డ్రగ్స్‌ కేసు: ప్రైవేట్‌ కంపెనీలకు నోటీసులు | Drug racket: one more peddlers arrested | Sakshi
Sakshi News home page

డ్రగ్స్‌ కేసు: ప్రైవేట్‌ కంపెనీలకు నోటీసులు

Published Wed, Jul 5 2017 4:33 PM | Last Updated on Fri, Sep 7 2018 1:59 PM

డ్రగ్స్‌ కేసు: ప్రైవేట్‌ కంపెనీలకు నోటీసులు - Sakshi

డ్రగ్స్‌ కేసు: ప్రైవేట్‌ కంపెనీలకు నోటీసులు

హైదరాబాద్‌: డ్రగ్స్‌ మాఫియాతో సంబంధం ఉన్న విద్యార్థులను తాము ఇబ్బందిపెట్టబోమని ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ అకున్‌ సబర్వాల్‌ తెలిపారు. డ్రగ్స్‌ సరఫరా చేయటంతోపాటు వినియోగించే విద్యార్థులు, ఆయా విద్యాసంస్థల వారి నుంచి అవసరమైన మేర సమాచారం రాబడతామన్నారు.

కాగా, ఈ కేసులో బుధవారం హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కళాశాల నిర్వాహకుడు బెండెన్ బెన్‌ అనే వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు వివరించారు. దీంతో మొత్తం 8 మందిని అరెస్ట్‌ చేసినట్లయిందన్నారు. బెండెన్ బెన్, నిఖిల్‌ షెట్టి కలిసి డ్రగ్స్‌ వ్యాపారం నడుపుతున్నట్లు తమ విచారణలో తేలిందన్నారు.

ఈ కేసు దర్యాప్తులో భాగంగా 27 కళాశాలలు, 26 స్కూళ్లతోపాటు పలు ప్రైవేట్‌ కంపెనీలకు నోటీసులు జారీ చేశామన్నారు. సినీ పరిశ్రమ, వాణిజ్య ప్రముఖులకు కూడా నోటీసులు ఇచ్చామన్నారు. ఈ విషయంలో ఎవరైనా తెలిసిన సమాచారం అందించాలనుకునేవారికి టోల్‌ఫ్రీ నంబర్‌ (1800 425 2523) కూడా అందుబాటులోకి తెచ్చినట్లు వివరించారు. దీంతోపాటు ఈనెల 14వ తేదీన 83 స్కూళ్ల యాజమాన్యాలతో సమావేశం ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement