కానిస్టేబుల్ మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి | constable abu barak post martum finished in vikakapatnam | Sakshi
Sakshi News home page

కానిస్టేబుల్ మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి

Published Mon, Oct 24 2016 9:20 PM | Last Updated on Sat, Sep 15 2018 7:57 PM

గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ అబూ బరాక్ మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి అయింది.

విశాఖపట్నం: గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ అబూ బరాక్ మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి అయింది. ఆర్డీవో వెంకటేశ్వర్లు సమక్షంలో అధికారులు శవపంచనామా నిర్వహించారు. అధికార లాంఛనాలతో అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు.

ఒడిశాలోని మల్కాన్ గిరి జిల్లాలో జరిగిన భారీ ఎన్కౌంటర్లో 24 మంది మావోయిస్టులు మృతిచెందిన విషయం తెలిసిందే. మావోల ఎదురుదాడిలో గాయపడ్డ మరో కానిస్టేబుల్‌ డి.సతీష్‌కు విశాఖ సెవెన్ హిల్స్ ఆస్పత్రిలో ఆపరేషన్ పూర్తి అయింది. కాలులో ఉన్న బుట్టెట్ను వైద్యులు తొలగించారు. ప్రస్తుతం కానిస్టేబుల్ సతీష్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement