వైఎస్సార్ జిల్లాతోపాటు పక్కనున్న క ర్నూలుకు చెందిన 11 మంది బాలికలను కడప రైల్వే పోలీసులు పట్టుకుని బాలికల సంర క్షణాలయానికి తరలించారు. వీరందరినీ చెన్నైకి అక్రమంగా తీసుకెళ్తున్నట్లు అందిన సమాచారం మేరకు ఐసీడీఎస్ అధికారులు, పోలీసులు బుధవారం వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ బాలికలంతా 13-16 ఏళ్ల వారే కావటం గమనార్హం. తాము చెన్నైలోకి దుస్తుల కంపెనీలో ఉద్యోగాల కోసం వెళ్తున్నట్లు వారు చెబుతున్నారు. వారు చెప్పిన వివరాల మేరకు చెన్నైలోని కంపెనీలను సంప్రదించగా అలాంటిదేమీ లేదని వారన్నట్లు సమాచారం.బాలికల తండ్రులు, సంబంధీకులుగా చెబుతున్న 10 మందిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
రైల్వే స్టేషన్లో 11 మంది బాలికల పట్టివేత
Published Wed, Jul 27 2016 4:21 PM | Last Updated on Mon, Sep 4 2017 6:35 AM
Advertisement
Advertisement