కేపీహెచ్బీ పోలీస్స్టేషన్ పరిధిలో ఓ కన్సల్టెన్సీ నిరుద్యోగులకు కుచ్చుటోపీ పెట్టింది.
కేపీహెచ్బీ పోలీస్స్టేషన్ పరిధిలో ఓ కన్సల్టెన్సీ నిరుద్యోగులకు కుచ్చుటోపీ పెట్టింది. ఒక్కో నిరుద్యోగి నుంచి రూ.లక్ష నుంచి రూ.లక్షా యాభై వేల వరకు వసూలు చేసింది. సుమారు 70 మంది వద్ద వసూలు చేసిన కన్సల్టన్సీ నిర్వాహకులు మొదటి రెండు నెలలు జీతాలు ఇచ్చి ఆ తర్వాత చేతులు దులుపుకున్నారు. దీంతో బాధితులు స్థానిక పోలీస్స్టేషన్లో ఈ విషయం గురించి ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.