తిరుమల: చిత్తూరు జిల్లా తిరుమల శ్రీవారి ఆలయానికి భక్తుల తాకిడి ఎక్కువగా ఉంది. శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనార్థం శనివారం ఆలయానికి వస్తున్న భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి దర్శనం కోసం భక్తులు 28 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. సర్వ దర్శనానికి 12 గంటలు, ప్రత్యేక దర్శనానికి 3 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 8 గంటల సమయం పడుతోంది. శుక్రవారం శ్రీనివాసుని 74,350 మంది భక్తులు దర్శించుకున్నారు. హుండీ ఆదాయం 2.59 కోట్లు లభించిందని టీటీడీ అధికారులు తెలిపారు.