Published
Thu, Jul 21 2016 8:16 PM
| Last Updated on Mon, Sep 4 2017 5:41 AM
హరితహారాన్ని అంతా మెచ్చుకుంటున్నారు..
అర్వపల్లి : రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని విదేశీయులు కూడా ప్రశంసిస్తున్నారని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ అన్నారు. గురువారం అర్వపల్లిలోని ఎంపీడీఓ కార్యాలయంలో అమెరికా దేశస్తులతో కలిసి ఆయన మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో 5 కోట్ల మొక్కలు నాటుతున్నట్లు చెప్పారు. అమెరికాలోని ఎల్డీఎస్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు డార్లా న్యూటన్, లారెన్స్ న్యూటన్ మనోహర్ బేకరా, ట్రస్ట్ కోర్డినేటర్ శేఖర్ అలమూరి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న హరితహారం కార్యక్రమం ఎంతో బాగుందని కొనియాడారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పాశం విజయయాదవరెడ్డి, ఎంపీపీ దావుల మనీషావీరప్రసాద్, వైస్ చైర్మన్ గుజ్జ యుగేందర్రావు, జడ్పీటీసీ సంద అమల, వైస్ ఎంపీపీ బొడ్డు వెంకన్న, గుండగాని అంబయ్య, తహసీల్దార్ పులి సైదులు, ఎంపీడీఓ శిరీష తదితరులు పాల్గొన్నారు.