే. అమ్మాయి పుట్టింటిని వదిలి అత్తవారింట్లో అడుగుపెట్టాలి. అందుకు ఉద్యోగం అడ్డమైతే ఆ ఉద్యోగాన్ని వదిలేయాలి. అంతగా ఆ అమ్మాయికి ఉద్యోగం చేయాలనే కోరిక ఉంటే.. అత్తగారి ఊరిలో లేదా భర్త ఉద్యోగం చేసే ఊరిలో కొత్త ఉద్యోగాన్ని వెతుక్కోవాలి. అప్పటివరకు తాను ఎదిగిన మెట్లను తానే కూలదోసుకుని కొత్త సోపానాల తొలిమెట్టు మీద నిలబడాలి. అయితే కిషోర్, మినాల్ల జీవితమూ అలాంటి మలుపులనే తీసుకుని ఉంటే వారి గురించి చెప్పుకోవడానికి ఏమీ ఉండేది కాదు. వీళ్లు ఏన్నో ఏళ్లుగా వస్తున్న సంప్రదాయాలను బ్రేక్ చేస్తున్నారు. పెళ్లి చేసుకుని భర్త ఇంట్లో అడుగుపెట్టడమే ఎందుకు జరగాలి, భార్య ఇంట్లో భర్త అడుగుపెడితే తప్పేంటి... అని వీరైతే ఎవర్ని ప్రశ్నించడం లేదు కానీ, తామైతే ఆచరిస్తున్నారు! భర్త ఉద్యోగం చేస్తే భార్య ఇంటిని చక్కబెట్టుకోవడంలో ఏ మాత్రం ఎబ్బెట్టు లేనప్పుడు, భార్య ఉద్యోగం చేస్తుంటే భర్త ఇంటి పనులు చక్కబెట్టుకుంటే అది ఎబ్బెట్టు ఎందుకవుతుంది? అన్నది వీళ్ల ఉద్దేశం. హౌస్ వైఫ్ అనిపించుకోవడం ఏమాత్రం గౌరవాన్ని తగ్గించుకోవడం కానప్పుడు, హౌస్ హజ్బెండ్ అనిపించుకోవడం తక్కువ ఎందుకవుతుంది? అని మినాల్ అంటోంది. జైపూర్ అబ్బాయి ఈ కొత్తతరం భార్యాభర్తల్లో అబ్బాయి నంద కిశోర్ కుమావత్ది రాజస్తాన్, జైపూర్లో ఉద్యోగం చేసేవాడు. అమ్మాయి పేరు మినాల్ విజయ్ పాండ్సే. ముంబైలోనే పుట్టి పెరిగింది, ముంబైలోనే ఉద్యోగం చేస్తోంది. 2017 నవంబర్ ఎనిమిదవ తేదీన ఆన్లైన్ యాప్లో పరిచయమయ్యారు. ఆ తర్వాత ఆరు రోజులపాటు రోజుకు పన్నెండు గంటల సేపు ఫోన్ కాల్స్, వీడియో కాల్స్ చేసుకునేవారు. ఆరో రోజు అతడిని ముఖాముఖి చూడాలనిపించింది మినాల్కి. జైపూర్కి టికెట్ బుక్ చేసుకుంది. అతడికి అది సర్ప్రైజ్. ఉదయం నుంచి సాయంత్రం వరకు కబుర్లు చెప్పుకున్నారు. రాత్రి జైపూర్లో ఆమెను ముంబైకి ట్రైన్కి ఎక్కిస్తూ ఒకే ఒక్క మాట.. ‘ఐ వాంట్ యూ ఇన్ మై లైఫ్, ఇట్ యాజ్ ఎ ఫ్రెండ్, లివ్ ఇన్ పార్ట్నర్ ఆర్ వైఫ్’ అన్నాడతడు. మూడవ ఆప్షన్ ఎంచుకుంది మినాల్. 2018 జూలైలో పెళ్లి చేసుకున్నారు. పెళ్లయ్యాక వాళ్ల సంప్రదాయం ప్రకారం వధువు.. వరుడి ఇంటికి గృహప్రవేశం చేయాలి. ఇక్కడ కిశోర్ మినాల్ ఇంట్లో అడుగుపెట్టాడు. కాలదోషం పట్టిన సంప్రదాయాలను చెరిపేసి కొత్త సంప్రదాయాన్ని అలవాటు చేయడం తమకిష్టం అని చెబుతున్నారు ఈ దంపతులు. ముంబైలో అమ్మాయి జైపూర్లో ఉద్యోగానికి రిజైన్ చేశాడు కిశోర్. ముంబైలో కొత్త ఉద్యోగ ప్రయత్నాలు మొదలయ్యాయి. ప్రతిచోటా ‘ఆ ఉద్యోగానికి ఎందుకు రిజైన్ చేశారు’ అనే ప్రశ్న ఎదురైంది. ‘భార్య ఇక్కడ (ముంబైలో) ఉద్యోగం చేస్తోంది, అందుకే’ అనే మాట పూర్తయ్యే లోపు నవ్వేశారు కొందరు. ఇందులో అంత విచిత్రం ఏముంది? అని అడుగుతోంది మినాల్. ‘సంపాదించని మగాడిని భర్తగా భరించడం కష్టం, భవిష్యత్తులో అతడు నీకు భారం అవుతాడు. ఈ నిర్ణయం వద్దు’ అని చెప్పారామెకి తల్లిదండ్రులు. రొటీన్ని బ్రేక్ చేసి చూపిస్తామంటున్నారు ఈ భార్యాభర్తలు. అయితే మినాల్ సంపాదిస్తుంటే హాయిగా కాలం గడిపేయాలనే బద్ధకంతో హౌస్ హజ్బెండ్ కాలేదతడు. ఇంటిని చూసుకుంటూ చేయగలిగిన వ్యాపారానికి ప్రణాళిక వేసుకుంటున్నాడు. – మంజీర ఉన్నవి రెండే ఆప్షన్లు మేమిద్దరం చెరొక చోట ఉన్నాం. ఒక దగ్గరకు చేరాలంటే రెండే ఆప్షన్లు. ఒకటి.. నేను ఉద్యోగం మానేసి జైపూర్ వెళ్లడం, లేదా కిశోర్ ముంబైకి రావడం. కిశోర్ కాకుండా మరే మగాడైనా నన్ను కెరీర్ వదులుకోమనే చెప్తాడు. వీలుకాదంటే... ఉద్యోగం మన ప్రేమకంటే ఎక్కువా, పెళ్లి కంటే ముఖ్యమా.. అనే ఎమోషనల్ లాజిక్తో ఇరుకున పెట్టేవాడు. నన్ను కెరీర్ వదులుకోమని చెప్పకపోవడం కిశోర్ ఔన్నత్యం. – మినాల్ -
నేర చరిత్ర
మూవీ మొఘల్ ప్రొడక్షన్స్పై అజర్ షేక్ నిర్మిస్తున్న చిత్రం ‘మార్కెట్’. దాసరి గంగాధర్ దర్శకునిగా పరిచయ మవుతున్నారు. కిశోర్, దివ్య జంటగా నటిస్తున్న ఈ చిత్రం సోమవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా గంగాధర్ మాట్లాడుతూ– ‘‘దర్శకునిగా ఇది నా తొలి సినిమా. నా మీద ఉన్న నమ్మకంతో నిర్మాతకు నన్ను పరిచయం చేసిన రాముగారికి థ్యాంక్స్. కథ విషయానికొస్తే ఏ ఊరికైనా నేర చరిత్ర ఉంటుంది. రాత్రి సమయంలో జరిగే క్రైమ్ ఇన్సిడెంట్ని తీసుకొని అల్లుకున్న కథ ఇది. ఇప్పటివరకు ప్రపంచం చూడని నేర సామ్రాజ్యాన్ని నా సినిమాలో చూపించబోతున్నా’’ అన్నారు. అజర్ షేక్ మాట్లాడుతూ– ‘‘నా సినిమా ప్రయాణంలో ఇదే తొలి మెట్టు. గంగాధర్ చెప్పిన ఈ కథ నచ్చి నిర్మించడానికి ఒప్పుకున్నాను. జనవరిలో షూటింగ్ ప్రారంభించి మార్చిలో సినిమాని పూర్తి చేస్తాం’’ అన్నారు. -
నో డూప్
గాల్లో తేలియాడుతున్నారు హీరోయిన్ సాయిధన్సిక. ఊహల్లో కాదండీ బాబు! నిజంగానే. అయ్యో... ఆమెకు ఎందుకంత కష్టం. అంటారా? కష్టం కాదు ఇష్టం. కన్నడ చిత్రం ‘ఉద్ఘర్ష’ కోసం ఆమె డూప్ లేకుండా రియల్గా స్టంట్స్ చేస్తున్నారు. సునైల్ కుమార్ దేశాయ్ దర్శకత్వంలో అనూప్సింగ్ థాకూర్, సాయి ధన్సిక, తాన్యా హోప్, కబీర్ దుహాన్ సింగ్, కిశోర్, హర్షికా పోనాచా ముఖ్య తారలుగా నటిస్తున్న ఈ సినిమాను తెలుగు, కన్నడ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. తమిళంలో ఈ చిత్రాన్ని డబ్ చేయాలనుకుంటున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ తుదిదశకు చేరుకుంది. ఈ చిత్రం కోసమే రియల్గా స్టంట్స్ చేస్తున్నారు ధన్సిక. ‘‘కొన్నిసార్లు జీవితంలో రిస్క్ తీసుకోవాల్సి ఉంటుంది’’ అని పేర్కొన్నారు ధన్సిక. రజనీకాంత్ ‘కబాలి’ సినిమాలో యోగి పాత్రలో ఆమె చేసిన యాక్షన్కు ప్రేక్షకులు మంచి మార్కులు వేశారు. మరి.. ఈ ‘ఉద్ఘర్ష’ లో «ధన్సిక చేసిన యాక్షన్ ఆడియన్స్కి ఏ మాత్రం నచ్చుతుందో చూడాలంటే సినిమా విడుదల వరకు ఆగాల్సిందే. -
ఫస్ట్ లుక్లో కొత్తదనం కనిపిస్తోంది
‘‘మైత్రివనం’ సినిమా ఫస్ట్ లుక్లో కొత్తదనం కనిపిస్తోంది. రవిచరణ్ నాకు తెలుసు. సినిమా కోసం బాగా కష్టపడతాడు. సినిమా వినూత్నంగా తెరకెక్కించి ఉంటారనుకుంటున్నా. సూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నా’’ అన్నారు దర్శకుడు సుకుమార్. విశ్వ, కిషోర్, వృషాలీ, హర్షదా పాటిల్ ముఖ్య తారలుగా రవిచరణ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మైత్రివనం’. ‘ఫీనిక్స్ ఎల్ వీ’ అన్నది ఉపశీర్షిక. లక్ష్మీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సుఖేష్ ఈశ్వరగారి నిర్మించిన ఈ చిత్రం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. మోషన్ పోస్టర్కు ప్రత్యామ్నాయంగా సిద్ధం చేసిన ‘మైత్రివనం’ మూవీ గ్రీటింగ్ని, ఫస్ట్ లుక్ని సుకుమార్ ఆవిష్కరించారు. రవిచరణ్ మాట్లాడుతూ– ‘‘కొన్ని వాస్తవ సంఘటనల స్ఫూర్తితో ఈ చిత్రకథ రాసుకున్నా. ఈ విశ్వంలో మనిషి తలచుకుంటే ఏదైనా చేయగలడు.. ఎంత కష్టమైన లక్ష్యాన్ని అయినా సాధించగలడు. అద్భుతాలు సృష్టించగలడు.. అని చెప్పేందుకు చేసిన ప్రయత్నమే ఈ సినిమా’’ అన్నారు. ‘‘యువతకు నచ్చేలా మంచి సందేశంతో పాటు ఆద్యంతం వినోదాత్మకంగా తెరకెక్కించిన చిత్రమిది. మే నెలలో సినిమాను విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు సుఖేష్ ఈశ్వరగారి. ఈ చిత్రానికి సంగీతం–ఎడిటర్: కిషోర్ మద్దాలి, కెమెరా: పరంధామ. -
చివరి నిమిషంలో ‘గూగ్లీ’.. అస్సలు ఊహించలేరు
సాక్షి, సినిమా : నటుడిగానే కాదు, ఇష్క్, మనం వంటి చిత్రాలతో రచయితగా కూడా హర్షవర్ధన్ మంచి పేరు సంపాదించుకున్నాడు. కొంతకాలం క్రితం డైరెక్టర్ అవతారంలోకి మారి గుడ్ బ్యాడ్ అగ్లీ అనే చిత్రాన్ని తెరకెక్కించాడు. ఆ చిత్రం గతేడాది రిలీజ్ కావాల్సి ఉన్నప్పటికీ ఎందుకనో వాయిదా పడింది. ఇక ఇప్పుడు విడుదలకు సిద్ధమైపోయింది. అయితే అనూహ్యంగా ఇప్పుడు ఆ చిత్ర టైటిల్ను మార్చేశాడు దర్శకుడు హర్షవర్ధన్. ‘‘క్రికెట్లో గూగ్లీ గురించి చాలా మందికి తెలిసి ఉంటుంది. మా చిత్రం కూడా అంతే. క్రికెట్ లో గూగ్లీని బ్యాట్స్ మెన్ ఏ విధంగా ఊహించరో.. అలాగే ప్రేక్షకులు కూడా మా చిత్రాన్ని, అందులోని పాత్రల తీరును అస్సలు ఊహించలేరు. అందుకే టైటిల్ను ఇలా మార్చేశాం’’ అని హర్ష చెప్పారు. శ్రీ ముఖి, కిషోర్, మురళీ కృష్ణ, ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంలో హర్షవర్ధన్ కూడా ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ విలేజ్ డ్రామా ఫిబ్రవరి చివరి వారంలో విడుదలయ్యే అవకాశం ఉంది. -
మీ భవిష్యత్.. మాకు వర్తమానం!
ప్రొఫెసర్ ఇల్లు. కిషోర్ తన గ్యాంగ్ మొత్తాన్నీ వెంటేసుకొని వచ్చి గేటు బయట నిలబడ్డాడు. కిషోర్తో సహా గ్యాంగ్ అంతా పిల్లలే! ‘‘ఇదే ప్రొఫెసర్ గారిల్లు. గేట్ మూసుందే!?’’ అంటూ అందరినీ గేటెక్కమన్నట్టు సైగ చేశాడు కిషోర్. పిల్లలంతా గేటెక్కి అక్కణ్నుంచి ఇంట్లోకి దూకారు. లోపలకొచ్చి ఓ పెద్ద మెషీన్ వంక చూస్తూ నోరెళ్లబెట్టారు. ఒక చిన్నపాటి గదంత పెద్దగా ఉంది ఆ మెషీన్. కనిపించిన బటన్స్ అన్నీ నొక్కేస్తున్నారు. లైట్లు వెలుగుతున్నాయి. పెద్ద శబ్దాలు వినిపిస్తున్నాయి. పిల్లలు ఆ శబ్దం ఏమై ఉంటుందా అని జోక్స్ చేసుకుంటున్నారు. వీడియో గేమ్స్ ఆడుకున్నట్లు అక్కడున్నకంప్యూటర్స్తో ఆడుకుంటున్నారంతా. మెల్లిగా ఆ మెషీన్ డోర్ మూసుకుపోయింది. పిల్లలు భయపడిపోతున్నారు. ఈలోపే కృష్ణకుమార్కు పిల్లలంతా ప్రొఫెసర్ ఇంటికి వెళ్లారన్న విషయం తెలిసింది. అప్పటికి కృష్ణకుమార్ కూడా ప్రొఫెసర్ ఇంట్లోనే ఉన్నాడు. పరుగెత్తుకుంటూ వెళ్లి పిల్లలందరినీ ఆ మెషీన్ నుంచి బయటపడేశాడు. కృష్ణకు తోడుగా అతడి గర్ల్ఫ్రెండ్ హేమ కూడా పిల్లల్ని కాపాడుతూ ఓ చెయ్యందించింది. పిల్లలందరూ బయటపడ్డారు. లైట్లు మళ్లీ వెలిగాయి. శబ్దం మరింత పెరిగింది. హేమ కళ్లు తిరిగి పడిపోయింది. అయోమయంలో ఏదో బటన్ నొక్కింది. డోర్ మూసుకుంది. మెషీన్ పనిచేయడం మొదలుపెట్టింది. అది టైమ్ మెషీన్. గతంలోనికైనా, భవిష్యత్లోకైనా తీసుకెళ్లగలిగే మెషీన్. కృష్ణకుమార్, హేమ మాత్రమే చిక్కుకుపోయారా మెషీన్లో. గతంలోకి వెళుతోందా మెషీన్. సంవత్సరాలు సంవత్సరాలు వెనక్కి.. అలా సంవత్సరాలు సంవత్సరాలు వెనక్కి వెళుతోన్న టైమ్ మెషీన్ సరిగ్గా 1526వ సంవత్సరంలోకి వెళ్లి ఆగిపోయింది. డోర్ తెరుచుకుంది. కృష్ణకుమార్, హేమ ఇద్దరూ ఆ మెషీన్ నుంచి బయటపడ్డారు. కృష్ణ అప్పటికే హేమ వాళ్ల నాన్నను తిడుతున్నాడు. హేమ తండ్రే టైమ్ మెషీన్ను తయారు చేసిన ప్రొఫెసర్. చుట్టూ గమనించారిద్దరూ. అంతా కొత్తగా ఉంది. ఎక్కడ చూసినా చెట్లే. అడవి. ఒకరి చెయ్యి ఒకరు పట్టుకొని మెల్లిగా నడుస్తూ ముందుకు వెళుతున్నారు. ‘‘ఇదంతా అడవిలా ఉంది కృష్ణా!’’ అంది హేమ.‘‘అసలిది ఏ దేశమో.. ఏ కాలమో..’’‘‘తిరిగి వెళ్లిపోదామా?’’ అనుకుంటూ ఇద్దరూ వెనక్కి తిరగ్గానే ఏవో శబ్దాలు వినిపించాయి. అటు దిక్కుగా చూస్తే ఎవరో మనుషులు. అక్కడి మనుషులు, వ్యవహారం చూసి ఇదేదో రాజుల కాలంలా ఉందన్న నిశ్చయానికి వచ్చారిద్దరూ. కృష్ణ, హేమ.. వాళ్లను అలా గమనిస్తూండగానే ఏదో పెద్ద గొడవ మొదలైంది. ఎవరో దుండగులు ఒక యువతిపై దాడి చేస్తున్నారు. కృష్ణ ఒక్క క్షణంలో వారిమీద విరుచుకుపడ్డాడు. అందరినీ చితకబాది ఆ యువతిని కాపాడాడు. ‘‘నా మానప్రాణములను కాపాడిన యువ కిషోరమునకు కృతజ్ఞతలు..’’ అంది ఆ యువతి గట్టిగా ఊపిరి పీల్చుకొని. ‘‘మీరూ?’’ అడిగాడు కృష్ణ. ఆ యువతి నవ్వుతూ.. ‘‘నేను రాజనర్తకిని. సింహనందిని నా నామధేయము. రాయలవారి ఆస్థానమున నర్తించుట నా వృత్తి..’’ అంది. ‘‘రాయలవారంటే?’’ ‘‘శ్రీకృష్ణదేవరాయ ప్రభువులు..’’ కృష్ణ, హేమ ఒక్కసారే ఆశ్చర్యానికి లోనయ్యారు. ‘‘ఓ మై గాడ్! మనం శ్రీకృష్ణదేవరాయల కాలానికి వచ్చామా?’’ అంది హేమ, సంతోషంతో!సింహనందినికి కృష్ణ, హేమ కొత్తగా కనిపించారు. వాళ్లు వేసుకున్న బట్టలు, వారి భాష.. అంతా కొత్తగా ఉంది. వారిపై ప్రశ్నల వర్షం కురిపించింది. ‘‘మేము మీకంటే ఐదు వందల సంవత్సరాల ముందు వాళ్లం!’’ అన్నాడు కృష్ణ, సింహనందిని వరుస ప్రశ్నలకు, చూపులకు సమాధానంగా. ‘‘నాకేమీయూ అవగతం కాకున్నది..’’ అంది సింహనందిని, అమాయకంగా.కృష్ణకుమార్, హేమ ఏమీ మాట్లాడకుండా అలా చూస్తూ నిలబడ్డారు. మళ్లీ సింహనందినే మాట్లాడుతూ, ‘‘నాతో రండి! ప్రభువులను కలసి.. నన్ను కాపాడినందులకు బహుమతులు అందుకొందురు..’’ అంది. ∙∙ కృష్ణ, హేమ శ్రీకృష్ణదేవరాయలు ఆస్థానానికి విచ్చేశారు. ప్రభువులు సభకు విచ్చేస్తున్నారంటూ అక్కడివారంతా సందడి చేస్తున్నారు. ఎవరి పనుల్లో వాళ్లు మునిగిపోయారు. కృష్ణ అందరినీ చూస్తూ కూర్చున్నాడు. హేమ ‘వీళ్లెవరూ? వీళ్లెవరూ?’ అంటూ అమాయకంగా ప్రశ్నలడుగుతోంది. వాళ్లిద్దరి మాటలలా కొనసాగుతుండగానే, వైభవంగా సభకు విచ్చేశాడు కృష్ణదేవరాయలు. ఆయన వస్తూంటే సభలో కూర్చున్నవారంతా గౌరవంగా లేచి నిలబడి నమస్కరించారు. ప్రభువు తన పీఠంపై కూర్చోగానే అందరూ కూర్చున్నారు. తమ పెద్దలకు అంజలి ఘటించి సభను మొదలుపెట్టాడు కృష్ణదేవరాయలు. సభ జరుగుతుండగానే, కృష్ణ, కృష్ణదేవరాయల కంట పడ్డాడు. ‘‘ఎవరీ పరదేశీయుడు?’’ కృష్ణదేవరాయల ప్రశ్నకు..సింహనందిని లేచి, అడవిలో దుండగుల బారినుంచి తనను కాపాడారని చెప్పింది. ‘‘ఓ! అలాగా!! వీరకుమారా? మీరు ఏ దేశ వాసులు?’’ అనడిగాడు కృష్ణదేవరాయలు. ‘‘మేము తెలుగు వారమే మహారాజా?’’ అని సమాధానమిచ్చాడు కృష్ణ. కృష్ణదేవరాయలు వరుసగా ప్రశ్నలు కురిపిస్తూనే ఉన్నారు. ‘‘మహారాజా! మీ భవిష్యత్ కాలం.. మాకు వర్తమాన కాలం. మేం భవిష్యత్ నుంచి వచ్చిన వాళ్లం.’’కృష్ణదేవరాయలకు కృష్ణ చెప్పేది ఏదీ అర్థం కాలేదు. ‘‘అంటే?’’ అనడిగాడు. ‘‘మేము 20వ శతాబ్దకాలం వాళ్లం. మీకంటే 500 సంవత్సరాలు ముందు వాళ్లం. అందుకే మీ విషయాలన్నీ మాకు తెలుసు..’’ నవ్వుతూ సమాధనమిచ్చాడు కృష్ణ. ‘‘వీరి నాన్నగారు..’’ హేమను చూపిస్తూ.. ‘‘కాలంలో ప్రయాణం చేసే యంత్రాన్ని కనిపెట్టారు. అదెక్కి మేము మీ కాలానికి రావడం తటస్థించింది..’’ కృష్ణ చెప్తూ వెళ్తున్నాడు. కృష్ణదేవరాయలకు ఇదంతా కొత్తగా కనిపిస్తూ ఉంటే, అలా వింటూ ఉన్నాడు. -
ఆస్తులు అమ్ముకున్నా! – రాజశేఖర్
‘‘గరుడవేగ’కి కోటేశ్వర్ రాజు, జీవిత, ప్రవీణ్ సత్తారు, మా నాన్నగారు నాలుగు పిల్లర్లు. నా పిల్లలు శివాని, శివాత్మికలు సూపర్ పవర్స్లా మరో రెండు పిల్లర్స్లా సహకారం అందించారు’’ అన్నారు రాజశేఖర్. ఆయన హీరోగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో జ్యో స్టార్ ఎంటర్ప్రైజెస్ పతాకంపై కోటేశ్వర్ రాజు నిర్మించిన సినిమా ‘పీఎస్వీ గరుడవేగ 126.18ఎం’. పూజా కుమార్, శ్రద్ధా దాస్, కిషోర్ ముఖ్య తారలు. నవంబర్ 3న సినిమా విడులవుతున్న సందర్భంగా హైదరాబాద్లో ప్రీ–రిలీజ్ వేడుక నిర్వహించారు. రాజశేఖర్ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా టీజర్ చూసిన మా అమ్మగారు హ్యాపీ ఫీలయ్యారు. తను చనిపోవడంతో నేను కింద పడిపోయినట్లు అనిపించింది. మేం సినిమాల్లో ఉండటం కారణంగా చాలా ఆస్తులు అమ్మేశా. దాంతో నష్టపోయాను. ఆ విషయంలో అమ్మగారు బాధపడుతుండేవారు. ఈ సినిమా సక్సెస్తో నేను బాగానే ఉన్నానని పై లోకంలో ఉన్న మా అమ్మ తెలియాలి. ఇందుకు ప్రేక్షకుల ఆశీర్వాదం కావాలి’’ అన్నారు. జీవితా రాజశేఖర్ మాట్లాడుతూ– ‘‘మా అమ్మాయి పేరు మీదనే జ్యో స్టార్ బేనర్ స్టార్ట్ చేశాం. మా మావయ్యగారి ద్వారా కోటేశ్వర్ రాజుగారు పరిచయం. రాజశేఖర్గారికి మంచి హిట్ ఇవ్వాలనే తపనతో ఖర్చుకు వెనకాడకుండా 30 కోట్లతో సినిమా నిర్మించారు. సినిమాకి ఫైనాన్షియల్ సమస్యలున్నాయని, నవంబర్ 3న రాదని కొందరు అంటున్నారు. అవన్నీ పుకార్లే. 3నే విడుదలవుతుంది’’ అన్నారు. ‘‘సినిమా బాగా వచ్చింది. జీవితగారు అందించిన సహకారం మరచిపోలేను. నిర్మాత రాజీ పడలేదు’’ అన్నారు ప్రవీణ్ సత్తారు. ‘‘ప్యాషన్తో చేసిన సినిమా ఇది. అందరికీ నచ్చేలా ఉంటుంది’’ అన్నారు కోటేశ్వర్ రాజు. నటీనటులు పూజా కుమార్, శ్రద్ధా దాస్, సన్నీ లియోన్, ఆదిత్ అరుణ్ తదితర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. -
త్వరలో తెరపైకి ఉరుధికోల్
తమిళసినిమా: ఉరుధికోల్ చిత్రం యూఏ సర్టిఫికెట్తో తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. బాలనటుడిగా మంచి పేరు తెచుకున్న కిశోర్ కథానాయకుడిగా నటించిన చిత్రం ఉరుధికోల్. నటి మేగ్నా నాయకిగా నటించిన ఇందులో అఖిలేష్, కాళీవెంకట్ ముఖ్య పాత్రల్లో నటించారు. ఏపీకే.ఫిలింస్, జై స్నేహం ఫిలింస్ సంస్థలు కలిసి నిర్మించిన ఈ చిత్రానికి అయ్యనార్ దర్శకుడు. నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి సెన్సార్ సమస్యలు ఎదురయ్యాయి. చివరికి రివైజింగ్ కమిటీకి వెళ్లి యూఏ సర్టిఫికెట్తో బయట పడింది. దీని గురించి చిత్ర దర్శకుడు అయ్యనార్ తెలుపుతూ అన్ని వర్గాల వారు చూడాలన్న భావంతోనే ఉరుధికోల్ చిత్రాన్ని తెరకెక్కించినట్లు పేర్కొన్నారు.అంతే కానీ ఎవరూ అసహ్యించుకునే విధంగానో, ఎవరి మనసులను గాయపరిచేవిధంగానో చిత్రం ఉండదని అన్నారు. తుది ఘట్టంలో వయిలెన్స్ ఎక్కువగా ఉందన్న అభిప్రాయంతోనే సెన్సార్ బృందం ఉరుధికోల్ చిత్రానికి యూఏ సర్టిఫికెట్ ఇచ్చిందని, త్వరలోనే చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు దర్శకుడు వెల్లడించారు. -
YSRCP అభ్యర్ధి కిషోర్ గెలుపు
-
ఏమోషనల్ డ్రామాగా కలత్తూర్గ్రామం
తమిళసినిమా: యాక్షన్తో కూడిన ఎమోషనల్ డ్రామాగా కలత్తూర్ గ్రామం ఉంటుందని ఆ చిత్ర దర్శకుడు చరణ్ కే.అద్వైతన్ తెలిపారు. దర్శకుడు గణేశ్రామ్ శిష్యుడైన ఈయన తొలిసారిగా మెగాఫోన్ పట్టిన చిత్రం కలత్తూర్ గ్రామం. ఏఆర్.మూవీ ప్యారడైజ్ పతాకంపై అవుదైతై రామమూర్తి నిర్మిస్తున్న ఇందులో కిషోర్ కథానాయకుడిగా, బెంగళూర్కు చెందిన యజ్ఞశెట్టి కథానాయకిగా నటించిన ఈ చిత్రంలో సునీల్కుమార్, అజయ్రత్నం తదితరులు ముఖ్య పాత్రలను పోషించారు. సంగీతజ్ఞాని ఇళయరాజా సంగీతం అందించడంతో పాటు ఇందులోని ఒక పాటను ఆలపించడం విశేషం. కాగా నిర్మాణం పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధం అయిన కలత్తూర్ గ్రామం చిత్రం విశేషాలను దర్శకుడు తెలుపుతూ ఇది తూత్తుకుడి జిల్లాలోని పుదుపట్టి గ్రామంలో జరిగే కథాంశంగా ఉంటుందన్నారు. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ చితాన్ని ఆంధ్ర, తమిళనాడు సరిహద్దులో చిత్రీకరించినట్లు చెప్పారు. చిత్ర కథను ఇళయరాజాకు వినిపించగా చాలా బాగుంది. షూటింగ్ పూర్తి చేసి రండి తాను సంగీతాన్ని అందిస్తానని అన్నారన్నారు. చిత్రంలో కిషోర్ రెండు విభిన్న గెటప్లలో కనిపిస్తారని, ఇందులో రెండు పాటలు, నాలుగు ఫైట్స్ ఉంటాయని తెలిపారు. చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి అయ్యాయని, సెప్టెంబర్లో విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్టు చెప్పారు. ఈ చిత్రాన్ని తెలుగులోనూ అనువదించే ఆలోచన ఉందని దర్శకుడు పేర్కొన్నారు. -
పెళ్లి సింపుల్గా.. షష్టిపూర్తి ఘనంగా...
నటుడు, రచయిత హర్షవర్ధన్ తొలిసారి దర్శకత్వం వహించడంతో పాటు సంగీతం అందించిన సినిమా ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’. మురళి, శ్రీముఖి, కిశోర్, అజయ్ గోష్, హర్షవర్ధన్ ముఖ్య తారలుగా అంజిరెడ్డి ప్రొడక్షన్, ఎస్.కె. విశ్వేష్బాబు సమర్పణలో అంజిరెడ్డి నిర్మించిన ఈ సినిమా ఫస్ట్ లుక్ను హైదరాబాద్లో విడుదల చేశారు. హర్షవర్ధన్ మాట్లాడుతూ– ‘‘పెళ్లిని ఘనంగా చేస్తుంటారు. కానీ, షష్టిపూర్తి కార్యక్రమాలు అలా జరగడం లేదు. పెళ్లి సైలెంట్గా జరగాలి. షష్టిపూర్తి ఘనంగా జరగాలనే ఆలోచన నుంచి పుట్టిన కథే ఈ చిత్రం. సినిమాలో ఏకైక లేడీ పాత్రను శ్రీముఖి చేశారు. 1988–89 కాలంలో ఓ మారుమూల గ్రామంలో జరిగిన ప్రేమకథే ఈ చిత్రం. ఫీల్ గుడ్ ఎలిమెంట్స్తో పాటు పక్కా కమర్షియల్ అంశాలూ ఉంటాయి. సంగీత దర్శకుడు కావాలనే నేను హైదరాబాద్ వచ్చా. అందుకే ఈ చిత్రానికి సంగీతం అందించా’’ అన్నారు. శ్రీముఖి, విశ్వేష్, కిశోర్, మురళి, సంతోష్, సురేష్, శ్రీధర్, కమల్, టిఎన్ఆర్ తదితరులు పాల్గొన్నారు. -
ఇప్పుడు 25 కోట్లు... తర్వాత 2 కోట్లైనా ఓకే!
‘‘కథను బట్టే బడ్జెట్ ఉంటుంది. ఈ సిన్మాను పాతిక కోట్లతో తీశామని... నా తర్వాతి సినిమాను అంత కంటే ఎక్కువ బడ్జెట్తో తీయాలనుకోను. కథకు రెండు కోట్లు చాలనుకుంటే... రెండు కోట్లలోనే తీస్తా’’ అన్నారు ప్రవీణ్ సత్తారు. రేపు ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా రాజశేఖర్ హీరోగా ఆయన దర్శకత్వంలో ఎం. కోటేశ్వరరాజు నిర్మించిన ‘పీఎస్వీ గరుడవేగ 126.18ఎం’ సినిమా గురించి ప్రవీణ్ చెప్పిన విశేషాలు... ⇒ జీవితాగారు ఓ రోజు ఫోన్ చేసి రాజశేఖర్గారికి ఏదైనా కథ ఉంటే చెప్పమన్నారు. హాలీవుడ్ హిట్ ‘డై హార్డ్’ టైప్ కథ చెప్పా. నేను తీసిన గత రెండు సినిమాలు ‘చందమామ కథలు, గుంటూరు టాకీస్’ కంటే డిఫరెంట్ జానర్ సిన్మా. భారీ స్కేల్ ఉన్న సిన్మా, భారీ బడ్జెట్ కావాలి. బహుశా... వేరే నిర్మాతలైతే అంతకు ముందు ఏం తీశావమ్మా? అనడిగేవారేమో! ఎం. కోటేశ్వరరాజుగారు, హీరోగారు కథను, నన్ను నమ్మారు. ⇒ రాజశేఖర్గారి ‘మగాడు’ సినిమాకు, అందులో ఆయన యాక్టింగ్కి నేను పెద్ద ఫ్యాన్. ఇందులో ఆయనది అలాంటి క్యారెక్టరైజేషన్ ఉన్న పాత్రే. ‘నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ’ (ఎన్ఐఏ) ఆఫీసర్గా చేశారు. షూటింగ్ ఫినిష్ చేశాం. తాను తప్ప వేరేవాళ్లు చేయలేరన్నంతగా రాజశేఖర్గారు నటించారు. సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్ సిన్మా ఇది. స్టోరీ, యాక్షన్ సీక్వెన్లు చాలా కొత్తగా ఉంటాయి. ⇒ ఈ సినిమాకు ముందు రాజశేఖర్గారి మార్కెట్ ఎంతని ఆలోచించలేదు. ఈ రెండేళ్లలో వచ్చిన సినిమాలు పరిశీలిస్తే... కొత్తవాళ్లతో రెండు కోట్లలో తీసిన సినిమా 20 కోట్లు వసూలు చేసింది. పదేళ్లుగా ఇల్లు–టీవీలకు అతుక్కుపోయిన ప్రేక్షకులను ‘బాహుబలి’ థియేటర్లకు రప్పించింది. సినిమాలో కంటెంట్ ఉంటే ఆకాశమే హద్దుగా వసూళ్లు వస్తున్నాయి. హీరో స్లంపులో ఉన్నాడనేది మేటర్ కాదు. అదే... ఎంత పెద్ద హీరో సినిమా అయినా.. బాగోకపోతే రెండో రోజు కలెక్షన్స్ ఉండవు. ⇒ సన్నీ లియోన్తో ఐటమ్ సాంగ్ చేయించాలనేది నిర్మాత ఐడియా. భీమ్స్ మంచి బీటున్న సాంగ్ చేశారు. ఆడియన్స్ను సన్నీ సాంగ్ బాగా ఎట్రాక్ట్ చేస్తుంది. బట్, రిలీజైన తర్వాత సిన్మాలో కంటెంట్ ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తుందనే నమ్మకముంది. పూజాకుమార్, శ్రద్ధా దాస్, కిశోర్.. అద్భుతంగా నటించారు. తెలుగులో యాక్షన్ బేస్డ్ ఎంటర్టైనర్స్కు ‘పీఎస్వీ గరుడవేగ’ కొత్త టెంప్లేట్ అవుతుందనుకుంటున్నా. -
ఉరుది కోల్ చిత్ర గీతాలావిష్కరణ
తమిళసినిమా: ఉరుధి కోల్ చిత్ర గీతాలావిష్కరణ కార్యక్రమం సోమవారం మధ్యాహ్నం స్థానిక సాలిగ్రామంలోని ప్రసాద్ల్యాబ్లో జరిగింది. ఏపీకే.ఫిలిం స్, స్నేహం ఫిలింస్ సం స్థల అధినేతలు పీ.అ య్యప్పన్, సీ.పళని కలి సి నిర్మిస్తున్న ఇందులో గోలీసోడా ఫేమ్ కిశోర్ కథానాయకుడిగా నటిస్తున్నారు. నటి మోహన నాయకిగా నటిస్తున్న ఇందులో కాళీవెంకట్, తెన్నవన్, మాస్టర్ శివశంకర్, కన్నన్, పొన్నయ్య, అఖిలేష్, షర్మిళ తదితరులు ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు.నవ దర్శకుడు ఆర్.అయ్యనార్ కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఈయన దర్శకుడు కృష్ణ వద్ద నెడుంశాలై చిత్రానికి సహాయ దర్శకుడిగా పని చేశారన్నది గమనార్హం. పాండిఅరుణాచలం ఛాయాగ్రహణం, జూట్ వినీగర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో నటుడు మన్సూర్అలీఖాన్ అతిథిగా పాల్గొని ఆడియో తొలి ప్రతిని ఆవిష్కరించారు. చిత్ర వివరాలను దర్శకుడు ఆర్.అయ్యనార్ తెలుపుతూ పాఠశాల్లో చదువుకునే వయసులో విద్యార్థి, విద్యార్థిని మధ్య ఏర్పడే ప్రేమ మంచిది కాదని, అందులో పరిపక్వత ఉండదని చెప్పే కథాంశంతో కూడిన చిత్రం ఉరుధి కోల్ అని చెప్పారు. ఆడపిల్లల పెంపకంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న మంచి సందేశాన్ని ఈ చిత్రం ద్వారా తల్లిదండ్రులకు ఇవ్వనున్నట్లు తెలిపారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ ఉరుధికోల్ చిత్రాన్ని త్వరలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించారు. -
బేరానికి దిగలేరు..భయపెట్టి బతకలేరు!
పోలీస్ పాత్రలంటే యాంగ్రీ మేన్ రాజశేఖరే గుర్తుకొస్తారు. ఆ పాత్రల్లో అంతలా ఒదిగిపోతారాయన. ఆయన మరోసారి పోలీసాఫీసర్గా నటిస్తున్న చిత్రం ‘పి.ఎస్.వి. గరుడవేగ 126.18ఎం’. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో జ్యోస్టార్ ఎంటర్ప్రైజెస్ సమర్పణలో కోటేశ్వరరాజు నిర్మిస్తున్నారు. పూజా కుమార్ కథానాయిక. ‘కబాలి, చీకటి రాజ్యం’ చిత్రాల్లో విలన్ పాత్రల్లో మెప్పించిన కిషోర్ ఈ చిత్రంలో పవర్ఫుల్ విలన్ జార్జ్ పాత్ర చేస్తున్నారు. ‘‘జార్జ్.. రాక్షసుడి మానవ రూపం.. అతనితో పొత్తే వినాశనం.. శారీరకంగా అవిటివాడైనా, మానసికంగా అత్యంత బలవంతుడు. బుద్ధి బలంతో ఢీ కొట్టి గెలవలేం. అతనితో బేరానికి దిగలేరు, భయపెట్టి బతకలేరు.. వేటకు దిగిన మృగం కంటే క్రూరుడు.. జార్జ్ పాత్ర గొప్ప ప్రతినాయకులైన మొగాంబో, గబ్బర్సింగ్ని తలపిస్తుంది’’ అని దర్శక–నిర్మాతలు చెప్పారు. ఈ చిత్రానికి కెమెరా: అంజి, సంగీతం: శ్రీచరణ్. -
పెద్దలకు భయపడి విషం తాగిన ప్రేమికులు
కుక్కునూరు(పశ్చిమ గోదావరి జిల్లా): కుటుంబ పెద్దలు తమ పెళ్లికి అంగీకరించలేదని ఇద్దరు ప్రేమికులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. కుక్కునూరు మండలం పాములేరు వద్ద ఈ సంఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. అశ్వాపురం మండలం జగ్గారంకు చెందిన ఆటో డ్రైవర్ కిషోర్(23), ఆశ్వాపురం మండల కేంద్రం మంచికంటి నగర్ కు చెందిన నవ్య అనే యువతి గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే, ఇటీవలె ఈ విషయం వాళ్ల ఇళ్లల్లో తెలియడం, వారి పెళ్లికి అంగీకరించని కారణంతో ఇద్దరూ కలిసి పాములేరు వద్ద పురుగుల మందు తాగారు. స్థానికులు గుర్తించి పోలీసులకు, 108 వాహనానికి సమాచారం అందించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పండుగ పూట పెనువిషాదం..
కారు–ఆటో ఢీ దైవదర్శనానికి వెళ్లి వస్తూ ఒకరు.. జీవన ప్రమాణపత్రం ఇచ్చేందుకు వెళ్తూ మరొకరు మృతి 13మందికి తీవ్రగాయాలు మృత్యుంజయురాలు మూణ్నెళ్ల చిన్నారి కొడుకును బతికించాలని తల్లి వేడుకోలు డిచ్పల్లి(నిజామాబాద్ రూరల్) నిజామాబాద్ క్రైం : బోగి పండుగపూట వారి ఇళ్లల్లో విషాదచాయలు అలుముకున్నాయి. అనుకోని ప్రమాదం వారి జీవితాలను అల్లకల్లోలం చేసింది. దైవదర్శనానికి వెళ్లివస్తూ రోడ్డు ప్రమాదం జరగడంతో 12 కుటుంబాల్లో విషాదం నెలకొంది. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వారంతా బీడీలు చుట్టి బతికే పేద మహిళలు. ఈనెల 15వ తేదీ వరకే పీఎఫ్ ఆఫీస్లో జీవన ప్ర మాణ పత్రాలు ఇచ్చేందుకు శుక్రవారం ఇందల్వాయి మండలం నల్లవెల్లి గ్రామానికి చెందిన 13మంది మహిళలు ఆటోలో బయలుదేరారు. డిచ్పల్లి మండలం ధర్మారం(బి) గ్రామం వద్దకు రాగానే ఎదురుగా వేగంగా వచ్చిన కారు ఆటోను ఢీకొట్టింది. దీంతో ఆటో మూడు పల్టీలు కొట్టింది. ఆటోలో ఉన్న వారికి తీవ్ర గాయాలయ్యాయి. కారు నడుపుతున్న రాయచూరి కిషోర్ కుమా ర్ (45)తో పాటు నల్లవెల్లికి చెందిన దామ కళావతి (65) ఈ ప్రమాదంలో మృతి చెందారు. ఓవర్ టేక్ చేయబోయి.. మహబూబ్నగర్ జిల్లా నారాయణ్పేట్కు చెందిన రా యచూరి కిషోర్ కుమార్ కుటుంబసభ్యులతో కలిసి నిర్మల్ జిల్లా బాసర పుణ్యక్షేత్రానికి వెళ్లి శుక్రవారం ప్రయాణమయ్యాడు. కిషోర్ కుమార్ హైదరాబాద్లోని కర్మాన్ ఘాట్లో ఉంటున్నాడు. ఆయనతో పాటు కారులో భా ర్య చంద్రకళ, కూతురు అక్షయ(14), కొడుకు సాత్విక్(11), బావమరిది కుమారుడు సాయిచరణ్ కూడా ఉ న్నారు. వీరి కారు ధర్మారం(బి) వద్ద ముందు వెళ్తున్న వాç ßæనాన్ని ఓవర్టేక్ చేసేందుకు ప్రయత్నించి ఎదురుగా వస్తున్న ఆటోను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ గాండ్ల లక్ష్మన్తో పాటు అందులో ప్రయాణిస్తున్న 14 మంది మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి. కారు ముందు టైర్ పేలిపోయింది. కారు నడుపుతున్న కి షోర్కుమార్కు తీవ్రగాయాలయ్యాయి. ప్రమాదం జరిగి న వెంటనే స్థానికులు అక్కడికి చేరుకుని ఆటోలో నుంచి మహిళలను బయటకు తీశారు. సమాచారం అందుకు న్న ఎస్సై నరేందర్రెడ్డి తన సిబ్బందితో హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఇదేక్రమంలో ధర్పల్లి వెళ్తున్న ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ తనయుడు జగన్ సంఘటనాస్థలంలో క్షతగాత్రులను తన వాహనంలో జి ల్లాస్పత్రికి తరలించారు. మిగిలిన వారిని 108లో జిల్లా కేంద్రానికి తరలించారు. ఆస్పత్రి లో చికిత్స పొందు తూ కిషోర్ కుమార్, నల్లవెల్లికి చెందిన దామ కళావతి మృతిచెందారు. కారు ముందు సీట్లో కూర్చున్న సాత్విక్ కు తీవ్రగాయాలయ్యాయి. అతడిని హైదరాబాద్కు తరలించారు. ఈ సంఘటనతో చంద్రకళ షాక్కు గురైంది. నల్లవెల్లిలో.. బోగి పండుగ పూట రోడ్డు ప్రమాదం జరిగి 11 కుటుం బాలకు చెందిన మహిళలు తీవ్రంగా గాయపడటం, వా రిలో ఒకరు మృతి చెందటంతో నల్లవెల్లి గ్రామంలో వి షాదం నెలకొంది. గ్రామానికి చెందిన దామ కళావతి (65) మృతి చెందగా, ఆటో డ్రైవర్ గాండ్ల లక్ష్మణ్ (వార్డు మెంబర్) పరిస్థితి విషమంగా ఉంది. గాయాలపాలైన వారిలో పిప్పెర రామవ్వ, ఎర్రమోల్ల వాణి, వడ్లూరి భా రతి, కమ్మరి భూలక్ష్మి, మంజునాథ చంద్రభాగ్య, బూస గంగవ్వ, పత్తిపాట గంగవ్వ, టెక్మాల్ జమున, జారజి సాయమ్మ, జారజి భాగిర్తి, గంగవ్వ, మౌనిక ఉన్నారు. మృత్యుంజయురాలు కీర్తన.. ఈ ప్రమాదంలో మూన్నెళ్ల కీర్తన మృత్యుంజయురాలు గా నిలిచింది. కారు ఢీకొనగానే ఆటో పల్టీలు కొట్టింది. అయితే ఆటోలో ఉన్న మౌనిక చేతుల్లోంచి కూతురు కీర్తన రోడ్డుపక్కన ఎండుగడ్డిపై ఎగిరి పడింది. దీంతో చిన్నారి కాలికి చిన్నగాయమై ప్రాణాపాయస్థితి నుంచి తప్పించుకుంది. అందరూ గడ్డికుప్పపైనే పడడంతో ప్రా ణాలతో బయటపడ్డారని స్థానికులు పేర్కొన్నారు. ఎలాగైనా ప్రాణాలు కాపాడండి.. ఒకేసారి సుమారు 15మంది క్షతగాత్రులు, వారి బంధువుల రోదనలు జిల్లాస్పత్రిలో మిన్నంటాయి. అస్పత్రిలో కారు డ్రైవర్ కిషోర్కుమార్ మృతిచెందగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆటోలో ప్రయాణించిన దేగ కళావతి(65) మృతి చెందింది. ఆస్పత్రిలో భర్త మృతి చెంది, కొడుకు సాత్విక్ ప్రాణాపాయస్థితిలో ఉండడంతో ఎలా గైనా సాత్విక్ ప్రాణాలు కాపాడాలని తల్లి చంద్రకళ వైద్యులను ప్రాధేయపడడం అందరినీ కలిచివేసింది. -
సత్యదేవుని సన్నిధిలో ‘కిషోర్’ షూటింగ్
అన్నవరం : అభిషేక్ పిక్చర్స్ బ్యానర్పై హీరో నిఖిల్, నూతన హీరోయి¯ŒS రీతూ వర్మ జంటగా నటిస్తున్న ‘కిషోర్ ’ సినిమా షూటింగ్ సోమవారం అన్నవరంలో సత్యదేవుని సన్నిధిన జరిగింది. సత్యదేవుని వ్రతమండపం వద్ద హీరో, హీరోయి¯ŒSలు ప్రసాదం తింటున్న దృశ్యాలను దర్శకుడు సుధీర్వర్మ చిత్రీకరించారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ అన్నవరం దేవస్థానంలో చివరి షెడ్యూల్ను రెండ్రోజులు షూటింగ్ చేస్తామన్నారు. ప్రతీకారం ప్రధానాం శంగా సాగే సినిమాలో ఇక్కడ చిత్రీకరించే దృశ్యాలు కీలకమన్నారు. గతంలో ‘స్వామిరారా, దోచేవు’ సినిమాలకు దర్శకత్వం వహించానని, ఇది మూడో సినిమా అని చెప్పారు. హీరో నిఖిల్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘హ్యాపీడేస్’తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడని, ఆ తరువాత ‘ఆలస్యం..అమృతం, స్వామి రారా, కార్తికేయ’ వంటి సినిమాలతో మంచి పేరు తె చ్చుకున్నాడని తెలిపారు. ‘కిషోర్’లో లో రావు రమేష్, ఈషా కోపీకర్, అజయ్ తదితరులు నటిస్తున్నారని తెలిపారు. సినిమాకు నిర్మాత అభిషేక్ , కెమేరామ¯ŒS దివాకర్ అని, సంగీత దర్శకుడిని ఇంకా ఎంపిక చేయలేదని తెలిపారు. పాటలకు మాత్రం ముగ్గురు యువ సంగీత దర్శకులు బాణీలు సమకూర్చారని, ఫిబ్రవరి లేదా మార్చిలో విడుదల చేస్తామని చెప్పారు. -
సూరత్లో మరో నల్లకుబేరుడి బాగోతం
-
అరకు ఘాట్రోడ్డులో చెట్టును ఢీకొట్టిన కారు..
- ఐదుగురికి గాయాలు అరకులోయ(విశాఖ) వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టిన ఘటనలో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో ఒక బాలుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ సంఘటన విశాఖ జిల్లా అరకులోయలో సోమవారం ఉదయం చోటుచేసుకుంది. విశాఖపట్నంలోని రవిచంద్రనగర్కు చెందిన ఓ కుటుంబ సభ్యులు అరకు లోయ నుంచి తిరిగి వస్తుండగా.. ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కిషోర్(14)ను కేజీహెచ్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. -
తమిళ నిర్మాతలు లేకుంటే రాజ్కుమార్ లేరు!
తమిళ నిర్మాతలు అవకాశం ఇవ్వకుంటే కన్నడ నటుడు రాజ్కుమార్ ఎక్కడుండేవారని సీనియర్ నిర్మాత వీసీ.గుహనాథన్ ప్రశ్నించారు.నటుడు కిశోర్, కరుణాకరన్ కథానాయకులుగా నటి స్తున్న చిత్రం గడియాగార మనిదర్గళ్. క్రిస్ట్ పి.ది ఇంటర్నేషనల్ ప్రొడక్షన్ పతాకంపై ప్రవీష్. కే.ప్రదీప్ జోష్ నిర్మిస్తున్నారు. నిర్మాతల్లో ఒకరైన ప్రదీప్ జోష్ ముఖ్య పాత్ర పోషిస్తున్న ఈ చిత్రం ద్వారా వైగరై బాలన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.ఈయన దర్శకుడు శశికుమార్ శిష్యుడన్న విషయం గమనార్హం. అద్దె ఇళ్ల నివాసుల ఇతి బాధలను ఆవిష్కరించే చిత్రంగా తెరకెక్కుతున్న ఈ గడిగార మనిదర్గళ్ చిత్రంలో షెరీన్ కథానాయకిగా పరిచయం అవుతున్నారు. ఇతర ముఖ్య పాత్రల్లో లతారావ్, వాసు విక్రమ్, బాలాసింగ్, సిజర్మనోహర్, పావా లక్ష్మణ్, సౌందర్, షీలాగోపి, మాస్టర్ రిషీ నటిస్తున్నారు. సీఎస్.శ్యామ్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం ప్రచార చిత్రం, ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారం ఉదయం స్థానిక సాలిగ్రామంలోని ప్రసాద్ల్యాబ్లో జరిగింది.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కే.భాగ్యరాజ్, వీసీ.గుహనాథన్, కదిరేశన్, పీఎల్.తేనప్పన్ పాల్గొన్నారు. వీసీ.గుహనాథన్ మాట్లాడుతూ కులమతాలకు, భాషలకు అతీతం కళాకారులని పేర్కొన్నారు. అలాంటి కళాకారులు నీటి కోసం జరిగే పోరాటంలో జోక్యం చేసుకోరాదన్నారు. దురదృష్టవశాత్తు కర్ణాటకలో ఇదే జరుగుతుందన్నారు. నిజం చెప్పాలంటే కన్నడ నటుడు రాజ్కుమార్ తమిళ నిర్మాతలు ఏవీ.మెయప్పన్, సీఆర్.బసవరాజు లాంటి వారు నిర్మించిన బేడర కన్నప్ప చిత్రం లేకపోతే ఎక్కడుండేవారని ప్రశ్నించారు.అలాంటి రాజ్కుమార్కు చెందిన వారు కావేరి నీటి విషయంలో సమస్యలు సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దర్శక నటుడు కే.భాగ్యరాజ్ మాట్లాడుతూ వీసీ.గుహనాథన్ ఎప్పుడూ భావోద్రేకంతో మాట్లాడతారని, అయినా ఆయన మాటల్లో న్యాయం ఉంటుంద ని అన్నారు. ఇది భావోద్రేకాలకు గురైయ్యే పరిస్థితి అని వ్యాఖ్యానించారు. ఇక ఈ గడిగార మనిద ర్గళ్ చిత్ర విషయానికి వస్తే మంచి విషయం ఉన్న దర్శకుడు శశికుమార్ శిష్యుడు దర్శకత్వం వహిస్తున్న చిత్రం కాబట్టి ప్రేక్షకుల ఆదరణ పొందుతుందని భావించవచ్చునన్నారు.అదే విధంగా కిషోర్ నటిస్తున్నారంటే కచ్చితంగా కథలో కొత్తదనం ఉంటుందని అన్నారు. గడియార మనిదర్గళ్ చిత్రం మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో నటుడు కిషోర్, నటి షెరీన్, ప్రదీప్ జోష్, నిర్మాత ప్రవీష్.కే, దర్శకుడు వైగరై బాలన్ పాల్గొన్నారు. -
చీకట్లో ఒకరోజు...
పట్టుకోండి చూద్దాం ‘‘నువ్వు ఆ సృజనను పెళ్లి చేసుకుని ఉంటే ఇలా అద్దె ఇంట్లో కాకుండా ఏడంతస్తుల మేడలో కాలు మీద కాలు వేసుకొని సుఖంగా జీవించేవాడివి. నాలో ఏం నచ్చి పెళ్లి చేసుకున్నావు?’’ అని అడిగింది జానకి. జానకిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు కిశోర్. ఈ పెళ్లి వాళ్ల ఇంట్లో వాళ్లకు ఎంతమాత్రం ఇష్టం లేదు. కిశోర్ మేనత్త సుజాత కోటీశ్వరురాలు. భర్త చిన్నవయసులోనే చనిపోయినా అధైర్యపడకుండా నలుగురు గొప్పగా చెప్పుకునే పారిశ్రామికవేత్తగా ఎదిగింది. చిన్నస్థాయి నుంచి కోట్లు సంపాదించే పారిశ్రామికవేత్తగా ఎదిగిన సుజాత అంటే చుట్టాలు పక్కాలలో చాలా గౌరవం. ఆమె జీవితాన్ని పిల్లలకు పాఠాలుగా చెబుతుంటారు. సుజాతకు ఒకే కూతురు. పేరు సృజన. సృజనకు కిశోర్ అంటే చెప్పలేనంత ఇష్టం. పెళ్లంటూ చేసుకుంటే అతడినే చేసుకుంటానని పట్టుబట్టింది. అతి కష్టం మీద కూతురు కోరికను మన్నించింది సుజాత. అయితే మరోవైపు పరిస్థితి భిన్నంగా ఉంది. కిశోర్ తన కొలిగ్ అయిన జానకిని ప్రేమించాడు. సృజన ప్రపోజల్ని తిరస్కరించి జానకిని పెళ్లి చేసుకున్నాడు. ‘‘కిశోర్ తెలివితక్కువ నిర్ణయం తీసుకున్నాడు’’ అంటూ చాలామంది తిట్టారు. ఇక కుటుంబ సభ్యులైతే కిశోర్తో మాట్లాడడమే మానేశారు. ఒక విధంగా చెప్పాలంటే తమ నుంచి బహిష్కరించారు. తల్లిదండ్రులకు దూరంగా హైదరాబాద్లో ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ భార్యతో పాటు ఉంటున్నాడు కిశోర్. ‘‘కిశోర్ స్థానంలో వేరే ఎవరినీ భర్తగా ఊహించలేను. నేను ఎవరినీ పెళ్లి చేసుకోను’’ అంది సృజన. కూతురికి రకరకాలుగా చెప్పి చూసింది సుజాత. ఒక సైకియాట్రిస్ట్ దగ్గరకు తీసుకెళ్లి కౌన్సిలింగ్ కూడా చేయించింది. అయినా ఫలితం లేదు. ‘‘కిశోర్ను తప్ప ఎవరినీ భర్తగా ఊహించలేను’’ అని ఎప్పటిలాగే చెబుతుంది తప్ప ‘పెళ్లి చేసుకుంటాను’ అనడం లేదు సృజన. తన కూతురి జీవితాన్ని ఎడారి చేసిన కిశోర్ అంటే సుజాతకు అసహ్యం ఏర్పడింది. ‘‘ఏ భార్యను చూసి అయితే మురిసిపోతున్నావో... ఆ భార్య వల్లే చనిపోతావు’’ అని కిశోర్ను కసిగా తిట్టుకుంది సుజాత. ఆరోజు కిశోర్, జానకీల పెళ్లి రోజు. పెళ్లి చేసుకోవడానికి తాము ఎన్నెన్ని ఇబ్బందులు పడ్డారో ఒకసారి గుర్తుతెచ్చుకున్నారు ఇద్దరు. ‘‘నువ్వు ఆ సృజనను పెళ్లి చేసుకుని ఉంటే ఇలా అద్దె ఇంట్లో కాకుండా ఏడంతస్తుల మేడలో కాలు మీద కాలు వేసుకొని సుఖంగా జీవించేవాడివి. నాలో ఏం నచ్చి పెళ్లి చేసుకున్నావు?’’ అని అడిగింది జానకి. ‘‘నీ మనసు చూసి పెళ్లి చేసుకున్నాను. మంచి మనసును కోట్లతో కొలవలేము’’ అన్నాడు కిశోర్. కొద్దిసేపటి తరువాత.... ‘‘నేను క్రికెట్ మ్యాచ్ చూస్తాను’’ అంటూ టీవి ముందు వాలిపోయాడు కిశోర్. జానకి తన గదిలోకి వెళ్లి పుస్తకం చదువుకుంటుంది. కొద్దిసేపటి తరువాత కరెంట్ పోయింది. కొత్తగా ఇల్లు మారారు. ఇంట్లో వెలిగించడానికి ఒక్క క్యాండిల్ కూడా లేదు. జానకి సెల్ఫోన్ రిపేర్లో ఉంది. కరెంట్ వచ్చేలోపే కిశోర్ హత్యకు గురయ్యాడు. పోలీసులు సంఘటన స్థలానికి వచ్చారు. జానకిని ఎంక్వ్యేరీ చేశారు. ‘‘ఆయన టీవీ చూస్తున్నారు. కొద్దిసేటి తరువాత కరెంట్ పోయింది. నేను గది నుంచి బయటకు రాలేదు. పుస్తకం చదువుతూ కూర్చున్నాను’’ అని చెప్పింది జానకి. ఇంట్లో వెలిగించడానికి ఒక్క క్యాండిల్ కూడా లేదు. జానకి సెల్ఫోన్ రిపేర్లో ఉంది. మరి ఆ చీకట్లో ఆమె పుస్తకం ఎలా చదవగలిగింది? పోలీసులు జానకిని ఎందుకు అనుమానించలేదు? Ans: పోలీసులు జానకిని అనుమానించకపోవడంలో ఎలాంటి తప్పులేదు. జానకి అంధురాలు. ఆ చీకట్లో ఆమె చదివింది బ్రెయిలీ బుక్. దీన్ని చదవడానికి వెలుగుతో పని లేదు కదా! -
సెప్టెంబర్లో నిశ్శబ్దం
చాలా నిశ్శబ్దంగా చిత్రీకరణ పూర్తి చేసుకున్న చిత్రం నిశబ్దం. నవ నటుడు అజయ్ కథానాయకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రంలో నాడోడగళ్ చిత్రం ఫేమ్ అభినయ నాయకిగా నటించారు.ఇతర ముఖ్య పాత్రల్లో బేబీ సాంతన్య, కిషోర్,ప్రముఖ కన్నడ నటుడు రామకృష్ణ, దర్శకుడు ఏ.వెంకటేశ్ తదితరులు నటించిన ఈ చిత్రాన్ని తిరుమతి ఎంజలిన్ డావన్సీ మిరాకిల్ పిక్చర్స్ పతాకంపై కృపా కితియోన్, జయరతి లారెన్స్,పురట్చి క్లా,వలర్మదన్,పెరుమాళ్లు కలిసి నిర్మిస్తున్నారు. మైఖెల్అరుణ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి షాన్ జలీస్ సంగీతాన్ని అందిస్తున్నారు. చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ ఇది బెంగుళూర్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్న చిత్రం అని చెప్పారు.బెంగళూర్లో నివసించే ఒక తమిళ కుటుంబం చుట్టూ తిరిగే కధతో రూపొందిస్తున్న చిత్రం నిశబ్ధం అని తెలిపారు. ఇది మానవ విలువలను ఆవిష్కరించే చిత్రంగా ఉంటుందన్నారు.ఈ చిత్రం కోసం ఇటీవల కన్నుమూసిన గీత రచయిత నా.ముత్తుకుమార్ రాసిన మన్మీదు పొన్నాయ్ వందాయ్ కన్నే అనే పాట ఆయనకు మరిసారి జాతీయ అవార్డును అందిస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.చిత్ర షూటింగ్ పూర్తి అయ్యిందని, నిర్మాణాంతర కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్నాయనీ తెలిపారు.చిత్రాన్ని సెప్టెంబర్ చివరిలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు దర్శకుడు మైఖెల్ అరుణ్ తెలిపారు. -
సైన్స్ను ప్రజలకు దగ్గర చేయాలి: గాదరి కిషోర్
మోత్కూరు: గ్రామాల్లో పేరుకపోయిన మూడనమ్మకాలను దూరంచేసి శాస్త్రసాంకేతిక రంగాలు అందజేస్తున్న విజ్ఞానాన్ని క్షేత్ర స్థాయిలో ప్రజలకు దగ్గర చేయాలని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ అన్నారు. ఆదివారం మోత్కూరులో జన విజ్ఞానవేదిక రెండో జిల్లా మహాసభలు ఎస్ఎం పంక్షన్హాల్లో జరిగాయి. డివిజన్ గౌరవ అధ్యక్షుడు జి.లక్ష్మీనర్సింహ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే కిషోర్ మాట్లాడుతూ ప్రజల్లో సృజనాత్మకతను పెంచాలని అన్నారు. వ్యవస్థలో మమేకమై ప్రజల్లో నెలకొన్న రుగ్మతులను పారతోలడానికి కృషిచేస్తున్న జనవిజ్ఞాన వేదికను అభినందించారు. జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ లక్ష్మారెడ్డి మాట్లాడుతూ మానవ ప్రగతి–సైన్స్ పాత్ర అనే అంశంపై అవగాహన కల్పించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటి రమేష్ మాట్లాడుతూ ప్రయోగశాలల్లో జరిగే ఫలితాలు, క్షేత్రస్థాయిలో ప్రజలకు చేరే విధంగా పాలకులు విద్యావంతులు కృషిచేయాలని అన్నారు. ఆధునిక శాస్త్రసాంకేతిక విజ్ఞాన ఫలాలు ప్రజలకు అందించడమే లక్ష్యంగా తమ వేదిక పనిచేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఫ్రొఫెసర్ కోయ వెంకటేశ్వర్రావు, ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు అందె సత్యం, ఎంపీపీ ఓర్సులక్ష్మీపురుషోత్తం, జెడ్పీటీసీ చింతల వరలక్ష్మీవిజయభాస్కర్రెడ్డి, సింగిల్విండోచైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి, ఎంపీటీసీ జంగ శ్రీను తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో అన్నచెల్లెలు మృతి
పరీక్ష రాయటానికి వెళ్తున్న ఓ యువతి, ఆమె సోదరుడు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. తర్లుపాడు మండలంలోని భూపతిపల్లికి చెందిన పులికూరి మరియన్న కుమార్తె ప్రశాంతి(18) గురువారం ఉదయం జరుగనున్న ఇంటర్ సప్లిమెంటరీ పరీక్ష రాయటానికి బయలుదేరింది. ఈ పరీక్షకు తండ్రితో పాటు ప్రశాంతి, సోదరుడు కిశోర్(20) కూడా బయలుదేరాడు. ముగ్గురూ టూవీలర్పై పరీక్ష కేంద్రమైన కంభం పట్టణంలోని సీఎల్ఆర్ కళాశాల వద్దకు చేరుకున్నారు. పరీక్ష కేంద్రం ఎదురుగా మరియన్న వాహనం దిగిపోగా అన్నాచెల్లెలు లోపలికి వెళ్లేందుకు యూ టర్న్ తీసుకుంటున్నారు. అదే సమయంలో వేగంగా వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో వారిద్దరూ అక్కడికక్కడే చనిపోయారు. -
తిరుమల ఘాట్రోడ్డులో ప్రమాదం
- దంపతులకు గాయాలు తిరుమల తిరుమల ఘాట్రోడ్డులో సోమవారం ఉదయం జరిగిన ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన నంది కిశోర్, శ్రావణి దంపతులు తిరుమల ఆలయానికి వెళ్తుండగా ఒకటో ఘాట్రోడ్డు 26వ నంబర్ మలుపు వద్ద ప్రమాదవశాత్తు బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో దంపతులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే టీటీడీ ఆస్పత్రికి తరలించారు. -
రియాక్టర్లో పేలుడు కార్మికులకు గాయాలు
మెదక్ జిల్లా జిన్నారం మండలం గడ్డపోతారం పారిశ్రామిక వాడలో ఆదివారం ప్రమాదం చోటు చేసుకుంది.ఓ కంపెనీలో రియాక్టర్ పేలిపోవడంతో ఇద్దరు కార్మికులకు గాయాలయ్యాయి. ఫ్యాక్టరీల ఇన్స్పెక్టర్, కార్మికుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. గడ్డపోతారం పారిశ్రామిక వాడలోని యగ్మగ్ పరిశ్రమలో ఎప్పటిలాగే కార్మికులు రియాక్టర్ వద్ద విధులు నిర్వహిస్తున్నారు. ప్రమాద వశాత్తు రియాక్టర్లో ఉండే రసాయనాల వత్తిడి ఎక్కువ అవ్వటంతో రియాక్టర పైకప్పుడు భారీ శభ్దంతో ఒక్క సారిగా పేలిపోయింది. దీంతో రియాక్టర్ వద్ద విధులు నిర్వహిస్తున్న ఋషీ, కిషోర్ల ఒంటిపై రసాయనాలు పడటంతో తీవ్రంగా గాయపడ్డారు. వీరిని షాపూర్ నగర్లోని ఓ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. -
అలా చెప్పుకోవడానికి గర్వంగా ఉంది
‘‘చాలా మంది నిర్మాతలు, దర్శకులు తమ బిడ్డలను హీరోలను చేయడంతో పాటు, వాళ్లని అగ్రస్థాయికి తీసుకెళ్లడానికి కృషి చేస్తున్నారు. కానీ, నా బిడ్డలకు అదృష్టం లేదని బాధపడేవాణ్ణి. అయితే, ఇండస్ట్రీలో ఉన్నది డెబ్భై శాతం మంది నా బిడ్డలే అని చెప్పుకోవడం గర్వంగా ఉంది’’ అని దర్శకరత్న దాసరి నారాయణరావు అన్నారు. బ్రహ్మానందం, ‘వెన్నెల’ కిషోర్ ముఖ్య తారలుగా రేలంగి నరసింహారావు దర్శకత్వంలో మారెళ్ల నరసింహారావు, వద్దెంపూడి శ్రీనివాసరావు నిర్మిస్తున్న చిత్రం ‘ఎలుకా మజాకా’. ఈ చిత్రం లోగోను దాసరి ఆవిష్కరించారు. ‘‘మురళీ రామ్మోహనరావు రాసిన ‘ఎలుక వచ్చె ఇల్లు భద్రం’ నవల ఆధారంగా ఈ చిత్రం తీశాను. గ్రాఫిక్స్ ఓ హైలైట్’’ అని దర్శకుడు చెప్పారు. -
హారర్ బెల్
వైవిధ్యమైన కథాంశంతో హారర్ థ్రిల్లర్గా రూపొందిన చిత్రం ‘కాలింగ్ బెల్’. రవివర్మ, కిషోర్, సంకీర్త్, వ్రితి ఖన్నా ముఖ్య తారలుగా నటించిన ఈ చిత్రాన్ని పన్నా రాయల్ దర్శకత్వంలో అనూద్ నిర్మించారు. నిర్మాత మాట్లాడుతూ -‘‘ఉన్నత సాంకేతిక విలువలతో ఈ చిత్రాన్ని రూపొందించాం. ఈ నెల 13న పాటలను విడుదల చేస్తున్నాం’’ అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: సుకుమార్.పి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: షాని సోలోమన్. -
రైలు నుంచి జారిపడి విద్యార్థి దుర్మరణం
బొబ్బిలి: గ్రామ దేవతకు పండుగకు కొడుకు వస్తున్నాడని ఆ తల్లిదండ్రులు సంబర పడిపోయారు. బయట ఊరిలో చదువుతూ ఇంటికి వస్తున్న కుమారుడి కోసం అన్ని ఏర్పాట్లూ చేశారు. కానీ అంతలోనే ఆ కుర్రాడు చనిపోయాడనే వార్త వినాల్సి రావడంతో వారు తల్లడిల్లిపోతున్నారు. ఒక్క రోజు ముందు రైల్వే స్టేషన్లో కలిసి మాట్లాడిన కొడుకు ఇక లేడని తెలిసి ఆ తండ్రి కంటికీ మింటికీ ఏకధారగా ఏడుస్తున్నారు. బొబ్బిలి రైల్వే స్టేషన్లో మంగళవారం ఉదయం బాడంగికి చెందిన మరడా న కిశోర్(17) అనే విద్యార్థి హఠియా-యశ్వంత్పూర్ రైలు నుంచి జారి పడి మృతి చెందాడు. పూర్తి వివరాల్లోకి వెళితే... కిశోర్ విజయవాడలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో మెకానికల్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. తండ్రి పాపారావు, తల్లి లక్ష్మిలకు కిశోర్ ఒక్క డే కొడుకు. గతంలో వీరికి ఓ కుమార్తె పుట్టి మరణించడంతో కిశోర్ను అల్లారు ముద్దుగా పెంచుతున్నారు. పాపారావు కుటుంబ పోషణ కోసం కొన్నాళ్ల కిందట చెన్నై వలస వెళ్లారు. ప్రస్తుతం బాడంగిలో పోలమ్మ గ్రామదేవత పండుగ జరుగుతోంది. ఈ పండుగ కోసం ఆయన ఇంటికి వస్తూ విజయవాడ రైల్వే స్టేషన్లో కిశోర్ను కలిశారు. పండుగకు ఇంటికి రావాలని కొడుకుకు చెప్పారు. తనకు పరీక్షలున్నాయని, రాలేనని చెప్పి కిశోర్ తండ్రిని రైలు ఎక్కించి వెళ్లిపోయాడు. దీంతో పాపారావు సోమవారం ఇంటికి చేరుకున్నాడు. ఆ తర్వాత కిశోర్ ఇంటికి ఫోన్ చేసి ఫ్రెండ్సతో కలిసి పండుగకు మంగళవారం ఇంటికి వస్తున్నానని చెప్పాడు. ఫ్రెండ్సతో కలిసి విజయవాడ నుంచి బొబ్బిలికి హఠియా నుంచి యశ్వం త్పూర్ వస్తున్న రైలు ఎక్కాడు. ఆ రైలుకు బొబ్బిలి రైల్వే స్టేషనులో హాల్ట్ లేదు. పార్వతీపురంలో దిగి వెనక్కి రావాలి. అయితే బొబ్బిలి స్టేషన్లో ట్రైన్ కాస్త నెమ్మది కావడంతో కిశోర్ దిగడానికి ప్రయత్నించి జారిపడిపోయాడు. ప్రమాదం జరిగి గాయపడిన కాసేపటికే వి ద్యార్థి మృతి చెందాడు. ఈ వార్త తెలియగానే కిశోర్ తల్లిదండ్రులు నిశ్చేష్టులయ్యారు. రైలు నుంచి జారిపడి తీవ్రంగా గాయపడిన కిశోర్ తల్లిదండ్రులతో అప్పుడు కూడా ఫోన్లో మాట్లాడి తనకేమీ కాలేదని, ఆస్పత్రికి వెళ్లి వైద్యం చేయించుకొని ఇంటికి వచ్చేస్తానని చెప్పాడు. కానీ ఆ కొద్ది సేపటికే ప్రాణాలు వదిలేశాడు. దీంతో గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది. పం డగకి రాను రాను అంటూ వచ్చి వెళ్లిపోయావా... అంటూ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. రైల్వే పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
తాపీ ధర్మారావు కృషికి మరో దివిటీ...
మంచి పుస్తకం తాపీ ధర్మారావు గురించి మనం ఎక్కువగా వింటామా తక్కువగా వింటామా? సాహితీ సభల్లో, పాఠ్య పుస్తకాల్లో, విమర్శనా సాంప్రదాయంలో తాపీ ధర్మారావు పేరు ‘తాపీ’గా వినిపిస్తుందా తరుచుగా తారసపడుతుందా? రెండోదే నిజమైతే దానికి ‘కారణం’ అంటూ ఉందా? ఇలాంటి సందేహాలు కొందరికి రావచ్చు. ‘ఆయన ఫలానా వర్గం కాబట్టి అణిచేశారు’ అని ఎవరైనా అభిప్రాయపడితే నిప్పు లేనిదే పొగ రాదని అర్థం చేసుకునే అవకాశం ఉండొచ్చు. ఏటిప్రవాహం ఈడ్చుకెళితే గట్టున పడేవారు కొందరు. ఏటికి ఎదురీది ఒడ్డున నిలబడేవారు కొందరు. తాపీ ధర్మారావు రెండో కోవకు చెందుతారు. కవిగా, విమర్శకుడిగా, పరిశోధకుడిగా, పత్రికా నిర్వాహకునిగా, సినీ రచయితగా ఆయన వేసిన ముద్ర సామాన్యమైనది కాదు. ‘కొత్తపాళీ’, ‘పాతపాళీ’, ‘పెళ్లి-దాని పుట్టుపూర్వోత్తరాలు’, ‘దేవాలయాల మీద బూతు బొమ్మలెందుకు’, ‘ఇనప కచ్చడాలు’, ‘ఆలిండియా అడుక్కు తినేవారి మహాసభ’, ‘సాహితీ మొర్మరాలు’ వంటి రచనలు, ‘మాలపల్లి’, ‘పల్లెటూరి పిల్ల’, ‘భీష్మ’ తదితర సినిమా రచనలు ఆయనను చెరపడానికి వీలులేని పేరును చేశాయి. ముఖ్యంగా దేవాలయాల మీద బూతుబొమ్మలెందుకు పుస్తకం ఆనాటి భారతీయ సమాజంతో పోలిస్తే తెలుగు సమాజ విచారధారను ముందంజలో పెడుతూ తెచ్చిన పుస్తకంగా భావించాలి. మాట మెత్తగా ఉన్నా అభిప్రాయం సూటిగా, కటువుగా చెప్పడంలో తాపీ ముందుండేవారు. ఒకనాడు గ్రాంథికాన్ని వెనకేసుకొచ్చి స్వయంగా తన గురువుగారైన గిడుగు రామమూర్తి పంతులుగారి మీదే యుద్ధం చేశారు. కాని కాలక్రమంలో వాడుక భాష విలువ తెలిసి గ్రాంథికం మీద అంతే తీవ్రంగా విరుచుకుపడ్డారు. చేమకూర వెంకటకవి విజయ విలాసం కావ్యానికి తాపీ రాసిన ‘హృదయోల్లాస వ్యాఖ్య’ను పండితులు గౌరవంగా ఎంచుతారు. ఈ వివరాల్నీ, తాపీ స్ఫూర్తినీ ఈ తరం పాఠకులకు అందించాలనే ఉద్దేశ్యంతో తెచ్చిన పుస్తకం ‘చెరగని స్ఫూర్తి- తాపీ ధర్మారావు’. డా.నాగసూరి వేణుగోపాల్, డా.సామల రమేశ్బాబు సంపాదకత్వంలో వెలువడిన ఈ పుస్తకంలో తాపీ మీద డా.ఏటుకూరి ప్రసాద్, నార్ల, కె.ఎస్.చలం, పొత్తూరు వేంకటేశ్వరరావు, వి.ఎ.కె.రంగారావు, కడియాల రామమోహనరాయ్ వంటి పెద్దలు రాసిన వ్యాసాలు, తాపీ కుటుంబ సభ్యుల జ్ఞాపకాలు, ఇంకా తాపీ అసంపూర్ణ ఆత్మకథ ‘రాలూ రప్పలూ’లోని కొన్ని భాగాలు ఉన్నాయి. అన్నీ తాపీగారి కృషిని, పట్టుదలనూ, జీవన గమనాన్ని, వ్యక్తిత్వాన్నీ విశదం చేసేవే. చాలా మంచి పుస్తకం. సాహితీ ప్రియులందరూ పరిశీలించదగ్గ పుస్తకం. - నెటిజన్ కిశోర్ చెరగని స్ఫూర్తి తాపీ ధర్మారావు డా.నాగసూరి వేణుగోపాల్, డా. సామల రమేశ్బాబు వెల: రూ. 150 ప్రతులకు: 9848016136 -
పేదలపై కేసులు.. పెద్దల వద్ద మామూళ్లా?
వేమనపల్లి : అక్రమంగా నల్లబెల్లం, పటిక, అమ్మోనియా, అధిక ధరలకు మద్యం అమ్మతున్నా పట్టించుకోవడం లేదని ఎస్సీ కాలనీవాసులు ఎక్సైజ్ అధికారులను నిలదీశారు. పేదలు గుడుంబా కాస్తే కేసులు పెడతామంటూ భయభ్రాంతులకు గురిచేయడం ఏమిటని ప్రశ్నించారు. మండలంలోని ఎస్సీ కాలనీలో ఎక్సైజ్ ఎస్సై కిశోర్ ఆధ్వర్యంలో అధికారులు దాడులు నిర్వహించి కుమ్మరిమల్లక్క ఇంట్లో చొరబడి హైరానా చేశారు. ఇంట్లోని వస్తువులు చిందరవందరగా పడవేసి బెల్లం నాన పోసి ఉంచిన కుండలను ధ్వంసం చేశారు. దీంతో కాలనీవాసులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. గుడంబా కాస్తే కేసులు పెట్టే మీరు గ్రామంలో విచ్ఛలవిడిగా అధిక ధరలకు మద్యం అమ్ముతున్నా పట్టించుకోరెందుకని నిలదీశారు. పాఠశాలల ముందు అక్రమంగా బెల్ట్షాపులు, సిట్టింగ్లు పెట్టి అధిక ధరలకు మద్యం అమ్ముతున్నా వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని వాగ్వాదానికి దిగారు. మహారాష్ట్రకు రోజుకు లక్షల విలువ చేసే మద్యం అక్రమంగా రవాణా చేస్తున్నా.. మామాళ్లు తీసుకుని వదిలివేస్తున్నారని ఆరోపించారు. దీంతో అధికారులు చేసేదేమీ లేక అక్కడి నుంచి వెళ్లిపోయారు. -
అధ్యాపకుడు.. ప్రేమ పేరుతో వంచించాడు
* భవనం పైనుంచి దూకి యువతి ఆత్మహత్యాయత్నం * మూడేళ్లుగా ప్రేమించి పెళ్లికి నిరాకరించడమే కారణం * నడుముకు తీవ్ర గాయాలు.. విజయవాడ తరలింపు * జంగారెడ్డిగూడెం మండలం ఉప్పలమెట్టలో ఘటన ఏలూరు (వన్టౌన్) : పేదరికంలో మగ్గిపోతున్న తమ కుటుంబాన్ని బాగా చదివి ఆదుకోవాలనుకున్న ఆ యువతి ఆశయాలను కామాంధుడైన అధ్యాపకుడు కాల రాశాడు. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయంతో ఉన్నత శిఖరాలు అధిరోహించాల్సిన యువతి చివరకు నడుం విరగ్గొట్టుకుని ఆసుపత్రి పాలైంది. బాధితురాలు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. జంగారెడ్డిగూడెం మండలం ఉప్పలమెట్టకు చెందిన నాగేశ్వరరావు, నాగమణి కుమార్తె బాదిన బేబీషాలిని జంగారెడ్డిగూడెం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్లో చేరింది. అదే కళాశాలలో కాంట్రాక్ట్ పద్ధతిలో బోటనీ లెక్చరర్గా పనిచేస్తున్న తాడేపల్లిగూడెం మండలం జగన్నాథపురానికి చెందిన ఎన్.కిషోర్ బేబిషాలినితో ప్రేమలో పడ్డారు. మూడేళ్లుగా ఆమెతో వివాహేతర సంబంధం కొనసాగించాడు. ఇంటర్ అనంతరం షాలినిని డిగ్రీ చేయనివ్వకుండా టీచర్ ట్రైనింగ్ కోర్సులో చేరాలని పట్టుబట్టాడు. బిఫార్మసీ ఫ్రీసీటు వచ్చినా వద్దని వారించాడు. ఈ క్రమంలో షాలినీ, ఆమె కుటుంబ సభ్యులు అతని వద్ద పెళ్లి ప్రస్తావన తీసుకువచ్చారు. అయితే తనకు రూ.ఐదు లక్షలు కట్నం కావాలని కిషోర్ తేల్చి చెప్పాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన యువతి గురువారం భవనం పైనుంచి దూకి ఆత్మహత్యకు ప్రయత్నించింది. వెంటనే బంధువులు, కుటుంబ సభ్యులు జంగారెడ్డిగూడెం ఏరియా ఆస్పత్రికి తరలించగా, చికిత్స చేసిన వైద్యులు యువతి నడుం విరిగిందని మెరుగైన చికిత్స అందించాలని వారికి సూచించారు. దీంతో శుక్రవారం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిందితుడికి నేతల అండదండలు గురువారం రాత్రి పదిగంటల సమయంలో జరిగిన ఈ ఘటనపై పోలీసులు శుక్రవారం సాయంత్రం వరకు కేసు నమోదు చేయలేదు. రాత్రి ఆస్పత్రిలో బాధితురాలు చెప్పిన వివరాల ప్రకారం కేసు నమోదు చేయాల్సిన జంగారెడ్డిగూడెం పోలీసులు చోద్యం చూస్తూ ఉండిపోయారు. నిందితుడు కిషోర్కు కొందరు అధికార పార్టీ నేతలు అండగా నిలిచి కేసు లేకుండా చేసేందుకు విఫలయత్నం చేసినట్టు తెలిసింది. విషయం మీడియా ద్వారా వెలుగులోకి రావడంతో పోలీసులు హడావుడిగా ఏలూరు చేరుకుని అప్పటికప్పుడు బాధితురాలి స్టేట్మెంట్ను రికార్డ్ చేశారు. అతనితోనే పెళ్లి చేయాలి ‘కిషోర్ను ఏమీ చేయవద్దని, అతనితో తనకు పెళ్లి చేయాలి’ అని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న షాలినీ శుక్రవారం విలేకరుల వద్ద వాపోయింది. యువతి తల్లిదండ్రులు కూడా తాము పేదోళ్ళం బాబు మా కూతురికి అతనితో పెళ్లి జరిగితే చాలయ్యా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. షాలినీకి ఇంకా మెరుగైన చికిత్స అందించాలని వైద్యులు సూచించడంతో బంధువులు, కుటుంబ సభ్యులు ఆమెను గుంటూరు తరలించారు. -
విచారణ ప్రారంభం
కడప అగ్రికల్చర్ : ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల్లో అక్కడక్కడ జరిగిన అవకతవకలపై సీబీసీఐడి విచారణ ప్రారంభించింది. సొసైటీలలో జరిగిన అవకతవకలపై విచారణ జరుపుతామని ఇటీవల శాసనసభలో ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు గురువారం తిరుపతి సీబీసీఐడీ డీఎస్పీ కిశోర్ జిల్లా కేంద్రంలోని కేంద్ర సహకార బ్యాంకుకు వచ్చి సమాచారాన్ని సేకరించారు. అనంతరం పుల్లంపేట మండలం అనంతయ్యగారిపల్లె, అనంతంపల్లె, అనంతసముద్రం ప్రాథమిక వ్యవసాయ సహకార సొసైటీలలోని రికార్డులను తనిఖీ చేశారు. తిరుపతి నుంచి వచ్చిన సీబీసీఐడీ బృందం పదిరోజులపాటు జిల్లాలో ఉండి పలు విషయాలపై సమగ్రంగా విచారించనున్నట్లు తెలిసింది. పూర్తి స్థాయిలో తనిఖీలు నిర్వహించి తగిన చర్యలు తీసుకునేందుకు హైదరాబాదు నుంచి మరో బృందం జిల్లాకు రానున్నట్లు సమాచారం. -
సిటీ కుర్రాడి గిన్నిస్ ప్రయత్నం
టాటా.. బైబై.. వీడ్కోలు.. అయినా కళ్ల ముందు కదలాడే అనుబంధం.. మరపురానీయని మధుర జ్ఞాపకం.. పచ్చబొట్టు. అనాదిగా ఉన్నదే. పేరు మారి మళ్లీ కొంగొత్త సింగారంగా మనముందుకొచ్చిందే టాటూ. నాడు తాతా అవ్వల ఒంటి మీద పచ్చందనపు గుర్తే నేడు యువత సొగసుకు కొత్తరూపుతో వన్నెలద్దుతోంది. ఈ టాటూలు వేయడంలోనూ గిన్నిస్బుక్ రికార్డులూ బద్దలవుతున్నారుు. గత ఏడాదే అమెరికాకు చెందిన లేడీ టాటూనిస్ట్ 24 గంటల్లో 801 టాటూలు వేసి రికార్డు నెలకొల్పింది. ఆ రికార్డును తిరగరాయడానికి నేనున్నా అని రంగంలోకి దిగాడు... నగరానికి చెందిన కిషోర్ సందుప్తల. శనివారం ఉదయం 8 గంటలకు బంజారాహిల్స్లోని ‘గెట్ ఇంక్డ్’ టాటూ స్టూడియోలో మొదలైన ఈ టాటూయజ్ఞం ఆదివారం ఉదయం 8 వరకు కొనసాగనుంది. 803 టాటూలతో రికార్డు నెలకొల్పాలన్నదే ఆయన సంకల్పం. ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ... సిటీలో గత ఐదేళ్లుగా ఇదే వృత్తిలో కొనసాగుతున్నాడు టాటూయిస్ట్ కిషోర్. ‘రికార్డు సాధించడం ఒక్కటే కాదు.. ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ.. 2 చదరపు అంగుళాల టాటూను పరిచయం చేస్తున్నా’ అన్నాడు కిషోర్. అందుకు అమ్మ ఆశీర్వాదం కూడా ఉందంటున్నాడు. సాక్షి, సిటీప్లస్ -
తమ్ముడి చేతికి బ్యాట్
పోటీ నుంచి తప్పుకున్న కిరణ్కుమార్రెడ్డి పీలేరు బరి నుంచి సోదరుడు కిషోర్ నామినేషన్ నామినేషన్ వేసే వరకు గోప్యం ఓటమి భయంతోనే కిషోర్ని బరిలోకి తెచ్చారని ప్రచారం కిరణ్ నిర్ణయంతో జేఎస్పీ అభ్యర్థుల్లో సడలిన ఆత్మస్థైర్యం మ్యాచ్ ప్రారంభానికి ముందే జై సమైక్యాంధ్ర పార్టీ అధినేత కిరణ్కుమార్రెడ్డి చేతులెత్తేశారు. తమ్ముడి చేతికి బ్యాట్ ఇచ్చి తాను ప్రేక్షకుడి పాత్రకే పరిమితమయ్యారు. చెలరేగి ఆడతాడనుకున్న తమ నాయకుడు ముందే అస్త్రసన్యాసం చేయడంతో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఖంగుతిన్నారు. రాజకీయ భవిష్యత్తుపై పెట్టుకున్న అంతోఇంతో ఆశను వారు వదిలేసుకున్నారు. సాక్షి, తిరుపతి: జై సమైక్యాంధ్ర పార్టీ అధ్యక్షులు నేలవిడిచి సాముచేస్తున్నారు. నామినేషన్ల ఘట్టం చివరి రోజున మాజీ సీఎం కిరణ్కుమార్రెడ్డి సొంత నియోజకవర్గం పీలేరులో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. జేఎస్పీ తరపున కిరణ్ సోదరుడు కిషన్కుమార్రెడ్డి అలియూస్ కిషోర్కుమార్రెడ్డి నామినేషన్ దాఖలు చేయడం రా జకీయవర్గాలను విస్తుపోయేలా చేసింది. నామినేషన్ పత్రాలు దాఖలుచేసే వరకు కిరణ్కుమార్రెడ్డినే అభ్యర్థిగా భావించారు. చివరకు కిషోర్ పేరుతో నామినేషన్ వేయడంతో అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. పార్టీ అధ్యక్షులు ఎన్నికల బరి నుంచి తప్పుకోవడంతో ఆ పార్టీ అభ్యర్థులు షాక్కు గురయ్యారు. కిరణ్ వ్యూహం ఏమైనప్పటికీ అభ్యర్థులు మాత్రం ఆత్మస్థైర్యం కోల్పోయారు. ముందుండి నడిపించాల్సిన నాయకుడు యుద్దం లోకి వెళ్లకముందే అస్త్రసన్యాసం చేసినట్లు ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తం గా ప్రచారం చేయాల్సి ఉన్నందున కిషోర్ను పోటీకి దింపినట్లు కిరణ్ చెప్పడం సాకు మాత్రమేనని అంటున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్, టీడీపీ అధ్యక్షులు ఎన్నికల బరిలో ఉంటూనే ఆ పార్టీల అభ్యర్థుల విజయానికి కృషి చేస్తున్న వైనం గుర్తుచేస్తున్నారు. అంతా హైడ్రామా నామినేషన్ దాఖలుకు ముందు కిరణ్కుమార్రెడ్డి స్వగ్రామమైన నగిరిపల్లెలో అనుయాయులతో సమావేశమయ్యారు. ఆయన ఎక్కడా తాను పోటీ చేయనన్న విషయాన్ని బయటపెట్టలేదు. అందరితోనూ కలివిడిగా ఉన్నారు. కిరణ్కుమార్రెడ్డి పోటీ చేస్తున్నారనే ఆయన వర్గీయులు భావించారు. కిందటి వారం నగిరిపల్లెకు వచ్చిన ఆయన పీలేరు నుంచి తానే పోటీ చేస్తానని స్పష్టం చేశారు. ఈలోగా మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది. ముందు రోజు రాత్రి తన మనసులోని మాటను కిషోర్కుమార్రెడ్డికి తెలియజేసి ఆ మేరకు నామినేషన్ పత్రాలను సిద్ధం చేసుకున్నారు. నామినేషన్ దాఖలుకు ముందు ర్యాలీ లో సోదరులు ఇద్దరూ జనానికి అభివాదం చేస్తూ రిటర్నింగ్ అధికారి కార్యాలయం వరకు వెళ్లారు. అక్కడికి వెళ్లిన తరువాత నామినేషన్ పత్రాలను అందజేశారు. అభ్యర్థి చేత ప్రమాణం చేయించే వర కు కిషోర్ అభ్యర్థి అన్న విషయం మాజీ సీఎం సొంత మనుషులకూ తెలియలేదు. కిరణ్ వర్గీయుల అసంతృప్తి ఎన్నో ఏళ్లుగా నల్లారి కుటుంబాన్ని నమ్ముకుని సొంత మనుషులకూ తెలియకుండా కిషోర్కుమార్రెడ్డి అభ్యర్థిత్వాన్ని చివరి నిమిషం వరకు దాచి పెట్టడం అసంతృప్తికి దారితీసింది. బయటకు చెప్పుకోలేనప్పటికీ నల్లారి ముఖ్య అనుచరులు లోలోన కుతకుతలాడుతున్నారు. రాష్ట్ర విభజన ద్రోహిగా ముద్రవేసుకున్న కిరణ్కుమార్రెడ్డి ఇప్పుడు సొంత మనుషుల నుంచి కూడా అదే ముద్ర వేసుకున్నారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్న సయయంలో రాష్ట్ర విభజన జరగడం, రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజ ల్లో వ్యతిరేకత వ్యక్తం కావడం తెలిసిందే. ఈ ప్రభా వం సొంత నియోజకవర్గంలోనూ ఉంటుందనే భావనతో ముందుగానే పోటీ నుంచి వైదొలిగినట్లు చెబుతున్నారు. మాజీ సీఎంగా ఎన్నికల్లో ఓటమి భారం భరించడం కన్నా తప్పుకోవడమే ఉత్తమమని అభిప్రాయానికి వచ్చిన తర్వాతే సోదరుడు కిషోర్ని బరిలోకి దించారని అంటున్నారు. మొత్తానికి కిరణ్ అనుసరిస్తున్న వ్యూహం నేలవిడిచి సాముచేయడమేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
గురుకుల విద్యార్థికి కిశోర్ పురస్కారం
తాడిపత్రి రూరల్, న్యూస్లైన్ : అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం వెంకటరెడ్డిపల్లికి చెందిన బండారు పెద్దిరాజు కేంద్ర ప్రభుత్వ కి శోర్ వైజ్ఞానిక్ పురస్కార్ యోజన(కేవీ పీవై) ఉపకార వేతనానికి ఎంపికయ్యా డు. ఇతను రంగారెడ్డి జిల్లా గౌలిదొడ్డిఏ పీఎస్డబ్లూఆర్ఎస్ (సాంఘిక సంక్షేమ) జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం (బైపీసీ) చదువుతున్నాడు. భారత శాస్త్ర, సాంకేతిక శాఖ దేశవ్యాప్తం గా ప్రతిభావంతులైన విద్యార్థులను ఎం పిక చేసి సైన్స్ రంగంలో పరిశోధనలు చేయిస్తోంది. ఇందులో భాగంగా ఏటా కిశోర్ వైజ్ఞానిక్ పురస్కార్ యోజన పేరు తో అర్హత పరీక్ష నిర్వహిస్తోంది. గతేడాది అక్టోబర్లో నిర్వహించిన పరీక్షలో పెద్దిరాజు ప్రతిభ చూపాడు. దేశవ్యాప్తంగా 37కేంద్రాల్లో నిర్వహించిన ఈ పరీక్షకు 1.7 లక్షల మంది హాజరుకాగా మన రా ష్ట్రం నుంచి పెద్దిరాజు 44వ ర్యాంకు (ఎ స్సీ, ఎస్టీ కోటా) సాధించి స్కాలర్షిప్ సాధించాడు. ఈ పరీక్షలో ర్యాంక్ సాధిం చడం ద్వారా పెద్దిరాజు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఫర్ సైన్స్ అండ్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్స్ (ఐఐఎస్ఈఆర్), ఇండియ న్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్), బెంగళూరు), ఐఐఐటీ (హైదరాబాద్), హెచ్సీయు (హైదరాబాద్)లో పరిశోధనలు చేసేందుకు సైతం అర్హత సాధిం చాడు. ఈ స్కాలర్షిప్ కింద ఇతడికి నెలకు రూ. 4వేలు, సంవత్సరానికి రూ.16 వేలు అందుతుంది. రాష్ట్ర సాం ఘిక సంక్షేమ శాఖ హాస్టళ్ల తరఫున ఈ స్కాలర్షిప్కు ఎంపికైన తొలి విద్యార్థి ఇతడే కావడం గమనార్హం. ప్రతిష్టాత్మక పురస్కారానికి ఎంపికైన పెద్దిరాజుకు రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ కార్యదర్శి డాక్టర్ ఆర్.ఎస్. ప్రవీణ్కుమా ర్, ఐపీఎస్ అభినందనలు తెలిపారు. ఏడో తరగతిలోనే తండ్రిని కోల్పోయి.. పేద కుటుంబంలో జన్మించిన పెద్దిరాజు కు చదువంటే ప్రాణం. మంచి ప్రతిభ చూపుతుండేవాడు. వికలాంగుడైన తం డ్రి నారాయణ.. పెద్ది రాజు ఏడో తరగతి చదువుతుండగా అనారోగ్యంతో మృతి చెందాడు. తల్లి ఓబుళమ్మ కుమారుడితో పాటు కుమార్తె ఇంద్రాణిని బాగా చది వించాలనుకుంది. కూలీగా పనిచేస్తూ పి ల్లలను చదివిస్తోంది. ఇంద్రాణి స్థానికం గా ఉన్న ప్రభుత్వ పాఠశాలలో ఏడో తరగతిచదువుతోంది. పెద్దిరాజుకు పురస్కారం రావడంతో తన కష్టానికి ప్రతిఫలం దక్కిందని ఆమె హర్షం వ్యక్తం చేస్తోంది. -
వైవిధ్యమైన కథలు
జీవితంలో ఎదురయ్యే అనుభవాలే పాఠాలు. మనిషిని పరిపూర్ణుణ్ణి చేసేది అవే. అలా జీవితం నుంచి పాఠాలను నేర్చుకున్న కొందరు వ్యక్తుల అనుభవాలు, పర్యవసానాలు, ఫలితాల సమాహారాన్నే కథాంశంగా చేసుకొని రూపొందుతోన్న చిత్రం ‘చందమామ కథలు’. ‘ఎల్బీడబ్ల్యూ’ ఫేం ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మంచు లక్ష్మీప్రసన్న, సీనియర్ నరేష్, ఆమని, కృష్ణుడు, కిషోర్, శౌర్య ముఖ్య తారలు. చాణక్య భూనేటి నిర్మాత. ప్రస్తుతం ఈ చిత్రం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. హైదరాబాద్లో ఈ చిత్రం ప్రచార చిత్రాలను మంచు లక్ష్మీప్రసన్న విడుదల చేశారు. తెలుగు సినీ చరిత్రలో ‘చందమామ కథలు’ చిత్రం ఓ లాండ్మార్క్గా నిలిచిపోతుందని, దర్శకుడు ఎంతో వైవిధ్యంగా సినిమాను తీర్చిదిద్దుతున్నాడని లక్ష్మీప్రసన్న అన్నారు. పదహారు వంటకాలతో వడ్డించిన విందు భోజనంలాంటి పసందైన సినిమా ఇదని నరేష్ కొనియాడారు. త్వరలో పాటలను, మార్చి ప్రథమార్ధంలో సినిమాను విడుదల చేస్తామని నిర్మాత తెలిపారు. -
చందమామ కథలు మూవీ ప్రెస్ మీట్