25 నుంచి ఐసెట్‌ కౌన్సెలింగ్‌ | from 25th icet counceling | Sakshi
Sakshi News home page

25 నుంచి ఐసెట్‌ కౌన్సెలింగ్‌

Published Sat, Jul 23 2016 11:34 PM | Last Updated on Sat, Sep 15 2018 8:28 PM

from 25th icet counceling

కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : ఐసెట్‌–2016కు కౌన్సెలింగ్‌ను ఈ నెల 25 నుంచి ఎస్‌జీపీఆర్‌ ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో నిర్వహిస్తామని కోఆర్డినేటర్‌ వై.విజయభాష్కర్‌ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. 25 నుంచి 29వ తేదీ వరకు ప్రతి రోజు ఉదయం 9 గంటలకు సర్టిఫికెట్ల పరిశీలన ప్రారంభమవుతుందన్నారు. జూలై 28 నుంచి 30వ తేదీ వరకు కళాశాలలకు ఆప్షన్లు, ఆగస్టు రెండో తేదీ కళాశాలల కేటాయింపు ప్రక్రియ ఉంటుందన్నారు. కౌన్సెలింగ్‌కు హాజరయ్యే ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.500, బీసీ/ఓసీ విద్యార్థులు రూ.1000  చెల్లించాలన్నారు. ఎన్‌సీసీ/పీహెచ్‌సీ/క్యాప్‌/స్పోర్ట్స్‌ కేటగిరీ వారికి  విజయవాడ బెంజ్‌ సర్కిల్లోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో కౌన్సెలింగ్‌ ఉంటుందన్నారు. ఐసెట్‌–2006 హాల్‌టికెట్, ర్యాంకు కార్డు, ఆధార్‌కార్డు, పది, ఇంటర్, డిగ్రీ మార్కుల జాబితాలు, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, 9 నుంచి డిగ్రీ వరకు స్టడీ సర్టిఫికెట్ల ఒరిజినల్స్, రెండు సెట్ల జిరాక్స్‌ ప్రతులతో సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరుకావాలన్నారు. మరిన్ని వివరాలకు వెబ్‌సైట్‌ (www.apicet.nic.in) లో చూడాలన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement