
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
చిత్తూరు జిల్లా తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది.
తిరుమల: చిత్తూరు జిల్లా తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ఏడుకొండలపై కొలువైన శ్రీ వెంకటేశ్వరస్వామి దర్శనానికి ప్రస్తుతం 6 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 5 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 4 గంటల సమయం పడుతోంది.
నిన్న(గురువారం) 60,747 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. శ్రీవారి హుండీకి రూ.3.53 కోట్ల ఆదాయం వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు.