![ఆదమరిస్తే అంతే.. - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/4/71472661438_625x300.jpg.webp?itok=e8ylb8cq)
ఆదమరిస్తే అంతే..
నార్పల : నార్పల మండలం బొందలవాడ సమీపంలోని హెచ్చెల్సీ ప్రధాన కాలువపై బ్రిడ్జి ప్రమాదకరంగా మారింది. కాలువపై రక్షణ గోడ ఏర్పాటు చేయకపోవడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇప్పుడు కాలువలో నీళ్లు కూడా ప్రవహిస్తుండటంతో ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా కాలువలో పడే ప్రమాదం ఉంది. ఇప్పటికైనా అధికారులు స్పందించాల్సి ఉంది.