27న సిద్దిపేటకు కేంద్ర బృందం రాక | cetral group came to siddipet on 27th | Sakshi
Sakshi News home page

27న సిద్దిపేటకు కేంద్ర బృందం రాక

Sep 24 2016 8:29 PM | Updated on Sep 4 2017 2:48 PM

స్వచ్ఛ భారత్‌- స్వచ్ఛ తెలంగాణ కింద బహిరంగ మలవిసర్జన రహిత మున్సిపాల్టీగా గుర్తింపు పొందిన స్వచ్ఛ సిద్దిపేటను పరిశీలించేందుకు 27న కేంద్ర బృందం ప్రతినిధులు రానుంది.

సిద్దిపేట జోన్‌: స్వచ్ఛ భారత్‌- స్వచ్ఛ తెలంగాణ కింద బహిరంగ మలవిసర్జన రహిత మున్సిపాల్టీగా గుర్తింపు పొందిన స్వచ్ఛ సిద్దిపేట పనితీరును పరిశీలించేందుకు ఈ నెల27న  కేంద్ర బృందం ప్రతినిధులు  సిద్దిపేట పట్టణానికి రానున్నట్లు మున్సిపల్‌ కమిషనర్‌ రమణాచారి తెలిపారు. కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వశాఖ సూచనల మేరకు క్వాలిటీ కౌన్సిల్‌ ఆఫ్‌  ఇండియా బృందం దేశంలోని 40 స్వచ్ఛ పట్టణాలను సందర్శించనున్నట్లు  అందులో భాగంగానే ఈ నెల 27న సిద్దిపేటకు కేంద్ర బృందం రానుందన్నారు. ఉదయం 10 గంటలకు స్థానిక శివమ్స్‌ గార్డెన్‌లో బృందం సభ్యుల సమక్షంలో అభినందన సభ నిర్వహిస్తామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement