తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది.
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ప్రస్తుతం ఏడుకొండలవాడి దర్శనానికి 9 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వ దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. స్వామివారి ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది.
అలాగే కాలినడకన వచ్చే భక్తులు మూడు కంపార్ట్మెంట్లలో వేచి ఉండగా 2 గంటల సమయం పడుతోంది. నిన్న(ఆదివారం) స్వామివారిని 82,436 మంది భక్తులు దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.