రైల్వేలైన్ కు త్వరలో భూసేకరణ | collect the land for Railway Line said the Collector Katamneni Bhaskar | Sakshi
Sakshi News home page

రైల్వేలైన్ కు త్వరలో భూసేకరణ

Published Sun, May 7 2017 3:21 PM | Last Updated on Thu, Mar 21 2019 7:25 PM

రైల్వేలైన్ కు త్వరలో భూసేకరణ - Sakshi

రైల్వేలైన్ కు త్వరలో భూసేకరణ

రైల్వేలైన్ల ఏర్పాటు పనులు పూర్తి చేసేందుకు త్వరలోనే రైల్వే అధికారులతో కలిసి తనిఖీలు నిర్వహించనున్నట్టు జిల్లా కలెక్టర్‌ కాటంనేని భాస్కర్‌ చెప్పారు.

► కలెక్టర్‌ కాటంనేని భాస్కర్‌
 
ఏలూరు (మెట్రో) : జిల్లాలో రైల్వేలైన్ల ఏర్పాటు పనులు యుద్ధప్రాతిపదికపై పూర్తి చేసేందుకు త్వరలోనే రైల్వే అధికారులతో కలిసి తనిఖీలు నిర్వహించనున్నట్టు జిల్లా కలెక్టర్‌ కాటంనేని భాస్కర్‌ చెప్పారు. స్థానిక కలెక్టరేట్‌లో రైల్వే ప్రాజెక్టులు, సేద్యపు నీటి పథకాల ప్రగతి తీరుపై అధికారులతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ భాస్కర్‌ మాట్లాడుతూ నిడదవోలు, భీమవరం మధ్య రైల్వే డబుల్‌లైన్ నిర్మాణ పనులకు మరో నెలలో భూసేకరణ పూర్తి చేయనున్నామని చెప్పారు.

రైల్వే ప్రాజెక్టుల ఉన్నతాధికారితో త్వరలోనే జిల్లాలో పలు రైల్వే ప్రాజెక్టులపై జాయింట్‌ తనిఖీలు నిర్వహిస్తామని, రైల్వే శాఖ గతంలో మాదిరిగా నత్తనడకతో రైల్వే ట్రాక్‌లు నిర్మించాలనే ఆలోచనలకు స్వస్తి పలకాలన్నారు. ఆరు నెలల్లో రైల్వే ట్రాక్‌ పూర్తి చేసి కాంట్రాక్టర్‌కు బోనస్‌ ఇచ్చే స్థాయిలో పనులు జరగాలని కలెక్టర్‌ భాస్కర్‌ చెప్పారు. ఆకివీడు–భీమవరం, నరసాపురం–కోటిపలి్లలతో పాటు ఏలూరు సమీపంలోని వట్లూరు వద్ద కూడా రైల్వే బ్రిడ్జి పనులు కూడా వెంటనే పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల కోసం నిర్మించే ఇళ్ల కాలనీలన్నీ ఏడాదిలోగా పూర్తి చేయాలన్నారు.

అన్ని కాలనీల్లో మౌలిక వసతులు కల్పించి దశల వారీగా ఏడాదిలోపు 30 కాలనీలు పూర్తి చేయాలని కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో భూసేకరణ ప్రత్యేక కలెక్టర్‌ భానుప్రసాద్, ఏజేసీ షరీఫ్, డీఆర్వో కె.హైమావతి, ఇరిగేషన్ ఎస్‌ఈ శ్రీనివాస్, పోలవరం ప్రాజెక్టు ఎస్‌ఈ శ్రీనివాసయాదవ్, గృహనిర్మాణశాఖ పీడీ ఇ.శ్రీనివాస్, సబ్‌కలెక్టర్లు షాన్ మోహన్, గాంధీ, ఆర్డీవోలు చక్రధర్, శ్రీనివాసరావు, లవన్న పాల్గొన్నారు.   
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement