ఓమిని వాహనం బోల్తా.. నలుగురికి గాయాలు | four injured of omni van rolls | Sakshi
Sakshi News home page

ఓమిని వాహనం బోల్తా.. నలుగురికి గాయాలు

Published Wed, Jan 4 2017 10:44 PM | Last Updated on Tue, Sep 5 2017 12:24 AM

four injured of omni van rolls

మడకశిర రూరల్‌ : కర్ణాటకలోని పావగడ తాలుకాలోని రాజవంతి గ్రామ సమీపంలో బుధవారం ఓమిని వాహనం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో మడకశిర మండలం గోవిందాపురం గ్రామానికి చెందిన శ్రీనివాసుబాబు, తల్లి రత్నమ్మ, కోడళ్లు అనితమ్మ, విద్య తీవ్రంగా గాయపడ్డారు. నాగలమడకలో జరుగుతున్న సుబ్రహ్మణ్యేశ్వరస్వామి రథోత్సవానికి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను పావగడలో ప్రథమ చికిత్స అనంతరం  మెరుగైన వైద్యం కోసం బెంగళూరులోని కొలంబియా ఆస్పత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement