లేపాక్షి ఆలయాన్ని సందర్శించిన సీఆర్‌పీఎఫ్‌ సిబ్బంది | crpf team in lepakshi temple | Sakshi
Sakshi News home page

లేపాక్షి ఆలయాన్ని సందర్శించిన సీఆర్‌పీఎఫ్‌ సిబ్బంది

Published Tue, Jun 20 2017 10:02 PM | Last Updated on Sat, Aug 11 2018 9:02 PM

లేపాక్షి ఆలయాన్ని సందర్శించిన సీఆర్‌పీఎఫ్‌ సిబ్బంది - Sakshi

లేపాక్షి ఆలయాన్ని సందర్శించిన సీఆర్‌పీఎఫ్‌ సిబ్బంది

లేపాక్షి : పర్యాటక కేంద్రమైన లేపాక్షి ఆలయాన్ని మంగళవారం మధ్యాహ్నం సీఆర్‌పీఎఫ్‌ సిబ్బంది సందర్శించారు. హిందూపురం పట్టణంలోని పురవీధుల గుండా వారు కవాతు నిర్వహించారు. అనంతరం లేపాక్షి ఆలయాన్ని తిలకించారు. ఈ సందర్భంగా ఆలయంలోని దుర్గాదేవి, వీరభద్రస్వాముల వారికి విశేషంగా పూజలు నిర్వహించారు.

అనంతరం ఆలయ విశిష్టతను అర్చకులను అడిగి తెలుసుకున్నారు. ఆలయంలోని ఏడు శిరస్సుల నాగేంద్రుడు, నంది విగ్రహం, అంతరిక్ష స్తంభం, నాట్యమండపం, కల్యాణ మండపం, చిత్రాలు, అపురూపమైన విగ్రహాలను తిలకించి ఆనందించారు. లేపాక్షి ఆలయంలోని శిల్పాలు, చిత్రలేఖనాలు అద్భుతంగా ఉన్నాయని తెలిపారు. లేపాక్షి ఎస్‌ఐ శ్రీధర్‌తో పాటు వారి సిబ్బంది వారి వెంట ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement