Published
Tue, Aug 2 2016 5:43 PM
| Last Updated on Mon, Sep 4 2017 7:30 AM
సీసీ రోడ్డు పనులు ప్రారంభం
హుజూర్నగర్ : నగరపంచాయతీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే ధ్యేయంగా కృషి చేస్తున్నట్లు చైర్మన్ జక్కుల వెంకయ్య అన్నారు. మంగళవారం పట్టణంలోని 3వ వార్డులో రూ.3 లక్షలతో చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణ పనులను స్థానిక కౌన్సిలర్, నగరపంచాయతీ వైస్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్గౌడ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అల్లం ప్రభాకర్రెడ్డిలతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలోని 20 వార్డుల పరిధిలో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచేందుకు అంతర్గత రోడ్లు, డ్రెయినేజీల నిర్మాణాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు తన్నీరు మల్లికార్జున్రావు, దొంతిరెడ్డి సంజీవరెడ్డి, కంకణాల పుల్లయ్య, శాఖ గ్రంథాలయ చైర్మన్ కె.సైదులు, నాయకులు కామిశెట్టి రవికుమార్, వల్లపుదాసు కృష్ణ, చింతకాయల రాము, నందిగామ శంభయ్య, యల్లావుల రాములు, కాలవపల్లి బ్రహ్మారెడ్డి, యతిపతిరావు, నర్సింహారావు పాల్గొన్నారు.