కాటారం: ఆడుకుంటున్న ఓ చిన్నారి ప్రాణాలను డీజిల్ ట్యాంకర్ బలితీసుకుంది. కరీంనగర్ జిల్లా కాటారం మండల కేంద్రంలో శుక్రవారం రాత్రి ఈ ఘటన జరిగింది. మేరుగ రమేష్ టీ స్టాల్ నిర్వహిస్తుంటాడు. అతడికి గాయత్రి (4)తోపాటు ఓ కుమారుడు ఉన్నాడు. గాయత్రి ఇంటి ముందు ఆడుకుంటుండగా భూపాలపల్లి వైపు వెళుతున్న ఓ డీజిల్ ట్యాంకర్ ఢీకొంది. తీవ్ర గాయాలతో చిన్నారి ప్రాణాలు విడిచింది. స్థానికులు డ్రైవర్ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు.