ఆహార పదార్థాలను కల్తీచేస్తే చర్యలు
Published Tue, Oct 25 2016 2:09 AM | Last Updated on Thu, Oct 4 2018 5:08 PM
ఏలూరు (మెట్రో) : జిల్లాలో ఆహారపదార్థాలను కల్తీ చేసే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని జాయింట్ కలెక్టర్ పులిపాటి కోటేశ్వరరావు హెచ్చరించారు. స్థానిక కలెక్టర్ కార్యాలయంలో సోమవారం సాయంత్రం ఏర్పాటు చేసిన జిల్లా విజిలెన్స్ కమిటీ సమావేశంలో ఆయన∙మాట్లాడుతూ జిల్లాలో రోడ్డు పక్కన చిరువ్యాపారాలు చేసే వ్యక్తులు కల్తీ సరుకులతో తినుబండారాలు తయారు చేయడం వల్ల ప్రజల ఆరోగ్యానికి ముప్పు ఏర్పడుతోందని, వ్యాపారులు ప్లాస్టిక్ కవర్లలో వేడివేడి పదార్థాలు ప్యాకింగ్ చేస్తున్నారని, దీనివల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని వివరించారు. వ్యాపారులు ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని పదార్థాలు కలుషితం కాకుండా చూడాలని సూచించారు. జిల్లాలో మంచినీటి సరఫరా చేసే సంస్థలు నాణ్యతా ప్రమాణాలు పాటించాలని ఆదేశించారు. సమావేశంలో డీఎస్వో శివశంకరరెడ్డి, జిల్లా వినియోగదారుల సంఘం సమాఖ్య అధ్యక్షులు బొబ్బిలి బంగారయ్య, కార్యదర్శి జి.ఆనందరావు పాల్గొన్నారు.
Advertisement
Advertisement