Seat allocation
-
Supreme Court: ఆ విద్యార్థికి ఐఐటీ సీటివ్వండి
న్యూఢిల్లీ: నిరుపేద కుటుంబంలో పుట్టి కష్టపడి చదివినా సమయానికి ప్రవేశరుసుం కట్టలేక ప్రతిష్టాత్మక ఐఐటీ ధన్బాద్లో సీటు కోల్పోయిన దళిత విద్యార్థికి సర్వోన్నత న్యాయస్థానంలో భారీ ఊరట లభించింది. వెంటనే ఆ విద్యార్థి అతుల్ కుమార్కు సీటు ఇవ్వాలని ఐఐటీ ధన్బాద్ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్ధివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాల ధర్మాసనం సోమవారం ఆదేశించింది. జూన్ 24వ తేదీ సాయంత్రం ఐదింటిలోపు అడ్మిషన్ ఫీజు రూ.17,500 కట్టలేకపోవడంతో బీటెక్ సీటు కోల్పోయిన తనకు న్యాయం చేయాలంటూ విద్యార్థి సుప్రీంకోర్టును ఆశ్రయించడం తెల్సిందే. ‘‘ విద్యార్థి ఆరోజు ఆన్లైన్లో ఫీజు చెల్లింపు కోసం మధ్యాహ్నం మూడు గంటలకే లాగిన్ అయ్యాడు. తర్వాత పదేపదే ఎస్ఎంఎస్లు, వాట్సాప్లో రిమైండ్లతో గడువును గుర్తుచేశాం’’ అని ఐఐటీ సీట్ల కేటాయింపు విభాగం వాదించింది. దీంతో సీజేఐ కలగజేసుకుని ‘‘మీరెందుకంతగా వ్యతిరేకిస్తున్నారు?. ఈ పిల్లాడికి ఏమైనా చేయగలవేమో చూడండి. ఆ డబ్బులే ఉంటే కట్టకుండా ఎందుకుంటాడు? అణగారిన వర్గాలకు చెందిన రోజువారీ కూలీ కుమారుడు. పైగా అతనిదిదారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబం. ఐఐటీలో సీటు కోసం ఎంత కష్టపడాలో అంత కష్టపడ్డాడు. ప్రతిభగల ఇలాంటి విద్యార్థిని మనం ఊరకనే వదిలేయలేం. రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 ద్వారా సుప్రీంకోర్టుకు సంక్రమించిన అసాధారణ అధికారంతో మిమ్మల్ని ఆదేశిస్తున్నాం. ఇదే ఏడాది అదే బ్యాచ్ ఎలక్ట్రిక్ ఇంజనీరింగ్ కోర్సులో విద్యార్థికి సీటివ్వండి. హాస్టల్ వసతి సహా అర్హతగల అన్ని ప్రయోజనాలు అతనికి అందేలా చూడండి’’ అని ఐఐటీ కాలేజీ విభాగాన్ని కోర్టు ఆదేశించింది. కిక్కిరిసిన కోర్టు హాలులో అంతసేపూ చేతులు కట్టుకుని నిలబడిన విద్యార్థితో ‘‘ ఆల్ ది బెస్ట్. బాగా చదువుకో’’ అని సీజేఐ అన్నారు. బాగా చదువుతూ ఇంజనీరింగ్ చేస్తున్న అతని ఇద్దరు అన్నల బాగోగులు తదితరాల గురించి కూడా ఆయన ఆరాతీశారు.ఉత్తరప్రదేశ్లోని ముజఫర్నగర్జిల్లా టిటోరా గ్రామానికి చెందిన అతుల్ ఐఐటీ ధన్బాద్లో సీటు వచ్చినా పేదరికం కారణంగా డబ్బులు కట్టలేక నిస్సహాయుడయ్యాడు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు తలో చేయి వేసి నగదు సర్దినా చివరి నిమిషంలో ఆన్లైన్ చెల్లింపు విఫలమై ఫీజు కట్టలేకపోయాడు. జార్ఖండ్ హైకోర్టు లీగ్ సర్వీసెస్ అథారిటీని ఆశ్రయించగా పరీక్షను ఐఐటీ మద్రాస్ నిర్వహించినందున మద్రాస్ హైకోర్టుకు వెళ్లాలని సూచించింది. దీంతో మద్రాస్ హైకోర్టుకు వెళ్లారు. అక్కడ విచారణ నెమ్మదించడంతో ఈసారి నేరుగా సుప్రీంకోర్టు తలుపు తట్టారు. -
దళిత విద్యార్ధికి అండగా సుప్రీంకోర్టు.. సీటు ఇవ్వాలని ఆదేశం
న్యూఢిల్లీ: గడువు తేదీలోగా ఫీజు కట్టలేకపోయిన ఓ పేద విద్యార్థికి అడ్మిషన్ ఇవ్వాలని ఐఐటీ ధన్బాద్ను సుప్రీంకోర్టు ఆదేశించింది. ప్రతిభ గల విద్యార్థిని ఫీజు విషయంలో సీటుకు దూరం చేయడాన్ని అనుమతించలేమని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ పార్దీవాలా, జస్టిస్ మనోజ్మిశ్రాలతో కూడిన ధర్మాసనం పేర్కొంది.అసలేం జరిగిందంటే..ఉత్తర్ప్రదేశ్లోని ముజఫర్నగర్ జిల్లా టిటోరా గ్రామానికి చెందిన 18 ఏళ్ల అతుల్కుమార్ ఐఐటీ ధన్బాద్లో ఎలక్టానిక్ ఇంజనీరింగ్లో సీటు సాధించాడు. సీటు ఖరారు చేసేందుకు జూన్ 24 లోపు రూ.17,500 ఫీజు కట్టాల్సి ఉండగా,అతడి తల్లిదండ్రులు గడువులోగా ఫీజు కట్టలేకపోయారు. తండ్రి రోజుకు 450 సంపాదించే కూలీ అవ్వడంతో..వారి నిస్సహాయతను చూసిన టిటోడా గ్రామస్థులు విరాళాలు వేసుకొని ఆ మొత్తం సమకూర్చారు. అయితే అప్పటికే గడువు తేదీ దగ్గర పడటంతో.. చివరిరోజుసాంకేతిక కారణాలతో ధన్బాద్ ఐఐటీ ఆన్లైన్ పోర్టల్ పనిచేయక అతుల్ ఆ మొత్తాన్ని సకాలంలో కట్టలేకపోయాడు. సీటు వచ్చినట్టే వచ్చి చేజారింది.దీంతో విద్యార్ధి తనకు న్యాయం చేయాలని కోరుతూ తొలుత జార్ఖండ్ లీగల్ సర్వీసెస్ అథారిటీకి.ఆ తర్వాత చెన్నై లీగల్ సర్వీసెస్కు వెళ్లాడు. అయిన ప్రయోజనం లేకపోవడంతో మద్రాస్ హైకోర్టును అశ్రయించాడు. మద్రాస్ హైకోర్టు దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని కోరింది. తాజాగా నేడు సుప్రీంకోర్టులో విచారణకు రాగా.. ‘ విద్యార్థి చాలా తెలివైన వాడు. కేవలం రూ. 17,000 కట్టలేని కారణంగా అతని చదువును కోల్పోయాడు. ప్రతిభావంతుడైన వ్యక్తి ఫీజు కట్టని విషయంలో వదిలివేలయం. అతుల్ కుమార్ను అదే బ్యాచ్లో చేర్చుకోవాలి. మరే ఇతర విద్యార్థి అభ్యర్థిత్వానికి భంగం కలగకుండా సూపర్న్యూమరీ సీటు సృష్టించాలి. అతనికి సీటు కల్పించాలి’ అని ఐఐటీ ధన్బాద్ను ఆదేశించింది -
Haryana: అందరి దృష్టి ఆ సీటుపైనే..
హర్యానాలో అసెంబ్లీ ఎన్నికల తేదీలు వెల్లడయ్యాయి. రాష్ట్రంలోని మొత్తం 90 అసెంబ్లీ స్థానాలకు అక్టోబర్ ఒకటిన పోలింగ్ జరగనుంది. అక్టోబర్ 4న ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి. రాష్ట్రంలోని 90 స్థానాల్లో ఒకటైన బధ్రా అసెంబ్లీ స్థానంపై అందరి దృష్టి నిలిచింది . ఈ సీటు హర్యానాలోని కీలకమైన సీట్లలో ఒకటి.బధ్రా అసెంబ్లీ స్థానం భివానీ మహేంద్రగఢ్ లోక్సభ నియోజకవర్గం పరిధిలో ఉంది. ఈ సీటులో మొత్తం 1.5 లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుష ఓటర్లు 97,247, మహిళా ఓటర్ల సంఖ్య 86,708. ఈ స్థానంలో జాట్ ఓటర్లు అధికంగా ఉన్నారు. ఈ సీటుకున్న ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడి నుంచి ఒకసారి ఎన్నికల్లో గెలిచిన వారు మరోమారు విజయం సాధించలేదు.2019 అసెంబ్లీ ఎన్నికల్లో బధ్రా అసెంబ్లీ స్థానం నుంచి జననాయక్ జనతా పార్టీ నేత నైనా చౌతాలా భారీ విజయాన్ని దక్కించుకున్నారు. నైనాకు 52,543 ఓట్లు వచ్చాయి. నాటి ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి రణబీర్ సింగ్ మహేంద్రకు 38,898 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థి సుఖ్వీందర్కు 32,685 ఓట్లు వచ్చాయి. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి చెందిన సుఖ్విందర్ మాంధీ విజయం సాధించగా, 2009లో ఐఎన్ఎల్డీ నేత కల్నల్ రఘ్బీర్ సింగ్ బధ్రా ఎన్నికల్లో విజయం సాధించారు. -
Maharashtra: మహాయుతి సీట్ల సద్దుబాటు ఫార్ములా ఇదే..
మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల తేదీలు ఇంకా ప్రకటించనప్పటికీ, రాష్ట్రంలో రాజకీయ వేడి అంతకంతకూ పెరుగుతోంది. సీట్ల సద్దుబాటుకు సంబంధించి మహాయుతి (బీజేపీ, శివసేన, ఎస్సీపీల కూటిమి)లో రాజకీయ గందరగోళం నెలకొన్నదనే వార్తలు వస్తున్న తరుణంలో మరో ఆస్తకికర పరిణామం చోటుచేసుకుంది.రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి సీట్ల సద్దుబాటు ఫార్ములాను ఆగస్టు 15 నాటికి మహాయుతి ఖరారు చేయనుంది. కూటమిలోని వివిధ పార్టీల ఎమ్మెల్యేలు గతంలో గెలిచిన స్థానాలలోనే తిరిగి పోటీ చేసేలా ఫార్ములా రూపొందించనున్నట్లు ఎన్సీపీ జాతీయ అధ్యక్షుడు, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ తెలిపారు.ఈ ప్రకటనపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ బవాన్కులే స్పందిస్తూ సిట్టింగ్ ఎమ్మెల్యేలలో బీజేపీ వారైనా, షిండే లేదా అజిత్ పవార్ వర్గం వారైనా వారి మనోభావాలను గౌరవిస్తామన్నారు. అయితే అక్కడక్కడ ఒకటి లేదా రెండు సీట్ల కేటాయింపులలో తేడా ఉండవచ్చన్నారు. పొత్తు విషయంలో దేవేంద్ర ఫడ్నవీస్, ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్ మధ్య చర్చలు జరగాలని ఎమ్మెల్యేలు కోరుకుంటున్నారన్నారు. -
‘తిక్క తీరింది బిడ్డకు’..! పగలబడి నవ్వుతారు: వైరల్ వీడియో
ప్రయాణాల్లో గర్భంతో ఉన్న మహిళను చూస్తే ఎవరికైనా లేచి సీటు ఇవ్వాలనిపిస్తుంది. నిజానికి అది కనీస ధర్మం కూడా. కానీ చాలామంది యువకులు విచిత్రంగా ప్రవర్తిస్తుంటారు. ఆడవాళ్లను, అందులోనూ గర్భిణీలను గౌరవించాలనే కనీస జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తారు. సరిగ్గా ఇలాంటి సంఘటన ఒకటి ఇంటర్నెట్లో వైరల్ గా మారింది. ఒక బస్సులో గర్భిణీ స్వయంగా వచ్చి సీటు అడిగినా ఇవ్వలేదు ఒక యువకుడు. సరికదా... అసభ్యంగా ప్రవర్తించాడు. తన ఒళ్ళో కూచోమన్నట్టుగా సైగ చేశాడు. దీంతో వెనక కూర్చున్న పెద్దాయనకు ఒళ్లు మండింది. వీడికి తగిన బుద్ధి చెప్పాలని నిర్ణయించు కున్నాడు. ఇక క్షణం ఆలస్యం చేయకుండా..వెంటనే లేచి ఆ మహిళను తన సీట్లో కూర్చోమని చెప్పి, ఠపీమని ఆ పోరగాడి ఓళ్లో కూచున్నాడు. అటు వాడి తిక్క తీరింది. లబోదిబోమన్నాడు. దీంతో ఆ మహిళతో సహా, బస్సులోని వాళ్లందరూ నవ్వుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వేలకొద్దీ కామెంట్లు, రీషేర్లతో నెట్టింట్ వైరల్గా మారింది.😂😂pic.twitter.com/yp5QDTfMVc— Figen (@TheFigen_) June 19, 2024 తిక్క తీరింది బిడ్డకు.. లేకపోతే.. ఏంటా యాటిట్యూడ్ అంటూ నెటిజన్లు కమెంట్స్ చేశారు. ‘బుర్రా..బుద్ధీ ఉండాలి కదరా! మారండిరా’ అని మరి కొంతమంది ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్స్లో షేర్ అయిన ఈ వీడియో ఇప్పటికే కోటి 1.30 కోట్లకు పైగా వ్యూస్ను దక్కించుఉంది. -
శ్రీనగర్లో నువ్వా? నేనా? అంటున్న ఎన్సీ, పీడీపీ?
దేశంలో ఎన్నికల పండుగ జరుగుతోంది. ఈ నేపధ్యంలో శ్రీనగర్ పార్లమెంటరీ నియోజకవర్గం మే 13న ఆసక్తికర పోటీకి సిద్ధమైంది. మొత్తం 17,43,845 మంది ఓటర్లు.. బరిలో ఉన్న 24 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చనున్నారు. ఈ ఎన్నికల్లో తొలిసారిగా రెండు లక్షల మంది ఓటు వేయనున్నారు. 2019 లోక్సభ ఎన్నికలు పూర్తయిన తర్వాత జమ్ముకశ్మీర్లో ఆర్టికల్ 370 తొలగించి, కేంద్ర పాలిత ప్రాంత హోదాను కల్పించారు. ఈ ప్రకియ తరువాత ఇప్పుడు తొలిసారిగా ఇక్కడ ఎన్నికల పోరు జరుగుతోంది. కశ్మీర్లోని ఐదు జిల్లాల్లో విస్తరించి ఉన్న శ్రీనగర్ నియోజకవర్గంలో ఆసక్తికర పోటీ నెలకొంది. ఇక్కడ అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్ణయించేందుకు 17,43,845 మంది ఓటర్లు సిద్ధంగా ఉన్నారు. వీరిలో 8,73,426 మంది పురుషులు, 8,70,368 మంది మహిళలు కాగా, 51 మంది ట్రాన్స్జెండర్లు.భారత ఎన్నికల కమిషన్ అందించిన డేటా ప్రకారం శ్రీనగర్, గందర్బాల్, బుద్గాం, పుల్వామా, షోపియాన్ జిల్లాల్లో మొత్తం 2,135 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ) నుండి అఘా సయ్యద్ రుహుల్లా మెహదీ, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ(పీడీపీ) నుండి వహీద్-ఉర్-రెహ్మాన్ పర్రా ప్రధాన పోటీదారులుగా నిలిచారు. డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్కు అమీర్ భట్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. శ్రీనగర్ లోక్సభ స్థానంపై నేషనల్ కాన్ఫరెన్స్కు మంచి పట్టు ఉంది. నేషనల్ కాన్ఫరెన్స్ 2014 మినహా 1977 నుండి 2019 వరకు నిరంతరం ఈ స్థానాన్ని గెలుచుకుంటూ వస్తోంది. 2019 లోక్సభ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్ అభ్యర్థి ఫరూక్ అబ్దుల్లా 1,06,596 ఓట్లతో విజయం సాధించారు. అయితే 2014లో పీడీపీ అభ్యర్థి తారిఖ్ హమీద్ కర్రా 1,57,923 ఓట్లతో గెలుపొందడంతో పరిస్థితి మారిపోయింది. కశ్మీర్లోని ఐదు స్థానాల్లో మూడింటిని ఎన్సీ కైవసం చేసుకుంది.జమ్మూ కాశ్మీర్లో మొత్తం ఐదు లోక్సభ స్థానాలు ఉన్నాయి. వీటిలో మూడు నేషనల్ కాన్ఫరెన్స్, రెండు బీజేపీ చేతిలో ఉన్నాయి. శ్రీనగర్ లోక్సభ స్థానం నేషనల్ కాన్ఫరెన్స్కు బలమైన కోటగా ఉంది. పార్టీ 1947 నుండి 15 పార్లమెంటరీ ఎన్నికల్లో 12 సార్లు ఈ సీటును దక్కించుకుంది.శ్రీనగర్ లోక్సభ నియోజకవర్గంలో అబ్దుల్లా కుటుంబ ఆధిపత్యం మొదటి నుంచి ఉంది. అయితే ఈ సారి పరిస్థితి పూర్తిగా భిన్నంగా కనిపిస్తోంది. శ్రీనగర్ లోక్సభ స్థానాన్ని సున్నితమైన స్థానంగా పరిగణిస్తారు. గత 35 ఏళ్లలో వేర్పాటువాదం, హింసాయుత ఘటనల కారణంగా ఈ ప్రాంతంలో తక్కువ శాతం ఓటింగ్ జరుగుతూ వస్తోంది. అయితే ప్రస్తుత పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా ఉంది. ఈసారి ఇక్కడి ఓటర్లు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఏర్పడింది. -
కంగనా దుస్తులపైనే అందరి దృష్టి!
హిమాచల్ ప్రదేశ్లోని మండి లోక్సభ స్థానం నుంచి నటి కంగనా రనౌత్ బీజేపీ తరపున ఎన్నికల బరిలోకి దిగారు. ఆమె కాంగ్రెస్ అభ్యర్థి విక్రమాదిత్య సింగ్పై పోటీ చేస్తున్నారు. హిమాచల్లో 17 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ప్రస్తుతం మండీలో విక్రమాదిత్య సింగ్ తల్లి ప్రతిభా సింగ్ ఎంపీగా ఉన్నారు.హిమాచల్ ప్రదేశ్లోని మండి లోక్సభ స్థానంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఇక్కడి నుంచి పోటీ చేయడమే ఇందుకు కారణంగా కనిపిస్తోంది. కాగా కంగనా రనౌత్ తన ఎన్నికల ప్రచారంలో సంప్రదాయ దుస్తులతో అందరినీ ఆకట్టుకుంటున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి విక్రమాదిత్య సింగ్ ఇటీవల కంగనా ధరిస్తున్న సంప్రదాయ దుస్తులపై కామెంట్ చేశారు. ఆమె ప్రజలను ఆకట్టుకునేలాంటి దుస్తులను తరచూ ధరిస్తున్నారని విక్రమాదిత్య సింగ్ ఆరోపించారు.కంగనా రనౌత్ హిమాచల్ ప్రదేశ్లోని మండి జిల్లాలోని భంబ్లా పరిధిలోగల జాహు నివాసి. మండిలో జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో కంగనా రనౌత్ సంప్రదాయ చీరలు, స్థానిక దుస్తులతో కనిపిస్తున్నారు. ఆమె కులులో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నప్పుడు కుల్లవి వేషధారణలో కనిపించారు. ఇక్కడ ఈ తరహా దుస్తులకు ఎంతో ఆదరణ ఉంది.ఆమె చంబాలోని భర్మౌర్ను సందర్శించినప్పుడు శామ్ చౌరాసి దేవాలయంలో పూజలు చేశారు. ఈ సమయంలో కంగనా చంబా సాంప్రదాయ దుస్తులలో కనిపించారు. ఆ సమయంలో ఆమె తీయించుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. కిన్నౌర్ జిల్లాలో ఆమె ప్రచారంలో పాల్గొన్నప్పుడు కిన్నౌరి శాలువా కప్పుకుని అందరికీ కనిపించారు. ఆ వీడియోను కంగన సోషల్ మీడియాలో షేర్ చేశారు.సిమ్లాలోని రాంపూర్లో ప్రచారం సాగించినప్పుడు ఆమె అక్కడి ప్రసిద్ధ భీమాకాళి ఆలయంలో పూజలు చేసి, బహిరంగ సభ కూడా నిర్వహించారు. ఆ సమయంలో ఆమె స్థానిక సంప్రదాయ దుస్తులలో కనిపించి అందరినీ ఆకట్టుకున్నారు. ఈ సిమ్లా సంప్రదాయ దుస్తుల్లో కంగనా మెరుపు తీగలా ఉన్నారనే కామెంట్ వినిపించింది. ఇదిలా ఉండగా కంగనా రనౌత్ ప్రచార సభల్లో పాల్గొనేటప్పుడు డిఫరెంట్ డ్రెస్సుల్లో కనిపిస్తూ, అందరినీ ఆకట్టకుంటున్నారని విక్రమాదిత్య సింగ్ ఆరోపించారు. ఆమె ప్రచార సభలను చూస్తుంటే ఆమె ఓ సినిమా షూటింగ్లో పాల్గొన్నట్లు అనిపిస్తోందని విక్రమాదిత్య వ్యాఖ్యానించారు. -
రాయ్బరేలీ నుంచి రాహుల్? ప్రియాంకపై వీడని ఉత్కంఠ?
యూపీలోని అమేథీ, రాయ్బరేలీ లోక్సభ స్థానాల నుంచి కాంగ్రెస్ ఎవరిని ఎన్నికల బరిలోకి దింపుతున్నదనే విషయం ఇంకా వెల్లడి కాలేదు. అయితే రాహుల్ గాంధీ అమేథీ నుండి కాకుండా రాయ్బరేలీ నుండి ఎన్నికల్లో పోటీ చేయవచ్చనే వార్త తాజాగా వినిపిస్తోంది. అదేవిధంగా ప్రియాంక గాంధీని ఎన్నికల పోరులో నిలబెట్టే ఆలోచన కాంగ్రెస్కు లేదని కూడా అంటున్నారు.ఉత్తరప్రదేశ్లోని అమేథీ, రాయ్బరేలీ స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తామని తాజాగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తెలిపారు. కాగా రాహుల్ గాంధీ అమేథీ నుంచి, ప్రియాంక గాంధీ వాద్రా రాయ్బరేలీ నుంచి పోటీ చేయాలని కాంగ్రెస్ ఉత్తరప్రదేశ్ ఇన్ఛార్జ్ అవినాష్ పాండే, లెజిస్లేచర్ పార్టీ నాయకుడు ఆరాధన మిశ్రా అధినాయకత్వాన్ని కోరినట్లు సమాచారం.రాహుల్ గాంధీ 2004 నుంచి 2019 వరకు అమేథీ లోక్సభ సభ్యునిగా ఉన్నారు. 2019 లోక్సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ చేతిలో రాహుల్ గాంధీ ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ఇప్పుడు జరుగుతున్న లోక్సభ ఎన్నికల్లో కేరళలోని వయనాడ్ నుంచి రాహుల్ గాంధీ పోటీ చేస్తున్నారు.కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఈసారి రాయ్బరేలీ నుండి ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నారు. ఆమె రాజస్థాన్ నుండి రాజ్యసభకు ఎన్నికయ్యారు. సోనియా రెండు దశాబ్దాల పాటు ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రియాంక గాంధీ ఈ స్థానం నుంచి పోటీ చేసే అవకాశం ఉందనే మాట కూడా వినిపిస్తోంది. కొద్దిసేపటిలో కాంగ్రెస్ అమెథీ, రాయ్బరేలీ లోక్సభ స్థానాలు అభ్యర్థుల పేర్లను వెల్లడించనుంది. దీంతో ఈ సస్పెన్స్కు తెరపడనుంది. -
Lok sabha elections 2024: కాంగ్రెస్లో ప్రియాంకం
ప్రియాంకా గాంధీ వాద్రా. తండ్రి రాజీవ్ హత్యకు గురైనప్పుడు సమాజంతో పాటు మొత్తం ప్రపంచంపైనే కోపం పెంచుకున్న అమ్మాయి. ఎదిగే కొద్దీ క్షమాగుణం విలువను తెలుసుకున్నారు. ప్రధాని పదవి స్వీకరించాలని తల్లి సోనియాను కాంగ్రెస్ నేతలంతా కోరితే తననూ హత్య చేస్తారని భయపడి ఏడ్చిన సగటు యువతి. ఇప్పుడదే కాంగ్రెస్కు ట్రబుల్ షూటర్గా మారారు. అచ్చం నానమ్మ ఇందిర పోలికలను పుణికిపుచ్చుకున్న ప్రియాంక రాజకీయాల్లోకి వస్తారా, రారా అన్న చర్చ ఆమె పద్నాలుగో ఏట నుంచే మొదలైంది! తనకు రాజకీయాలు సరిపడవని మొదట్లో గట్టిగా నమ్మారామె. అలాంటిది ఇప్పుడు రాజకీయాల్లో పూర్తిగా తలమునకలయ్యారు. గాంధీల కంచుకోటైన యూపీలోని రాయ్బరేలీలో తల్లికి బదులుగా కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తారంటూ ప్రచారమూ జరుగుతోంది. రాజకీయ జీవితం ప్రియాంక తొలుత క్రియాశీల రాజకీయాల్లో అంతగా పాల్గొనలేదు. తల్లి, సోదరుల లోక్సభ నియోజకవర్గాలైన రాయ్బరేలీ, అమేథీలకు వెళ్లేవారు. 2004 లోక్సభ ఎన్నికలలో సోనియాకు ప్రచార నిర్వాహకురాలిగా వ్యవహరించారు. రాహుల్ ప్రచారాన్ని కూడా పర్యవేక్షించారు. 2007 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ రెండు లోక్సభ స్థానాల పరిధిలోని పది అసెంబ్లీ సీట్లలో ప్రచారం మొదలుకుని సీట్ల కేటాయింపులు, అంతర్గత పోరును పరిష్కరించడం దాకా అన్నీ తానై వ్యవహరించారు. 2019లో యూఈ తూర్పు భాగానికి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా అధికారికంగా రాజకీయాల్లోకి ప్రవేశించారు. తర్వాత యూపీ ఇన్చార్జిగా వ్యవహరించారు. 2022 యూపీ అసెంబ్లీ ఎన్నికల బాధ్యతలను తీసుకున్నారు. మహిళలకు 40 శాతం టికెట్ల డిమాండ్తో ‘లడ్కీ హూ, లడ్ సక్తీ హూ’ నినాదాన్ని తెరపైకి తెచ్చారు. ఆమె ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమే చవిచూసింది. ఆ అనుభవం తన జీవితంలో స్థితప్రజ్ఞత తీసుకొచి్చందంటారు ప్రియాంక. అయితే 2022 హిమాచల్ప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రచారానికి సారథ్యం వహించి పార్టీని విజయ తీరాలకు చేర్చారు. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లోనూ క్రియాశీల పాత్ర పోషించారు. హిందీ సాహిత్యం.. బౌద్ధం... ప్రియాంక 1972 జనవరి 12న జని్మంచారు. డెహ్రాడూన్ వెల్హామ్ బాలికల పాఠశాలలో చదివారు. తర్వాత భద్రతా కారణాలతో రాహుల్తో పాటు ఢిల్లీలోని డే స్కూల్కు మారారు. ఇందిర హత్యానంతరం ఇద్దరూ ఇంట్లోనే చదువుకున్నారు. ఢిల్లీ విశ్వవిద్యాలయం అనుబంధ కాలేజీ జీసస్ అండ్ మేరీ నుంచి ప్రియాంక సైకాలజీలో డిగ్రీ చేశారు. బౌద్ధ అధ్యయనంలో మాస్టర్స్ చేశారు. నానమ్మను అత్యంత శక్తివంతమైన మహిళగా చెబుతారు. బాల్యంలో నానమ్మతో రాహులే ఎక్కువగా గడపడం చూసి ఈర‡్ష్య పడేదాన్నంటూ నవ్వేస్తారు. ప్రియాంక బాల్యం ఎక్కువగా బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్ తల్లి తేజీ బచ్చన్తో గడిచింది. అమితాబ్ తండ్రి హరివంశ్ రాయ్ బచ్చన్ కవిత్వం చదివి హిందీ సాహిత్యంపై మక్కువ పెంచుకున్నారు. ప్రేమ్చంద్ సాహిత్యాన్ని ఇష్టపడతారు. ఖాళీ దొరికితే పుస్తకాలు పట్టుకుంటారు. బౌద్ధ తత్వశా్రస్తాన్ని ఆచరిస్తారు. 1999లో రాజకీయాల్లోకి రావాల్సి వచి్చనప్పుడు పది రోజులపాటు మెడిటేషన్ చేసి నిర్ణయం తీసుకున్నారు. 1997లో వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రాను పెళ్లాడారు. వారికిద్దరు పిల్లలు. ప్రియాంక రేడియో ఆపరేటర్ కూడా! -
రాయ్బరేలీ నుంచి ప్రియాంకా గాంధీ? త్వరలో అధికారిక ప్రకటన?
కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తర్వాత యూపీలోని రాయ్బరేలీ ఎవరిది? ఈ ప్రశ్నకు కాంగ్రెస్ హైకమాండ్ త్వరలోనే జవాబు చెప్పనుంది. తాజాగా రాయ్బరేలీ ఎన్నికల బరిలో ప్రియాంక ప్రవేశానికి సంబంధించిన సూచనలు హై కమాండ్ నుంచి జిల్లా కార్యనిర్వాహకవర్గానికి అందిందనట్లు సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడనుందట. ప్రియాంకా గాంధీ రాయ్బరేలీ నుంచి ఎన్నికల్లో పోటీ చేయాలని కోరేందుకు జిల్లా కమిటీ అధికారులు ఫిబ్రవరిలో ఆమెను కలుసుకున్నారు. ఈ లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్కు రాయ్బరేలీ సీటు ఎంతో కీలకం. సమాజ్వాదీతో పొత్తు కారణంగా రాష్ట్రంలో కాంగ్రెస్కు 17 సీట్లు దక్కాయి. ప్రియాంక గాంధీ రాయ్బరేలీ నుంచి ప్రచారాన్ని ప్రారంభిస్తే రాష్ట్రంలోని అన్ని లోక్సభ స్థానాలకు మంచి సందేశం అందుతుందని, అది భారత కూటమికి మేలు చేస్తుందని కాంగ్రెస్ థింక్ ట్యాంక్ నమ్ముతోంది. రాయ్బరేలీలో ప్రియాంక గాంధీకి.. ఆమె అమ్మమ్మ ఇందిరా గాంధీ, తల్లి సోనియా గాంధీకి ఉన్నంత ఆదరణ ఉంది. ప్రియాంక తొలిసారి 1999 లోక్సభ ఎన్నికల సమయంలో రాయ్బరేలీలో అడుగుపెట్టారు. ఆ సమయంలో కాంగ్రెస్ అభ్యర్థి కెప్టెన్ సతీష్ శర్మ గెలుపు బాధ్యతను ప్రియాంక విజయవంతం చేశారు. రాయ్బరేలీ రాజకీయాలపై ప్రియాంకకు మంచి అవగాహన ఉందని విశ్లేషకులు చెబుతుంటారు. -
లోక్సభ ఎన్నికలకు అఖిలేష్ దూరం?
ఉత్తరప్రదేశ్కు చెందిన సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ రాబోయే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదనే వార్త వినిపిస్తోంది. దీంతో ఇంతకాలం ఆయన ఆయన కన్నౌజ్ స్థానం నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తారనే ప్రచారంలో వాస్తవం లేదని తేలింది. ఆయన ఈ లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆసక్తి చూపడం లేదని, అయితే కన్నౌజ్ సీటు నుంచి ఎవరిని నిలపాలనే దానిపై పార్టీ నేతలతో చర్చించనున్నారని తెలుస్తోంది. ఇందుకోసం ఆయన కన్నౌజ్లోని బూత్ ఇన్ఛార్జ్లతో సమావేశం కానున్నారని తెలుస్తోంది. ఈ సమావేశంలో కన్నౌజ్ అభ్యర్థిపై చర్చించే అవకాశాలున్నాయంటున్నారు. కన్నౌజ్ సీటు నుంచి అతని బంధువు తేజ్ ప్రతాప్కు టిక్కెట్ కేటాయించవచ్చని విశ్వసనీయ వర్గాల సమాచారం. కన్నౌజ్లో ఎన్నికల ఇన్ఛార్జ్తో జరిగే సమావేశం అనంతరం దీనిపై తుది నిర్ణయం తీసుకోనున్నారని తెలుస్తోంది. గత లోక్సభ ఎన్నికల్లో అఖిలేష్ యాదవ్ భార్య డింపుల్ యాదవ్ కన్నౌజ్ స్థానం నుంచి పోటీ చేశారు. అయితే ఆమె బీజేపీకి చెందిన సుబ్రతా పాఠక్ చేతిలో ఓడిపోయారు. ఆ తరువాత ములాయం సింగ్ మరణానంతరం మెయిన్పురి స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో ఆమె గెలిచి ఎంపీ అయ్యారు. కాగా రాంపూర్ లోక్సభ స్థానం నుంచి తేజ్ ప్రతాప్ యాదవ్ను అఖిలేష్ యాదవ్ పోటీకి దించవచ్చని గతంలో వార్తలు వచ్చాయి. అయితే ఆజం ఖాన్ అందుకు సిద్ధంగా లేరని సమాచారం. కన్నౌజ్లో సమాజ్వాదీ నేతలు అఖిలేష్ యాదవ్ ఇక్కడ నుండి పోటీ చేస్తే బాగుంటుందని సూచిస్తున్నారు. తేజ్ ప్రతాప్ యాదవ్ సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపకులు ములాయం సింగ్ సోదరుడు రాజ్వీర్ సింగ్ యాదవ్ కుమారుడు. 2014లో మెయిన్పురి స్థానం నుండి ఎంపీగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత అతనికి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం రాలేదు. తేజ్ ప్రతాప్కు ఆర్జేడీ నేత లాలూ యాదవ్తోనూ సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. లాలూకు తేజ్ ప్రతాప్ అల్లుడు. లాలూ యాదవ్ కుమార్తె రాజలక్ష్మి యాదవ్ను తేజ్ ప్రతాప్ వివాహం చేసుకున్నారు. -
ఆ సీటుకు కాంగ్రెస్ Vs కాంగ్రెస్?
లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అంతర్గత కలహాలతో సతమతమవుతోంది. ముఖ్యంగా కోలార్ సీటు విషయంలో పార్టీలో తర్జనభర్జనలు జరుగుతున్నాయి. కోలార్ సీటును ఆ మాజీ ఎంపీ అల్లుడికి ఇస్తే రాజీనామా చేస్తామంటూ ఐదుగురు పార్టీ ఎమ్మెల్యేలు అధిష్ఠానాన్ని బెదిరించారు. పార్టీ సీనియర్ నేత, మంత్రి కె. హెచ్.మునియప్ప అల్లుడు చిక్క పెద్దన్నకు లోక్సభ ఎన్నికల్లో కోలార్ నుంచి టికెట్ ఇస్తే రాజీనామా చేస్తామంటూ ఐదుగురు ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు. ఈ నేపధ్యంలో ఈ ప్రాంతంలో పార్టీ ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు. కోలార్ నియోజకవర్గం నుంచి ప్రస్తుత రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కెహెచ్ మునియప్ప గెలుపొందారు. ఆయన ఇప్పుడు తన అల్లుడు చిక్కా పెద్దన్నకు ఈ ప్రాంతపు టిక్కెట్ అడుగుతున్నారు. పార్టీ ఇంకా అభ్యర్థిని ప్రకటించనప్పటికీ, కోలార్ జిల్లాకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, ఇద్దరు శాసన మండలి (ఎమ్మెల్సీ) సభ్యులు, ఒక మంత్రి తదితరులు చిక్కా పెద్దన్నకు టిక్కెట్ ఇస్తే తాము పార్టీలోని అన్ని పదవులకు రాజీనామా చేస్తామని ప్రకటించారు. పెద్దన్నకు టికెట్ ఇస్తే షెడ్యూల్డ్ కులాల వామపక్ష వర్గానికి ప్రాతినిధ్యం దక్కుతుందని పార్టీ భావిస్తోంది. అయితే కోలార్ జిల్లాకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు కోలార్ కొత్తూర్జి మంజునాథ్, కే. వై. నంజేగౌడ, ఎంసీ శాసనమండలి సభ్యులు అనిల్కుమార్, నసీర్ అహ్మద్ తదితరులు ఈ సీటును షెడ్యూల్డ్ కులానికి చెందిన రైట్వింగ్ అభ్యర్థికే కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో పార్టీ అధిష్ఠానం ఎటూ తేల్చుకోలేకపోతున్నదని సమాచారం. -
ఆజంఖాన్ కంచుకోటను అఖిలేష్ కాపాడతారా?
ఉత్తరప్రదేశ్లోని పలు లోక్సభ స్థానాలకు సమాజ్వాదీ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. అయితే పార్టీ నేత ఆజం ఖాన్కు కంచుకోటగా ఉన్న రాంపూర్పై పార్టీ ఇంకా ఒక నిర్ణయానికి రాలేదు. ఈసారి ఆజం స్థానంలో ఎవరిని రంగంలోకి దింపాలనే ప్రశ్న ఎస్పీని కలవరపెడుతోంది. ఈ సీటు నుంచి అఖిలేష్ యాదవ్ పోటీ చేయాలని కార్యకర్తలు కోరుతున్నారని సమాచారం. అఖిలేష్ రామ్పూర్ నుండి ఎన్నికల్లో పోటీ చేయాలని అజం ఖాన్ స్వయంగా కోరారట. అయితే ఎస్పీ చీఫ్ అఖిలేష్ ఇందుకు సిద్ధంగా లేరట. మరోవైపు అఖిలేష్ కుటుంబం నుండి తేజ్ ప్రతాప్ యాదవ్ను రాంపూర్ నుండి పోటీ చేయించాలని పార్టీ భావిస్తోందని సమాచారం.. అధికారికంగా అఖిలేష్ ఇంకా ప్రకటించనప్పటికీ తేజ్ ప్రతాప్ యాదవ్కు టిక్కెట్ దక్కే అవకాశాలున్నాయని కొందరు అంటున్నారు. ఉత్తరప్రదేశ్లో అఖిలేష్ యాదవ్ కాంగ్రెస్తో చేతులు కలిపారు. దీంతో యూపీలో సమాజ్వాదీ పార్టీ 63 స్థానాల్లో పోటీ చేస్తుండగా, కాంగ్రెస్కు 17 సీట్లు మిగిలాయి. ఇటీవల యూపీలోని కొన్ని స్థానాల్లో కాంగ్రెస్ తమ అభ్యర్థులను ప్రకటించింది. వారణాసి నుంచి అజయ్ సింగ్కు, రాజ్గఢ్ నుంచి దిగ్విజయ్ సింగ్కు అవకాశం కల్పించారు. -
ఎన్నికల బరిలో వీరప్పన్ కుమార్తె!
గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ కుమార్తె విద్యా రాణి ఏప్రిల్ 19న తమిళనాడులో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. తమిళ్ నేషనలిస్ట్ పార్టీ ఆఫ్ నామ్ తమిజర్ కచ్చి (ఎన్టీసీ) టికెట్పై ఆమె కృష్ణగిరి లోక్సభ స్థానం నుంచి పోటీకి దిగారు. వృత్తిరీత్యా న్యాయవాది అయిన విద్యా రాణి జూలై 2020లో భారతీయ జనతా పార్టీలో చేరారు. తమిళనాడు బీజేపీ యూత్ వింగ్ వైస్ ప్రెసిడెంట్గానూ పనిచేశారు. ఇటీవల ఆమె నటుడు, దర్శకుడు సీమాన్ నేతృత్వంలోని ఎన్టీకే పార్టీలో చేరారు తమిళనాడు, పుదుచ్చేరిలో ఎన్నికల్లో పోటీ చేస్తున్న 40 మంది అభ్యర్థులను ఎన్టీకే నేత సీమాన్ పరిచయం చేశారు. ఈ సందర్భంగా ఆయన కృష్ణగిరి నుంచి ఎన్టీకే అభ్యర్థిగా విద్యా రాణి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని, మొత్తం 40 మంది ఎన్టీకే అభ్యర్థుల్లో సగం మంది మహిళలేని తెలిపారు. వృత్తిరీత్యా న్యాయవాది అయిన విద్యా రాణి కృష్ణగిరిలో ఒక పాఠశాలను నడుపుతున్నారు. ఆమె తన తండ్రి వీరప్పన్ను ఒకే ఒక్కసారి కలిశారట. తన తండ్రి వీరప్పన్ తన జీవితానికి కొత్త దిశానిర్దేశం చేశారని విద్యా రాణి తెలిపారు. తాను మూడో తరగతి చదువుతున్నప్పుడు తమిళనాడు-కర్ణాటక సరిహద్దులోని గోపీనాథమ్లోని తాతయ్య ఇంట్లో తన తండ్రిని మొదటిసారిగా, చివరిసారిగా చూశానని తెలిపారు. -
ప్రధాని మోదీ ప్రత్యర్థి రాయ్ బలాబలాలేమిటి?
2024 లోక్సభ ఎన్నికలకు 46 మంది అభ్యర్థుల పేర్లతో కూడిన నాలుగో జాబితాను కాంగ్రెస్ విడుదల చేసింది. వీటిలో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు అజయ్ రాయ్. యూపీలోని వారణాసి లోక్సభ స్థానం నుంచి ప్రధాని నరేంద్ర మోదీపై అజయ్రాయ్ను కాంగ్రెస్ మూడోసారి అభ్యర్థిగా నిలబెట్టింది. వారణాసి నుంచి తనకు అవకాశం కల్పించినందుకు రాయ్ కాంగ్రెస్ హైకమాండ్కు కృతజ్ఞతలు తెలిపారు. 2014, 2019 లోక్సభ ఎన్నికల్లో వారణాసి స్థానం నుండి బీజేపీ అభ్యర్థి నరేంద్ర మోదీపై కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ రాయ్ పోటీ చేశారు. 2014లో అజయ్రాయ్కు 75,614 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఈ ఎన్నికల్లో ప్రధాని మోదీపై 5,05,408 లక్షల ఓట్ల తేడాతో ఓడిపోయారు. 2019 లోక్సభ ఎన్నికల్లో అజయ్ రాయ్ 1,52,548 ఓట్లు దక్కాయి. ఈ ఎన్నికల్లో రాయ్ ఓట్ల శాతం పెరిగింది. ఈ ఎన్నికల్లో ఆయన 5,22,116 ఓట్ల తేడాతో ఓడిపోయారు. అజయ్ రాయ్ 1996, 2002, 2007లలో వారణాసిలోని కొలాస్లా అసెంబ్లీ స్థానం నుండి బీజేపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2007లో బీజేపీని వీడిన అజయ్ రాయ్ 2009లో స్వతంత్ర అభ్యర్థిగా కొలాస్లా ఉపఎన్నికల్లో గెలిచి నాలుగోసారి ఎమ్మెల్యే అయ్యారు. ఆ తర్వాత 2012లో వారణాసిలోని పింద్రా స్థానం నుంచి కాంగ్రెస్ టికెట్పై పోటీ చేశారు. అప్పుడు కూడా గెలుపొంది, ఐదోసారి ఎమ్మెల్యే అయ్యారు. అయితే ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించలేకపోయారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో 2017, 2022లో వారణాసిలోని పింద్రా స్థానం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా ఆయన పోటీ చేశారు. అయితే ఈ రెండు సార్లూ ఓటమిని ఎదుర్కోవలసి వచ్చింది. అజయ్ రాయ్ ఘాజీపూర్ జిల్లాకు చెందిన భూమిహార్ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. వారణాసిలో స్థిరపడ్డారు. ఆర్ఎస్ఎస్ విద్యార్థి విభాగం అయిన ఏబీవీపీ నుండి ఆయన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. వారణాసి నుంచి లోక్సభ టిక్కెట్ రాలేదనే కారణంతో అజయ్ రాయ్ బీజేపీని వీడారు. అయితే ఆయనకు బీజేపీకి చెందిన పలువురు నేతలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని అంటుంటారు. అజయ్ రాయ్పై పలు క్రిమినల్ కేసులు కూడా ఉన్నాయి. పూర్వాంచల్లోని పేరుమోసిన మాఫియా డాన్ ముఖ్తార్ అన్సారీ, అతని అనుచరులు 1994లో అజయ్ రాయ్ సోదరుడు అవధేష్ రాయ్ను కాల్చి చంపారు. అప్పటి నుంచి అజయ్రాయ్, అన్సారీ కుటుంబీకుల మధ్య శత్రుత్వం కొనసాగుతోందని అంటారు. -
జేడీయూ సిట్టింగ్ ఎంపీలకు మొండిచెయ్యి?
లోక్సభ ఎన్నికలకు బీహార్లోని జనతాదళ్యునైటెడ్ (జేడీయూ) అభ్యర్థుల పేర్లు ఇవేనంటూ కొన్ని లీకులు బయటకు వస్తున్నాయి. వీటి ప్రకారం చూస్తే ఈ ఎన్నికల్లో జేడీయూ పాతవారికి చెక్ పెట్టి, కొత్తవారికి అవకాశం కల్పించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పార్టీ టిక్కెట్లు దక్కనివారిలో కొంతమంది సిట్టింగ్ ఎంపీలు ఉన్నారని సమాచారం. సీట్ల పంపకంలో జేడీయూ తమ సిట్టింగ్ ఎంపీల టిక్కెట్లకు కోతపెట్టి, వాటిని మిత్ర పక్షాలకు కట్టబెట్టినట్లు సమాచారం. మీడియాకు అందిన వివరాల ప్రకారం సీట్ల పంపకంలో కరకట్ ఎంపీ మహాబలి సింగ్, గయ ఎంపీ విజయ్ మాంఝీ, సివాన్ ఎంపీ కవితా సింగ్, సీతామర్హి ఎంపీ సునీల్ కుమార్ పింటూలకు టిక్కెట్లు దక్కలేదని తెలుస్తోంది. అయితే శివహార్ నుంచి లవ్లీ ఆనంద్, సీతామర్హి నుంచి దేవేశ్ చంద్ర ఠాకూర్, శివన్ నుంచి రాజలక్ష్మి కుష్వాహా, కిషన్గంజ్ నుంచి మాస్టర్ ముజాహిద్ పేర్లను జేడీయూ ఖరారు చేసిందనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ పేర్లను ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. బీహార్లో జేడీయూకు 16 సీట్లు దక్కాయి. వాల్మీకినగర్ నుండి సునీల్ కుమార్, భాగల్పూర్ నుండి అజయ్ మండల్, మాధేపురా నుండి దినేష్ చంద్ర యాదవ్, ఝంఝార్పూర్ నుండి రాంప్రీత్ మండల్, సుపాల్ నుండి దిలేశ్వర్ కామత్, జెహానాబాద్ నుండి చండేశ్వర్ చంద్రవంశీ తదితరులు జేడీయూ నుంచి పోటీ చేస్తున్నట్లు తెలుస్తోంది. -
Lok Sabha elections 2024: నాలుగు రాష్ట్రాల్లో పొత్తు కాంగ్రెస్, ఆప్ ఒప్పందం
న్యూఢిల్లీ: లోక్సభ ఎన్నికల్లో ఢిల్లీ సహా నాలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ పొత్తు ఖరారైంది. ఢిల్లీ, గుజరాత్, గోవా, హరియాణాల్లో సీట్ల పంపకం పూర్తయింది. ఢిల్లీలో కాంగ్రెస్ 4, ఆప్ 3 చోట్ల బరిలో దిగుతాయి. న్యూఢిల్లీ, వెస్ట్ ఢిల్లీ, సౌత్ ఢిల్లీ, ఈస్ట్ ఢిల్లీ స్థానాల్లో ఆప్, చాందినీ చౌక్, నార్త్ ఈస్ట్ ఢిల్లీ, నార్త్ వెస్ట్ ఢిల్లీ సీట్లలో కాంగ్రెస్ బరిలో ఉంటాయి. గుజరాత్లో 24 స్థానాల్లో కాంగ్రెస్, రెండు స్థానాల్లో (భావ్నగర్, భరూచ్) ఆప్ పోటీ చేస్తాయి. హరియాణాలో కురుక్షేత్ర స్థానంలో ఆప్, మిగతా 9 చోట్లా కాంగ్రెస్ బరిలో ఉంటాయి. గోవాలో మొత్తం రెండు సీట్లతో పాటు చండీగఢ్ లోక్సభ స్థానంలోనూ కాంగ్రెసే పోటీ చేస్తుంది. కాంగ్రెస్ నేత ముకుల్ వాస్నిక్, ఆప్ ప్రధాన కార్యదర్శి సందీప్ పాఠక్ శనివారం ఈ మేరకు మీడియాకు వెల్లడించారు. పంజాబ్లో ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా పొత్తుతో సంబంధం లేకుండా అక్కడి 13 స్థానాల్లో విడిగానే పోటీ చేయాలని రెండు పారీ్టలూ నిర్ణయించాయి. గుజరాత్లో భరూచ్ స్థానాన్ని ఆప్కు కేటాయించడాన్ని దివంగత కాంగ్రెస్ నేత అహ్మద్ పటేల్ కుమారుడు ఫైజల్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అక్కడ అహ్మద్ పటేల్ పలుమార్లు గెలిచారు. ఈసారి కూడా కాంగ్రెస్ టికెట్పై తాను పోటీ చేస్తానని, దీనిపై పార్టీ అధిష్టానాన్ని కలిసి చర్చిస్తానని ఫైజల్ చెప్పారు. -
పొత్తు.. టీడీపీ సీనియర్లు చిత్తు
సాక్షి, అమరావతి : ప్రజల్లో ఆదరణ కోల్పోయినా, పొత్తుల ద్వారా గట్టెక్కుదామనుకుంటున్న తెలుగుదేశం పార్టీకి అవి కూడా శరాఘాతాల్లా మారాయి. పొత్తులో భారీగా సీట్లు కోల్పోయే పరిస్థితి నెలకొనడంతో చాలా మంది సీనియర్ల మెడపై కత్తులు వేలాడుతున్నాయి. దీంతో వారి రాజకీయ భవితవ్యం అగమ్యగోచరంగా మారింది. ఇప్పటికే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ 67 పేర్లతో జాబితాను చంద్రబాబుకు ఇచ్చారు. వాటిలో కనీసం 50కి పైగా సీట్లు తమకు కేటాయించాలని కోరుతున్నారు. తాజాగా బీజేపీతో పొత్తు కోసం వెంపర్లాడుతుండడంతో ఆ పార్టీకి ఆరు ఎంపీ, 25 ఎమ్మెల్యే సీట్లు ఇవ్వక తప్పదని టీడీపీ నేతలు చెబుతున్నారు. ఈ పొత్తులు ఖరారైతే బీజేపీ, జనసేనకు 75 ఎమ్మెల్యే, 10 ఎంపీ స్థానాలు వదులుకోక తప్పని పరిస్థితి నెలకొంది. దీంతో అనేక మంది సీనియర్ల సీట్లు గల్లంతవుతున్నాయి. పొత్తులతో పార్టీ పరిస్థితి అగమ్య గోచరంగా తయారైందని సీనియర్ నేతలు లబోదిబోమంటున్నారు. అన్ని సీట్లు వదులుకుంటే పార్టీ అధికారంలోకి రావడం అటుంచి అసలు విలువే లేకుండా పోతుందని నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అది నిజమే అయినా పొత్తులు లేకపోతే దిగజారిపోయిన పార్టీ మనుగడే కష్టమైపోతుందని చంద్రబాబు భావిస్తున్నారు. అందుకే పవన్ కళ్యాణ్, బీజేపీతో పొత్తు కోసం వెంపర్లాడుతున్నారు. తద్వారా పార్టీని రేసులోనైనా నిలపవచ్చని భావిస్తున్నారు. అయితే దీనివల్ల అనేక మంది సీనియర్ నాయకుల రాజకీయ జీవితాలకు ముగింపు తప్పదని పార్టీలో ఆందోళన వ్యక్తమవుతోంది. ఉత్తరాంధ్ర కకావికలం ఈ పొత్తులు ఖరారైతే ఉత్తరాంధ్రలో టీడీపీ సీనియర్ నేతలు కళా వెంకట్రావు, అశోక్ గజపతిరాజు, చింతకాయల అయ్యన్న పాత్రుడు, గౌతు శిరీష, బండారు సత్యనారాయణమూర్తి, గండి బాబ్జి, గంటా శ్రీనివాసరావు, పీలా గోవింద్, పల్లా శ్రీనివాసరావు తదితర నేతల పేర్లు గల్లంతవనున్నాయి. ఎచ్చెర్లపై ఎన్నో అశలు పెట్టుకున్న కళా వెంకట్రావు పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా మారింది. విశాఖలో కీలక నేతగా ఉన్న మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి సీటు ఎగిరిపోనుంది. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. అశోక్గజపతిరాజు వంటి సీనియర్ తన కుమార్తెకు సీటు ఇప్పించుకోలేక సతమతమవుతున్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాల నేతలకు తప్పని పొత్తు పోట్లు కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కీలకమైన సీనియర్లకు పొత్తు పోట్లు తప్పేలా లేవు. విజయవాడలో మాజీ ఎమ్మెల్యేలు జలీల్ఖాన్, బొండా ఉమామహేశ్వరరావులను పక్కన పెట్టే పరిస్థితి ఏర్పడనుంది. అవనిగడ్డలో మాజీ మంత్రి మండలి బుద్ధప్రసాద్, పెడనలో కాగిత కృష్ణప్రసాద్, మచిలీపట్నంలో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, తెనాలిలో ఆలపాటి రాజా, నక్కా ఆనంద్బాబు వంటి నేతలకు షాక్ తగలనుంది. ఆలపాటి రాజా ఇప్పటికే తన సీటు పోతే ఒప్పుకునేది లేదని అనుచరులను ముందుపెట్టి హడావుడి చేస్తున్నారు. పరిటాల శ్రీరామ్, భూమా అఖిలప్రియకు టాటా నెల్లూరు, ప్రకాశం, రాయలసీమ జిల్లాల్లో పలువురు కీలక నాయకులు పొత్తుతో రాజకీయంగా కనుమరుగయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సత్యసాయి జిల్లా ధర్మవరంలో పరిటాల శ్రీరామ్, నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో భూమా అఖిలప్రియ, అనంతపురంలో ప్రభాకర్ చౌదరి, నగరిలో గాలి భానుప్రకాష్, తిరుపతిలో సుగుణమ్మ, శ్రీకాళహస్తిలో బొజ్జల సుదీర్రెడ్డి, రాజంపేటలో బత్యాల చెంగల్రాయుడు, జమ్మలమడుగులో భూపే‹Ùరెడ్డి వంటి నేతలు పోటీ నుంచి తప్పుకోక తప్పదంటున్నారు. పొత్తులో బీజేపీ విశాఖ, విజయవాడ, నర్సాపురం, రాజమండ్రి, తిరుపతి, రాజంపేట పార్లమెంట్ సీట్లు ఆశిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. విశాఖ నుంచి గత ఎన్నికల్లో లోకేశ్ తోడల్లుడు భరత్ పోటీ చేసి ఓడిపోయారు. ఆయన అక్కడి నుంచి మళ్లీ పోటీ చేయాలని భావిస్తున్న తరుణంలో ఆ సీటు బీజేపీకి పోతే ఆయన భవితవ్యం ప్రశ్నార్థకం కానుంది. విజయవాడ సీటును సిట్టింగ్ ఎంపీ కేశినేని నానిని కాదని ఆయన సోదరుడు కేశినేని చిన్నికి ఇస్తున్నట్లు చంద్రబాబు స్పష్టం చేశారు. పొత్తులో అక్కడి నుంచి బీజేపీ తరఫున సుజనా చౌదరి పోటీ చేయాలని చూస్తున్నారు. దీంతో కేశినేని చిన్నికి సీటు పోయినట్లేనని భావిస్తున్నారు. జనసేన కోరుతున్న నియోజకవర్గాలు ♦ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా: ఎచ్చెర్ల, శ్రీకాకుళం, పలాస ♦ ఉమ్మడి విజయనగరం జిల్లా: విజయనగరం, నెల్లిమర్ల. ♦ ఉమ్మడి విశాఖ పట్నం జిల్లా: పెందుర్తి, యలమంచిలి, చోడవరం, విశాఖపట్నం దక్షిణం, విశాఖపట్నం ఉత్తరం, భీమిలి, అనకాపల్లి, గాజువాక. ♦ ఉమ్మడి తూర్పు గోదావరి: పిఠాపురం, కాకినాడ సిటీ, కాకినాడ రూరల్, ముమ్మడివరం, రాజమండ్రి రూరల్, రాజానగరం, కొత్తపేట, అమలాపురం, రామచంద్రాపురం, రాజోలు, పి.గన్నవరం. ♦ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా: నర్సాపురం, భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు, నిడదవోలు, ఉంగుటూరు, ఏలూరు, గోపాలపురం, కొవ్వూరు, పోలవరం, ఆచంట. ♦ ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లా: విజయవాడ పశ్చిమ, విజయవాడ సెంట్రల్, విజయవాడ తూర్పు, అవనిగడ్డ, పెడన, నూజివీడు, మచిలీపట్నం, కైకలూరు, పెనమలూరు, తెనాలి, గుంటూరు వెస్ట్, పెదకూరపాడు, తాడికొండ, పొన్నూరు, వేమూరు, గుంటూరు తూర్పు. ♦ ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ జిల్లాలు : దర్శి, గిద్దలూరు, నెల్లూరు సిటీ, కోవూరు, కావలి, తిరుపతి, మదనపల్లి, చిత్తూరు, నగరి, ఆళ్లగడ్డ, నంద్యాల, గుంతకల్లు, బద్వేలు, రైల్వే కోడూరు, రాజంపేట, పుట్టపర్తి, ధర్మవరం. గోదావరి జిల్లాల్లో సీనియర్ల సీట్లు గల్లంతే గోదావరి జిల్లాల్లోనూ చాలా మంది ముఖ్య నాయకుల మెడపై కత్తి వేలాడుతోంది. గోరంట్ల బుచ్చయ్య చౌదరి, గొల్లపల్లి సూర్యారావు, తోట సీతారామలక్ష్మి, కేఎస్ జవహర్, ఎస్వీఎస్ వర్మ వంటి వారు పోటీ చేసే అవకాశాన్ని కోల్పోనున్నారు. బుచ్చయ్యచౌదరి సిట్టింగ్ ఎమ్మెల్యేను కాబట్టి తన సీటు ఉంటుందని చెప్పుకుంటున్నా దానికి గ్యారంటీ లేదు. మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు సీటు ఇప్పటికే ఎగిరి పోయింది. రాజ్యసభ మాజీ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి భీమవరం సీటును నిరాకరిస్తుండడంతో ఆమె అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పిఠాపురం సీటు జనసేనకు పోతుండడంతో మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ వర్మ ఇప్పటికే తిరుగుబాటు స్వరం వినిపిస్తున్నారు. వీరు కాకుండా నర్సాపురంలో మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు, కాకినాడ వనమాడి వెంకటేశ్వరరావు, కాకినాడ రూరల్ పిల్లి అనంతక్ష్మి, ఐతాబత్తుల ఆనందరావు, బూరుగుపల్లి శేషారావు, గన్ని వీరాంజనేయులు వంటి నేతలకు టికెట్లు గల్లంతవనున్నాయి. -
రాహుల్ వయనాడ్ సీటును వదులుతారా? సీపీఐకి ఏం కావాలి?
కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రస్తుతం భారత్ జోడో న్యాయ యాత్ర చేపడుతున్నారు. ఇదిలావుంటే మమతా బెనర్జీ, నితీష్ కుమార్ల తర్వాత వామపక్షాలు కూడా కాంగ్రెస్కు పట్టం కట్టాయి. ఈ నేపధ్యంలో కాంగ్రెస్కు సవాళ్లు పెరుగుతున్నాయి. కేరళలోని రాహుల్ గాంధీ స్థానమైన వయనాడ్పై సీపీఐ తన వాదనలు వినిపిస్తోంది. ప్రస్తుతం కాంగ్రెస్ ఈ సీటును వదులుకునే పరిస్థితి లేదని చెబుతున్నప్పటికీ, సంకీర్ణ రాజకీయాల కారణంగా రాహుల్ ఈ సీటును వదిలిపెట్టే అవకాశం ఉందనే చర్చ సాగుతోంది. సీపీఐ చూపు ఇప్పుడు రాహుల్కు చెందిన వయనాడ్ సీటుపై పడింది. వయనాడ్ ఎప్పటి నుంచో లెఫ్ట్ సీటు అని, కాబట్టి రాహుల్ నిజంగా బీజేపీని సవాలు చేయాలనుకుంటే ఉత్తర భారతదేశంలోని ఏదైనా స్థానం నుండి పోటీ చేయాలని సీపీఐ చెబుతోంది. కాగా సీపీఐ ఎంపీ బినోయ్ విశ్వం మాట్లాడుతూ రాహుల్ స్థాయి వ్యక్తులు వాయనాడ్ను ఎన్నుకునేందుకు బదులుగా ఉత్తరాదితో పోరాడాలి. ఉత్తరాదిలో బీజేపీతో ప్రధాన పోరు ఉంది. అక్కడ ఎక్కువ సీట్లు ఉన్నాయి. అయితే ఈ విషయంలో కాంగ్రెస్లో కాన్ఫిడెన్స్ లేదని అనిపిస్తున్నదని పేర్కొన్నారు. అయితే రాహుల్కి వయనాడ్ సీటు సేఫ్ అనే వాదన వినిపిస్తుంటుంది. 2019లో రాహుల్ వయనాడ్లో సీపీఎం అభ్యర్థిని నాలుగు లక్షలకు పైగా ఓట్లతో ఓడించారు. అయితే అమేథీలో ఓడిపోయారు. మతోన్మాద శక్తులకు వ్యతిరేకంగా రాహుల్కు మద్దతు నివ్వాలని కాంగ్రెస్ వామపక్షాలను అభ్యర్థిస్తోంది. సీపీఐ, సీపీఎం తదితర వామపక్షాలు రాహుల్కు మద్దతివ్వాలని తాము కోరుతున్నామని కాంగ్రెస్ ఎంపీ కె.సురేష్ అన్నారు. కేరళ ప్రజలు కాంగ్రెస్కు మద్దతు ఇస్తున్నారని, రాహుల్ గాంధీ వయనాడ్ నుంచి పోటీ చేయాలని కేరళ ప్రజలు, కార్యకర్తలు కోరుకుంటున్నారని కూడా సురేష్ పేర్కొన్నారు. అయితే వయనాడ్ సీటు విషయంలో రెండు పార్టీలు ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. అయితే ఇండియా కూటమికి చెందిన ఈ రెండు పక్షాలు వయనాడ్ సీటు విషయంలో తమ వాదనలపై గట్టిగానే ఉన్నట్లు కనిపిస్తోంది. -
YSRCP: సరికొత్త సామాజిక విప్లవం..
ఏపార్టీ అయినా కానీ బాసూ.. అక్కడ మాత్రం ఆ కులానికే సీట్ ఇవ్వాలి.. ఎవరేమనుకున్నా కానీ ఈ ఎంపీ, ఎమ్మెల్యే సీట్ మాత్రం వాళ్ళకే ఇస్తారు. అయినా కోట్లు లేకుండా టిక్కట్ ఎలా దక్కుతుంది గురూ.. డబ్బుల్లేకుండా ఎలా గెలుస్తారు? ఇవీ గత కొన్నేళ్ళక్రితం వరకూ ప్రజల్లో ఉన్న అభిప్రాయం.. కానీ, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సరికొత్తగా సామాజిక విప్లవానికి నాంది పలికారు. ఇన్నాళ్లూ ఎస్సీ, ఎస్టీ రిజర్వ్డ్ సీట్లు పోగా మిగిలిన జనరల్ సీట్లలో ఆ ఎంపీ సీటు ఆ కులానిది.. ఈ ఎమ్మెల్యే సీటు ఆ వర్గానిది అంటూ అనధికారిక రిజర్వేషన్లు ఉండేవి. అంటే ఆ ఎంపీ లేదా ఎమ్మెల్యే సీటు ఏ పార్టీ వాళ్ళయినా ఫలానా కులానికి ఇవ్వాలన్నది ఒక అలిఖిత నిబంధన.. కొనసాగుతూ వస్తోంది. కానీ, సీఎం జగన్ ఆ నిబంధనల సంకెళ్లు తెంచేసి.. ఎస్సీ, ఎస్టీ సీట్లు మినహా మిగతా ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలకు సరికొత్త ఫార్ములాను రూపొందించారు. అగ్రకులాలు అంటే రెడ్డి, కమ్మ.. కాపు.. క్షత్రియ నాయకులు ఏలిన స్థానాల్లో సైతం ఇప్పుడు బీసీ అభ్యర్థులకు స్థానం కల్పిస్తూ సరికొత్త సామజిక విప్లవానికి ముఖ్యమంత్రి జగన్ బీజం వేశారు. నెల్లూరు సిటీ స్థానాన్ని గతంలో ఎవ్వరూ ఇవ్వని విధంగా ముస్లింలకు ఇవ్వడం ద్వారా.. అక్కడ ఆ వర్గాన్ని దగ్గర చేసుకున్నారు. నర్సాపురం లోక్సభ నియోజకవర్గం మొదటి నుంచీ క్షత్రియులు లేదా కాపులకు రిజర్వ్ చేయబడిన సెగ్మెంట్. కృష్ణంరాజు.. చేగొండి హరిరామజోగయ్య.. భూపతిరాజు విజయకుమార్ రాజు వంటి పెద్ద నాయకులు ఎంపీగా గెలిచిన చోటు అది. దానికితోడు భారీగా ఖర్చు కూడా పెట్టగలిగే వాళ్ళు అక్కడ పోటీ చేస్తారు. ఆ ప్రాంతానికి ఉన్న పొటెన్సీ అలాంటిది. అలాంటి నర్సాపురం ఎంపీగా బీసీ శెట్టిబలిజ కులానికి చెందిన సాధారణ అడ్వకేట్ ఉమాబాలకు కేటాయించి సీఎం జగన్ ప్రత్యర్థులకు గట్టి సవాల్ విసిరారు. ఈ క్రమంలోనే ఏలూరు.. కాకినాడ.. శ్రీకాకుళం.. విజయనగరం.. నర్సరావుపేట, అనంతపురం.. హిందూపురం.. కర్నూల్.. విశాఖ వంటి ఎంపీ స్థానాలు బీసీలకు కేటాయించారు. తద్వారా ఆయా నియోజకవర్గంలో దశాబ్దాలుగా ఓటర్లుగానే ఉంటూ వస్తున్నా కులాలకు నాయకత్వాన్ని అప్పగించే సరికొత్త విధానానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బాటలు వేస్తున్నారు. అయితే, ఈ నిర్ణయాల పట్ల కొందరు పుల్లవిరుపు మాటలు, వ్యంగ్యపు కామెంట్లు చేస్తున్నారు. అనామకులనుకున్నవాళ్ళే అసామాన్యులయ్యారు.. వీళ్ళు ఎంపీలా?, వీళ్ళు ఎమ్మెల్యేల అంటూ అప్పట్లో చాలామంది మీద ఇలాంటి కామెంట్స్ వినిపించాయి. కానీ, ఆ ఫలితాలు చూసాక వాళ్ళే వారెవ్వా ఇదీ జగనన్న స్కెచ్ అన్నారు.. ఉదాహరణకు.. # పార్వతీపురం(ఎస్టీ) నుంచి ఐదు సార్లు ఎంపీగా గెలిచి కేంద్రంలో మంత్రిగా చేసిన వైరిచర్ల కిషోర్ చంద్రదేవ్ను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున కొత్తపల్లి గీత, గొట్టేటి మాధవి అనే సాధారణ కార్యకర్తల చేతిలో రెండు సార్లు ఓడిపోయారు # కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి అనే సీనియర్ నేత అనామకుడైన సంజీవ్ కుమార్ చేతిలో ఓడిపోయారు # రాయపాటి సాంబశివరావు అనే సీనియర్ నాయకుడు.. లావు కృష్ణదేవరాయలు అనే యువకుడి చేతిలో గుంటూరులో ఓటమి చవిచూశారు # సినీ నటుడు.. డబ్బున్న నాయకుడు అయినా మురళీమోహన్ కోడలు మాగంటి రూప కాస్తా రాజమండ్రిలో కొత్తవాడైన మార్గాని భరత్ చేతిలో ఓడిపోయారు. # విజయనగరం రాజకుటుంబీకుడు పలుమార్లు రాష్ట్ర.. కేంద్ర మంత్రిగా చేసిన అశోక్ గజపతిరాజు కాస్తా కొత్తవాడైన బెల్లాన చంద్రశేఖర్ చేతిలో మట్టి కరిచారు. ఇలా చూసుకుంటూ పొతే జగనన్న వేసిన ప్లాన్ ఎంతోమంది సాధారణ కార్యకర్తలను రాష్ట్ర, జాతీయ స్థాయి నాయకులుగా మార్చింది. -సిమ్మాదిరప్పన్న -
India alliance: సీట్ల సర్దుబాటు కింద 11 స్థానాలిస్తాం
లక్నో: విపక్షాల ‘ఇండియా’ కూటమి భాగస్వామి పారీ్టగా భావిస్తూ 11 లోక్సభ స్థానాలను కాంగ్రెస్కు ఇస్తున్నట్లు సమాజ్వాదీ పార్టీ శనివారం ప్రకటించింది. ఈ కేటాయింపుతో విపక్షాల కూటమిలో సీట్ల సర్దుబాటు పర్వానికి చక్కటి శుభారంభం లభించిందని ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ వ్యాఖ్యానించారు. ‘ ఈ పంథా గెలుపు సమీకరణాలతో మరింత ముందుకెళ్తుంది. వెనుకబడిన, దళిత, అల్పసంఖ్యాల వర్గాల ఫార్ములాతో ఇండియా కూటమి చరిత్ర సృష్టించనుంది’’ అని అఖిలేశ్ అభిలíÙంచారు. ‘‘ కాంగ్రెస్కు ఇస్తామన్న సీట్ల సంఖ్యలో ఎలాంటి మార్పు ఉండబోదు’’ అని ఎస్పీ అధికార ప్రతినిధి రాజేంద్ర చౌదరి స్పష్టంచేశారు. ‘‘ యూపీలో సీట్ల సర్దుబాటులో భాగంగా మేం కాంగ్రెస్కు 11, రా్రïÙ్టయ లోక్దళ్(ఆర్ఎల్డీ)కి ఏడు సీట్లు ఇస్తాం. మిగతా మొత్తం 62 స్థానాల్లో మేమే పోటీచేస్తాం’’ అని వివరించారు. దీనిపై ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు అజయ్ రాయ్ స్పందించారు. ‘‘ మిత్ర పక్షం ఎస్పీ చేసిన ప్రతిపాదనపై తుది నిర్ణయం కాంగ్రెస్ నేత ముకుల్ వాస్నిక్ నేతృత్వంలోని కమిటీ తీసుకోనుంది’ అని అన్నారు. -
‘ఇండియా’లో పొత్తు చిచ్చు!
రానున్న లోక్సభ ఎన్నికల్లో అధికార బీజేపీని గద్దె దించడమే లక్ష్యంగా ఇతర విపక్షాలతో కలిసి ఇండియా కూటమి ఏర్పాటు చేసిన కాంగ్రెస్కు సీట్ల సర్దుబాటు కత్తిమీద సాములా మారుతోంది. సీట్ల పంపకాల విషయంలో సొంత పార్టీ నేతల నుంచే భిన్నాభిప్రాయాలు ఒకవైపు, భాగస్వామ్య పక్షాలు అధిక సీట్లు డిమాండ్ చేస్తుండటం మరోవైపు తలనొప్పిగా మారాయి. ముఖ్యంగా మహారాష్ట్ర, పశి్చమబెంగాల్, బిహార్, జమ్మూ కశీ్మర్లలో సీట్ల పంపకాల అంశం కాంగ్రెస్కు పరీక్ష పెడుతోంది...! బెంగాల్లో బెంబేలు... సీట్ల సర్దుబాటుపై ముందు సొంత పార్టీ నేతల నుంచి కాంగ్రెస్ అభిప్రాయ సేకరణ చేస్తోంది. దీనిపై ముకుల్ వాస్నిక్, అశోక్ గహ్లోత్, భూపేశ్ బఘెల్, సల్మాన్ ఖుర్షీద్, మోహన్ ప్రకాశ్లతో ఏర్పాటైన ఐదుగురు సభ్యుల ఏఐసీసీ బృందం రాష్ట్రాలవారీగా నేతలతో భేటీ అవుతోంది. ముఖ్యంగా 10 రాష్ట్రాల్లో కూటమి పక్షాలతో సీట్ల పంపకాలపై వారి అభిప్రాయాలు స్వీకరిస్తోంది. పశి్చమబెంగాల్లో 2019 లోక్సభ, 2021 అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ఆధారంగా కాంగ్రెస్కు రెండే ఎంపీ సీట్లిస్తామని అధికార తృణముల్ కాంగ్రెస్ ఇప్పటికే తేల్చిచెప్పింది. మిగతా 40 చోట్ల తామే పోటీ చేస్తామంటోంది. ఈ మాత్రానికి తృణముల్తో పొత్తెందుకని రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ప్రశి్నస్తున్నారు. వామపక్షాలతో పొత్తు పెట్టుకొని ఎక్కువ సీట్లలో కాంగ్రెసే పోటీ చేయాలంటున్నారు. అసలు కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోకుండా రాష్ట్రంలో అన్ని సీట్లలోనూ తామే పోటీ చేయాలని తృణమూల్ అధినేత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ భావిస్తున్నట్టు సమాచారం. ఢిల్లీలో ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్దీ ఇదే అభిప్రాయమని కూడా చెబుతున్నారు! బిహార్లో పీటముడి! బిహార్లోని 40 లోక్సభ స్థానాల్లో 2019లో ఆర్జేడీ సహా చిన్నా చితక పారీ్టలతో కాంగ్రెస్ జత కట్టి పోటీ చేసింది. ఈసారి జేడీ(యూ) కూడా జత కూడుతుండటంతో సమీకరణాలు పూర్తిగా మారుతున్నాయి. 2019లో ఆర్జేడీ 20, కాంగ్రెస్ 9, ఆర్ఎల్ఎస్పీ 5, హిందుస్థానీ అవామ్ మోర్చా (హమ్), వీఐపీ చెరో మూడు చోట్ల పోటీ చేశాయి. కాంగ్రెస్ కేవలం ఒక సీటు గెలవగా, అప్పట్లో బీజేపీతో పొత్తున్న జేడీ(యూ) 16 సీట్లు నెగ్గింది! బీజేపీ 17, లోక్ జనశక్తి పార్టీ 6 సీట్లు గెలిచాయి. ఈసారి కాంగ్రెస్కు భాగంగా కాంగ్రెస్కు 6 సీట్లే ఇస్తామని జేడీ(యూ) చీఫ్ నితీశ్కుమార్ అంటుండటం పార్టీ పెద్దలకు మింగుడు పడటం లేదు! జేడీ(యూ) 23, ఆర్జేడీ 9 స్థానాల్లో పోటీ చేయాలని భావిస్తున్నాయి. మహారాష్ట్రలో ఐదు సీట్లే! 48 లోక్సభ స్థానాలున్న మహారాష్ట్రలోనూ శివసేన (ఉధ్దవ్) పార్టీ ఏకంగా 23, మరో మిత్రపక్షం ఎన్సీపీ 20 సీట్లు కోరుతున్నాయి. అదే జరిగితే కాంగ్రెస్కు దక్కేవి ఐదే సీట్లు! ఇది ఆ మూడు పారీ్టలతో కూడిన ఎంవీఏ కూటమిలో చిచ్చు రాజేస్తోంది. ఇక ఢిల్లీ, పంజాబ్లో అధికారంలో ఉన్న ఆమ్ఆద్మీ పార్టీతో పొత్తు మాటెత్తితేనే స్థానిక కాంగ్రెస్ భగ్గుమంటున్నారు. రాష్ట్ర స్థాయిలో ఆప్తో పోరాడుతున్న తమకు పొత్తుల పేరిట అన్యాయం చేయొద్దంటున్నారు. కశీ్మర్లో కూడా మెజార్టీ సీట్లలో కాంగ్రెసే పోటీ చేయాలని, నేషనల్ కాన్ఫరెన్స్కు ఎక్కువ సీట్లు వద్దని అక్కడి నేతలంటున్నారు. జనవరి మూడో వారానికల్లా సీట్ల సర్దుబాటును పూర్తి చేయాలని భావిస్తున్న కాంగ్రెస్ను ఈ సమస్యలు చీకాకు పరుస్తున్నాయి. -
‘సమోసాకు డబ్బుల్లేక.. చాయ్తో సరిపెట్టారు’
న్యూఢిల్లీ: ఢిల్లీలో మంగళవారం విపక్షాల ‘ఇండియా’ కూటమి భేటీలో ప్రస్తావనకు వచ్చిన కీలకాంశాలపై ఓ వైపు చర్చ జరుగుతుంటే అక్కడ సమోసాలు ఇవ్వలేదంటూ జేడీ(యూ) సీనియర్ నేత సునీల్ కుమార్ పింటూ కాంగ్రెస్నుద్దేశిస్తూ చులకనగా మాట్లాడారు. డబ్బుల్లేక కాంగ్రెస్ కనీసం సమోసాలు కూడా వడ్డించలేదని వ్యాఖ్యానించారు. ‘‘ నిన్నటి సమావేశానికి భాగస్వామ్య పార్టీల అగ్రనేతలంతా విచ్చేశారు. సీట్ల పంపకాలపై చర్చించాలనుకున్నా అది టీ, బిస్కెట్లకే పరిమితం అయింది. ఎందుకంటే కాంగ్రెస్ దగ్గర నిధులు నిండుకున్నాయి. రూ.138, రూ.1,380, రూ.13,800 ఇలా చిన్న చిన్న మొత్తాలను ఆ పార్టీ విరాళంగా సేకరిస్తోంది. ఇంకా విరాళాలు రావాల్సి ఉంది. అప్పటిదాకా సమోసాలుండవు. టీ, బిస్కెట్లతో సరిపెట్టుకోవాలి. సమోసాలు లేకుండా ఎలాంటి తీవ్రమైన చర్చలు జరగబోవు’’ అని సునీల్ పింటూ వెటకారంగా అన్నారు. సంబంధిత వీడియోను బీజేపీ నేత అమిత్ మాలవీయ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్చేశారు. JDU सांसद सुनील कुमार पिंटू का बड़ा बयान। I.N.D.I. अलायंस की बैठक को बताया टांय-टांय फिस्स। pic.twitter.com/saHVMze4bJ — News18 Bihar (@News18Bihar) December 20, 2023 Video Credits:News18 Bihar ఆయ్.. హిందీ తెలియాల్సిందే విపక్షాల కూటమి సమావేశంలో నితీశ్ కుమార్ ప్రసంగిస్తుండగా డీఎంకే నేత టీఆర్ బాలు బాగా ఇబ్బంది పడ్డారు. హిందీరాని బాలుకు నితీశ్ హిందీ ప్రసంగం అర్ధంకాలేదు. అర్ధంచేసుకునేందుకు తన పక్కనే కూర్చున్న రా్రïÙ్టయ జనతాదళ్ రాజ్యసభ సభ్యుడు మనోజ్ ఝాను సాయంకోరారు. ‘మీ ప్రసంగాన్ని ఆయనకు అర్ధమయ్యేలా అనువాదం చేయొచ్చా?’ అని నితీశ్ను ఝా కోరారు. దీంతో ఆగ్రహించిన నితీశ్.. ‘ హిందీ మన జాతీయ భాష. అందుకే మన దేశాన్ని హిందుస్తాన్గా పిలుచుకుంటాం. హిందీ అందరి భాష. అలాంటి హిందీ తెలియాల్సిందే. నేర్చుకుని అర్ధంచేసుకోవాలి. మీరు అనువాదాలు ఏవీ చేయకండి’’ అని ఝాను వారించారు. -
ఏ ర్యాంక్కు ఎక్కడ మెడికల్ సీటొస్తుంది?
సాక్షి, అమరావతి: ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన నీట్ యూజీ–2023 ఫలితాలు వెలువడ్డాయి. ఈ ఏడాది రాష్ట్రంలో 68,578 మంది విద్యార్థులు నీట్ రాయగా 42,836 మంది అర్హత సాధించారు. జాతీయ స్థాయిలో వచ్చిన ర్యాంక్ ఆధారంగా రాష్ట్ర స్థాయిలో ఏ ర్యాంక్ వస్తుంది? గత ఏడాది ఏ ర్యాంకుకు ఏ కాలేజీలో సీటు వచ్చిందో పోల్చుకొని, ఈసారి ఏ కాలేజిలో సీటు వచ్చే అవకాశాలున్నాయో అంచనా వేసుకొంటున్నారు. కాలేజీల ప్రాధాన్యతక్రమం ఏ విధంగా ఉండాలో కసరత్తు చేసుకుంటున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 11 ప్రభుత్వ, 16 ప్రైవేటు, రెండు మైనారిటీ, శ్రీ పద్మావతి మహిళా వైద్య కళాశాల ఉన్నాయి. వీటిలో 5,360 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. ఇందులో 2,185 సీట్లు 11 ప్రభుత్వ వైద్య కళాశాలలకు సంబంధించినవి. ఈ విద్యా సంవత్సరం నుంచి విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాలల్లో కొత్తగా నిర్మించిన 5 ప్రభుత్వ వైద్య కళాశాలలు ప్రారంభంకానున్నాయి. వీటిలో ఒక్కో కాలేజిలో 150 చొప్పున 750 ఎంబీబీఎస్ సీట్లు అదనంగా అందుబాటులోకి వచ్చాయి. ఇది విద్యార్థులకు వరమే. వీటితో కలుపుకొంటే ప్రభుత్వ కళాశాలల్లో సీట్లు 2,935కు పెరుగుతాయి. వీటిలో 15 శాతం సీట్లు ఆల్ ఇండియా కోటా కింద భర్తీ చేస్తారు. మిగిలినవి రాష్ట్ర కోటాలో భర్తీ చేస్తారు. మరోవైపు గత ఏడాది నుంచి బీ కేటగిరిలో 85 శాతం సీట్లలో మన విద్యార్థులకే ప్రభుత్వం అవకాశం కల్పిస్తోంది. ఆంధ్ర వైద్య కళాశాలలో ఇలా సాధారణంగా రాష్ట్రంలో వైద్య విద్య అభ్యసించే విద్యార్థుల మొదటి చాయిస్ ఆంధ్ర వైద్య కళాశాలే. ఈ కాలేజిలో సీటు రావడమే అదృష్టంగా భావిస్తారు. ఈ కాలేజిలో గత ఏడాది (2022–23) ఎస్టీ విభాగంలో 456 స్కోర్తో 120176 ర్యాంక్ సాధించిన విద్యార్థికి చివరి సీటు వచ్చింది. ఎస్సీ విభాగంలో 76695 ర్యాంక్, బీసీ–ఏలో 25137, బీసీ–బిలో 31874, బీసీ–సిలో 26291, బీసీ–డిలో 17632, బీసీ–ఈలో 68801, ఓసీ కేటగిరీలో 15652, ఈడబ్ల్యూఎస్లో 19907 ర్యాంక్ వారికి చివరి సీట్లు వచ్చాయి. దాని తర్వాతి స్థానాల్లో గుంటూరు, కర్నూలు, కాకినాడ తదితర ప్రభుత్వ కళాశాలలు ఉంటాయి. గుంటూరు వైద్య కళాశాలలో ఓసీ విభాగంలో 22531, ఈడబ్ల్యూఎస్లో 26162, బీసీ–ఎలో 46529, బీసీ–బిలో 36192, బీసీ–సిలో 42535, బీసీ–డిలో 32830, బీసీ–ఈలో 65595, ఎస్సీలో 94801, ఎస్టీ విభాగంలో 132580 ర్యాంక్ వరకూ సీట్లు వచ్చాయి. కర్నూలు వైద్య కళాశాలలో ఓసీ కేటగిరీలో 20419, బీసీ–ఎలో 46268, బీసీ–బిలో 34676, బీసీ–సిలో 32239, బీసీ–డిలో 45304, బీసీ–ఈలో 36371, ఈడబ్ల్యూఎస్లో 26954, ఎస్సీలో 91270, ఎస్టీ విభాగంలో 115105 ర్యాంక్ వరకు విద్యార్థులు సీట్లు సాధించారు. కాకినాడ రంగరాయలో ఓసీ విభాగంలో 25622, బీసీ–ఎలో 48837, బీసీ–బిలో 47893, బీసీ–సిలో 44104, బీసీ–డిలో 31589, బీసీ–ఈలో 89637, ఈడబ్ల్యూఎస్లో 31333, ఎస్సీలో 97913, ఎస్టీ కేటగిరీలో 143288 ర్యాంక్ల వరకూ సీట్లు లభించాయి. -
55,000 వరకు నేషనల్ లెవల్
సాక్షి, హైదరాబాద్: జాతీయస్థాయి ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాలకు కోసం ఈ నెల 15 వరకు జరిగిన జేఈఈ మెయిన్ ఎంట్రన్స్ ఫలితాలు వెల్లడికానున్న నేపథ్యంలో తమకు ఏ ర్యాంకు వస్తుంది? ఎక్కడ, ఏ బ్రాంచీలో సీటు వస్తుందనే ఉత్సుకత విద్యార్థుల్లో నెలకొంది. గతేడాది జేఈఈ అంచనాలు, ఈసారి పేపర్ విధానాన్ని పరిశీలిస్తే జేఈఈ మెయిన్లో 55 వేల వరకు ర్యాంకు వచ్చిన వాళ్లకు కూడా జాతీయస్థాయి ఇంజనీరింగ్ కాలేజీల్లో ఏదో ఒక కోర్సులో, ఎక్కడో ఒకచోట సీటు ఖాయమని తెలుస్తోంది. ఈడబ్ల్యూఎస్కు 60 వేలు, ఓబీసీలకు 65 వేలు, ఎస్సీలకు 1.20 లక్షలు, ఎస్టీలకు 3 లక్షలు, పీడబ్ల్యూడీలకు 8 లక్షల ర్యాంకు వచ్చినా జాతీయ స్థాయి ఇంజనీరింగ్ కాలేజీల్లో సీటు పొందే వీలుంది. అయితే కంప్యూటర్ సైన్స్, నచ్చిన కాలేజీలో సీటు కోసం మాత్రం పోటీ ఎక్కువే ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. వరంగల్, సూర్తాల్, తిరుచాపల్లి వంటి ఎన్ఐటీ కాలేజీల్లో సీటు రావాలంటే జేఈఈ మెయిన్లో 5 వేలలోపు ర్యాంకు వరకే ఆశలు పెట్టుకోవాలని సూచిస్తున్నారు. 30 నుంచి దరఖాస్తులకు అవకాశం... ఈ నెల 30 నుంచి జాతీయ ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని, ఉమ్మడి ప్రవేశాల అథారిటీ (జోసా) కౌన్సెలింగ్ నిర్వహిస్తుందని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) తెలిపింది. ఈసారి జేఈఈ మెయిన్ ప్రవేశపరీక్షను దేశవ్యాప్తంగా దాదాపు 10 లక్షల మంది రాశారు. వారిలో 2.5 లక్షల మంది జేఈఈ అడ్వాన్స్డ్కు అర్హత సాధించనున్నారు. జేఈఈ మెయిన్లో అర్హత సాధించిన వారు ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలు, కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే కాలేజీలతోపాటు రాష్ట్ర ఇంజనీరింగ్ కాలేజీల్లో బీ–కేటగిరీ సీట్లలో ప్రాధాన్యం పొందుతారు. దేశవ్యాప్తంగా ఈసారి 10 వేల ఇంజనీరింగ్ సీట్లు పెరిగే వీలుంది. కొత్త కోర్సులకు అనుమతించడం, కొన్ని కాలేజీల్లో సీట్లు పెంచడమే దీనికి కారణం. ఐఐటీల్లో 16,053 సీట్లు, ఎన్ఐటీల్లో 24 వేలు, ట్రిపుల్ ఐటీల్లో 16 వేలు, కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే సంస్థల్లో 6,078 సీట్లున్నాయి. గతేడాది పర్సంటైల్ను పరిశీలిస్తే జనరల్ కేటగిరీలో 88.41 పర్సంటేల్ వస్తే జేఈఈ అడ్వాన్స్డ్కు ఎంపికయ్యారు. ఓబీసీ ఎన్సీఎల్కు 67.00, ఈడబ్ల్యూఎస్కు 63.11, ఎస్సీలకు 43.08, ఎస్టీలకు 26.77, పీడబ్ల్యూడీలకు 0.003 పర్సంటేల్తో అడ్వాన్స్డ్ కటాఫ్ ఖరారైంది. ఈసారి కూడా పోటీని బట్టి కటాఫ్ గతేడాదికి కొంచెం అటుఇటుగా ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆలోచించి అడుగేయాలి.. జేఈఈ మెయిన్లో టాప్ పర్సంటైల్ వచ్చిన వారు సాధారణంగా అడ్వాన్స్డ్కు వెళ్తారు. మెయిన్లో అర్హత పొంది, 55 వేల ర్యాంకు వరకు వస్తే మాత్రం ఎన్ఐటీ కాలేజీల్లో సీటు పొందే వీలుంది. ర్యాంకు ఎంతో తెలిశాక ఆచితూచి అడుగేయాలి. కాలేజీతో ప్రాధాన్యం లేదనుకుంటే ఇప్పటివరకు వస్తున్న ర్యాంకులను బట్టి ముందుకెళ్లాలి. కోరుకున్న కోర్సు, కాలేజీనే కావాలనుకుంటే వచ్చిన ర్యాంకును బట్టి సీటు వస్తుందో లేదో చూసుకోవాలి. లేకుంటే లాంగ్టర్మ్ కోచింగ్ తీసుకొని వచ్చే ఏడాది మంచి ర్యాంకు సాధించేందుకు ప్రయత్నించడమే మంచిది. – ఎంఎన్ రావు, జేఈఈ మెయిన్ బోధన నిపుణుడు -
ఎంబీఏ, ఎంసీఏ సీట్ల కేటాయింపు పూర్తి
సాక్షి, హైదరాబాద్: ఎంబీఏ, ఎంసీఏ తుది దశ సీట్ల కేటాయింపు గురువారం పూర్తయింది. మొత్తం 83 శాతం సీట్లు కేటాయించినట్టు సాంకేతిక విద్యావిభాగం ప్రకటించింది. ఐసెట్లో మొత్తం 61, 613మంది అర్హత సాధించారు. 19,666 మంది 3,60,435 ఆప్షన్లు ఇచ్చారు. ఎంబీఏలో 24,278 సీట్లు, ఎంసీఏలో 2865 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఎంబీఏలో 21,983 సీట్లు కేటాయించగా, ఇంకా 2295 సీట్లు మిగిలిపోయాయి. ఎంసీఏలో 2865 (వంద శాతం) సీట్లు కేటాయించారు. సీట్లు పొందిన అభ్యర్థులు ఈ నెల 31లోగా ఆయా కాలేజీల్లో రిపోర్టు చేయాలని సాంకేతిక విద్యావిభాగం సూచించింది. -
జేఈఈ టాపర్స్ దృష్టి... ఐఐటీ బాంబే వైపే
న్యూఢిల్లీ: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ), బాంబే హవా కొనసాగుతోంది. ఈ ఏడాది జేఈఈ అడ్వాన్స్డ్–2022లో టాప్–100 ర్యాంకర్లలో 93 మంది ఐఐటీ బాంబేను మొదటి ప్రాథామ్యంగా ఎంపిక చేసుకున్నారు. వీరిలో 69 మంది బాంబే ఐఐటీలో సీటు సాధించారు. ఇందులో 68 మంది మొదటి విడత కౌన్సిలింగ్లో కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ కోర్సును ప్రథమ ప్రాథామ్యంగా ఎంపిక చేసుకోగా ఒక్కరు ఇంజినీరింగ్ ఫిజిక్స్ను తీసుకున్నారు. టాప్–100 ర్యాంకర్లలో 28 మంది ఐఐటీ ఢిల్లీలోనూ ముగ్గురు ఐఐటీ మద్రాస్లోనూ జాయినయ్యారు. జాయింట్ సీట్ ఎలొకేషన్ అథారిటీ ఈ వివరాలను అందించింది. గత ఏడాది జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలో టాప్–100 ర్యాంకర్లలో 62 మంది, 2020లో 58 ఐఐటీ బాంబేలో ప్రవేశం పొందగా 2019లో టాప్–100 ర్యాంకర్లలో 62 మంది, 2018లో 59 మంది ఇక్కడే సీటు సాధించారు. టాప్–500 ర్యాంకర్లకూ బాంబే ఐఐటీనే మొదటి ప్రాథామ్యంగా ఉంది. టాప్–500 ర్యాంకర్లలో 173 మంది ఇక్కడ, 127 మంది ఢిల్లీ ఐఐటీలో స్థానం సంపాదించారు. టాప్–500 ర్యాంకర్లలో మద్రాస్, ఖరగ్పూర్, కాన్పూర్ ఐఐటీల్లో సీట్లు సాధించిన వారి సంఖ్య 50 మంది లోపే. -
మహిళా ప్రయాణికులకు రైల్వేశాఖ గుడ్ న్యూస్.. ఇకపై రైళ్లలో వారికోసం..
భారతీయ రైల్వే.. ప్రతీ రోజు లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానానికి చేరుస్తూ ప్రజలతో విడదీయరాని బంధం ఏర్పరుచుకుంది. తక్కువ ఖర్చుతో ప్రయాణమే గాకా వివిధ సేవలను ప్యాసింజర్లకు అందించడంలో ఎప్పుడూ ముందుంటుంది. ప్రస్తుతం మహిళల కోసం రైల్వేశాఖ పెద్ద ప్రకటనే చేసింది. మహిళలు ఇకపై రైలులో సీటు గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటూ తెలిపింది. బస్సు, మెట్రో తరహాలో ఇకపై భారతీయ రైళ్లలో మహిళలకు ప్రత్యేక సీట్లను రిజర్వ్ చేయనున్నట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. మహిళలకు ప్రత్యేకంగా సీటు రిజర్వ్ సుదూర ప్రాంతాలకు ప్రయాణించే మహిళల కోసం.. భారతీయ రైల్వే ప్రత్యేక బెర్త్లను కేటాయించనున్నారు. దీంతో పాటు మహిళల భద్రతకు కూడా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. దీనిపై రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ రైళ్లలో మహిళల సౌకర్యార్థం రిజర్వ్ బెర్త్ల ఏర్పాటుతో పాటు అనేక సౌకర్యాలను ప్రారంభించినట్లు తెలిపారు. స్లీపర్ క్లాస్లో ఆరు బెర్త్లు మెయిల్, ఎక్స్ప్రెస్ రైళ్లలో స్లీపర్ క్లాస్లోని మహిళలకు ఆరు బెర్త్లను రిజర్వ్ చేయనున్నట్లు రైల్వే మంత్రి తెలిపారు. రాజధాని ఎక్స్ప్రెస్, గరీబ్ రథ్, దురంతో సహా పూర్తిగా ఎయిర్ కండిషన్డ్ ఎక్స్ప్రెస్ రైళ్లలో థర్డ్ ఏసీ (3ఏసీ క్లాస్)లో ఆరు బెర్త్లు మహిళల కోసం రిజర్వ్ చేస్తున్నట్లు చెప్పారు. రైలులోని ఒక్కో స్లీపర్ కోచ్లో ఆరు లోయర్ బెర్త్లు, 3 టైర్ ఏసీ కోచ్లో నాలుగు నుంచి ఐదు లోయర్ బెర్త్లు, 2 టైర్ ఏసీ సీనియర్ సిటిజన్లలో మూడు నుంచి నాలుగు లోయర్ బెర్త్లు, 45 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న మహిళలు, గర్భిణీ స్త్రీలకు రిజర్వు చేస్తున్నట్లు తెలిపారు. మహిళా ప్రయాణికుల భద్రత కోసం రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్), జీఆర్పీ, జిల్లా పోలీసులతో భద్రత కల్పిస్తారు. చదవండి: భారీ నౌక, రూ.8,318 కోట్ల ఖర్చు.. తొలి ప్రయాణం కూడా కాకముందే తునాతునకలు! -
ఎక్కువ మంది కంప్యూటర్ సైన్స్ వైపే..
సాక్షి, హైదరాబాద్: ఈసెట్ ర్యాంకు ఆధారంగా ఇంజనీరింగ్ సెకండియర్లో 89 శాతం మందికి సాంకేతిక విద్యాశాఖ సీట్లు కేటాయించింది. తొలిదశ సీట్ల కేటాయింపు పూర్తి చేసినట్టు సాంకేతిక విద్య కమిషనర్ నవీన్ మిత్తల్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈసెట్ కౌన్సెలింగ్లోనూ కంప్యూటర్ సైన్స్, దాని అనుబంధ కోర్సులనే విద్యార్థులు ఎక్కువగా ఎంచుకున్నట్టు తెలిపారు. ఈ ఏడాది మొత్తం 19,558 మంది ఈసెట్లో అర్హత సాధించగా తొలి దశ కౌన్సెలింగ్కు 13,429 మంది ఆప్షన్లు ఇచ్చినట్టు చెప్పారు. రాష్ట్రంలో రెండో ఏడాదిలో ప్రవేశానికి 11,260 ఇంజనీరింగ్ సీట్లు అందుబాటులో ఉండగా, 9,968 సీట్లు కేటాయించినట్టు తెలిపారు. ఫార్మసీలో 1,174 సీట్లు అందుబాటులో ఉంటే, 50 సీట్లు కేటాయించామన్నారు. సీట్లు దక్కించుకున్న అభ్య ర్థులు ఈ నెల 22లోగా ఆన్లైన్ చెల్లింపు ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని, వచ్చే నెల 10లోగా అన్ని ధ్రువపత్రాలతో కాలేజీలో నేరుగా రిపోర్టు చేయాలని తెలిపారు. తొలి విడత కౌన్సెలింగ్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సీట్లు 19 భర్తీ అయ్యాయి. ఏఐఎంఎల్లో 127 సీట్లు ఉంటే, 105 కేటాయించారు. డేటాసైన్స్, సైబర్ సెక్యూరిటీ కోర్సుకు 80 శాతంపైనే ఆప్షన్లు ఇచ్చారు. కంప్యూటర్ సైన్స్లో 2,643 సీట్లు ఉంటే, 2470 సీట్లు కేటాయించారు. ఈసీఈలోనూ 2,060 సీట్లకు 1853 భర్తీ అయ్యాయి. ఈఈఈలో 1,096 సీట్లకు 1,066 కేటాయించారు. మెకానికల్ ఇంజనీరింగ్లో 886 సీట్లకు 860, సివిల్ ఇంజనీరింగ్లో 905 సీట్లకు 900 కేటాయించారు. -
తొలివిడత వదిలేస్తే మలివిడతలో చాన్స్
సాక్షి, హైదరాబాద్: కంప్యూటర్ సైన్స్ కోర్సులో పెరగబోయే సీట్లు తొలివిడత ఇంజనీరింగ్ కౌన్సెలింగ్పై ప్రభావం చూపాయి. చాలా మంది విద్యార్థులు తొలివిడత కౌన్సెలింగ్లో ఆయా కోర్సుల్లో సీటు వదిలేస్తే, మలివిడతలో నచ్చిన సీటు వస్తుందనే నమ్మకంతో ఉన్నారు. కాలేజీల విషయంలోనూ ఇదే అభిప్రాయంతో ఉన్నట్టు కన్పిస్తోంది. సీట్లు పెరగడంతో మరో కాలేజీలో ఈసారి సీటు వస్తుందనే ఆశ వారిలో కన్పిస్తోంది. అదీకాక ఐఐటీ, ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీల్లో సీట్లు పొందినవారు ఎంసెట్ కౌన్సెలింగ్ నుంచి తప్పుకునే వీలుంది. ఈ రకంగానూ కొంత సానుకూల వాతావరణం ఉంటుందని విద్యార్థులు ఆలోచిస్తున్నారు. ఈసారి అదృష్టం పరీక్షిద్దాం రాష్ట్రంలో తొలివిడత ఇంజనీరింగ్ కౌన్సెలింగ్కు అన్ని రకాల కోర్సులకు కలిపి మొత్తం 71,286 సీట్లు కన్వీనర్ కోటా కింద సిద్ధంగా ఉన్నాయి. వీటిల్లో 60,208 సీట్లు కేటాయించారు. ఈ నెల 13 నాటికి కేవలం 43 వేలమంది సెల్ఫ్ రిపోర్టింగ్ చేశారు. 17 వేల మందికి సీట్లు వచ్చినా అది తమకు నచ్చలేదని భావించి రిపోర్టింగ్కు దూరంగా ఉన్నారు. ఇలాంటివారిలో ఎక్కువ మంది కంప్యూటర్ సైన్స్ లేదా ఐటీ, ఆఖరుకు ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ కోర్సుల్లో సీట్లు ఆశపడుతున్నవారే. తొలి దశలో పెంచిన కంప్యూటర్ సైన్స్ కోర్సు సీట్లు 9,240 అందుబాటులోకి రాలేదు. 25 వేల లోపు ర్యాంకు వచ్చిన విద్యార్థులు కూడా మెరుగైన కాలేజీ, సీటు కోసం తొలి దశలో వచ్చిన అవకాశాన్ని విడిచిపెట్టారు. కొంతమంది కంప్యూటర్ సైన్స్(సీఎస్సీ)లో సీటు వచ్చినా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ వంటి కోర్సుల కోసం ఎదురుచూస్తూ మొదటి విడతలో చేరలేదు. ఆప్షన్ల ఎంపికలో సానుకూలత రెండో విడత కౌన్సెలింగ్ ఈ నెల 28న మొదలవుతుంది. కొత్తగా 12 వేలకుపైగా సీట్లు పెర గడం, జేఈఈ ర్యాంకర్లు ఈసారి ఎంసెట్ కౌన్సెలింగ్లో పెద్దగా పోటీ పడకపోవడం వల్ల రా ష్ట్రస్థాయి విద్యార్థులకు అవకాశాలు కలిసి వస్తాయని నిపుణులు చెబుతున్నారు. 40 వేలలోపు ర్యాంకు విద్యార్థులు ఆచితూచి ఆప్షన్లు ఇచ్చుకోవడం మంచిదని అంటున్నారు. 5 వేలలోపు ర్యాంకుల్లో ఉన్న విద్యార్థులు ఎక్కువమంది ఈసారి పోటీలో ఉండరని, 10 వేల లోపు ర్యాంకు విద్యార్థుల్లో 50 శాతం మాత్రమే పోటీ ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. కాబట్టి 40 వేల లోపు ర్యాంకు విద్యార్థులు కోరిన కాలేజీ, సీటు కోసం పోటీపడేందుకు ప్రయత్నించాలని సూచిస్తున్నారు. ఆ పై ర్యాంకు విద్యార్థులు కాలేజీ విషయం పక్కన పెట్టినా, కోరుకున్న సీటును ఎక్కడైనా పొందేందుకు ప్రయత్నించి సఫలం కావచ్చని చెబుతున్నారు. -
ట్రిపుల్ ఐటీ.. ట్రబుల్ లేకుండా ఎంట్రీ
సాక్షి, హైదరాబాద్: ఇంటర్లో చేరిన విద్యార్థుల్లో చాలా మంది జాతీయ ఇంజనీరింగ్ కాలేజీల్లో సీటు సాధించడంపై దృష్టిపెడతారు. ఆ లక్ష్యంతోనే చివరి వరకూ జేఈఈపై పట్టుకోసం ప్రయత్నిస్తారు. కొందరు సఫలమవుతారు. సాధారణంగా జేఈఈ మెయిన్స్ ర్యాంకు సాధించిన ప్రతీ ఒక్కరూ ఐఐటీ తర్వాత ఎన్ఐటీల్లో సీట్లు కోరుకుంటారు. ఆ తర్వాత ప్రాధాన్యమిచ్చేది ట్రిపుల్ ఐటీ (ఐఐఐటీ)లకే. వీటిల్లో ఎంత వరకు ర్యాంకువారికి సీటొస్తుంది? ఏ బ్రాంచ్కు ఎంత ర్యాంకు వరకు ప్రాధాన్యత ఇవ్వొచ్చనే సందేహాలు చాలా మంది విద్యార్థుల్లో ఉంటున్నాయి. ప్రాథమిక ర్యాంకుల అంచనాను ఎన్టీఏ వెల్లడించకపోవడం కూడా విద్యార్థుల గందరగోళానికి కారణమవుతుంది. ఈ నేపథ్యంలోనే గత కొన్నేళ్లుగా ట్రిపుల్ ఐటీల్లో సీట్ల భర్తీ ర్యాంకుల కటాఫ్లను గమనిస్తే సులువుగా అవగాహన వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఎంత వరకు అవకాశం? దేశవ్యాప్తంగా 11 ట్రిపుల్ ఐటీలు జేఈఈ ర్యాంకు ద్వారా సీట్లు కేటాయిస్తున్నాయి. వీటన్నింటిలో కలిపి మొత్తం 6,146 ఇంజనీరింగ్ సీట్లున్నాయి. బాలికలకు ప్రత్యేకంగా కేటాయించే సూపర్ న్యూమరరీ సీట్లు మరో 305 వరకు ఉంటాయి. మొత్తంగా రిజర్వేషన్లను అనుసరించి సీట్లు కేటాయిస్తారు. గత ఏడాది ఓపెన్ కేటగిరీలో బాలురకు 35వేల ర్యాంకు వరకు, బాలికలకు 40వేల ర్యాంకు వరకు సీట్లు దక్కాయి. ఓబీసీ, నాన్ క్రీమీలేయర్ కేటగిరీలో 60వేల ర్యాంకు వరకు సీఎస్సీలో, 65వేల ర్యాంకు వరకు ఈసీఈలో సీట్లు వచ్చాయి. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు 2.5లక్షల ర్యాంకు వరకు ట్రిపుల్ ఐటీల్లో సీట్లు లభించాయి. ఆప్షన్ల ఎంపికే కీలకం జాతీయ ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాలకు సెప్టెంబర్ 12 నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ మొదలవుతుంది. ఈ సమయంలో ఆప్షన్ల ఎంపికే కీలకమని నిపుణులు సూచిస్తున్నారు. నిట్, కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో నడిచే సంస్థల్లో ఏ ర్యాంకు వరకూ సీటు వస్తుందనే అవగాహనతోపాటు ట్రిపుల్ ఐటీల్లో సీటుకు కావాల్సిన ర్యాంకులను తెలుసుకోవాలని స్పష్టం చేస్తున్నారు. ఆ ర్యాంకులకు అనుగుణంగా ఆప్షన్లు ఇచ్చుకుంటే.. సులువుగా సీటు పొందే వీలు ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. వచ్చిన ర్యాంకుకు తగిన చోట సీటు లభించే ఆప్షన్లను ముందుగా ఎంచుకోవాలని.. లేకుంటే సీటు నష్టపోయే అవకాశం ఉంటుందని వివరిస్తున్నారు. తగిన వ్యూహం అవసరం ట్రిపుల్ ఐటీ సీట్లు పొందాలనుకునే వారు ర్యాంకుల ఆధారంగా ఆప్షన్లు ఇవ్వడంలో వ్యూహాత్మకంగా వ్యవహరించాలి. జేఈఈ మెయిన్స్ అర్హులంతా ట్రిపుల్ ఐటీ బరిలో ఉండటం సహజమే. అయితే వచ్చిన ర్యాంకుకు ఎక్కడ సీటు వస్తుందనే అంచనాకు రాగలితే ప్రయోజనకరంగా ఉంటుంది. – ఎంఎన్ రావు, గణిత శాస్త్ర నిపుణుడు -
పాలిటెక్నిక్ కాలేజీల్లో 72.5% సీట్లు భర్తీ
సాక్షి, హైదరాబాద్: టెన్త్ తర్వాత డిప్లొమా కోర్సుల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించిన పాలిసెట్–2022 కౌన్సెలింగ్ ప్రక్రియ ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా 118 పాలిటెక్నిక్ కాలేజీల్లోని దాదాపు 25 బ్రాంచీల్లో 28,562 సీట్ల భర్తీకి చేపట్టిన కౌన్సెలింగ్లో 20,709 సీట్లు (72.51%) నిండాయని సెట్ కన్వీనర్ నవీన్ మిట్టల్ తెలిపారు. 21 ప్రభుత్వ కాలేజీలు, 3 ప్రైవేటు కాలేజీల్లో 100 శాతం సీట్లు భర్తీ అయ్యాయని చెప్పారు. సీట్లు పొందిన విద్యార్థులు ఈ నెల 10 నాటికి లాగిన్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి సీటును నిర్ధారించుకొని కాలేజీలో ఫీజు చెల్లించాలని పేర్కొన్నారు. గడువులోగా ఈ ప్రక్రియ పూర్తి చేయకుంటే సీటు రద్దవుతుందన్నారు. పాలిటెక్నిక్ కాలేజీల్లో సోమవారం నుంచి అకడమిక్ సెషన్ ప్రారంభం కానుండగా 16వ తేదీ వరకు ఓరియంటేషన్, ఈ నెల 17 నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి. 8 బ్రాంచీల్లో సీట్లన్నీ ఫుల్... పాలిటెక్నిక్ కోర్సుల్లో 8 బ్రాంచీల్లో 100% సీట్లు భర్తీ అయ్యాయి. ఆర్కిటెక్చరల్ అసిస్టెంట్షిప్, ఆర్టిఫిషి యల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషీన్ లెర్నింగ్, బయో మెడికల్ ఇంజనీరింగ్, క్లౌడ్ కంప్యూటింగ్ అండ్ బిగ్ డేటా, కెమికల్, సైబర్ ఫిజికల్ సిస్టమ్స్ అండ్ సెక్యూరిటీ, కంప్యూటర్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ వీడియో ఇంజనీరింగ్ బ్రాంచీల్లో సీట్లన్నీ నిండాయి. టెక్స్టైల్ టెక్నాలజీ, లెదర్ గూడ్స్ అండ్ ఫుట్వేర్ టెక్నాలజీ, మెటర్లాజికల్ ఇంజనీరింగ్ కోర్సుల్లో అతితక్కువగా సీట్లు భర్తీ అయ్యాయి. -
1.12 లక్షల మందికి డిగ్రీలో ప్రవేశాలు!
సాక్షి, హైదరాబాద్: డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు సంబంధించి దోస్త్–2022 తొలివిడత సీట్ల కేటాయింపు పూర్తయింది. వెబ్ ఆప్షన్లు ఇచ్చిన 1,12,683 మంది విద్యార్థులకు ప్రాధాన్యతాక్రమంలో సీట్లు కేటాయించారు. ఈ మేరకు దోస్త్–2022 కన్వీనర్ ప్రొఫెసర్ లింబాద్రి కళాశాల విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్తో కలసి శనివారం వివరాలను విడుదల చేశారు. దోస్త్–2022 ఫేజ్–1లో మొత్తం 1,44,300 మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకోగా, 1,18,898 మంది వెబ్ ఆప్షన్లు ఇచ్చారు. 6,215 మంది విద్యార్థులు సరైనవిధంగా ఆప్షన్లు ఇవ్వకపోవడంతో వారికి సీట్లు రాలేదు. కామర్స్, ఆర్ట్స్ గ్రూపుల్లో అధికంగా... దోస్త్–2022 తొలివిడతలో సీట్లు పొందిన 1,12,683 మంది విద్యార్థుల్లో పురుషులు 45,743(40.59%), మహిళలు 66,940(59.41%) ఉన్నారు. అడ్మిషన్లు పొందినవారిలో అత్యధికంగా ఆర్ట్స్, కామర్స్ గ్రూపులవారే ఉన్నారు. సైన్స్ గ్రూప్ల అడ్మిషన్లు రెండోస్థానంలో ఉన్నాయి. మీడియాలవారీగా పరిశీలిస్తే ఇంగ్లిష్ మీడియంలో 1,02,418 మంది విద్యార్థులు, తెలుగు మీడియంలో 9,304, ఉర్దూ మీడియంలో 10, హిందీ మీడియంలో 951 మందికి సీట్లు కేటాయించారు. దోస్త్–2022లో మొత్తం 978 కాలేజీల్లో 510 కోర్సులున్నాయి. మొత్తం 4,20,318 సీట్లలో తొలివిడత 1,12,683 సీట్లు భర్తీ అయ్యాయి. ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు, ఇంజనీరింగ్, మెడికల్ సీట్లకు కౌన్సెలింగ్ పూర్తయ్యాక డిగ్రీ ప్రవేశాల వేగం పుంజుకుంటుందని నవీన్ మిట్టల్ తెలిపారు. ఇప్పటివరకు 51 కాలేజీల్లో ఎలాంటి ప్రవేశాలు జరగలేదు. సెల్ఫ్ రిపోర్టింగ్ చేస్తేనే సీటు డిగ్రీ కోర్సుల్లో సీట్లు పొందిన విద్యార్థులు లాగిన్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్ ప్రక్రియతో సీటు రిజర్వ్ చేసుకోవాలి. ప్రభుత్వకాలేజీల్లో సీటుపొంది ఫీజు రీయింబర్స్మెంట్కు అర్హత ఉన్న విద్యార్థులు కుల, ఆదాయ ధ్రువీకరణపత్రాలతో ఉచితంగా, మిగతా విద్యార్థులు రూ.500 లేదా రూ.1,000 చెల్లించి సెల్ఫ్ రిపోర్టింగ్తో సీటు రిజర్వ్ చేసుకోవాలి. సెల్ఫ్ రిపోర్టింగ్లో విఫలమైతే సీటు రద్దవుతుంది. దోస్త్–2022 ఫేజ్–2 రిజిస్ట్రేషన్లు, వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ఈ నెల 7 నుంచి 22వ తేదీ వరకు కొనసాగుతుంది. -
సర్కారీ పాలిటెక్నిక్కే సై
సాక్షి, హైదరాబాద్: డిప్లొమా కోర్సుల్లో చేరేందుకు విద్యార్థులు ఎక్కువగా ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలనే ఎంచుకున్నారు. ప్రభుత్వ, ఎయిడెడ్ పాలిటెక్నిక్ కాలేజీలు 55 ఉండగా, వీటిల్లో 91.69 శాతం సీట్లు కేటాయించారు. 63 ప్రైవేటు కాలేజీల్లో కేవలం ఐదింటికి మాత్రమే విద్యార్థులు ఆప్షన్లు ఇచ్చారు. దీంతో 60.34 శాతం మాత్రమే సీట్లు కేటాయించారు. టెన్త్ తర్వాత పాలిటెక్నిక్ డిప్లొమా ప్రవేశాలకు సంబంధించి రాష్ట్ర టెక్నికల్ ఎడ్యుకేషన్ నిర్వహించిన పాలిసెట్కు 79,051 మంది అర్హత సాధించారు. తొలిదశ కౌన్సెలింగ్లో 25,146 మంది 5,96,613 ఆప్షన్లు ఇచ్చారు. వీటిని పరిశీలించిన పాలిసెట్ విభాగం గురువారం మొదటి విడత సీట్లను కేటాయించింది. డిప్లొమా దశలోనూ కంప్యూటర్ కోర్సుల వైపే.. పాలిటెక్నిక్లో దాదాపు 25 బ్రాంచీలున్నాయి. వీటిల్లో 28,083 సీట్లు అందుబాటులో ఉన్నాయి. తొలివిడత ఆప్షన్లకు అనుగుణంగా 20,695 (73.69 శాతం) సీట్లు కేటాయించారు. ఇందులో విద్యార్థులు అత్యధికంగా కంప్యూటర్ సైన్స్ కోర్సులకే ప్రాధాన్యం ఇచ్చారు. కంప్యూటర్స్లో 4,110 సీట్లు ఉండగా వందశాతం కేటాయించారు. దీనికి అనుబంధ కోర్సుగా చెప్పుకునే ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నింగ్లో మొత్తం 178 సీట్ల(వంద శాతం)కూ విద్యార్థులు ఆప్షన్లు ఇచ్చారు. సైబర్ ఫిజికల్ సిస్టమ్స్ అండ్ సెక్యూరిటీలో ఉన్న 59 సీట్లూ తొలి కౌన్సెలింగ్లోనే భర్తీ అయ్యాయి. క్లౌడ్ కంప్యూటింగ్ (100 శాతం) వైపు విద్యార్థులు ఆసక్తి చూపారు. సంప్రదాయ కోర్సులైన సివిల్ ఇంజనీరింగ్ (67.7 శాతం), మెకానికల్ (48.63 శాతం) మాత్రమే విద్యార్థులు ఎంచుకున్నారు. నెలాఖరులోగా రిపోర్టింగ్ తొలి విడత కేటాయింపులో సీటు దక్కించుకున్న అభ్యర్థులు ఈ నెలాఖ రులోగా సెల్ఫ్ రిపోర్టి్టంగ్ చేయాల్సి ఉంటుంది. tspolycet.nic.in అనే వెబ్సైట్కు లాగిన్ అయి, అలాట్మెంట్ ఆర్డర్తోపాటు అవసరమైన ధ్రువపత్రాలు అప్లోడ్ చేసి, నిర్ధారించిన ఫీజు ఆన్లైన్ ద్వారా చెల్లించవచ్చు. తుదిదశ వరకూ అభ్యర్థులు కౌన్సెలింగ్లో పాల్గొనే చాన్స్ ఉంటుంది. -
కన్నడనాట కాంగ్రెస్కు భారీ షాక్?
సాక్షి, బెంగళూరు: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో కర్ణాటకలో రాజకీయ వేడి మొదలు కాబోతోంది. అధికారం నిలబెట్టుకునేందుకు భారతీయ జనతా పార్టీ ఇతర పార్టీ నేతలకు ఆహ్వానం పలుకుతోంది. ఇందులో భాగంగా కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్యకు బీజేపీ గాలం వేసినట్లు తెలిసింది. ఇప్పటికే సీట్ల సర్దుబాటు విషయం కూడా చర్చించినట్లు సమాచారం. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో విధానసభ ఎన్నికల్లో తన వర్గానికి మొత్తం 20 అసెంబ్లీ సీట్లు కావాలని సిద్ధరామయ్య అడిగారట. దీనిపై బీజేపీ అధిష్టానం పునరాలోచిస్తున్నట్లు సమాచారం. అన్నీ కుదిరితే సిద్ధరామయ్య కమలం గూటికి చేరడం ఖాయమనిపిస్తోంది. మంత్రివర్గంలో సిద్ధూ అనుచరులు కర్ణాటక కేబినెట్లో ఇప్పటికే సుమారు 15 మంది మంత్రులు సిద్ధూ అనుచరులు అని చెప్పవచ్చు. కాంగ్రెస్ – జేడీఎస్ సంకీర్ణంలో అమాత్యగిరి దక్కలేదని అసమ్మతి వ్యక్తం చేస్తూ బీజేపీలో చేరిన వారంతా సిద్ధూ అనుచరులుగానే చెబుతారు. వారందరిలో ఒకరిద్దరు మినహా అందరికీ ప్రస్తుత బీజేపీ ప్రభుత్వంలో మంత్రి పదవులు లభించాయి. దీంతో అసెంబ్లీ ఎన్నికలవేళకి సిద్ధరామయ్య కూడా కమలం గూటికి చేరే అవకాశం ఉన్నట్లు సమాచారం. సీట్ల సర్దుబాటు తేలకపోవడంతో ఆలస్యం అవుతున్నట్లు తెలుస్తోంది. 20 స్థానాలపై సిద్ధూ పట్టు బీజేపీ నేతల ఆహ్వానానికి ప్రతిపక్ష నేత సిద్ధరామయ్య కూడా గ్రీన్సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే తన వర్గానికి సుమారు 20 అసెంబ్లీ స్థానాల టికెట్లు ఇవ్వాలని పట్టుబట్టారు. వరుణ, చాముండేశ్వరి, హుణసూరు, హెబ్బాళ, చామరాజపేటె, కోలారు తదితర స్థానాలను సిద్ధూ ఆశించారు. మైసూరు జిల్లా హుణసూరు నుంచి సిద్ధూ పోటీ చేసినా తనకు ఇష్టమే అని మాజీ మంత్రి హెచ్.విశ్వనాథ్ అన్నారు. సిద్ధరామయ్య కోసం తన సీటును వదులుకుంటానని స్పష్టం చేశారు. పాత మైసూరుపై పట్టు కోసమే.. వచ్చే ఎన్నికల్లో బీజేపీ సొంతబలంతో అధికారంలోకి రావాలనే ఉద్దేశంతో ఇతర పార్టీల నేతలకు గాలం వేస్తోంది. ఇందులో భాగంగా బీజేపీ ప్రాబల్యం లేని పాత మైసూరు ప్రాంతంలో పట్టు సాధించేందుకు అక్కడి నేతలపై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా మాజీ సీఎం సిద్ధరామయ్యను బీజేపీలో చేర్చుకునేందుకు ప్రణాళిక రూపొందించినట్లు తెలుస్తోంది. పాత మైసూరు ప్రాంతంలో మొత్తం 89 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. ప్రస్తుతం 10 చోట్ల మాత్రమే బీజేపీ ప్రాతినిధ్యం వహిస్తోంది. త్వరలోనే కాంగ్రెస్కు సిద్ధూ గుడ్బై: మరి కొన్ని రోజుల్లో మాజీ సీఎం సిద్ధరామయ్య కాంగ్రెస్కు గుడ్బై చెప్పి.. బీజేపీలో చేరుతారని రాష్ట్ర మంత్రి ఆర్.మునిరత్న వ్యాఖ్యానించారు. గురువారం ఆయన విధానసౌధలో మీడియాతో మాట్లాడారు. వచ్చే 2023 ఎన్నికల్లో కాంగ్రెస్కు ఘోర పరాభవం తప్పదని జోస్యం చెప్పారు. గతంలో రామకృష్ణ హెగ్డేకు వచ్చిన పరిస్థితే.. ఇప్పుడు సిద్ధరామయ్యకు వస్తుందన్నారు. అదేవిధంగా మండ్య ఎంపీ సుమలతను బీజేపీలో చేర్చుకునే అంశంపై పార్టీ పెద్దలు నిర్ణయిస్తారని చెప్పారు. కర్ణాటక అసెంబ్లీ స్థానాలు – 224+1 (నామినేటెడ్), బీజేపీ – 122 (స్పీకర్ విశ్వేశ్వర హెగ్డే కాగేరితో కలిపి) కాంగ్రెస్ – 69 జేడీఎస్ – 32 స్వతం్రత్రులు– 2 -
వైరల్: ట్రైన్లో సీట్ దొరకలేదు.. ఏం పర్లేదు, ఇలా హాయిగా పడుకోవచ్చు
వీకెండ్స్లో, పండుగ సమయాల్లో రైలు, బస్సుల్లో రద్దీ ఎక్కువగా ఉంటుంది. నెల రోజుల ముందు టికెన్ రిజర్వేషన్ చేసుకుంటే గానీ సీట్ కన్ఫర్మ్ అవ్వదు. ఇక అకస్మికంగా ఊరేళ్లాలనుకుంటే బస్సులో సీట్ దొరుకుతుందేమో కానీ రైల్లో అయితే కష్టం. జనరల్ టికెట్ తీసుకొని నిల్చొని ప్రయాణం చేయాల్సిందే. మనలో చాలామంది ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొనే ఉంటాం. కానీ ఇప్పుడు చెప్పబోయే ఓ వ్యక్తి మాత్రం ఇబ్బందులను దాటుకొని వినూత్న ఆలోచన చేశాడు. రైలులో తనకంటూ ప్రతేక సీట్ను ఏర్పాటు చేసుకొని హాయిగా పడుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియోను ఇన్స్టాగ్రామ్లో కొన్ని రోజుల క్రితం మీమ్స్ పేజ్ షేర్ చేసింది. చదవండి: వెర్రి వేయి రకాలు.. కుక్కని బుక్ చేసేందుకు...మరీ అలా చేయాలా? ‘భారతీయుల తెలివితో మీరెప్పుడూ సరిపోలేరు’ అనే క్యాప్షన్తో షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్గా మారింది. లక్షల్లో వ్యూవ్స్, వేలల్లో లైకులు వచ్చి చేరుతున్నాయి. దీనిలో అసలేముందంటే.. రైలులో కోచ్ పూర్తిగా నిండిపోవడంతో ఓ వ్యక్తికి సీట్ దొరకలేదు. అయితే రాత్రి పడుకోడానికి అతనికి నేల తప్ప మరెక్కడ చోటు లేకపోయింది. ఈ క్రమంలో ఆ వ్యక్తికి అద్భుతమైన ఆలోచన తట్టింది. తన దగ్గరున్న బెడ్షీట్ను తీసుకొని ఒక చివర లగేజ్ హోల్డర్కు, మరో సీటుకు కలిపి గట్టిగా కట్టాడు. దీంతో కోచ్ మధ్యలో ఊయల లాగా ఏర్పడింది. వెంటనే పెక్కి ఎక్కి ఆ ఊయలలో హాయిగా పడుకుంటాడు. చదవండి: ఆ ఆహ్వానం నచ్చింది... అందుకే ఈ రాత్రికి అక్కడికి వెళ్తా!! View this post on Instagram A post shared by MEMES.BKS🤟🙂 (@memes.bks) దీనిని చూసిన తోటి ప్రయాణికులు ఆశ్యర్యం వ్యక్తం చేస్తూ.. అతడి తెలివిని తలుచుకొని నవ్వుకుంటారు. ఈ వీడియోపై నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తున్నారు. ‘ఇలా అయితే ట్రైన్ టికెట్ కూడా అవసరం లేదు. ఇతనికి తెలివి బాగా ఉంది. ఇలా పడుకుంటే హాయిగా నిద్రపోవచ్చు. ఇంకోసారి ట్రైన్లో వెళ్లేటప్పుడు నేను కూడా ఇలాగే చేస్తాను’ అంటూ సరదాగా కామెంట్ చేస్తున్నారు. -
‘ఆ కుర్రాడికి సీటు ఇవ్వకుంటే న్యాయాన్ని అపహాస్యం చేసినట్లే!’
Dalit Boy IIT Seat Case: విద్యార్హతలున్నవాళ్లకు అవకాశాలు దక్కడంలో అవాంతరాలు ఎదురైతే తాము చూస్తూ ఊరుకోబోమని దేశ అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. యూపీకి చెందిన ఓ దళిత బాలుడికి సాంకేతిక కారణాలతో ఐఐటీలో సీటు దక్కకపోవడం, కింది న్యాయస్థానంలో పిటిషన్ తిరస్కరణకు గురికావడంపై విచారం వ్యక్తం చేసిన కోర్టు.. అతనికి సీటు ఇవ్వాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది. ఈ బెంచ్ మార్క్ తీర్పుపై ఇప్పుడు సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. ఉత్తర ప్రదేశ్ ఘజియాబాద్కు చెందిన 17 ఏళ్ల ప్రిన్స్ జైబీర్సింగ్.. 2021 ఎంట్రెన్స్ ఎగ్జామ్లో 25, 894వ ర్యాంక్(ఎస్సీ కేటగిరీలో 864) సాధించాడు. కౌన్సెలింగ్లో బాంబే ఐఐటీలో సీటు కోసం ఆప్షన్ పెట్టుకున్నాడు. ఆ కుటుంబం నుంచి ఉన్నత విద్యకు వెళ్తున్న మొదటి వ్యక్తి కూడా ఈ కుర్రాడే. దీంతో ఆ కుటుంబం సంబురాలు చేసుకుంది. అయితే ఆర్థిక ఇబ్బందులతో సీటు పేమెంట్ రూ. 15వేలను చివరి నిమిషంలో చెల్లించాడతను. తీరా ఆ సమయానికి సాంకేతిక కారణాల వల్ల పేమెంట్ జరగకపోవడంతో అతనికి సీటు అలాట్ కాలేదు. ఈ సమస్యపై కౌన్సిలింగ్ జరిగిన ఖరగ్పూర్ ఐఐటీని వెంటనే ఆశ్రయించిన లాభం లేకపోయింది. బాంబే ఐఐటీ దీంతో ప్రిన్స్, బాంబే హైకోర్టు లో ప్లీ దాఖలు చేయగా.. కోర్టు అతని అభ్యర్థనను తోసిపుచ్చింది. ఆపై సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ బోపన్న ఆధ్వర్యంలోని ఇద్దరు న్యాయమూర్తుల బెంచ్ అభ్యర్థన పిటిషన్పై విచారణ చేపట్టింది. సోమవారం ఈ పిటిషన్పై వాదనల సందర్భంగా ధర్మాసనం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘జరిగింది సాంకేతిక తప్పిదం. విద్యార్థి తప్పేం లేదు. పైగా మంచి భవిష్యత్తు ఉన్న ఓ యువ దళిత విద్యార్థికి ఫీజు కారణంగా సీటు నిరాకరించడం బాధాకరం. ఒకవేళ అతనికి ఇక్కడ కూడా అతనికి న్యాయం జరగకపోతే.. న్యాయ్యాన్నే అపహాస్యం చేసిన వాళ్లం అవుతాం. తక్షణమే బాంబే ఐఐటీలో అతనికి సీటు కేటాయించాలి. మిగతా విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా.. అవసరమైతే ఇతని కోసం ఓ సీటును సృష్టించండి. 48 గంటల్లో అందుకు సంబంధించిన పత్రాలను కోర్టుకు సమర్పించాలి ’’ అని Joint Seat Allocation Authority (JOSAA)ని ఆదేశిస్తూ తీర్పు వెల్లడించింది. మానవతా దృక్ఫథంతో ఒక్కోసారి న్యాయ పరిధిని దాటి ఆలోచించాల్సి వస్తుందని, ఈ కేసులోనూ విద్యార్థి కోసం తాము అదే కోణంలో తీర్పు ఇస్తున్నామని జస్టిస్ చంద్రచూడ్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఇక రాజ్యాంగంలోని 142 ఆర్టికల్ అంటే.. పూర్తి న్యాయం జరిగేలా చూడడం కోసం తమ విచక్షణాధికారాన్ని సుప్రీం కోర్టు ఉపయోగించి ఆదేశాలు జారీ చేయొచ్చు.. అవి పాటించి తీరాల్సిందే!(కొన్ని సందర్భాలు మినహాయించి). ఈ ఆర్టికల్ను తెరపైకి తెచ్చిన బెంచ్.. తక్షణమే ఆదేశాలు అమలయ్యేలా చూడాలని ఆల్లోకేషన్ ఆథారిటీని ఆదేశించింది. ఇక కౌన్సిలింగ్ల సమయంలో టెక్నికల్ సమస్యలతో ఎంతో మంది విద్యార్థులు మంచి మంచి అవకాశాలు కోల్పోతున్న సందర్భాలు చూస్తుంటాం. అలాంటిది ఇలాంటి తీర్పులు అర్హత ఉన్న కొందరికైనా న్యాయం అందేలా చూస్తున్నాయన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది ఇప్పుడు. -
డీఎంకే–కాంగ్రెస్ కూటమికి బీటలు
సాక్షి ప్రతినిధి, చెన్నై: డీఎంకేతో వియ్యమందుకున్న కాంగ్రెస్ తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ కయ్యానికి దిగింది. యూపీఏ కూటమిలో పదేళ్లకు పైగా కొనసాగిన డీఎంకేతో తెగదెంపులు చేసుకునేందుకు తమిళనాడు కాంగ్రెస్ నాయకత్వం సిద్ధమైంది. తుది నిర్ణయం బాధ్యతను ఏఐసీసీ మాజీ అధ్యక్షులు రాహుల్గాంధీపై మోపింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటులో సయోధ్య కుదరక పోవడమే ఇందుకు కారణం. డీఎంకే కూటమిలోని కాంగ్రెస్ సీట్ల కేటాయింపుపై ఇప్పటికే పలు దఫాలు చర్చలు జరిపింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో వలెనే ఈసారి కూడా 41 సీట్లు కావాలని కాంగ్రెస్ పట్టుబడుతోంది. అయితే 41లో కేవలం 8 సీట్లు గెలుపొందడం వల్లనే 2016 ఎన్నికల్లో అధికారం దక్కలేదని డీఎంకే గుర్రుగా ఉంది. ఈసారి 18 స్థానాలకు మించి ఇచ్చేది లేదని స్పష్టం చేసింది. ఆరంభంలో అలానే ఉంటుంది, రానురానూ డీఎంకే తమకు అనుకూలంగా మారుతుందని కాంగ్రెస్ అంచనా వేసింది. ప్రజాబలం, పెద్దగా ఓటు బ్యాంకు లేని కాంగ్రెస్కు ఈసారి కూడా పెద్ద సంఖ్యలో సీట్లను కేటాయిస్తే మరోమారు నష్టపోతామని డీఎంకే పట్టుదలతో ఉంది. ఐ–ప్యాక్ అనే సంస్థతో సర్వే చేయించిన సర్వేలో కూడా కాంగ్రెస్ బలహీనం బయటపడడంతో డీఎంకే అధ్యక్షులు స్టాలిన్ మెట్టుదిగనందున చర్చల్లో ప్రతిష్టంభన నెలకొంది. మరీ తక్కువ సీట్లలో పోటీచేస్తే కాంగ్రెస్ ప్రతిష్ట దెబ్బతింటుందని అగ్రనేతలు భావించారు. దీంతో నేతలు, కార్యకర్తల అభిప్రాయాలను స్వీకరించాలని నిర్ణయించి అత్యవసరంగా సమావేశమయ్యారు. డీఎంకే చర్చల్లో తనకు ఎదురైన అనుభవాలను టీఎన్సీసీ అ«ధ్యక్షులు కేఎస్ అళగిరి పార్టీ శ్రేణులతో పంచుకుంటూ కన్నీరుపెట్టుకున్నారు. ఊహించని ఈ పరిణామంతో పార్టీ నేతలు తల్లడిల్లిపోయారు. కూటమిలో కొనసాగడమా, వద్దా అనే అంశంపై సుదీర్ఘ చర్చ జరిగినపుడు ‘30 సీట్లిస్తే సరే లేకుంటే ఒంటరి పోటీకి దిగుదాం’అని కొందరు అభిప్రాయం వ్యక్తం చేశారు. మరికొందరు కమల్హాసన్ నేతృత్వంలోని ‘మక్కల్ నీది మయ్యం’తో కలిసి కూటమి ఏర్పాటు చేద్దామని సలహా ఇచ్చారు. దీంతో అగ్రనేతలు ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోయారు. ‘కరుణానిధి కాలం నుంచి డీఎంకే కూటమిలో కొనసాగుతున్నాం, చర్చలకు వచ్చినపుడు కాంగ్రెస్ నేతలకు కరుణానిధి ఎంతో మర్యాద ఇచ్చేవారు. అయితే ఈసారి కేరళ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ కురువృద్ధుడు ఉమన్చాందీ వస్తే కనీస స్థాయిలో ఎవ్వరూ పట్టించుకోలేదు. అంతేగాక చర్చల్లో తీవ్ర అవమానాలకు గురయ్యామ’ని కాంగ్రెస్ నేతలు బాధపడ్డారు. పైగా మలివిడత చర్చలకు రమ్మని డీఎంకే నుంచి ఆహ్వానం రాలేదని వాపోయారు. ఈ పరిస్థితులను రాహుల్గాంధీకి వివరించేందుకు కర్ణాటకు చెందిన కాంగ్రెస్ అగ్రనేత వీరప్పమెయిలీ శనివారం ఢిల్లీ పయనమయ్యారు. డీఎంకే కూటమిలో కొనసాగడం ఇష్టం లేదు, అయితే రాహుల్ ఆదేశాలను అనుసరించి నడుచుకుంటామని చెబుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల కంటే తక్కువ సీట్లు కేటాయిస్తే ఒప్పుకోవద్దని తమిళనాడులో ఇటీవల ఎన్నికల ప్రచారం సమయంలో రాహుల్గాంధీ చెప్పినట్లు సమాచారం. డీఎంకేతో వికటిస్తే కాంగ్రెస్ను కలుపుకుని పోయేందుకు కమల్హాసన్ సిద్ధంగా ఉన్నారు. తన పార్టీ నేతలను ఇప్పటికే కాంగ్రెస్ అగ్రనేతల వద్దకు రాయబారం పంపారు. బీజేపీతో డీఎంకే రహస్య ఒప్పందం కుదుర్చుకుని రాష్ట్రాల వారీగా కాంగ్రెస్ను నిర్వీర్యం చేస్తోందని, ఇందుకు ఇటీవల పుదుచ్చేరీలో కాంగ్రెస్ పతనం, తరువాత చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలే నిదర్శనమని కమల్ శనివారం నాటి ప్రచారంలో కొత్త కోణాన్ని అందుకున్నారు. -
సిద్ధాంత్కు సీటివ్వండి!
న్యూఢిల్లీ: జేఈఈ పరీక్షలో మంచి ర్యాంకు సంపాదించినా ఒక్క రాంగ్ క్లిక్తో ఐఐటీ సీటు కోల్పోయిన సిద్ధాంత్ బత్రాకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. బత్రాకు మధ్యంతర ప్రవేశం కల్పించాలని కోర్టు ఐఐటీ బాంబేని ఆదేశించింది. జస్టిస్ ఎస్కే కౌల్ ఆధ్వర్యంలోని బెంచ్ ఈ కేసును విచారించింది. ముందుగా బత్రాకు అడ్మిషన్ ఇవ్వాల్సిందిగా ఐఐటీని ఆదేశించి తదుపరి విచారణను శీతాకాలం సెలవుల తర్వాతకు వాయిదా వేసింది. ప్రస్తుతం బత్రాకు ఇచ్చే అడ్మిషన్ తుది తీర్పునకు లోబడి ఉంటుందని తెలిపింది. ఆగ్రాకు చెందిన సిద్ధాంత్ బత్రాకు జేఈఈలో 270వ ర్యాంకు సాధించి ఐఐటీ బాంబేలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో సీటు సంపాదించాడు. అయితే అక్టోబర్ 31న తన రోల్ నంబర్పై అప్డేట్ల కోసం నెట్లో బ్రౌజ్ చేస్తుండగా ఒక లింక్ను అనుకోకుండా క్లిక్ చేశాడు. ‘‘విత్ డ్రా ఫ్రం సీట్ అలకేషన్ అండ్ ఫర్దర్ రౌండ్స్’ అని ఉన్న లింక్ను తను క్లిక్ చేశాడు. ఇప్పటికే తనకు సీటు దొరికినందున ఇకపై ఎలాంటి అడ్మిషన్ రౌండ్లు ఉండవన్న నమ్మకంతో ఈ లింక్ను క్లిక్ చేసినట్లు బత్రా చెప్పారు. అయితే నవంబర్ 10న విడుదలైన 93మంది విద్యార్దుల తుది జాబితాలో బత్రా పేరు లేదు. దీంతో ఆయన బొంబాయి హైకోర్టులో పిటీషన్ వేశారు. 19న పిటిషన్ విచారించిన కోర్టు రెండురోజుల్లో బత్రా పిటిషన్ను ఆయన విజ్ఞాపనగా పరిగణించమని ఐఐటీని ఆదేశించింది. అయితే విత్డ్రా లెటర్ను రద్దు చేసే అధికారం తమకు లేదంటూ ఐఐటీ గత నెల 23న బత్రా అప్పీలును తిరస్కరించింది. నిబంధనలు అతిక్రమించి ఏమీ చేయలేమని తెలిపింది. అడ్మిçషన్లన్నీ జేఒఎస్ఎస్ఏ చూసుకుంటుందని ఐఐటీ రిజిస్ట్రార్ చెప్పారు. ప్రస్తుతం తమ వద్ద ఖాళీ సీటు లేదన్నారు. వచ్చేఏడాది జేఈఈకి బత్రా అప్లై చేసుకోవచ్చన్నారు. ఐఐటీ వాదనతో ఏకీభవించిన బాంబే హైకోర్టు తన అభ్యర్థనను కొట్టివేయడంతో బత్రా సుప్రీం కోర్టును ఆశ్రయించారు. తన అభ్యర్థనను మానవతా ధృక్పథంతో పరిశీలించాలని, తనకోసం అదనపు సీటు సృష్టించాలని విజ్ఞప్తి చేశారు. ఇరువురి వాదనలు విన్న సుప్రీం కోర్టు విద్యార్ధికి అడ్మిషన్ ఇవ్వాల్సిందిగా ఆదేశించింది. -
ఆర్జేడీకి 144, కాంగ్రెస్కు 70 సీట్లు
పట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన బహుళ పార్టీల మహాకూటమిలో సీట్ల పంపకం శనివారం దాదాపు పూర్తయ్యింది. రాష్ట్రీయ జనతా దళ్(ఆర్జేడీ) చీఫ్ తేజస్వీ యాదవ్ను కూటమి నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సీట్ల పంపకంలోనూ ఆ పార్టీకే అగ్రస్థానం దక్కింది. మొత్తం 243 అసెంబ్లీ స్థానాలుండగా, ఆర్జేడీ 144 సీట్లలో పోటీ చేయనుంది. కాంగ్రెస్కు 70 సీట్లు, సీపీఐ(ఎంఎల్)కు 19, సీపీఐకి 6, సీపీఎంకు 4 సీట్లు కేటాయించారు. వాల్మీకీ నగర్ లోక్సభ స్థానానికి నవంబర్ 7న జరగనున్న ఉలప ఎన్నికలో మహా కూటమి తరపున కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థిని నిలిపేలా ఒప్పందం కుదిరింది. తమ పార్టీకి దక్కిన 144 సీట్లలో కొన్ని స్థానాలను వికాశీల్ ఇన్సాస్ పార్టీకి(వీఐపీ), జేఎంఎంకు కేటాయిస్తామని ఆర్జేడీ ప్రకటించింది. సీట్ల పంపకంలో తీమకు అన్యాయం జరిగింది, ఇతర పార్టీల నేతలు వెన్నుపోటు పొడిచారని, మహా కూటమి నుంచి తాము తప్పుకుంటున్నట్లు వికాశీల్ ఇన్సాస్ పార్టీ అధినేత ముకేశ్ సాహ్నీ ప్రకటించారు. బిహార్ బీఎస్పీ చీఫ్ రాజీనామా బీఎస్పీ అధినేత మాయావతికి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆ పార్టీ బిహార్ శాఖ అధ్యక్షుడు భరత్ బింద్ శనివారం బీఎస్పీకి రాజీనామా చేసి రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ)లో చేరారు. ఆర్జేడీ నేత తేజస్వీ ఆయనకు పార్టీ సభ్యత్వం అందజేశారు. సరికొత్త బిహార్ నిర్మాణానికి, యువజన వ్యతిరేకి అయిన ఎన్డీయే ప్రభుత్వాన్ని గద్దె దింపడానికి భరత్ తమ పార్టీలో చేరారని తేజస్వీ ట్వీట్చేశారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ, ఆర్ఎల్ఎస్పీ, జనతాంత్రిక్ పార్టీ(సోషలిస్టు) కలిసి మహాకూటమిగా ఏర్పడి బరిలో దిగడం తెల్సిందే. -
కలిసే పోటీచేస్తాం: జేపీ నడ్డా
పట్నా: రానున్న బిహార్ అసెంబ్లీ ఎన్నికల సీట్ల ఒప్పందంపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ల మధ్య కీలక భేటీ జరిగింది. ఈ సమావేశంలో ఎన్డీయే భాగస్వామ్య పక్షాల సీట్ల పంపకంపై చర్చించారు. రానున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికలను నితీష్ కుమార్ నాయకత్వంలో ఐక్యంగా ఎదుర్కొంటామని, భారీ మెజారిటీతో అధికారాన్ని నిలుపుకుంటామని ప్రకాష్ నడ్డా తేల్చి చెప్పారు. ఇటీవల రాంవిలాస్ పాశ్వాన్ నాయకత్వంలోని ఎల్జేపీ, జేడీయూపై వివిధ అంశాలపై తీవ్రంగా విభేదిస్తూ, జేడీయూతో కలిసి పోటీచేయలేమని ప్రకటించింది. ఎల్జేపీతో, జేడీయూకి తలెత్తిన విభేదాలను పరిష్కరించడంలో బీజేపీ చొరవ తీసుకుంటుందని నితీష్ కుమార్కి హామీయిచ్చారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ని ఎన్నికల కమిషన్ త్వరలోనే ప్రకటించనుంది. లాలూతో జార్ఖండ్ సీఎం హేమంత్ భేటీ జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరేన్ ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్తో రాంచీలో భేటీ అయ్యారు. రానున్న బిహార్ ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తామని ప్రకటించారు. త్వరలో బిహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ భేటీ జరిగింది. ఎన్నికల్లో జేఎంఎం 12 స్థానాలను డిమాండ్ చేయగా, ఆర్జేడీ దాదాపు 3 సీట్లే ఇవ్వగలమని చెప్పినట్లు తెలుస్తోంది. -
సీటు కోసం ప్రజ్ఞాఠాకూర్ పేచీ
న్యూఢిల్లీ: తనకు సీటు కేటాయించడంలో విమాన సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారని బీజేపీ ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్ ఆరోపించారు. ఈ కారణంగా ఢిల్లీ–భోపాల్ విమానం 45 నిమిషాలు ఆలస్యంగా బయలుదేరింది. శనివారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. ఎంపీ ప్రజ్ఞా భోపాల్కు ప్రయాణించేందుకు స్పైస్జెట్ విమానంలో టికెట్ బుక్ చేసుకున్నారు. అయితే ఆమె వీల్ చైర్లో రావడంతో విమానం ముందువరసలోని 1–ఏ సీటును కేటాయించేందుకు విమాన సిబ్బంది నిరాకరించారు. వెనుక సీటుకు మారాలని కోరగా ఆమె తిరస్కరించారు. వాదోపవాదాల అనంతరం ఆమె వెనుక సీటుకు వెళ్లేందుకు అంగీకరించారు. దీంతో విమానం 45 నిమిషాలు ఆలస్యంగా బయలుదేరింది. ఈ విషయంపై ఎంపీ ప్రజ్ఞా భోపాల్ ఎయిర్పోర్ట్ డైరెక్టర్కు ఫిర్యాదు చేశారు. భద్రతా కారణాల కారణంగానే ఆమెకు వెనుక సీటు కేటాయించినట్లు స్పైస్ జెట్ ప్రతినిధి తెలిపారు. -
టీడీపీలో తేలని సీట్ల పంచాయతీ
సాక్షి, అమరావతి: టీడీపీలో టికెట్ల పంచాయతీ తెలడం లేదు. చాలా చోట్ల సిట్టింగ్లకు వ్యతిరేకంగా సొంత పార్టీ నేతలే ఆందోళనకు దిగడం టీడీపీకి ఇబ్బందికరంగా మారింది. గత పదిహేను రోజులుగా ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపికపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సమీక్ష జరుపుతున్నప్పటికీ.. నేతల మధ్య ఏకాభిప్రాయం రాకపోవడంతో చాలా వరకు ఆ సమావేశాలు అర్ధాంతరంగా ముగుస్తున్నాయి. సీట్ల కోసం నేతల మధ్య వివాదాలు పరిష్కరించడాని చంద్రబాబు సమన్వయ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. అయితే నేతల మధ్య సయోధ్య కుదర్చడంలో సమన్వయ కమిటీ విఫలమైనట్టుగా తెలుస్తోంది. కొవ్వురులో మంత్రి జవహర్, నిడదవోలులో శేషారావుపై స్థానిక నేతల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొంది. మరోవైపు పాయకరావుపేట, పాతపట్నంలలో సిట్టింగ్లుగా ఉన్న అనిత, కలమట వెంకటరమణకు సీటు ఇవ్వవద్దని అసంతృప్త నేతలు పార్టీ అధిష్టానానికి తెలిపాయి. అవనిగడ్డలో మండలి బుద్దప్రసాద్ను, మంగళగిరిలో సునీల్ను నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. గుడివాడ, చీపురుపల్లి, మంగళగిరిలో స్థానిక నేతలకే సీట్లు ఇవ్వాలని అక్కడి నేతలు పట్టుబడుతున్నారు. సొంత పార్టీ నేతల మధ్య పోరు టీడీపీ అధిష్టానానికి తలనొప్పిగా మారింది. -
జైపాల్రెడ్డి,డీకే అరుణ మధ్య ముదిరిన వివాదం
-
గ్రుపుల పేరు చెప్పి సీట్లు అమ్ముకున్నారు
-
బీజేపీలో టికెట్ల లొల్లి
-
ట్విస్ట్: 12 స్థానాల్లో టీజేఎస్ పోటీ
సాక్షి, హైదరాబాద్: మహాకూటమిలో సీట్ల పంపకంలో గందరగోళం కొనసాగుతుంది. తాము 12 స్థానాల్లో పోటీ చేస్తామని తెలంగాణ జన సమితి (టీజేఎస్) ప్రకటించింది. ఈ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులను త్వరలోనే ప్రకటిస్తామని తెలిపింది. టీజేఎస్ కార్యాలయంలో ఆ పార్టీ ఉపాధ్యక్షుడు పిఎల్ విశ్వేశ్వర రావు తాము పోటీ చేసే నియోజకవర్గాల పేర్లు ప్రకటించారు. దుబ్బాక, మెదక్, మల్కాజిగిరి, అంబర్ పేట, సిద్దిపేట, వరంగల్ తూర్పు, వర్ధన్నపేట, అసిఫాబాద్, స్టేషన్ఘన్పూర్, జనగాం, మహబూబ్నగర్, మిర్యాలగూడ నుంచి పోటీకి దిగనున్నట్టు ప్రకటించారు. టీజేఎస్కు 8 సీట్లు ఇస్తామని కాంగ్రెస్ అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. జనగాం మాదే: టీజేఎస్ కాంగ్రెస్ పార్టీతో జనగాం సీటుపై పంచాయతీ తేలకుండానే ఇక్కడి నుంచి తామే పోటీ చేస్తామని టీజేఎస్ ప్రకటించడం విశేషం. మరోవైపు జనగాం సీటు తనదేనని పొన్నాల లక్ష్మయ్య విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీలో మకాం వేసి తన సీటును కాపాడుకునేందుకు ఆయన విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. పొత్తులో భాగంగా టీడీపీకి వెళ్లిన మహబూబ్నగర్ స్థానంలోనూ పోటీ చేస్తామని టీజేఎస్ ప్రకటించడంతో మళ్లీ గందరగోళం రేగింది. ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించిన అసిఫాబాద్, స్టేషన్ఘన్పూర్లోనూ బరిలోకి దిగుతామని ప్రకటించింది. కాంగ్రెస్పై ఒత్తిడి పెంచేందుకేనా? మహాకూటమిలో తమకు కేటాయించిన 8 స్థానాలకు మించి టీజేఎస్ అభ్యర్థులను ప్రకటించడం వెనుక పెద్ద వ్యూహమే ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అసిఫాబాద్, స్టేషన్ఘన్పూర్, మహబూబ్నగర్లో తాము బలంగా ఉన్నామని, కచ్చితంగా గెలుస్తామని టీజేఎస్ చెబుతోంది. ఇక్కడి అభ్యర్థులను ఉపసంహరించుకునేలా కాంగ్రెస్, టీడీపీలను ఒప్పిస్తామన్న విశ్వాసాన్ని వ్యక్తం చేసింది. ఎక్కడా స్నేహపూరక పోటీ ఉండదని చెబుతూనే, తాము మాత్రం వెనక్కు తగ్గబోమన్న సంకేతాలు ఇచ్చింది. కూటమిలో పట్టువిడుపులు ఉండాలని, తాము బలంగా ఉన్న సీట్లను మాత్రమే కోరుతున్నామని తెలిపింది. కాంగ్రెస్ హైకమాండ్తో తమ పార్టీ అధ్యక్షుడు కోదండరాం జరుపుతున్న చర్చలు ఫలిస్తాయన్న ఆశాభావాన్ని వ్యక్తపరిచింది. అయితే ఆశావహులను బుజ్జగించే ప్రయత్నంలోనే టీజేఎస్ ఈ ఎత్తుగడ వేసిందన్న వాదనలు లేకపోలేదు. మహాకూటమిలో కొనసాగుతామని టీజేఎస్ స్పష్టం చేసింది. -
ఒంటరి పోరుకే సీపీఐ మొగ్గు
-
‘హస్త’వాసి ఎవరికో..?
సాక్షిప్రతినిధి, ఆదిలాబాద్: మహాకూటమి పొత్తుల లెక్కలు తేలకపోయినా... కాంగ్రెస్ ఎన్నికల కమిటీ ఉమ్మడి జిల్లా పర్యటన మాత్రం ఖరారైంది. నవంబర్ ఒకటో తేదీ నుంచి ప్రచార కమిటీ చైర్మన్ భట్టి విక్రమార్క, కో చైర్పర్సన్ డీకే.అరుణ, స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి ప్రచారం సాగనుంది. నాలుగు రోజుల పాటు సాగే ఈ ప్రచార కార్యక్రమంలో భాగంగా నిర్మల్ జిల్లాలోని నిర్మల్, ముథోల్లలో మినహా ఎనిమిది నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. భైంసాలో ఇటీవలే రాహుల్గాంధీ ప్రచారసభను విజయవంతంగా నిర్వహించిన నేపథ్యంలో ముథోల్, నిర్మల్ మినహా మిగతా నియోజకవర్గాల్లో ప్రచారాన్ని సాగించనున్నారు. ఈ మేరకు రూట్ మ్యాప్ కూడా తయారైంది. అయితే ఇప్పటివరకు మహాకూటమిలో పొత్తులపైన స్పష్టత లేకపోవడం కార్యకర్తలను అయోమయానికి గురిచేస్తోంది. నవంబర్ ఫస్ట్కు ముందే స్పష్టత! మహాకూటమిలో పొత్తుల అంశాన్ని నెలరోజులుగా నానుస్తూ వస్తున్న కాంగ్రెస్ వైఖరి పట్ల ఇప్పటికే టీజేఎస్, సీపీఐ తమ అసంతృప్తిని వ్యక్తం చేశాయి. టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్ మరో అడుగు ముందుకేసి రెండురోజుల్లో తేల్చకపోతే మొదటి విడతగా తమ పార్టీ అభ్యర్థుల జాబితా విడుదల చేస్తానని హెచ్చరించినట్లు వార్తలు వచ్చాయి. పొత్తుల్లో తమకు కేటాయించే సీట్ల సంఖ్య తగ్గితే ఒప్పుకోమని, పార్టీ గుర్తుల మీద పోటీ చేస్తారని సీపీఐ కూడా హెచ్చరించింది. అయినా కాంగ్రెస్ పార్టీ స్క్రీనింగ్ కమిటీ, కోర్ కమిటీ సమావేశాలతోనే కాలం వెల్లుబుచ్చుతున్నట్లు విమర్శలు వస్తున్నాయి. సోమవారం కూడా స్క్రీనింగ్ కమిటీతో కోర్ కమిటీ భేటీ అయింది. ఇప్పటికే ఖరారు చేసిన జాబితాను ప్రకటించాలని కోర్ కమిటీలో నేతలు కోరగా, పొత్తులు ఖరారు కాకుండా అభ్యర్థులను ప్రకటించడం వీలుకాదని స్క్రీనింగ్ కమిటీ స్పష్టం చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో మంగళ, బుధవారాల్లోనే పొత్తులు ఖరారయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి జిల్లా భట్టి వర్గంలో జోష్ పూర్వ ఆదిలాబాద్ జిల్లాలో నియోజకవర్గాల వారీగా పార్టీ రెండు వర్గాలుగా విడిపోయింది. డీసీసీ అధ్యక్షుడు ఏలేటి మహేశ్వర్రెడ్డి అండదండలతో పార్టీ టికెట్టు ఆశిస్తున్న వారంతా ఉత్తమ్కుమార్రెడ్డి వర్గంగా ఉండగా, మహేశ్వర్రెడ్డిని వ్యతిరేకించే వారంతా మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేంసాగర్రావు నాయకత్వంలో భట్టి విక్రమార్క వర్గంగా టికెట్లు ఆశిస్తున్నారు. రాష్ట్ర ఎన్నికల ప్రచార కమిటీ ఛైర్మన్, కో చైర్పర్సన్గా ఉత్తమ్కుమార్రెడ్డిని తీవ్రంగా వ్యతిరేకించే భట్టి, డీకేలకే అవకాశం లభించడం ఉమ్మడి జిల్లాలోని ప్రేంసాగర్రావు వర్గానికి ఊపునిచ్చింది. నవం»బర్ ఒకటి నుంచి నాలుగోతేదీ వరకు సాగే పర్యటనలో భట్టి వర్గీయులే ప్రముఖంగా కనిపించే అవకాశం ఉంది. అయితే ప్రచార కమిటీ పర్యటన కాబట్టి నాయకులంతా హాజరవుతారని, గ్రూపులతో సంబంధం ఉండదని ప్రేంసాగర్రావు సాక్షితో మాట్లాడుతూ చెప్పారు. హస్తవాసి దక్కేదెవరికో... పొత్తుల లెక్కలు తేలకపోయినా పది నియోజకవర్గాలలో కాంగ్రెస్ నుంచి టికెట్లు ఆశిస్తున్న వారి సంఖ్య ఎక్కువే ఉంది. అయితే డీసీసీ, పీసీసీల స్థాయిలో వడబోత ముగిసింది. స్క్రీనింగ్ కమిటీ కూడా వేర్వేరు సర్వేలు, సలహాలు, సూచనలతో పాటు వాస్తవ పరిస్థితుల ఆధారంగా ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఖరారు చేసింది. ఈ మేరకు సోమవారం కోర్కమిటీ సమావేశం తరువాత ఏఐసీసీకి అభ్యర్థుల జాబితాను పంపించనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో నిర్మల్ నుంచి ఏలేటి మహేశ్వర్రెడ్డి, ఆసిఫాబాద్ నుంచి ఆత్రం సక్కు మినహా ఎవరూ ఆశావహులు లేరు. ముథోల్లో రామారావు పటేల్, నారా యణరావు పటేల్తో పాటు ఎన్నారై పి.విజయ్కుమార్రెడ్డి కూడా టికెట్టు రేసులో ఉన్నారు. వీరిలో ప్రజలతో సంబంధాలు మెరుగ్గా ఉన్న నేతనే స్క్రీనింగ్ కమిటీ అభ్యర్థిత్వానికి సిఫారసు చేసినట్లు తెలిసింది. బోథ్లో సోయం బాపూరావు, అనిల్జాదవ్లలో ఎస్టీల్లోని రెండు వర్గాలను సమతుల్యం చేసే ప్రక్రియలోనే అభ్యర్థి ఖరారు కానున్నారు. ఆదిలాబాద్లో సామాజిక సర్థుబాటుతో పాటు మంత్రి రామన్నకు గట్టి పోటీనిచ్చే మహిళా అభ్యర్థిని నిలబెట్టాలని భావిస్తే గండ్రత్ సుజా తకు అవకాశం దక్కనుంది. ఖానాపూర్లో రాథోడ్ రమేష్ అభ్యర్థిత్వంపై హామీతోనే కాంగ్రెస్లో చేరిన నేపథ్యంలో ఆయనకే సీటు ఖాయమనే ప్రచారం ఉంది. సిర్పూరులో హరీష్బాబు, రావి శ్రీనివాస్ మధ్య పోటీలో హరీష్ వైపే స్క్రీనింగ్ కమిటీ మొగ్గు చూపినట్లు సమాచారం. చెన్నూరులో బోర్లకుంట వెంకటేష్ నేత, మాజీ మంత్రి బోడ జనార్దన్ ఎవరికి వారే ప్రయత్నాలు చేసినా, స్క్రీనింగ్ కమిటీ వెంకటేశ్ నేతను ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. బెల్లంపల్లిలో గద్దర్ తనయుడు సూర్యకిరణ్ను తెరపైకి తెచ్చినా, సీపీఐ పొత్తులో సీటు గల్లంతయ్యే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక మంచిర్యాలలో టికెట్టు తనదేనని కొక్కిరాల ప్రేంసాగర్రావు ధీమాతో ఉన్నారు. అయితే స్క్రీనింగ్ కమిటీ ఫైనల్ చేసిన వారే అభ్యర్థిగా బరిలో దిగనున్నారు. రెండు రోజుల్లో జాబితా కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. -
ఎంతకాలం ఈ సాగదీత?
సాక్షి, హైదరాబాద్: మహాకూటమిలో సీట్ల సర్దుబాటు విషయమై జరుగుతున్న సాగదీత వైఖరిపై తెలంగాణ జనసమితి అసహనం వ్యక్తం చేసింది. టీజేఎస్ అధ్యక్షుడు ఎం. కోదండరాం నేతృత్వంలో పార్టీ కోర్ కమిటీ సోమవారం సమావేశమైంది. సీట్ల సర్దుబాటు, కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న వైఖరిపై ఈ సమావేశంలో నేతలు చర్చించారు. పార్టీ కార్యాలయంలోనే జరిగిన అంతర్గత సమావేశంలో సీట్ల సర్దుబాటును పూర్తి చేయకుండా కాంగ్రెస్ సాగదీయడంపై పలువురు నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఇక ఆలస్యం చేయకుండా సీట్ల పంపకాలను తేల్చేవిధంగా ఒత్తిడి చేయాలని ఈ భేటీలో నిర్ణయించారు. సీట్ల సర్దుబాటు వ్యవహారం సత్వరమే పూర్తయ్యేలా మిత్రపక్షాలైన టీటీడీపీ, సీపీఐతో కలసి కాంగ్రెస్పై ఒత్తిడి తేవాలని పలువురు ముఖ్యులు అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ ఇదే వైఖరితో ఉంటే రాష్ట్రంలో పట్టున్న ముఖ్యమైన 15 స్థానాల్లో తమ అభ్యర్థులను ప్రకటించి ముందుకు వెళ్దామని కొందరు టీజేఎస్ ముఖ్య నేతలు ప్రతిపాదించినట్లు తెలిసింది. టీజేఎస్కు కేటాయించే సీట్ల విషయంలో కాంగ్రెస్ ఎక్కడా స్పష్టత ఇవ్వకపోవడంతో పార్టీ శ్రేణుల్లో అయోమయం పెరుగుతోందని, ఈ నేపథ్యంలో పొత్తుల విషయమై తాడోపేడో తేల్చాలని కోదండరాంపై పలువురు నేతలు ఒత్తిడి తెచ్చినట్లు తెలియవచ్చింది. కోదండరాంతో రమణ, చాడ భేటీ... తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ఎం. కోదండరాంతో టీటీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి ఆదివారం రాత్రి, సోమవారం సమావేశమయ్యారు. టీజేఎస్కు 12 సీట్లు ఇవ్వాలని కోదండరాం కోరుతుండగా సీపీఐ కనీసం 6 స్థానాలకు తగ్గకుండా ఇవ్వాలని పట్టుబడుతోంది. ఇప్పటిదాకా టీజేఎస్కు 8 సీట్లను ఇవ్వడానికి కాంగ్రెస్ అంగీకరించినట్లు తెలుస్తోంది. సీపీఐ కూడా సీట్ల సర్దుబాటుపై అసహనం వ్యక్తం చేస్తోంది. బెల్లంపల్లి, కొత్తగూడెం, వైరా, హుస్నాబాద్, దేవరకొండ, మునుగోడు స్థానాల కోసం సీపీఐ పట్టుబడుతోంది. -
45 సీట్లు కావాలి..!
సాక్షి, హైదరాబాద్: సామాజిక న్యాయం ప్రాతిపదికన తమకు 45 స్థానాల్లో పోటీచేసే అవకాశం కల్పించాలని కాంగ్రెస్లోని బీసీ నేతలు కోరుతున్నారు. ఈ మేరకు పార్టీలోని బీసీ నేతలు ఏఐసీసీ పెద్దలను కలసి విన్నవించినట్లు సమాచారం. ఇప్పటికే ఏఐసీసీ నియమించిన భక్తచరణ్దాస్ నేతృత్వంలోని స్క్రీనింగ్ కమిటీని కలసి వెనుకబడిన వర్గాలకు చెందిన నేతలు పోటీ చేయాలనుకుంటున్న, విజయావకాశాలున్న స్థానాల జాబితాను కూడా అందజేశారు. కానీ, 45 స్థానాల కేటాయింపు సాధ్యం కాదనే అంచనాల నేపథ్యంలో కనీసం పార్లమెంట్ స్థానానికి 2 సీట్లయినా బీసీలకు కేటాయించాలనే వాదన పార్టీలో బలంగా వినిపిస్తోంది. అలా జరిగితే రాష్ట్ర వ్యాప్తంగా 34 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసే అవకాశం బీసీ నేతలకు వస్తుందని అంటున్నారు. అయితే, రాష్ట్ర పార్టీలోని బీసీ నేతల ప్రతిపాదనలను ఏఐసీసీ వర్గాలు సీరియస్గానే తీసుకున్నాయని, సామాజిక న్యాయం కోణంలో కనీసం 30 స్థానాలకు తగ్గకుండా బీసీలకు కేటాయించే అవకాశాలున్నాయని గాంధీభవన్ వర్గాలంటున్నాయి. కొన్ని క్లియర్.. మరికొన్ని డౌటే... బీసీ నేతలు కోరుతున్న విధంగా సీట్ల కేటాయింపులకు సంబంధించి టీపీసీసీలో కూడా కొంత స్పష్టత ఉంది. కనీసం 25 స్థానాల్లో బీసీ నేతలకు కచ్చితంగా గెలిచే అవకాశాలున్నందున వారికి అవకాశమివ్వాలని టీపీసీసీ ముఖ్యులు యోచిస్తున్నారు. ఇటీవల జరిగిన ప్రదేశ్ ఎన్నికల కమిటీ సమావేశాల్లోనూ ఆ 25 స్థానాలకు బీసీ నేతల పేర్లే మొదటి పేరుగా సూచించినట్లు సమాచారం. మిగిలిన చోట్ల కూడా కొన్ని స్థానాల్లో బీసీ నేతలను ప్రతిపాదించారని, వాటిలో కూడా బీసీ అభ్యర్థులకు అవకాశం వస్తుందని నేతలు చెబుతున్నారు. ముఖ్యంగా ఆలేరు, జనగామ, పరకాల, ముషీరాబాద్, గోషామహల్, కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి, బాల్కొండ, మునుగోడు, అంబర్పేట, కరీంనగర్, నిజామాబాద్ (టౌన్), ఆర్మూర్, ఇబ్రహీంపట్నం, మేడ్చల్, పటాన్చెరు, సిద్దిపేట, మహబూబ్నగర్, జడ్చర్ల, హుస్నాబాద్, వేములవాడ, ఎల్లారెడ్డి, కొత్తగూడెం, రామగుండం, భువనగిరి, వరంగల్ (ఈస్ట్), ఖమ్మం లాంటి నియోజకవర్గాల్లో బీసీలకు ప్రాధాన్యం కల్పించాలని టీపీసీసీ బీసీ నేతలు పార్టీ అ«ధిష్టానాన్ని కోరుతున్నట్లు సమాచారం. ఎస్సీలకు జనాభా ప్రాతిపదికన.. రిజర్వుడు నియోజకవర్గాల్లో ఎస్సీలకు రిజర్వ్ చేసిన చోట్ల జనాభా ప్రాతిపదికన సీట్లు కేటాయించాలనే చర్చ కూడా కాంగ్రెస్ వర్గాల్లో జరుగుతోంది. ఎస్సీల్లోని ప్రధాన కులాలయిన మాదిగ, మాలలతో పాటు ఇతర ఉపకులాలకు చెందిన నేతలు బరిలో దిగే అవకాశమున్న నేపథ్యంలో జనాభా ప్రాతిపదికన ఆయా వర్గాలకు సీట్లు కేటాయించాలనే డిమాండ్ వస్తోంది. ఇదే విషయమై మాజీ ఎంపీ వి.హనుమంతరావు కూడా ఇటీవల బహిరంగంగానే వ్యాఖ్యలు చేశారు. ఎస్సీ నేతలకు జనాభా ప్రాతిపదికన సీట్లు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. అయితే, టీఆర్ఎస్ ప్రకటించిన అభ్యర్థుల్లో కూడా ఇదే సూత్రాన్ని పాటించారని, తాము కూడా అదే కోవలో ముందుకు వెళ్లాల్సి వస్తుందని టీపీసీసీ చెందిన ముఖ్య నేత ఒకరు వ్యాఖ్యానించడం గమనార్హం. -
ఇంజనీరింగ్లో 27 వేల మందికి సీట్లు
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ ప్రవేశాల్లో భాగంగా ఎంసెట్ రెండో దశ సీట్ల కేటాయింపును ప్రవేశాల కమిటీ గురువారం ప్రకటించింది. కొత్తగా 13,206 మందికి సీట్లు లభించగా, తొలి కౌన్సెలింగ్లో సీట్లు వచ్చినా కాలేజీ మార్పు కోసం స్లైడింగ్లో ఆప్షన్లు ఇచ్చుకున్న మరో 14,595 మందికి సీట్లు లభించాయి. మొత్తంగా రెండో దశలో 27 వేలమందికిపైగా సీట్లను కేటాయించింది. సీట్లు పొందిన విద్యార్థులు అలాట్మెంట్లెటర్లను https://tseamcet.nic.in నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని ప్రవేశాల క్యాంపు అధికారి శ్రీనివాస్ తెలిపారు. తొలి విడత కౌన్సెలింగ్లో 52వేలమందికి సీట్లను కేటాయించినా, 38 వేల మందే కాలేజీల్లో చేరారు. మిగతా విద్యార్థులు కాలేజీల్లో చేరకుండా రెండో విడత కౌన్సెలింగ్లో ఇతర కాలేజీలను ఎంపిక చేసుకున్నారు. ఎంసెట్లో అర్హత సాధించినవారు 1,02,615 మంది ఉండగా, సర్టిఫికెట్ల వెరిఫికేషన్కు హాజరైనవారు 62,901 మంది ఉన్నారు. రెండో విడత కౌన్సెలింగ్లో కొత్తగా వెరిఫికేషన్కు హాజరైనవారు 4,594 మంది ఉన్నారు. 17,876 సీట్లు ఖాళీ.. ఇంజనీరింగ్, బీఫార్మసీ, ఫార్మ్–డి కోర్సులను నిర్వహిస్తున్న 302 కాలేజీల్లో 69,221 సీట్లు ఉండగా, అందు లో 51,345 మందికి సీట్లను (74.18%) కేటాయించింది. మరో 17,876 సీట్లు ఖాళీగా ఉండిపోయాయి. ఇంజనీరింగ్ కాలేజీలు 189 ఉండగా, వాటిల్లో 65,648 సీట్లు ఉన్నాయి. అందులో 51,157 సీట్ల (77.93%)ను ప్రవేశాల కమిటీ విద్యార్థులకు కేటా యించగా, 14,491 సీట్లు ఖాళీగా ఉండిపోయాయి. ఇక 1,856 మంది విద్యార్థులు ఆప్షన్లు ఇచ్చుకున్నా సీట్లు లభించలేదు. ఐఐటీ, ఎన్ఐటీ, ట్రిపుల్ఐటీ, జీఎఫ్టీఐలలో ప్రవేశాల కౌన్సెలింగ్ ఈ నెల 19తో ముగియనుంది. ఆ తర్వాత మరో విడత కౌన్సెలింగ్ను నిర్వహించేందుకు కమిటీ కసరత్తు చేస్తోంది. 24 కాలేజీల్లో 50 మందిలోపే..: రాష్ట్రంలో 189 ఇంజనీరింగ్ కాలేజీలు ఉంటే.. అందులో 2 కాలేజీల్లో ఒక్క విద్యార్థీ చేరలేదు. మరో 7 కాలేజీల్లో 9 మందిలోపే చేరగా, 24 కాలేజీల్లో 50 మందిలోపే చేరారు. మరో 43 కాలేజీల్లో 100 మందిలోపు చేరారు. 60 కాలేజీల్లో మాత్రం 100% కన్వీనర్ కోటా సీట్లు భర్తీ అయ్యాయి. అందులో 48 ప్రైవేటు కాలేజీలు ఉండగా, 12 వర్సిటీ కాలేజీలు ఉన్నాయి. ఈ నెల 15లోగా ఫీజు చెల్లించండి.. సీట్లు లభించిన విద్యార్థులు అలాట్ మెంట్ లెటర్ డౌన్లోడ్ చేసుకుని ఈ నెల 15లోగా ట్యూషన్ ఫీజు చెల్లించి(వర్తించేవారు), సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని క్యాంపు అధికారి శ్రీనివాస్ వెల్లడించారు. సెల్ఫ్ రిపోర్టింగ్ చేయని, కాలేజీలో రిపోర్టు చేయనివారి సీటు రద్దవుతుందన్నారు. సెల్ఫ్ రిపోర్టింగ్ చేసిన వారు 16లోగా కాలేజీల్లో ఒక సెట్ జిరాక్స్ కాపీలు ఇవ్వాలని, చివరి దశ కౌన్సెలింగ్ పూర్తయ్యాకే ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇవ్వాలని సూచించారు. డిగ్రీలోనూ మరో విడత కౌన్సెలింగ్..: డిగ్రీ ఆన్లైన్ ప్రవేశాల్లో భాగంగా ఒకట్రెండు రోజుల్లో ప్రత్యేక విడత సీట్ల కేటాయింపును ప్రకటించనున్న డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ(దోస్త్ ) మరో విడత కౌన్సెలింగ్ నిర్వహించాలని భావిస్తోంది. ఎంసెట్ బైపీసీ స్ట్రీమ్ ప్రవేశాలు, ఎంసెట్ ఎంపీసీ స్ట్రీమ్ కౌన్సెలింగ్ పూర్తయ్యాక దీనిని నిర్వహించాలని భావిస్తోంది. -
‘ఫిరాయింపు’ లెక్కలున్నాయ్!
సాక్షి ప్రతినిధి, కర్నూలు: ‘‘పార్టీ మారే సమయంలో మీకు ఏమిచ్చామో, ఆ తర్వాత ఏ కాంట్రాక్టు పనుల ద్వారా ఎంత ఆదాయం వచ్చేలా చేశామో అన్ని లెక్కలూ నావద్ద ఉన్నాయి. ఎంతో నష్టపోయామంటూ నావద్ద మాటలు చెప్పొద్దు. మీకు చేసిన ప్రతి పని వివరాల చిట్టా నావద్ద ఉంది’’ అంటూ ఫిరాయింపు ఎమ్మెల్యేలను ఉద్దేశించి సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్టాపిక్గా మారాయి. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు ఏం చేశామనే వివరాలన్నీ తన వద్ద ఉన్నాయంటూ చంద్రబాబు చెప్పడం వారికి ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. పార్టీ మారిన సమయంలో ఎంత ఇచ్చాం? కాంట్రాక్టు పనులు, నీరు–చెట్టు పనులు ఏవి ఇచ్చామనే వివరాలతోపాటు సదరు ఎమ్మెల్యే సిఫారసుతో చేసిన అధికారుల బదిలీలు, ఎమ్మెల్యే కమీషన్ల వివరాలతో చంద్రబాబు సమాచారాన్ని సిద్ధం చేసుకోవడం వారికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. పార్టీ మారి నష్టపోయామన్న ఫిరాయింపు ఎమ్మెల్యే కర్నూలు జిల్లాకు చెందిన ఫిరాయింపు ఎమ్మెల్యే ఒకరు తన అనుచరుడికి కనీసం చివరి ఏడాదైనా జిల్లా పరిషత్ చైర్మన్ పోస్టు ఇప్పించాలంటూ తాజాగా చంద్రబాబు వద్దకు వెళ్లినప్పుడు ఆయన సీఎం ఈ వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది. అది కుదరదని చంద్రబాబు చెప్పడంతో అసంతృప్తికి గురైన ఫిరాయింపు ఎమ్మెల్యే పార్టీ మారి తాను, తన కేడర్ ఎంతో నష్టపోయామని వ్యాఖ్యానించారు. దీంతో సదరు ఎమ్మెల్యే పనుల చిట్టాను చంద్రబాబు విప్పినట్టు సమాచారం. పార్టీ మారే సమయంలో ఏ పనులు చేయించుకున్నారు, ఎంత సంపాదించారనే మొత్తం వివరాలు ఉన్నాయంటూ సీఎం ఆగ్రహంగానే స్పందించినట్లు తెలిసింది. దీంతో సదరు ఎమ్మెల్యేతో పాటు ఆయన వెంట వెళ్లిన అనుచరులకు కూడా షాక్ తగిలింది. చంద్రబాబు వ్యాఖ్యలతో వచ్చే ఎన్నికల్లో సీటు విషయం కూడా గట్టిగా అడగలేని పరిస్థితికి చేరుకున్నామని ఫిరాయింపు ఎమ్మెల్యేలు మథనపడుతున్నట్లు సమాచారం. పార్టీ మారిన తర్వాత తమ ఆదాయ వివరాలను బేరీజు వేసి సమాచారం సిద్ధం చేసిన విషయం తెలియడంతో కలవరపాటుకు గురవుతున్నారు. 22 మంది ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు భారీ మొత్తం చెల్లించి టీడీపీ కొనుగోలు చేసిందన్న ఆరోపణలకు తాజా పరిణామాలు బలం చేకూరుస్తున్నాయి. పలువురికి సీట్లు ఇవ్వనట్లే! పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో చంద్రబాబు వ్యవహారశైలి చర్చనీయాంశంగా మారింది. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు కలిగిన లబ్ధి వివరాలను చంద్రబాబు తన వద్ద ఉంచుకోవడం వెనుక దీర్ఘకాలిక వ్యూహం ఉందని పార్టీ నేతలు పేర్కొంటున్నారు. నియోజకవర్గాల పునర్విభజన ఆశ చూపించి పలువురిని పార్టీలో చేర్చుకున్నారు. తీరా సీట్లు పెరగకపోవడంతో చంద్రబాబు రూటు మార్చారు. సీట్ల కేటాయింపు విషయంలో తేడా వచ్చి ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఎదురుదాడికి దిగితే ఈ మొత్తం చిట్టాను చూపించి దారికి తెచ్చుకునే వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. ఫిరాయింపుదారుల్లో పలువురికి సీట్లు కేటాయించే అవకాశం లేదని, సర్వే ప్రకారమే సీట్లు కేటాయిస్తానని చంద్రబాబు ఇప్పటికే స్పష్టం చేశారు. మంత్రి అఖిలప్రియ ప్రాతినిధ్యం వహించే ఆళ్లగడ్డ నియోజకవర్గంలో కూడా సర్వే ప్రకారమే సీటు ఇస్తానని చంద్రబాబు కుండబద్దలు కొట్టిచెప్పారు. -
ఆదర్శ పాఠశాలలకు అదనపు సీట్లు
శ్రీకాకుళం: వెనుకబడిన ప్రాంతాల్లో విద్యను అభివృద్ధి చేసేందుకు 2012–13 విద్యా సంవత్సరం నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీ ఆదర్శ పాఠశాలలను ఏర్పాటు చేసి, తరగతులు నిర్వహిస్తున్నారు. 6,7 తరగతులతోనే మొదలైన ఆదర్శ పాఠశాలల్లో ప్రస్తుతం ఇంటర్మీడియెట్ వరకు విద్య అందిస్తున్నారు. ఏపీ మోడల్ స్కూళ్లు వచ్చి న రెండు, మూడేళ్ల వరకు కూడా సరైన ప్రచారం లేకపోవడంతో ఎలా చేర్పించాలో తెలిసేది కాదు. వరుసగా అధిక ఫలితాలు సాధిస్తుండడంతో ఎలా గైనా చేర్పించాలనే ఆసక్తితో రాజకీ య నాయకులను సైతం కలుస్తున్నారు. గత ఏడాది నుంచి 6వ తరగతిలో చేరేందుకు భారీగా దరఖాస్తులు రావడం, ఈ ఏడాది విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ఒత్తిళ్లు రావడంతో విద్యాశాఖ అధికారులు ప్రస్తుతం ఉన్న సీట్లకు 25 శాతం అదనంగా పెంచారు. దీనికి సంబంధించి రెండు రోజుల కిందట జిల్లాకు ఉత్తర్వులు చేరాయి. దీంతో ఇప్పటివరకు ఒక్కో తరగతిలో 80 సీట్లు ఉండగా అవికాస్తా 100కు చేరాయి. జిల్లాలో 14 మోడల్ స్కూళ్లు ఉన్నాయి. రెండేళ్ల కిందటి వరకు పదో తరగతి వరకు మాత్రమే నిర్వహించేవారు. ఆ తర్వాత ఇంటర్మీడియెట్ వరకు మోడల్ స్కూళ్లను నిర్వహిస్తున్నారు. రెసిడెన్షియల్ తరహాలో మోడల్ స్కూళ్లను నిర్వహించాలన్న లక్ష్యంతో వీటిని ప్రారంభించారు. ఏ కారణంగానో గత ఏడాది వరకు వసతి గృహాలు ప్రారంభం కాలేదు. గత ఏడాది ఆరు మోడల్ స్కూళ్లలో బాలికల వసతి గృహాలను ప్రారంభించారు. ఈ ఏడాది మిగిలి ఉన్న 8 వసతి గృహాల్లో బాలికల వసతి గృహాలను ప్రారంభిస్తున్నారు. ప్రతి వసతి గృహంలోను ఆరో తరగతి నుంచి ఇంటర్ వరకు చదివే వంద మంది బాలికలకు అవకాశం కల్పిస్తారు. బాలురకు మాత్రం వసతి సౌకర్యం కల్పించలేదు. అయితే ఆంగ్ల మాధ్యమంలో బోధన జరుగుతుండడం వల్ల మోడల్ స్కూళ్లకు డిమాండ్ పెరిగింది. దీన్ని గుర్తించిన ప్రభుత్వం 25 శాతం సీట్లు పెంచుకునేందుకు అవకాశం కల్పించింది. అయితే ఇక్కడో కొత్త మెలికను కూడా ఉత్తర్వుల్లో పొందుపరిచారు. సీట్లు పెంచినా బడ్జెట్ను గానీ, ఫర్నిచర్, బోధన సిబ్బంది సంఖ్యను పెంచేది లేదని పేర్కొన్నారు. అర్హత మార్కులు తగ్గించే ఆలోచన.. ఈ ఏడాది ఆరో తరగతి ప్రవేశ పరీక్షల్లో తక్కువ మంది విద్యార్థులు అర్హత సాధించడం, ప్రశ్నపత్రం కాస్త కఠినంగా రావడంతోనే ఎక్కువ మంది అర్హత సాధించలేదు. దీంతో అర్హత మార్కులను తగ్గించి ఎక్కువ మంది విద్యార్థులను చేర్చుకునేందుకు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. దీనికితోడు 7, 8 తరగతుల్లో చేరేందుకు ఆసక్తి చూపే వారికి సైతం అడ్మిషన్ ఇవ్వాలని రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాలిచ్చింది. ప్రవేశ పరీక్ష నిర్వహించాలా, వచ్చిన విద్యార్థులకు రిజర్వేషన్ ఆధారంగా సీటు కేటాయించాలా అనేది ఆయా స్కూళ్ల ప్రిన్సిపాళ్లకే అప్పగించారు. ప్రచారం కరువు జిల్లాలో మోడల్ స్కూళ్లకు విశేష ఆదరణ ఉన్నా సీట్లు పెంచిన విషయాన్ని ప్రచారం చేయకపోవడంతో ఈ విషయం ప్రజలకు తెలియకుండా పోయింది. మోడల్ స్కూళ్లకు ఇన్చార్జిగా ఉన్న అధికారి స్థానికంగా కాకుండా నిత్యం దూర ప్రాంతం నుంచి రాకపోకలు సాగిస్తుండడంతో ఆయన పూర్తిస్థాయిలో దృష్టి సారించలేకపోతున్నారు. ఇదే అధికారి డీఈఓ కార్యాలయ ఏడీగా కూడా పనిచేస్తుండడంతో మోడల్ స్కూళ్లను అదనపు భారంగానే భావిస్తున్నట్లుగా అవగతమవుతోంది. మోడల్ స్కూళ్లలో ప్రవేశాలపై ఇప్పటివరకు స్పష్టతను ఇచ్చే ప్రకటన చేయలేదు. డీఈఓ కూడా దీనిపై దృష్టి సారించే పరిస్థితి లేకుండా పోయింది. ఉప విద్యాశాఖాధికారులను తొలగించడంతో అన్ని వ్యవహారాలు డీఈఓ చూసుకోవాల్సి వస్తోంది. ఉన్న ముగ్గురు ఏడీల్లో ఇద్దరు స్థానికంగా ఉండకుండా ఇతర ప్రాంతాల నుంచి రాకపోకలు సాగిస్తుండడం, మూడో ఏడీకి పాలనాపరమైన అనుభవం కాస్త తక్కువగా ఉండడంతో వారి సహకారం కూడా డీఈఓకు లేకుండా పోయింది. ఆదేశాలు అందాయి ఏపీ ఆదర్శ పాఠశాలల్లో తమ పిల్లలను చేర్పించేందుకు చాలామంది తల్లిదండ్రులు ఆసక్తి చూపుతున్నారు. ఈ స్కూళ్లలో ఇంగ్లీషు మీడియంతోపాటు కార్పొరేట్ స్థాయిలో నాణ్యమైన విద్య అందిస్తున్నందుకే మంచి స్పందన వస్తోంది. డిమాండ్ను బట్టి ఒక్కో స్కూల్కు 25 శాతం అదనంగా సీట్లు కేటాయించేందుకు కమిషనర్ ఉత్తర్వులు ఇచ్చారు. 6, 7, 8 తరగతులతోపాటు ఇంటర్మీడియెట్ వరకు అదనపు సీట్ల పెంపు వర్తిస్తుంది. మోడల్ స్కూళ్లు ఉన్న ప్రాంతాల్లో సీట్లు పెంపుపై ప్రచారం చేశాం. సోమవారం నుంచి మరింత ప్రచారం చేసి పెరిగిన సీట్లన్నీ భర్తీ అయ్యేలా చూస్తాం.– ఎం. సాయిరాం, జిల్లా విద్యాశాఖాధికారి -
‘డేంజర్ జోన్’లో ఎవరో..?!
సాక్షిప్రతినిధి, కరీంనగర్ : ‘మీ నియోజకవర్గాల్లో మీకు విపత్కర పరిస్థితులు ఉన్నాయి. వచ్చే ఎన్నికల నాటికి పరిస్థితులు ఇలాగే ఉంటే మిమ్మల్సి ఎవరూ రక్షించలేరు’ అంటూ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ హెచ్చరించిన చేసిన ఎమ్మెల్యేలు ఎవరు? ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 12 మందిలో కొందరు ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నారన్న ఆ ఐదుగురు ఎవరు? మూడు విడతల సర్వేలో వారి పనితీరును కళ్లకు కట్టిన అధినేత ఈసారి గట్టిగానే మందలించారా? ఒక సందర్భంలో ‘సిట్టింగ్’లకే మళ్లీ అవకాశం ఇస్తామన్న ఆయన తాజా సర్వేలతో వైఖరి మార్చుకోనున్నారా? ఇదే జరిగితే వచ్చే ఎన్నికల్లో ‘డేంజర్ జోన్’ ఎమ్మెల్యేలు గడ్డు పరిస్థితులు ఎదుర్కొనక తప్పదా? అనే అంశాలు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చర్చగా మారాయి. తాజాగా గులాబీ దళపతి కేసీఆర్ 39 నియోజకవర్గాల్లో అక్కడినుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యేలకు విపత్కర పరిస్థితులు ఉన్నాయం టూ హెచ్చరించిన ట్లు వార్తలు వెలువడిన విషయం తెలిసిందే. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 13 అసెంబ్లీ స్థానాలకుగాను జగిత్యాల మినహా 12 స్థానాల నుంచి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ప్రాతి నిధ్యం వహిస్తున్నారు. ఇందులో ఐదుగురి పేర్లు డేంజర్ జోన్లో ఉన్నట్లు వినిపిస్తుండగా.. కొంద రు ఎమ్మెల్యేలతో నేరుగా మాట్లాడిన కేసీఆర్.. మరికొందరు ఎమ్మెల్యేలకు మంత్రులు ఈటల రాజేందర్, కేటీఆర్తో చెప్పించినట్లు సమాచారం. దీంతోపాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇప్పుడున్న స్థానాలన్నింటినీ కైవసం చేసుకోవాలన్న వ్యూహంతో ఉన్న కేసీఆర్ ‘డేంజర్ జోన్’ ఎమ్మెల్యేలకు క్లాస్ ఇస్తున్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది. ఈ తాజా పరిణామాలు ఇటు అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు, అటు కేడర్లో హాట్టాఫిక్గా మారాయి. ప్రామాణికంగా మూడు విడతల సర్వేలు టీఆర్ఎస్ శాసనసభ్యులుగా ఎన్నికైన తరువాత 2015–16లో ఆ పార్టీ అధినేత కేసీఆర్ మొదట సర్వే జరిపించారు. ఆ తర్వాత ఈ ఏడాది మార్చి వరకూ మరో రెండు విడతల సర్వే నిర్వహించారు. మొదటి, రెండో విడతల ఫలితా లు ఎమ్మెల్యేలతో సమావేశం ఏర్పాటు చేసిన కేసీఆర్.. ఆ సమావేశంలోనే ర్యాంకులు, మార్కులను ప్రకటించారు. తొలి సర్వేలో మంచి మార్కులు కొట్టేసిన వారు కూడా రెండో, మూడో సర్వే నాటికి వెనుకబడిపోగా.. మరికొందరు మెరుగుపర్చుకున్నట్లు తేల్చారు. అధికార పార్టీ ఎమ్మెల్యేల పనితీరుపై నిర్వహించిన ఈ సర్వేలో హుజూరా బాద్ ఎమ్మెల్యే, రాష్ట్ర ఆర్థిక, పౌర సరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్కు ప్రజలు ఫస్ట్ ర్యాంకు ఇచ్చారు. తొలి సర్వేలో మంత్రి 73.50 శాతంగా ఉంటే... రెండో సర్వే నాటికి ఆయన పనితీరు 89.90 శాతానికి పెరిగింది. ఆ తర్వాత ధర్మపురి ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ తొలి సర్వేలో 42.60 శాతం మార్కులు రాగా, రెండో సర్వేలో 47.30కి పెరిగింది. సిరిసిల్ల ఎమ్మెల్యే, మంత్రి కేటీఆర్ 70.60 శాతం నుంచి 60.40కు పడిపోయింది. తొలి, రెండో సర్వేలతో పోలిస్తే కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నాలుగు శాతం పెరగగా.. మిగతా ఎమ్మెల్యేల్లో వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్బాబుకు మార్కులు తగ్గాయి. అదే వరుసలో రామగుండం ఎమ్మె ల్యే సోమారపు సత్యనారాయణ, మంథని ఎమ్మెల్యే పుట్ట మధు, ఆ తర్వాత కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు ఉన్నారు. మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీష్కుమార్, చొప్పదండి ఎమ్మెల్యే శోభ, పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి భారీగా తగ్గారు. మూడో విడత సర్వే కూడా జరిగినప్పటికీ గోప్యంగా వ్యవహరించిన అధినేత... సర్వే ఫలితాలను ఒక్కొక్కరికీ వ్యక్తిగతంగా వివరించినట్లు అప్పట్లో పార్టీ వర్గాల్లో చర్చ జరిగింది. ‘రైతుబంధు’ తర్వాత జరిగిన కీలక సర్వే రైతుబంధు పథకం అమలు తర్వాత జరిగిన సర్వేలు, వివిధ మార్గాల ద్వారా తెప్పించుకున్న నివేదికల్లో వచ్చిన సమాచారం ఇప్పుడు కీలకంగా మారింది. ఈ సర్వేలలో వచ్చిన ఫలితాలతో ఒక దశలో సీఎం కేసీఆర్ షాక్కు గురయినట్టు కూడా ప్రచారం జరిగింది. వచ్చే ఎన్నికల్లో అధికారం తమదేనని, ప్రత్యర్థి పార్టీలకు కనీసం పోలింగ్ ఏజెంట్లు కూడా లేరని కేసీఆర్ చుట్టున్న నాయకులు చెప్పుకుంటున్న తరుణంలో సర్వేలు భిన్నంగా రావడంపై తీవ్రంగా స్పందించినట్లు సమాచారం. రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్కు ఉన్న 90 మందిలో 39 మంది డేంజర్ జోన్లో ఉన్నారంటూ నివేదికలు అందడం.. ఉమ్మడి జిల్లాలో ఐదుగురి పేర్లు ప్రచారంలోకి రావడం ఇప్పుడు హాట్టాఫిక్గా మారింది. మొదటి విడత సర్వేకు.. రెండు, మూడు సర్వేలకు తేడా పోలిస్తే మెరుగ్గా ఉన్నవారితోపాటు గ్రాఫ్ తగ్గిన పలువురి పరిస్థితి కూడా మెరుగైనట్లు తేలింది. ఈ నేపథ్యంలో పలుమార్లు సమావేశాలు నిర్వహించిన కేసీఆర్ ఒకటి, అర మినహాయిస్తే ‘సిట్టింగ్’లు అందరికీ టిక్కెట్లు ఇస్తామనే చెప్పారు. మూడేళ్ల కాలంలో నిర్వహించిన మూడు సర్వేలతోపాటు, రైతుబంధు తర్వాత తెప్పించుకున్న నివేదికల వరకు పరిస్థితి మెరుగుపడని వారిని అధినేత ‘డేంజర్ జోన్’లో చేర్చినట్లు చెప్తున్నారు. ఈ కేటగిరి కింద ఐదుగురు ఎమ్మెల్యేలు వస్తున్నారని, ఆ ఐదుగురిలో కొందరితో నేరుగా మాట్లాడిన ముఖ్యమంత్రి, మరికొందరితో మంత్రులు రాజేందర్, కేటీఆర్ మాట్లాడాలని సూచించినట్లు సమాచారం. ఆ ఐదుగురు ఎమ్మెల్యేలు ఎవరన్న చర్చ ఇటూ పార్టీ వర్గాల్లో, అటు రాజకీయ విశ్లేషకుల్లో కలకలం రేపుతోంది. ఇంత జరిగినా వారి పరిస్థితి మారకపోతే త్వరలోనే ఆ వివరాలు కూడా వెల్లడి కావచ్చన్న చర్చ జరుగుతోంది. -
డిగ్రీలో 1.21 లక్షల మందికి సీట్లు
సాక్షి, హైదరాబాద్ : డిగ్రీ ఆన్లైన్ ప్రవేశాల్లో భాగంగా వెబ్ ఆప్షన్లు ఇచ్చుకున్న విద్యార్థులకు సోమవారం తెలంగాణ డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ (దోస్త్) సీట్లను కేటాయించింది. ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో జరిగిన సమావేశంలో కళాశాల విద్యా కమిషనర్ నవీన్ మిట్టల్, దోస్త్ కన్వీనర్ ప్రొఫెసర్ లింబాద్రి సీట్ల కేటాయింపు వివరాలను వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా డిగ్రీ ప్రవేశాల కోసం 1,37,874 మంది రిజిస్టర్ చేసుకోగా, అందులో 1,29,790 మంది వెబ్ ఆప్షన్లు ఇచ్చుకున్నారు. కాగా వారిలో మొదటి దశలో 1,21,307 మంది సీట్లు లభించినట్లు వెల్లడించారు. ఆప్షన్లు ఇచ్చిన వారిలో 8,483 మందికి మొదటి దశలో సీట్లు లభించలేదు. ఇక విద్యార్థులు ఇచ్చిన ఆప్షన్ల ప్రకారం వారు ఇచ్చుకున్న మొదటి ప్రాధాన్యం (ఆప్షన్) ప్రకారమే 84,870 మందికి సీట్లు లభించాయి. మొదటి ఆప్షన్ ప్రకారమే వారికి సీట్లు వచ్చాయి కనుక వారు రెండో దశ కౌన్సెలింగ్కు వెళ్లే అవకా«శం ఉండదని, వారంతా నేరుగా వెంటనే కాలేజీల్లో చేరాలని కళాశాల విద్యా కమిషనర్ నవీన్ మిట్టల్ వెల్లడించారు. ఇక ఇంజనీరింగ్ సీట్ల కేటాయింపు ఈ నెల 8న ఉన్నందున ఇంజనీరింగ్లో సీట్లు వచ్చిన వారికి డిగ్రీలో సీటు వచ్చి ఉంటే వారి అభిప్రాయాన్ని తెలుసుకొని డిగ్రీ సీటు వద్దని అనుకుంటే ఆప్షన్ ఇవ్వాలని, దాంతో వారి డిగ్రీ సీటు ఆటోమెటిక్గా రద్దు అవుతుందని వివరించారు. ఇక డిగ్రీలో చేరేందుకు బాలుర కంటే బాలికలే ఎక్కువ మంది దరఖాస్తు చేసుకున్నారు. సీట్లు పొందిన 1,21,307 మందిలో బాలికలు 72,859 మంది ఉంటే బాలురు 48,448 మంది ఉన్నారు. నేటి నుంచి రెండో దశ కోసం రిజిస్ట్రేషన్లు.. రెండో దశ కౌన్సెలింగ్ నిర్వహణకు ఈ నెల 5 నుంచే చర్యలు చేపడుతున్నట్లు కళాశాల విద్య కమిషనర్ నవీన్ మిట్టల్, దోస్త్ కన్వీనర్ ప్రొఫెసర్ లింబాద్రి తెలిపారు. మొదటి దశలో సీట్లు రాని వారితోపాటు త్వరలోనే విడుదల కానున్న అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాల్లో ఉత్తీర్ణులయ్యే వారికి రెండో దశ కౌన్సెలింగ్లో అవకాశం కల్పించాలని నిర్ణయించినట్లు తెలిపారు. అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాల్లో పాస్ అయ్యేవారు, ఇప్పటివరకు రిజిస్ట్రేషన్ చేసుకోని వారు కూడా ఇపుడు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని వెల్లడించారు. వారు రూ.400 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలన్నారు. మొదటి ఆప్షన్ల ప్రకారం సీట్లు పొందిన వారు మినహా మిగతా వారు ఇంప్రూవ్మెంట్ రౌండ్ కింద ఆప్షన్లను ఇచ్చుకోవచ్చని తెలిపారు. విద్యార్థులు ఈ నెల 12 వరకు రిజిస్ట్రేషన్ చేసుకునేలా, 14 వరకు ఆప్షన్లు ఇచ్చుకునేలా ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. వారికి 19న సీట్లను కేటాయించనున్నట్లు వెల్లడించారు. ఈ కౌన్సెలింగ్లో పాల్గొనే వారు జనరల్ అభ్యర్థులు రూ.1,000, ఎస్సీ, ఎస్సీ, బీసీలు రూ.500 చెల్లించాలని, ఆ మొత్తం తరువాత ఫీజులో సర్దుబాటు చేస్తామని, కాలేజీల్లో చేరని వారికి వెనక్కి తిరిగి ఇచ్చేస్తామన్నారు. మరోవైపు మూడో దశ కౌన్సెలింగ్ను కూడా ఈ నెలాఖరులోగా పూర్తి చేస్తామని, జూలై 2 నుంచి తరగతులు ప్రారంభం అవుతాయన్నారు. జూలై 5 నుంచి 7 వరకు కాలేజీ పరి«ధిలోనే ఇంటర్నల్ స్లైడింగ్కు అవకాశం కల్పిస్తామని వాటి కేటాయింపును జూలై 10న ప్రకటిస్తామని వివరించారు. -
పేదింటి ఆణిముత్యం
నీట్లో పేదింటి విద్యార్థిని సత్తా చాటింది. ఎంబీబీఎస్లో పీజీ(ఎండీ జనరల్ మెడిషన్) సీటు సాధించింది. చదువుకు పేదరికం అడ్డురాదని నిరూపించి పదిమందికి ఆదర్శంగా నిలిచిన విద్యార్థిని సుప్రజ ఆశయం.. కుటుంబ నేపథ్యంపై ప్రత్యేక కథనం. కోవెలకుంట్ల: కోవెలకుంట్లకు చెందిన ఓబుళపు సూర్యనారాయణరెడ్డి, రాజేశ్వరమ్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలు సంతానం. ఎలాంటి ఆస్తిపాస్తులు లేకపోవడంతో గౌండ వృత్తి నిర్వíßహించుకుంటూ పిల్లలను ప్రయోజకుల్ని చేయాలన్న ఉద్దేశంతో ఉన్నత చదువులు చదివిస్తున్నారు. పెద్దకుమార్తె సుప్రజ పదవ తరగతి వరకు పెండేకంటి పబ్లిక్ పాఠశాలలో, విజయవాడలోని శ్రీచైతన్య కళాశాలలో ఇంటర్ పూర్తి చేసుకుని 2011వ సంవత్సరంలో ఎంసెట్లో ర్యాంకు సాధించి రాయచూర్లోని నవోదయ మెడికల్ కళాశాలలో ఎంబీసీబీఎస్ పూర్తి చేసింది. ఈ ఏడాది నిర్వహించిన నీట్పరీక్షలో 5వేలు ర్యాంకు పొంది బెంగుళూరులోని వైదేహి మెడికల్ కళాశాలలో పీజీ సీటు దక్కించుకుంది. చిన్నకుమార్తె ఇందిర ఇంజినీరింగ్ పూర్తి చేసి హైదరాబాద్లో ఉద్యోగం చేస్తోంది. పేద కుటుంబానికి చెందిన విద్యార్థిని నీట్లో ప్రతిభ కనబరిచి జనరల్ మెడిషన్ సీటు సాధించడంతో ఆ విద్యార్థినికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. రోటరీక్లబ్ మాజీ అధ్యక్షులు బాలాంజనేయరెడ్డి, మోహనమూర్తి, సుబ్బయ్య, శివ, తదితరులు ఆ విద్యార్థినిని ప్రత్యేకంగా అభినందించారు. పేదలకు సేవచేయాలన్న తపన: సుప్రజ పేదల కష్టాలను చాలా దగ్గరగా చూశాను. పూట గడవటమే కష్టంగా ఉన్న పేద కుటుంబాల్లోని వ్యక్తులు జబ్బు పడితే వైద్యం చేయించుకోలేని పరిస్థితి. తల్లిదండ్రులు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఉన్నత చదువులు చదివి ఈ స్థాయికి చేరాను. బెంగుళూరులో పీజీ కోర్సు పూర్తి అయ్యాక డాక్టర్గా స్థిరపడి పేద ప్రజలకు సేవ చేయాలన్నదే నా ముందున్న లక్ష్యం. -
రైలులో సీటు కోసం డిష్యుం డిష్యుం
కమలాపురం: ఆస్తి పాస్తుల కోసమో.. డబ్బు కోసమో ఘర్షణ పడి పోలీస్ స్టేషన్ వరకు వచ్చే వారిని చూస్తుంటాం. కానీ రైలులో ప్రయాణిస్తూ సీటు కోసం ఘర్షణ పడి పోలీస్ స్టేషన్కు చేరిన సంఘటన కమలాపురంలో చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. శుక్రవారం ప్రకాశం జిల్లా, సీఎస్ పురం మండలం, చెర్లోపల్లెకు చెందిన రామనబోయిన సుబ్బయ్య, రామయ్య, సుధూర్, ఇండ్ల వెంకటేష్ తదితరులు వారి కుటుంబ సభ్యులతో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. పుణేలో జరుగుతున్న వివాహ వేడుకలకు హాజరయ్యేందుకు సాయంత్రం రేణిగుంటలో దాదర్ ఎక్స్ప్రెస్ ఎక్కారు. అలాగే వేంపల్లెకు చెందిన నామా శ్రీనివాసులు, హేమంత్, కశెట్టి నరసింహులు తమ కుటుంబ సభ్యులతో తిరుపతిలో మలుపెళ్లి చూసుకొని రేణిగుంటలో రైలు ఎక్కారు. కడప వరకు వారి ప్రయాణం సజావుగా సాగింది. కడప రైల్వే స్టేషన్ దాటాక ఆ రెండు కుటుంబాల వారు సీటు కోసం ఘర్షణకు దిగారు. మాటా మాటా పెరిగి కొట్టుకున్నారు. అయితే ప్రకాశం జిల్లా వాసులు ఎక్కువ మంది ఉండటంతో వేంపల్లె వారిని గాయ పడే విధంగా కొట్టారు. ఈ విషయాన్ని గమనించిన రైల్వే పోలీసులు వారిని కమలాపురం పోలీస్ స్టేషన్లో దించి వేశారు. దీంతో వారు కమలాపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లారు. అయితే కమలాపురం పోలీసులు రైలులో జరిగిన ఘర్షణతో తమకు సంబంధం ఉండదని, కడప రైల్వే పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేసుకోవాలని సూచించడంతో వారు కడప రైల్వే పోలీస్ స్టేషన్కు వెళ్లారు. -
మంత్రి సీటుకు అనుచరుల ఎసరు
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: నగర టీడీపీలో ఎత్తుగడ రాజకీయాలకు పూర్తి స్థాయిలో తెరలేచాయి. నిత్యం మంత్రి నారాయణ వెంట ఉండే కీలక అనుచరగణమే ఆయన సీటుకు ఎసరు పెట్టాయి. అదే స్థానం కోరుతూ పలువురు నేతలు కీలక లాబీయింగ్కు తెరతీసి సరికొత్త సమీకరణాలు తెరపైకి తెచ్చి సీటు హామీ వచ్చిందని ప్రచారం చేసుకుంటూ హడావుడి చేస్తున్నారు. విచిత్రం ఏమిటంటే మంత్రి నారాయణ చుట్టూ ఉన్న ప్రథమ శ్రేణి నేతలు అంతా టికెట్ కోసం ప్రయత్నిస్తూ గురువుకే సున్నం పెడుతున్నారు. వీరిలో ఒకరైతే మరో అడుగు ముందుకు వేసి సీటు తనకి వస్తే ఖర్చు మంత్రిగారే పెట్టుకుంటానని చెప్పారనే ప్రచారానికి తెరతీశారు. ఈ పరిణామాల క్రమంలో మంత్రి నారాయణ జిల్లాలో మరో నియోజకవర్గం సీటుపై దృష్టి సారించి అక్కడ రాజకీయ పనులు మొదలుపెట్టినట్లు సమాచారం. ఇప్పటికే నగర టీడీపీ చుక్కాని లేని నావలా తయారైంది. నేతలు పదుల సంఖ్యలో ఉన్నప్పటికీ వారి వ్యక్తిగత కార్యక్రమాలు మినహా పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్న దాఖలాల్లేవు. ఈ క్రమంలో పార్టీ అధిష్టానం పలుమార్లు నేతలు అందరూ సమన్వయంతో పనిచేయాలని చెప్పినా అది ఎవరూ పట్టించుకోని పరిస్థితి. దీంతో నగర టీడీపీలో గందరగోళం నెలకొంది. పాత, కొత్త నేతల వివాదాలు, గొడవలు, ఆదిపత్య పోరు నిత్య కృత్యంగా సాగుతూనే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అప్పుడే అసెంబ్లీ టికెట్ ఫైట్కు అధికార పార్టీలో తెర లేచింది. సార్వత్రిక ఎన్నికలకు మరో 10 నెలలు సమయం ఉన్నా అధికార పార్టీలో మాత్రం టికెట్ హడావుడి కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా గత ఏడాది కాలంగా అయితే రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ నెల్లూరు నగరం నుంచి తాను పోటీ చేస్తానని కార్యకర్తల సమావేశంలో ప్రకటించుకున్నారు. దీనికి అనుగుణంగా నగరంలో కార్యక్రమాలు చేస్తున్నారు. కనీసం వారంలో రెండు రోజుల పాటు నగరంలో పర్యటనలు నిర్వహించటం, అధికారిక కార్యక్రమాలతో పాటు పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. మరోవైపు నగరంలో అధికార పార్టీ కార్పొరేటర్లందరినీ తనవైపు మరల్చుకోవడానికి వీలుగా అందరికీ పనులు చేయించటం, ఆయా డివిజన్లకు నిధులు కేటాయించి నేరుగా తనతోనే మాట్లాడాలని ఆదేశాలు ఇచ్చి నగరంలో బలంగా వర్గం ఏర్పాటు చేసుకునే యత్నాలు సాగించారు. అయితే అవి కొంతమేరకే ఫలించాయి. ఈ క్రమంలో మంత్రి కోటరీలో కీలక వ్యక్తులుగా ఉన్న నెల్లూరు నగర మేయర్ అబ్దుల్ అజీజ్, నెల్లూరు నగర టీడీపీ ఇన్చార్జి మంగమూరు శ్రీధర కృష్ణారెడ్డి. టీడీపీ రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షురాలు తాళ్లపాక అనురాధలు టికెట్ రేసులోకి వచ్చారు. అలాగే నుడా చైర్మన్, నగర టీడీపీ అధ్యక్షుడు కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి కూడా సీటు కోసం తన లాబీయింగ్ మొదలుపెట్టారు. ఈ క్రమంలో ఎవరికీ వారు కార్యక్రమాలు నిర్వహించి హడావుడి చేస్తున్నారు. అయితే అంతిమంగా మాత్రం ఎవరు పార్టీ కార్యక్రమాలు నిర్వహించని పరిస్థితి. దీంతో నగరంలో ఆధిపత్యం విషయమై నేతల మధ్య పలుమార్లు అంతర్గత వివాదాలు రేగి మంత్రి వద్దే పంచాయితీలు జరిగాయి. టీడీపీ ఆవిర్భవించిన తర్వాత 1983లో ఆనం రామనారాయణరెడ్డి, ఆ తర్వాత 1994లో తాళ్లపాక రమేష్రెడ్డి మాత్రమే అధికార పార్టీ నుంచి ఇక్కడ గెలుపొందారు. 1994లో రమేష్రెడ్డి గెలుపొంది రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. దీంతో స్వతహాగానే నగరంలో పార్టీకి పట్టు తక్కువ. ఈ క్రమంలో 2014 నుంచి భారీగా వలస వచ్చిన నేతలు కూడా ఎక్కువ అయ్యారు. నేతలు ఎక్కువ, కార్యకర్తలు తక్కువ అన్న రీతిలో నగరంలో పరిస్థితి ఉంది. మైనార్టీ కోటాలో అజీజ్ హడావుడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో మేయర్గా గెలుపొందిన అబ్దుల్ అజీజ్ పార్టీ ఫిరాయించారు. ఈయన నెల్లూరు టికెట్ తనకే దక్కుతుందని బహిరంగంగా చెప్పుకుంటున్నారు. ఎమ్మెల్యే టికెట్ హామీతోనే పార్టీ ఫిరాయించానని, మంత్రి నారాయణతో పాటు లోకేశ్, చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారని చెబుతుండటంతో పాటు రెండు నెలలుగా మైనార్టీ ఆత్మీయ సమావేశాలు జిల్లా వ్యాప్తంగా నిర్వహించి టికెట్ డిమాండ్ను బలపరుచుకునేలా ప్రయత్నిస్తున్నారు. మరోవైపు ఇన్చార్జి ముంగమూరు శ్రీధరకృష్ణారెడ్డి టికెట్ తనకే వస్తుందని బలంగా చెప్పుకుంటూ పనిచేస్తున్నారు. మరోవైపు నగర టీడీపీ ఇన్చార్జీ హోదాలో నగరంతో పాటు రాజధానిలోనూ మంత్రి సహకారంతో భారీగా కాంట్రాక్ట్ వర్కులు తీసుకుంటు మందస్తు సన్నాహాల్లో ఉన్నారు. ఇక తాళ్లపాక అనురాధ కూడా టికెట్ కోసం ఆశిస్తూ తనకి టికెట్ వస్తే పార్టీ, మంత్రి నారాయణ ఖర్చు పెడతరానే ప్రచారం చేసుకుంటున్నారు. ఇక నుడా చైర్మన్ కోటంరెడ్డి యథావిధిగా బాలయ్య కోటాలో టికెట్ వస్తుందనే ఆశలో ఉన్నారు. నగర నేతలను ఏకతాటిపైకి తీసుకురావాలని మంత్రి రెండు సార్లు ప్రయత్నించి విఫలమయ్యారు. దీంతో నగరంలో తలనొప్పులు పడటం కష్టమనే భావనతో కొత్త నియోజకవర్గంపై దృష్టి సారించారు. మొత్తం మీద నగరం టీడీపీలో కొనసాగుతున్న టికెట్ ఫైట్ మంత్రికే తలనొప్పిగా మారటం విశేషం. -
2019 ఎన్నికల్లో 12 సీట్లల్లో 6 సీట్లు ఇవ్వాలి
మిర్యాలగూడ టౌన్ : వచ్చే ఎన్నికల్లో అన్ని పార్టీలు బీసీలకు సముచిత స్థానం కల్పించకుంటే తగిన బుద్ధి చెప్పుతామని బీసీ సంక్షేమ సంఘం జిల్లా వర్కింగ్ కమిటీ ప్రె సిడెంట్ మేకల వెంకన్న, తెలం గాణ విద్యుత్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీనివాస్, టీడీపీ రాష్ట్ర నాయకులు వెంకటేశ్వర్లు అన్నారు. బుధవారం బీసీ కులాల సంఘాల సమావేశానికి అతిథిగా హాజరయ్యారు. 2019 ఎన్నికల్లో 12 సీట్లల్లో 6 సీట్లు బీసీ జనా భా ప్రాతిపదికన సీట్లు పార్టీలు కేటాయిం చాలని డిమాండ్ చేశారు. మిర్యాలగూడ నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు కూడా బీసీకి ఎమ్మెల్యే టికెట్ను కేటాయించకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. సమావేశంలో అంజి, శ్రీను గిరి, సత్యనారాయణ, లక్ష్మినారాయణ, కృష్ణ, , పుప్పాల సత్యం, రాచూరి మహేష్, పందిరి వేణు, కంచి సత్యనారాయణ, లోహిత్, ఆనంద్, ప్రశాంత్ ఉన్నారు. -
స్టాక్స్ వ్యూ
సియట్ కొనొచ్చు బ్రోకరేజ్ సంస్థ: మోతిలాల్ ఓస్వాల్ ప్రస్తుత ధర: రూ.1,695 ; టార్గెట్ ధర: రూ.2,029 ఎందుకంటే: ఆర్పీజీ గోయంకా గ్రూప్కు చెందిన ఈ కంపెనీ... ఆదాయం పరంగా భారత్లో నాలుగో అతి పెద్ద టైర్ల కంపెనీ. రోజుకు 95 వేల టైర్ల ఉత్పత్తి సామర్థ్యం ఉన్న ఈ కంపెనీకి దేశవ్యాప్తంగా పటిష్టమైన డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ఉంది. కంపెనీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక ఆర్థిక ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయి. ఆదాయం అంచనాలకు అనుగుణంగా ఉండగా, నికర లాభం, ఇబిటా అంచనాలను అందుకోలేకపోయాయి. ఆదాయం 1% క్షీణించి రూ.1,628 కోట్లకు తగ్గింది. ముడిపదార్ధాల వ్యయాలు చెప్పుకోదగ్గ స్థాయిలో పెరగడంతో గత క్యూ1లో రూ.185 కోట్లుగా ఉన్న ఇబిటా ఈ క్యూ1లో రూ.55 కోట్లకు తగ్గింది. ఫలితంగా నికర లాభం రూ.104 కోట్ల నుంచి 99% క్షీణించి రూ.కోటికి పడిపోయింది. సహజ రబ్బరు ధరలు 30%, సింథటిక్ రబ్బర్ ధరలు 50% పెరగడం బాగా ప్రభావం చూపించింది. ఈ ఆర్థిక సంవత్సరం క్యూ2లో ఇప్పటికే సగటు ముడి పదార్ధాల వ్యయాలు 10% తగ్గాయి. ఇవి మరింతగా తగ్గే అవకాశాలున్నాయి. దీంతో మార్జిన్లు పుంజుకుంటాయని భావిస్తున్నాం. పంక్చర్ లెస్, మైలేజీ అధికంగా ఇచ్చే వంటి వినూత్నమైన టైర్లను మార్కెట్లోకి తెస్తుండటంతో ప్రయాణికుల సెగ్మెంట్ టైర్ల అమ్మకాలు పెరుగుతాయని అంచనా వేస్తున్నాం. గత ఏడాది సెప్టెంబర్లో మార్కెట్లోకి తెచ్చిన ట్రక్, బస్ రేడియల్(టీబీఆర్) టైర్ల సెగ్మెంట్ 70–80 % వృద్ధి సాధించగా, భవిష్యత్తులో మరో 10–15% వృద్ధికి అవకాశాలున్నాయని కంపెనీ అంచనా వేస్తోంది. ముడి పదార్ధాలు ధరలు తగ్గుతుండడం, జీఎస్టీ అమలు తర్వాత రికవరీ జరిగే అవకాశాలు, చైనా నుంచి దిగుమతయ్యే టైర్లపై యాంటీ డంపింగ్ సుంకం విధింపు కారణంగా దేశీయ టైర్ల కంపెనీల మార్కెట్ వాటా పెరిగే అవకాశాలు.. ఇవన్నీ సానుకూలాంశాలు. రెండేళ్లలో ఆదాయం 8 శాతం, నికర లాభం 17% చొప్పున చక్రగతిన వృద్ధి చెందే అవకాశాలున్నాయి. ఫ్యూచర్ రిటైల్ కొనొచ్చు బ్రోకరేజ్ సంస్థ: యాక్సిస్ డైరెక్ట్ ప్రస్తుత ధర: రూ.443 ; టార్గెట్ ధర: రూ.560 ఎందుకంటే: ఫ్యూచర్ రిటైల్ సంస్థ–బిగ్బజార్, ఫుడ్హాల్, ఫుడ్ బజార్, ఈజీ డే ఫార్మాట్ స్టోర్స్ను, ఎఫ్బీబీ, హోమ్ టౌన్(హోమ్ అండ్ ఫర్నిషింగ్స్), ఈజోన్(ఎలక్ట్రానిక్స్ రిటైల్) స్టోర్స్ను నిర్వహిస్తోంది. 2005–10 కాలంలో భారీగా విస్తరించడం, సంబంధం లేని వ్యాపారాల్లోకి ప్రవేశించిండం వంటి కారణాల వల్ల కంపెనీ రుణ భారం పెరిగిపోయింది. 2011–12 ఏడాది నుంచి పునర్వ్యస్థీకరణ చేపట్టింది. పాంటలూన్స్ సంస్థను విక్రయించింది. బిగ్బజార్ స్టోర్స్ను పునర్వ్యస్థీకరించింది. వీటన్నింటి ఫలితంగా ఆరోగ్యకరమైన ఆర్థిక స్థితిగతులతో.. భారత్లో అగ్రస్థాయి మల్టీ ఫార్మాట్ రిటైలర్ కంపెనీగా అవతరించింది. చౌక ధరల్లో ఉత్పత్తులందించే రిటైల్ చెయిన్గా 2001లో ప్రారంభమైన బిగ్బజార్ను పూర్తి స్థాయి వెరైటీ డిపార్టమెంటల్ స్టోర్గా పునర్వ్యస్థీకరించింది. యువతను ఆకర్షించేందుకు బిగ్బజార్ జెన్ నెక్స్ట్ పేరుతో కొత్త స్టోర్స్ను అందుబాటులోకి తెచ్చింది. ఫ్యాషన్ బిగ్ బజార్(ఎఫ్బీబీ)ను కూడా మారుతున్న ఫ్యాషన్ ట్రెండ్స్కు అనుగుణంగా మార్పుచేర్పులు చేసింది. ఈజీ డే, హెరిటేజ్ రిటైల్ స్టోర్స్ను కొనుగోలు చేసి, స్మాల్ ఫార్మాట్ స్టోర్ నెట్వర్క్ను మరింత పటిష్టం చేసుకుంది. స్వంత బ్రాండ్ కొర్యొ ఉత్పత్తుల విక్రయాల పెంపుపై దృష్టి సారిస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో రూ.1,100 కోట్లుగా ఉన్న నికర రుణ భారం వచ్చే ఏడాది కల్లా పూర్తిగా తగ్గిపోగలదన్న అంచనాలున్నాయి. పాంటలూన్స్లో మెజారిటీ వాటాను విక్రయించడం, క్యాపిటల్ ఫస్ట్లో పూర్తి వాటాను అమ్మేయడం, జెనరాలి సంస్థతో ఏర్పాటు చేసిన రెండు బీమా జేవీల్లో వాటాలను కూడా విక్రయించి రుణభారాన్ని తగ్గించుకుంది. హోమ్, ఫర్నిషింగ్స్ విభాగం హోమ్ టౌన్ను డీమెర్జ్ చేయాలని యోచిస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో 3.4 శాతంగా ఉన్న ఆపరేటింగ్ మార్జిన్ 2021–22 ఆర్థిక సంవత్సరానికి 5.5 శాతానికి పెరగగలదని అంచనా వేస్తున్నాం. -
కాపు కులస్థులకే మేయర్ పీఠం
భానుగుడి (కాకినాడ): కాకినాడ నగర మేయర్ పీఠాన్ని కాపు కులస్తులకే ఇవ్వాలని అ««ధిష్టానం నిర్ణయించినట్లు ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు. మంగళవారం జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాకినాడ నగరపాలక సంస్థ పరిధిలోని 48వ వార్డుల్లో పోటీచేసే తేదేపా అభ్యర్థుల జాబితాను జిల్లా పార్టీ కార్యవర్గం సిద్ధం చేసిందని, పరిశీలనకు అధిష్టానానికి పంపినట్లు పేర్కొన్నారు. ఆమోదముద్ర పడగానే జాబితాను విడుదల చేస్తామని రాజప్ప ప్రకటించారు. జిల్లా ఇన్ఛార్జి మంత్రి కళా వెంకట్రావు ఎన్నికలకు సంబంధించి సంధానకర్తగా వ్యవహరిస్తారని పేర్కొన్నారు. కాకినాడ నగర పార్టీలో కాపు వర్గీయులకు–ఎమ్మెల్యేకు మధ్య ఉన్న పొరపొచ్చాలను విలేకరులు ప్రశ్నించగా చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించి ముందుకెళతామన్నారు. ముద్రగడ రిజర్వేషన్ల కోసం పోరాడుతున్న నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుందని ప్రశ్నించిన విలేకరులపై విరుచుకుపడ్డారు. కాపులకు ఎప్పుడూ పార్టీలో గుర్తింపు ఉందని, ముద్రగడ గేటువరకు వచ్చి డబ్బు కొట్టి వెనక్కి వెళుతున్నారని, ఇదేం పద్ధతో అర్థం కావడం లేదని ముద్రగడ ఆందోళనను అవహేళన చేసేలా మాట్లాడారు. సమావేశంలో ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్రరావు, జిల్లా తెదేపా అధ్యక్షుడు నామన రాంబాబు, జెడ్పీ చైర్మన్ జ్యోతుల నవీన్, ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
ముగిసిన ఎంసెట్ తుది దశ కౌన్సెలింగ్
♦ 12,264 ఇంజనీరింగ్ సీట్లు ఖాళీ ♦ యూనివర్సిటీ కాలేజీల్లో 99.4 శాతం సీట్లు భర్తీ ♦ ప్రైవేటు కాలేజీల్లో 80.8 శాతమే ♦ ఎంపీసీ కోటా ఫార్మా సీట్ల భర్తీ 4.9 శాతమే సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్, ఫార్మా కాలేజీల్లో ప్రవేశాలకు సంబంధించి తెలంగాణ ఎంసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియ ముగిసింది. తుది దశ కౌన్సెలింగ్కు సంబంధించి సీట్ల కేటాయింపు శనివారం నాటితో పూర్తయింది. ఇంజనీరింగ్, బీ ఫార్మసీ, ఫార్మాడీ కేటగిరీలో 77.8 శాతం సీట్లు భర్తీ అయ్యాయి. ఈ మూడు కేటగిరీల్లో 317 కాలేజీల్లో 70,427 సీట్లు కన్వీనర్ కోటాలో ఉండగా.. 54,784 సీట్లను విద్యార్థులకు కేటాయించారు. కౌన్సెలింగ్ ప్రక్రియ శనివారం నాటితో పూర్తి కావడంతో మూడు కేటగిరీల్లో 15,643 సీట్లు ఖాళీగా ఉండిపోయాయి. ఇందులో ఇంజనీరింగ్ కేటగిరీలో 12,264 సీట్లు ఖాళీగా ఉండగా.. బీ ఫార్మసీలో 2,925 సీట్లు, ఫార్మాడీలో 454 సీట్లు మిగిలాయి. 2,015 మందికి దక్కని సీట్లు.. తుది దశ కౌన్సెలింగ్లో మొత్తంగా 1,06,200 మంది విద్యార్థులు ఆప్షన్లు ఇచ్చుకోగా 65,745 మంది విద్యార్థులు మాత్రమే అర్హులుగా తేలారు. వీరిలో తొలి దశలో 63,588 మంది ఆప్షన్లు ఇచ్చుకోగా, తుది దశలో 38,661 మంది ఆప్షన్లు ఇచ్చుకున్నారు. మొత్తం 54,784 సీట్లు భర్తీ కాగా.. 2,015 మంది విద్యార్థులకు సీట్లు అలాట్ కాలేదు. రాష్ట్రవ్యాప్తంగా ఒక ఇంజనీరింగ్ కాలేజీలో ఒక్క సీటు కూడా అలాట్ కాకపోగా.. 76 కాలేజీల్లో వంద శాతం సీట్లు భర్తీ అయ్యాయి. ఇంజనీరింగ్ కోటాలో 14 యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీల్లో 99.4 శాతం సీట్లు భర్తీ కాగా.. 187 ప్రైవేటు కాలేజీల్లో 80.8 శాతం సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. ఫార్మాసీ కాలేజీలు వెలవెల.. ఈ ఏడాది ఎంపీసీ కోటా విద్యార్థులు ఫార్మసీ కోర్సులపై అనాసక్తి చూపారు. ఎంపీసీ కోటాలో 3 యూనివర్సిటీ కాలేజీల్లో 80 సీట్లు ఉండగా.. కేవలం 24 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. 113 ప్రైవేటు కాలేజీల్లో 2,997 సీట్లు ఉండగా.. వీటిలో 128 సీట్లు మాత్రమే అభ్యర్థులు దక్కించుకున్నారు. ఫలితంగా 2,869 సీట్లు మిగిలిపోయాయి. అలాగే ఎంపీసీ కోటాలో ఫార్మాడీ కేటగిరీలో 51 ప్రైవేటు కాలేజీల్లో 503 సీట్లు ఉండగా.. వీటిలో 49 మందికి మాత్రమే సీట్లు కేటాయించారు. దాంతో 454 సీట్లు ఖాళీగా ఉండిపోయాయి. 29లోగా రిపోర్ట్ చేయాలి.. సీట్లు పొందిన విద్యార్థులు ఆన్లైన్ పద్ధతిలో లేదా నగదు రూపంలో నిర్దేశిత బ్యాంకులో చలానా ద్వారా ఫీజు చెల్లించాలి. అనంతరం చలానా నంబర్ ఆధారంగా వెబ్సైట్లో సెల్ఫ్ రిపోర్టింగ్ ఆప్షన్ నింపాలి. విద్యార్థులు ఈ నెల 28లోగా ఈ పేమెంట్ ప్రక్రియ పూర్తి చేసి.. 29లోగా కాలేజీలో రిపోర్టు చేయాలని ఎంసెట్ కన్వీనర్ ఓ ప్రకటనలో తెలి పారు. ఫీజు రీయింబర్స్మెంట్ పొందే అభ్యర్థులు ఈ నెల 27లోగా ఆదాయ ధ్రువీకరణ పత్రాన్ని హెల్ప్లైన్ సెంటర్లో సమర్పించాల్సి ఉంటుంది. -
నోటుకు సీటు!
ఆదర్శ పాఠశాలలో మెరిట్ ముసుగులో సీట్ల అమ్మకం - రూ.10వేల నుంచి రూ.15వేలు వసూలు - ఒప్పందం మేరకు వాట్సాప్లో ప్రశ్న, జవాబు పత్రాలు - ప్రిన్సిపాల్, మరో ఇద్దరు ఉపాధ్యాయుల పాత్ర - వేకెన్సీ సీట్ల భర్తీలో రిజరేషన్కు పాతర - అమ్ముడుపోయిన సుమారు 70 సీట్లు - ‘సాక్షి’ నిఘాలో బట్టబయలు ఆదర్శం అభాసు పాలయింది. విద్యార్థులకు తప్పొప్పులు తెలియజెప్పాల్సిన ఉపాధ్యాయులే తప్పటడుగులు వేశారు. జీవితం సాఫీగా సాగిపోయేందుకు అవసరమైన జీతం వస్తున్నా.. గీతం కోసం అర్హులైన విద్యార్థులకు వెన్నుపోటు పొడిచారు. ప్రయివేట్ పాఠశాలలను కాదని.. ఆదర్శ పాఠశాలల్లోనే తమ పిల్లల భవిష్యత్ బాగుంటుందని ఆశించిన తల్లిదండ్రుల కలనూ కాలరాశారు. మెరిట్.. రిజర్వేషన్ ప్రాతిపదికన భర్తీ చేయాల్సిన సీట్లను అమ్మకానికి పెట్టడంతో సరస్వతీ మాత కన్నీరు పెడుతోంది. రాయదుర్గం అర్బన్ : పట్టణంలోని ఆదర్శ పాఠశాలలో సీటుకు బాగా డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో పరీక్ష తప్పనిసరి చేశారు. ఆరో తరగతిలో 80 సీట్ల భర్తీకి నిర్వహించే పోటీ పరీక్షలో దాదాపు 400 మంది విద్యార్థులు హాజరువుతుండటం చూస్తే పోటీ ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఒక్కో తరగతికి 80 సీట్ల చొప్పున మంజూరు చేయగా, గత ఏడాది ప్రజాప్రతినిధులపై విపరీతమైన ఒత్తిడి రావడంతో ఆరో తరగతికి అదనంగా మరో 80 సీట్లను మంజూరు చేశారు. ఒకసారి ఆరో తరగతిలో చేరిలో ఇంటర్మీడియట్ వరకు ఎలాంటి ఇబ్బంది ఉండదనే అభిప్రాయం తల్లిదండుల్లో ఉంది. కాన్వెంట్లలో చదివించే తల్లిదండ్రులు కూడా ఆదర్శ పాఠశాలల్లో చేర్పించేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ నేపథ్యంలో దళారులు, ఇద్దరు ఉపాధ్యాయులు సొమ్ము చేసుకునేందుకు సిద్ధపడ్డారు. సీటుకు రూ.10వేల నుంచి రూ.15వేల చొప్పున సుమారు 70 సీట్లను అమ్మకున్నట్లు తెలిసింది. డబ్బిచ్చిన వారికి వాట్సాప్లో ముందుగానే ప్రశ్న, జవాబు పత్రాలు పంపుతున్నారు. అది కూడా రాయలేని వారికి వారే దిద్దుబాట్లు చేసి పంపుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ కారణంగా మెరిట్ విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. ఎవరైనా గుర్తించి ప్రశ్నిస్తే నిబంధనలకు విరుద్ధంగా సీట్లు కేటాయించి నోరు మూయిస్తున్నట్లు తెలుస్తోంది. వెలుగులోకి వచ్చిందిలా.. ఆదర్శ పాఠశాలలో పెద్ద ఎత్తున సీట్ల కోసం డబ్బు వసూలు చేస్తున్నారనే విషయమై బహిరంగంగానే చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ‘సాక్షి’ దృష్టి సారించగా వాయిస్ రికార్డులతో పాటు, రిజర్వేషన్ రోస్టర్ వెల్లడితో అడ్డంగా దొరికిపోయారు. వివిధ తరగతుల్లో ఖాళీగా ఉన్న 13 సీట్లను భర్తీ చేయడానికి గత నెల 24న రిజర్వేషన్ రోస్టర్ను ప్రిన్సిపాల్ ప్రకటించారు. జాబితా ప్రకారం ఏడో తరగతిలో ఆరు సీట్లు, ఎమిమిదో తరగతిలో మూడు సీట్లు, తొమ్మిదో తరగతిలో 4 సీట్లు ఉన్నాయి. వీటికి దరఖాస్తులు స్వీకరించారు. జాబితాలో పదో తరగతిలో సీట్లు చూపకపోయినప్పటికీ దరఖాస్తులు స్వీకరించారు. కేవలం రిజర్వేషన్ రోస్టర్ ప్రకారం దరఖాస్తులు స్వీకరించకుండా, అందరితోనూ దరఖాస్తులు స్వీకరించడం చర్చనీయాంశమైంది. వీరికి ఈ నెల 5వ తేదీన పరీక్షలు నిర్వహించారు. డబ్బు ఇచ్చిన వారికి ముందుగానే వాట్సాప్లో ప్రశ్నాపత్రాన్ని, జవాబు పత్రాన్ని పంపించారు. నాలుగో తేదీ సాయంత్రం 4.25 గంటలకు ఒక వ్యక్తికి ç ప్రశ్నాపత్రం పంపగా, 5వ తేదీ ఉదయం 7.34 గంటలకు అదే వ్యక్తికి జవాబు పత్రం కూడా ప్రిన్సిపాల్ సెల్ నుంచి వెళ్లింది. ఖాళీ సీట్ల భర్తీకి పాటించాల్సిన రిజర్వేషన్ వివరాలివీ.. నోటిఫికేషన్ ప్రకారం గత నెల 24న ప్రకటించిన ఖాళీలకు రిజర్వేషన్ వివరాలను ప్రిన్సిపాల్ విడుదల చేశారు. ఏడో తరగతిలో ఉన్న ఆరు సీట్లలో ఒకసీటు ఎస్సీ జనరల్ , మూడు సీట్లు ఎస్సీ ఉమెన్, ఒక సీటు ఎస్టీ ఉమెన్, ఒక సీటు బీసీ–బీ ఉమెన్కు కేటాయించారు. ఎనిమిదో తరగతిలోని మూడు సీట్లలో ఓసీ ఉమెన్కు ఒకటి, ఎస్సీ ఉమెన్కు ఒక సీటు, బీసీ–డీ జనరల్కు ఒక సీటు కేటాయించారు. తొమ్మిదో తరగతిలోని నాలుగు సీట్లలో ఎస్సీ జనరల్కు ఒక సీటు, ఎస్సీ ఉమెన్కు ఒక సీటు, ఎస్టీ ఉమెన్కు ఒక సీటు, బీసీ–డీ ఉమెన్కు ఒక సీటు కేటాయించారు. ఈ సీట్లకు 178 మంది దరఖాస్తు చేసుకున్నారు. విద్యార్థుల ఎంపిక చేశారిలా.. ఈనెల 12న వేకెన్సీ సీట్ల భర్తీకి సంబంధించిన ఫలితాలను వెల్లడించారు. అయితే రిజర్వేషన్కు, ఫలితాలకు పొంతన లేకుండా పోయింది. ఏడో తరగతిలో ఆరు సీట్లకు గాను ఓసీ కేటగిరీ కింద ఇద్దరు బాలురు, బీసీ–బీ కింద ఒక బాలుడు, బీసీ–డీ కింద ఒక బాలుడు, ఒక బాలికను, బీసీ–ఏ కింద ఒక బాలుడిని ఎంపిక చేశారు. 8వ తరగతికి ఎంపిక చేసిన ముగ్గురిలో బీసీ–బీ కింద ఇద్దరు బాలురు, ఓసీ కింద బాలికను ఎంపిక చేశారు. 9వ తరగతిలో బీసీ–బీ కింద ఇద్దరు బాలురు, ఒక బాలికను, బీసీ–డీ కింద ఒక బాలికను ఎంపిక చేశారు. 10వ తరగతికి వేకెన్సీలో చూపకపోయినప్పటికీ ఒక సీటు ఖాళీగా ఉందంటూ ఓసీకి చెందిన బాలుడిని ఎంపిక చేశారు. ఫలితాల్లో రిజర్వేషన్లకు తిలోదకాలు వేకెన్సీ సీట్ల కోసం ఈ నెల 5వ తేదీన 176 మంది పరీక్ష రాయగా, 13 మందిని ఎంపిక చేశారు. అయితే రిజర్వేషన్లకు తిలోదకాలు ఇవ్వడంతో వ్యవహారం బట్టబయలైంది. విషయాన్ని పసిగట్టిన ‘సాక్షి’ లోతుగా అధ్యయనం చేసింది. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన ప్రిన్సిపాల్.. ప్రస్తుతం, అంతకు ముందు ఎంపికైన ఆరవ తరగతి విద్యార్థులతో స్థానిక ఎమ్మెల్యేల రెకమండేషన్ లెటర్ తీసుకురావాలని ఒత్తిడి తీసుకొస్తున్నట్లు సమాచారం. ఎవరితోనూ డబ్బు తీసుకోలేదు మెరిట్ ప్రాతిపదికనే ఎంపిక ప్రక్రియ చేపడుతున్నాం. సీట్ల కోసం ఎవరితోనూ డబ్బు తీసుకోలేదు. మంచి మార్కులు వచ్చిన వారికే అవకాశం కల్పించాం. రిజర్వేషన్ రోస్టర్ ప్రకటించకుండా ఉండాల్సింది. - ప్రకాశ్నాయుడు, ప్రిన్సిపాల్, ఆదర్శ పాఠశాల, రాయదుర్గం -
ఆసక్తి చూపని విద్యార్థులు!
– 214 సీట్లకు 93 మంది హాజరు – ఇదీ కార్పొరేట్ విద్య పథకం దుస్థితి అనంతపురం ఎడ్యుకేషన్ : భర్తీ చేయాల్సిన సీట్లు 232. వచ్చిన దరఖాస్తులు 1960. చివరగా కౌన్సెలింగ్ హాజరైన విద్యార్థులు 93 మంది ... ఇదీ కార్పొరేట్ విద్య పథకం దుస్థితి. దీన్నిబట్టి చూస్తుంటే ఏడాదికి రూ.35 వేలు ఖర్చు చేసి ఉచితంగా చదివిస్తామంటే కూడా పిల్లలు ఆసక్తి చూపడం లేదనేది స్పష్టమవుతోంది. మరోవైపు ప్రభుత్వ అలసత్వం కారణంగానే ఈ దుస్థితి నెలకొందని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు. పిల్లలకు ఫీజు చెల్లించలేక చదువు మానేసిన కుటుంబాలు జిల్లాలో అనేకం. ఇలాంటి జిల్లాకు వరంగా మారిన కార్పొరేట్ విద్య పథకం చతికిల పడింది. 232 సీట్లు భర్తీ చేయాల్సి ఉండగా తొలివిడతా 214 సీట్ల ప్రవేశాలకు గురువారం స్థానిక ఎస్సీ నంబర్ 4 వసతి గృహంలో కౌన్సెలింగ్ నిర్వహించారు. ఆయా కళాశాలలకు విద్యార్థులను కేటాయిస్తూ ప్రవేశ పత్రాలు అందజేశారు. అయితే 214 సీట్లకు గానూ కేవలం 93 మంది మాత్రమే హాజరయ్యారంటే ఈ పథకం ఉపయోగం అర్థం చేసుకోవచ్చు. ఎస్సీ విద్యార్థులు 103 మందికి 56, మైనార్టీ విద్యార్థులు 15 మందికి 6, బీసీ విద్యార్థులు 54 మందికి 13, ఈబీసీ విద్యార్థులు 11 మందికి 4, ఎస్టీ విద్యార్థులు 28 మందికి 14 మంది హాజరయ్యారు. ఇక బీసీసీ విద్యార్థులు ముగ్గురికి కూడా ఒక్కరూ హాజరుకాలేదు. సాంఘిక సంక్షేమ శాఖ డీడీ రోశన్న, బీసీ సంక్షేమశాఖ డీడీ రమాభార్గవి, గిరిజన సంక్షేమశాఖ జిల్లా అధికారి కొండలరావు, సాంఘిక సంక్షేమ జిల్లా అధికారి లక్ష్మానాయక్ తదితరులు కౌన్సెలింగ్లో పాల్గొన్నారు. ఆలస్యమే ప్రధాన కారణం : ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో చదివి పదో తరగతిలో బాగా ప్రతిభ చాటి ఆర్థిక ఇబ్బందిగా ఉన్న కుటుంబాలకు కార్పొరేట్ విద్య పథకం చాలా ఉపయోగకరం. అయితే ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం వల్ల చాలామందికి ఉపయోగం లేకుండాపోయింది. ఈ పథకం ద్వారా ఏడాదికి రూ. 35 వేలు ఫీజు చెల్లించడంతో పాటు విద్యార్థి ఖర్చుకు రూ. 3 వేలు ప్రభుత్వమే చెల్లిస్తుంది. జూన్ 1 నుంచే ఇంటర్ ప్రథమ సంవత్సరం తరగతులు ప్రారంభమయ్యాయి. సరిగ్గా 35 రోజుల తర్వాత ప్రవేశాలకు కౌన్సెలింగ్ నిర్వహించారు. దీంతో ఇప్పటికే చాలామంది వారికి అనుకూలమైన కళాశాలల్లో అప్పుసప్పులు చేసి చేరిపోయారు. దీనికితోడు పేరుకు కార్పొరేట్ పథకం అని ఉన్నా...జాబితాలో అన్నీ లోకల్ కళాశాలల పేర్లే ఉండటం కూడా విద్యార్థులు చేరకపోవడానికి మరో కారణమంటూ విద్యార్థి సంఘాల నాయకులు చెబుతున్నారు. -
‘దేశం’లో కుర్చీలాట
- జెడ్పీ పీఠంపై వీడని ఉత్కంఠ - సమన్వయ సమావేశంలో తేలని రచ్చ - మధ్యలో వచ్చే వారికి పదవులిస్తే ఎలా అంటున్న నామన వర్గం - పట్టు సడలించని జ్యోతుల వర్గం - నేడు సీఎం సమక్షంలో భేటీ సాక్షి ప్రతినిధి, కాకినాడ : తెలుగుదేశం పార్టీలో రెండు పీఠాలు చిచ్చురేపుతున్నాయి. ఒకటి ఏడాదికిపైనే ఖాళీగా ఉంటే మరొకటి కావాలని ఖాళీ చేస్తున్నారు. ఈ రెండు పీఠాలు ఒకదానితో ఒకటి ముడిపడి ఉండటంతో నేతలు రెంగు గ్రూపులు కడుతున్నారు. ‘కడుపులో కత్తులు పెట్టుకుని కౌగలించుకున్న’ సామెత మాదిరిగా నేతల తీరు ఉండటంతో భర్తీ ప్రక్రియను ఏకాభిప్రాయంతో ముగింపు పలకలేక చేతులెత్తేశారు. పర్వత చిట్టిబాబు ఆకస్మిక మరణం తరువాత నుంచి పార్టీ జిల్లా అ«ధ్యక్ష పదవి ఖాళీగానే ఉంది. ఈ పీఠం భర్తీ చేయాలని పార్టీలో ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇంతలో జగ్గంపేట, ప్రత్తిపాడు ఎమ్మెల్యేలు జ్యోతుల నెహ్రూ, వరుపుల సుబ్బారావులు నమ్మి ఓటేసిన జనాన్ని గాలికొదిలేసి టీడీపీ గూటికి చేరడం, బాబు ఇచ్చిన హామీ కేబినెట్లో నెహ్రూకు చుక్కెదురవడం తెలిసిందే. నెహ్రూకు మంత్రి పదవి ఇవ్వకపోవడంతో తనయుడు, జెడ్పీటీసీ సభ్యుడు జ్యోతుల నవీన్కు చైర్మన్ ఇస్తారనే ప్రచారం అప్పటి నుంచి నడుస్తున్నదే. నవీన్ను చైర్మన్ను చేయాలంటే ఇప్పుడున్న చైర్మన్ నామన రాంబాబుకు ఉద్వాసన పలకాల్సిందే. నామనను చైర్మన్గా తప్పించి పార్టీ జిల్లా పగ్గాలు అప్పగించాలని గత కొంతకాలంగా పార్టీలో ఆలోచన చేస్తున్నారు. జతకలని మనసులు.... ఇదే విషయమై రెండు రోజుల కిందట కాకినాడలో జరిగిన పార్టీ సమన్వయ సమావేశంలో సైతం చర్చించినా ఎటువంటి నిర్ణయం తీసుకోకుండానే ముగించేశారు. వివాదరహితుడిగా పేరున్న నామనను జ్యోతుల కోసం తప్పించడం సహేతుకం కాదని జ్యోతుల వైరివర్గం బలమైన వాదన వినిపిస్తోంది. మొదటి నుంచీ పార్టీలో ఉన్నా ఇటీవలే తిరిగొచ్చిన వారికి పదవులు ఇస్తే పార్టీ కేడర్కు ఏమని సంకేతాలు పంపిస్తారని పలువురు అంతర్గత సంభాషణల్లో సీనయర్ల దృష్టికి తీసుకువెళ్లారని సమాచారం. రెండేళ్లు మాత్రమే మిగిలి ఉండగా ఇప్పుడు తప్పిస్తే తానేదో తప్పు చేసినట్టు, సమర్థంగా పనిచేయలేకపోయానని జనం ముద్రవేస్తారని మంత్రులు యనమల రామకృష్ణుడు, నిమ్మకాయల చినరాజప్ప వద్ద ఇటీవల నామన గోడు వెళ్లబోసుకున్నారని పార్టీ వర్గాల సమాచారం. మంత్రి పదవి దక్కని జ్యోతులకు టీటీడీ లేదా, కార్పొరేషన్ చైర్మన్ ఏదో ఒకటి ఇవ్వాలనే ప్రతిపాదన వచ్చింది. కానీ ఎంపీలు, ఎమ్మెల్యేలకు నామినేటెడ్ పదవులు ఇవ్వకూడదని విధానపరమైన నిర్ణయం తీసుకున్నట్టు సీఎం చంద్రబాబు తేల్చిచెప్పడం తెలిసిందే. రాజమహేంద్రవరం ఎంపీ మురళీమోహన్ టీటీడీ చైర్మన్ కోసం అభ్యర్థించిన సందర్భంలో బాబు ఈ విషయాన్ని స్పష్టం చేశారు. బాబు ప్రకటనతో నెహ్రూకు వస్తాదనుకున్న ఆ ఛాన్స్ కూడా లేదని తేలిపోయింది. ఇటువంటి తరుణంలో రాజకీయ వారసుడిగా నవీన్ను చైర్మన్ పీఠంపై కూర్చోబెట్టడం ద్వారా పార్టీలో ఒక స్థాయి కల్పించాలని నెహ్రూతోపాటు అతని వర్గీయులకు బలమైన కోరిక లేకపోలేదు. అందునా మెట్ట ప్రాంతంలో రాజకీయంగా తన తరువాత చక్రం తిప్పే నేతగా పైకి తీసుకురావాలని ఏ తండ్రికి మాత్రం ఉండదు. కానీ చిక్కల్లా ఆది నుంచి రాజకీయంగా వైరం కలిగిన మంత్రి యనమల వర్గీయులు అంతర్గతంగా ఇందుకు అడ్డుచక్రం వేస్తున్నారనే సమాచారమే జ్యోతుల వర్గంలో గుబులు రేపుతోంది. నెహ్రూకు ఎలాగూ నామినేటెడ్ అవకాశం లేదని తేలిపోవడంతో నవీన్కు జెడ్పీ చైర్మన్ ఇచ్చి, నామనకు నామినేటెడ్ పోస్టు ఇవ్వాలనే ప్రతిపాదన ఆది నుంచి ఉన్నదే. తన చైర్మన్ పీఠం అలానే ఉంచి ఆ నామినేటెడ్ పోస్టు ఏదో నవీన్కే ఇస్తే ఎవరికీ ఇబ్బంది కలగదని నామన పార్టీ సీనియర్ల ముందు చెప్పుకున్నారని, వారు కూడా ఇందుకు మొగ్గుచూపుతున్నారని తెలుస్తోంది. పీఠం కాపాడుకునే ప్రయత్నంలో నామన... తాజా పరిణామాల నేపథ్యంలో నామన తన పీఠాన్ని కాపాడుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. పార్టీ ఆవిర్భావం నుంచి దివంగత బాలయోగి, యనమలతో కలిసి ఉన్న పరిచయాలను ఈ సందర్భగా ఆయన వినియోగించుకుంటున్నట్టు కనిపిస్తోంది. నెహ్రూ అంటే పడని వర్గం ఎక్కడా బయటపడకుండా తెరవెనుక నామనకు మద్ధతు పలుకుతున్నారని సమాచారం. మరోపక్క జిల్లా పగ్గాల కోసం ఎప్పటి నుంచో రేసులో ఉన్న కొత్తపేట మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరరావు తన ప్రయత్నాల్లో తానున్నారు. పార్టీ పరంగా సీనియరే అయినా, పార్టీ వీడి బయటకు వెళ్లి తిరిగి రావడం బండారుకు మైనస్ అంటున్నారు. అలాగే కొత్తపేట నియోజకవర్గ ఇన్చార్జిగా వ్యవహరిస్తున్న పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో జిల్లా అంతటా పార్టీని ఎలా సమన్వయపరుస్తారనేది కూడా చర్చకు దారితీస్తోంది. బండారును కోనసీమ నుంచి మంత్రి చినరాజప్ప వర్గీయులు వ్యతిరేకిస్తున్నారంటున్నారు. అలా అనుకుంటే బండారు కంటే నియోజకవర్గ బాధ్యతలు లేని డీసీసీబీ చైర్మన్ వరుపుల రాజా, జగ్గంపేట నుంచి పోటీచేసి రెండుసార్లు కోట్ల రూపాయలు తగలేసుకుని ఓడిపోయిన జ్యోతుల చంటిబాబు, కోనసీమ నుంచి మాజీ మంత్రి దివంగత మెట్ల సత్యనారాయణరావు తనయుడు రమణబాబు పేర్లు విషయంలో కూడా పార్టీలో చర్చ జరుగుతోంది. ఈ విషయాలన్నింటిపైనా వీలునుబట్టి మంత్రులు యనమల, నిమ్మకాయల, శాసనమండలి డిప్యుటీ చైర్మన్ ఆర్ఎస్ తదితరులు మంగళవారం విజయవాడలో సీఎం చంద్రబాబుతో భేటీ కానున్నారు. ఆ సమయానికి జెడ్పీ చైర్మన్ నామనను కూడా అక్కడకు రావాలని పిలుపు వచ్చింది. ఆ భేటీ తరువాత జెడ్పీ చైర్మన్, జిల్లా పగ్గాలు విషయంపై కొంత స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. -
సీటు బెల్టు ధరిస్తేనే సురక్షితం
అర్బన్ జిల్లా ఎస్పీ బి.రాజకుమారి ఆల్కాట్తోట(రాజమహేంద్రవరం రూరల్) : ప్రస్తుతం సీటు బెల్టు ధరించకపోవడం వలన తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని, అందువల్ల వాహనదారులు తప్పనిసరిగా ధరించాలని రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా ఎస్పీ బి.రాజకుమారి పేర్కొన్నారు. రాష్ట్ర డీజీపీ ఎన్.సాంబశివరావు ఆదేశాల మేరకు శనివారం అర్బన్ జిల్లా పరిధిలోని జాతీయ రహదారి ముఖ్య కూడళ్లలో, నగరంలోని ట్రాఫిక్ సిగ్నల్స్ ఇతర ముఖ్య ప్రదేశాల్లో సీటుబెల్టు వాడకంపై అవగాహన కల్పించారు. మధ్యాహ్నం నాలుగు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు అర్బన్ ఎస్పీ రాజకుమారి ఆధ్వర్యంలో పోలీసు ఉన్నతాధికారులు, డీఎస్పీలు, ఇన్స్పెక్టర్లు, ఎస్సైలు, సిబ్బంది కారులో సీటు బెల్టు ధరించని వారికి అవగాహన కల్పించారు. మోరంపూడి జాతీయ రహదారి వద్ద సీటు బెల్టు ధరించిన వారికి తూర్పు మండల డీఎస్పీ రమేష్బాబు, ఇన్స్పెక్టర్ కనకారావులు గులాబీ పువ్వులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో 3,413 కార్లను ఆపి అవగాహన కల్పించారు. అర్బన్ జిల్లా అడిషనల్ సూపరింటెండెంట్ ఎం.రజనీకాంత్, ఆర్.గంగాధర్, డీఎస్పీలు, ఇన్స్పెక్టర్లు, ఎస్సైలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. రవాణా శాఖాధికారుల సైతం మోరంపూడి జాతీయరహదారి కూడలిలో రవాణాశాఖాధికారులు సీటు బెల్టుధరించడంపై అవగాహన కల్పించారు. మోటారు వెహికల్ ఇన్స్పెక్టర్లు, అసిస్టెంట్ మోటారు వెహికల్ ఇన్స్పెక్టర్లు కార్లను ఆపి సీటు బెల్టు ధరించాలని సూచించారు. -
పీఠం కదులుతోంది!
తెరపైకి జెడ్పీ చైర్మన్ మార్పు – పావులు కదుపుతున్న టీడీపీలోని ఓ వర్గం – స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సహకరించలేదని మరో వర్గం ఫిర్యాదు – జెడ్పీ పీఠంపై పలువురి గురి - అధికార పార్టీలో కొత్త ముసలం సాక్షి ప్రతినిధి, కర్నూలు: జిల్లా పరిషత్ చైర్మన్గిరి మరోసారి రచ్చకెక్కుతోంది. ఇప్పటికే చైర్మన్ పీఠం దక్కించుకునేందుకు ఎవరికి వారు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. గతంలో చేసుకున్న ఒప్పందం మేరకు చేరో రెండున్నర సంవత్సరాలు చైర్మన్గా ఉండాలనే అంశాన్ని ఓ వర్గం తెరపైకి తీసుకొచ్చింది. తాజాగా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమకు సహకరించలేదని నేరుగా ముఖ్యమంత్రికి ఫిర్యాదులు వెళ్లాయి. ఈ నేపథ్యంలో చైర్మన్గా ఆయన్ను తొలగించాలని అధికార పార్టీలోని మరో వర్గం కోరుతోంది. చైర్మన్ పీఠాన్ని దక్కించుకునేందుకు వైస్–చైర్మన్ పుష్పావతి విశ్వప్రయత్నాలు చేస్తుండగా.. తమకు ఎన్నికల్లో సహకరించనందుకు ఆయన్ను తొలగించాలని మరో వర్గం కోరుతోంది. ఈ ఇరువర్గాల టార్గెట్ కూడా జెడ్పీ చైర్మన్ కావడంతో ఆయన తొలగింపు లాంఛనమేనన్న చర్చ సాగుతోంది. అయితే, కేవలం పుష్పావతే కాకుండా.. పలువురు జెడ్పీటీసీలు కూడా రేసుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. అనంత మార్పిడి తర్వాత..! వాస్తవానికి కర్నూలు జెడ్పీ చైర్మన్ పీఠంపై టీడీపీలోని ఒక వర్గం ఎప్పటి నుంచో కన్నేసింది. ఇందులో భాగంగా అధికార పీఠాన్ని చెరో రెండున్నర సంవత్సరాల పాటు పంచుకుందామనే ఒప్పందం ఉందని కూడా ఈ వర్గం పేర్కొంటోంది. ఆ ప్రకారం తమకు ఇప్పటికే పీఠం దక్కాల్సి ఉందనేది వీరి వాదన. ఇందుకోసం ఒప్పందం అమలు చేయాలంటూ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి, ఎంపీ టీజీ వెంకటేష్, మాజీ మంత్రి కేఈ ప్రభాకర్లతో జిల్లాలోని ఎమ్మెల్యేలందరినీ ఈ వర్గం నేతలు కలిసి విన్నవిస్తున్నారు. తమకు చైర్మన్ పీఠం దక్కేందుకు సహకరించాలని కోరుతున్నారు. అయితే, ఇన్ని రోజులుగా ఈ వ్యవహారం అంతకు మించి ముందుకు కదల్లేదు. తాజాగా స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీకి సహకరించలేదనే ఫిర్యాదులు కూడా చైర్మన్పై ఉన్నాయి. ఈ నేపథ్యంలో మార్పు తప్పదనే ధీమా వైరివర్గంలో వ్యక్తమవుతోంది. అనంతపురం జిల్లాలో కూడా జెడ్పీ చైర్మన్ పీఠం మార్పు చేయనున్నారని.. ఆ ప్రక్రియ ముగిసిన వెంటనే కర్నూలు జిల్లాలోనూ మార్పు తప్పకుండా జరుగుతుందని ఈ వర్గం నొక్కిచెబుతోంది. అందని ఆహ్వానం తన పీఠానికి వచ్చిన ఇబ్బంది లేదని చైర్మన్ ధీమాగా చెబుతున్నప్పటికీ.. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల తర్వాత జరిగిన పరిణామాలను పరిశీలిస్తే చైర్మన్కు ఇబ్బందులు తప్పవని తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పీఠాన్ని గెలుచుకున్న తర్వాత జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఇన్చార్జీలతో పాటు ఎమ్మెల్సీగా గెలిచిన శిల్పా చక్రపాణి రెడ్డి కూడా వెళ్లారు. అయితే, ఈ కార్యక్రమానికి జెడ్పీ చైర్మన్కు కనీసం ఆహ్వానం కూడా అందలేదని తెలిసింది. జిల్లాలోని నేతలందరినీ పిలిచిన జిల్లా అధ్యక్షుడు శిల్పా చక్రపాణి రెడ్డి.. చైర్మన్ను ఉద్దేశపూర్వకంగానే విస్మరించారని సమాచారం. అంతేకాకుండా తనకు చైర్మన్ సహకరించలేదని కూడా నేరుగా ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో జెడ్పీ చైర్మన్ పీఠానికి ఎసరు తప్పదనే ప్రచారం అధికార పార్టీలో జరుగుతోంది. ఏదేమైనప్పటికీ జిల్లా జెడ్పీ చైర్మన్ పీఠం వ్యవహారం ఇప్పుడు అధికారపార్టీలో కొత్త వార్కు తెరలేపిందని చెప్పవచ్చు. -
అనిల్ అంబానీకి అంతర్జాతీయ గౌరవం
రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీ అంతర్జాతీయ గౌరవం దక్కింది. అమెరికాలోని అట్లాంటిక్ కౌన్సిల్ బోర్డు సభ్యుడిగా ఎంపిక అయ్యారు. వాషింగ్టన్ కేంద్రంగా పనిచేసే ప్రపంచ థింక్ ట్యాంక్ అట్లాంటా కౌన్సిల్ తన అంతర్జాతీయ సలహా బోర్డులో సభ్యుడిగా చేరాలని ఆహ్వానించింది. భారతదేశానికి ప్రముఖ వ్యాపారవేత్తను అనిల్ అంబానీని అట్లాంటిక్ కౌన్సిల్ లోకి తీసుకున్నట్టు అట్లాంటా కౌన్సిల్ మంగళవారం వెల్లడించింది. సౌత్ ఆసియాలో ముఖ్యంగా వేగంగా వృద్ధి చెందుతున్న భారత్ నుంచి అనిల్ అంబానీని ఎంపిక చేయడం సంతోషమని సంస్థ చైర్మన్ జాన్.ఎం. హంట్స్ మాన్ పేర్కొన్నారు. గ్లోబల్ కార్పొరేట్లను, రాజకీయ వేత్తలను అడ్వైజరీ బోర్డులోకి ఆహ్వానిస్తుంది అట్లాంటా కౌన్సిల్. ఈక్రమంలో న్యూస్ కార్పొరేషన్ చైర్మన్ రుపర్ట్ ముర్డోచ్, మాజీ స్పానిష్ ప్రధాన మంత్రి జోస్ మరియా అజ్నర్, ఎయిర్ బస్ సీఈవో థామస్ ఎండర్స్ , మాజీ ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి కెవిన్ రుద్ కూడా కౌన్సిల్లో చేరినట్టు అట్లాంటా కౌన్సిల్ య ఒక ప్రకటలో ప్రకటించింది. మరోవైపు అట్లాంటిక్ కౌన్సిల్ కి ఎంపిక కావడంపై అనిల్అంబానీ సంతోషం వ్యక్తం చేశారు. అమెరికా అగ్రగామి సంస్థ ప్రపంచ వ్యూహాత్మక వ్యవహారాల మీద అత్యంత ప్రభావవంతమైన మేధావుల అట్లాంటిక్ కౌన్సిల్ సలహా బోర్డులో చేరడం ఆనందదాయకమన్నారు. ప్రధాన మంత్రి మోదీ దార్శనికతకు ఆయన నాయకత్వంలో సాగుతున్నకృషికి ఇది స్పష్టమైన గుర్తింపు అని వ్యాఖ్యానించారు. -
వచ్చినట్లే వచ్చి పోయింది!
‘సీటొచ్చింది చేరిపొండి’ అని ఈమెయిల్స్ పంపింది కొలంబియా యూనివర్శిటీ. ఆ వెంటనే కొన్ని గంటల తర్వాత ... ‘అయ్యయ్యో.. సారీ, టెక్నికల్ మిస్టేక్ ఏదో జరిగింది. మీకు సీటు రాలేదు అని చెప్పడానికి చింతిస్తున్నాం’ అని 277 మంది విద్యార్థులకు అపాలజీ మెయిల్స్ పంపింది. కొలంబియాలో సీటంటే మామూలు సంగతేం కాదు. అదృష్టం ఇలా వచ్చి, అలా చేజారినందుకు ఎంత బాధపడిపోతుంటారో ఊహించిన యూనివర్శిటీ వైస్ డీన్ జూలీ కార్న్ఫెల్డ్... ‘కొలంబియా డీప్లీ అపాలజైజస్’ అని మెసేజ్ పంపారు. -
తెలుగుదేశంలో సంకుల సమరం
- అమాత్యుల ఓటు ‘బొడ్డు’కే - ‘హోం’పై సామాజిక వర్గం నిప్పులు - రేసులో చిక్కాల, గన్ని, మెట్ల స్వపక్షంలోనే విపక్షం ... సొంత గూట్లోనే పొగ ... తెలుగు తమ్ముళ్లలో కలకలం ... క్యాడర్లో అయోమయం. ఇదీ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక పెడుతున్న చిచ్చు. దీంతో తూర్పుగోదావరి జిల్లా టీడీపీలో ఇద్దరు మంత్రులతోపాటు ఎమ్మెల్యేల్లో అంతర్గత కుమ్ములాటలకు దారితీస్తోంది. ఒకే కుర్చీ కోసం పోటాపోటీ తయారైంది. సాక్షి ప్రతినిధి, కాకినాడ : జిల్లాలో ఖాళీ అయిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కోసం టీడీపీలో సంకుల సమరానికి తెరలేచింది. నామినేషన్ల గడువు దగ్గర పడేకొద్దీ పార్టీలో ఆశావహుల మధ్య పోరు తీవ్రమవుతోంది. ఈ ఎన్నికల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్, కార్పొరేషన్, నగర పంచాయతీ సభ్యులు ఓటర్లుగా ఉన్నారు. స్థానిక సంస్థల్లో మెజార్టీ టీడీపీకి ఉన్న నేపథ్యంలో గెలుపు సునాయాసమనే విశ్వాసంతో రేసులో ఉన్న వారి సంఖ్య చాంతాడును తలపిస్తోంది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర రామారావు పదవీ కాలం మే ఒకటో తేదీతో ముగియనుండటంతో ఆ స్థానానికి ఎన్నిక జరుగుతోంది. సిటింగ్ ఎమ్మెల్సీ భాస్కర రామారావు రెండోసారి బరిలో నిలుస్తున్నట్టు ఆయన అనుచరగణం ఇప్పటికే విస్తృతమైన ప్రచారం చేస్తోంది. మంగళవారం విజయవాడలో సీఎం చంద్రబాబుతో మాట్లాడేందుకు వెళ్లడం అందులో భాగమేనంటున్నారు. విజయవాడ వెళ్లి తిరిగి వస్తుండగానే ఆయన ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురవడం తెలిసిందే. రెండోసారి బరిలో నిలిచేందుకు భాస్క ర రామారావు ప్రయత్నాలపై ప్రత్యర్థి వర్గం నీళ్లు చల్లేం దుకు పావులుకదుపుతోంది. పార్టీని కాదని విడిచి వెళ్లిపోయి తిరిగొచ్చిన వారికి రెండోసారి అవకాశం ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. సిటింగ్ ఎమ్మెల్సీకి రాజకీయంగా బద్ధవిరోధి అయిన ప్రత్యర్థి వర్గానికి చెందిన అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, తండ్రి మాజీ ఎమ్మెల్యే మూలారెడ్డి వంటి నేతలు భాస్కర రామారావు వ్యతిరేకులందరినీ ఏకం చేస్తున్నారని పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది. అందుకు వ్యూహాత్మకంగానే కేబినెట్ విస్తరణలో అవకాశం లభిస్తుదంటున్న చంద్రబాబు తనయుడు లోకేష్ను ప్రతిపాదించారు. ఇక్కడ పార్టీకి మెజార్టీ ఓటింగ్ ఉండటాన్ని చూపించగా మొదట్లో బాబు కూడా సానుకూలత ప్రదర్శించారు. ఇంతలో ఎమ్మెల్యే, గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలు ఉండటంతో ఇక్కడ నుంచి పోటీ చేయాల్సిన అవసరం లేదనే అభిప్రాయానికి వచ్చారు. ఈ నేపథ్యంతోనే భాస్కర రామారావుకు తిరిగి అవకాశం కల్పించే విషయంలో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు గ్రీ¯ŒS సిగ్నల్ ఇచ్చారని ప్రచారం జరుగుతోంది. కాపుల వైపు చూపు... రాష్ట్ర స్థాయిలో జరుగుతున్న కాపు ఉద్యమంలో జిల్లా నుంచి ముద్రగడ పద్మనాభం క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న క్రమంలో ఈసారి ఆ సామాజిక వర్గానికి కేటాయించాలనే ప్రతిపాదన వచ్చింది. పార్టీలో సీనియర్ అయిన మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు లేదా, కోనసీమ కేంద్రం అమలాపురం నుంచి దివంగత మాజీ మంత్రి మెట్ల సత్యనారాయణరావు తనయుడు మెట్ల రమణబాబు పేర్లు ప్రముఖంగా ఆ సామాజికవర్గ నేతలు బాబు వద్ద పరిశీలనలోకి తీసుకువెళ్లారు. ఈ రెండు పేర్లు పరిగణనలోకి తీసుకోవాలని ఆ సామాజికవర్గానికి చెందిన ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అధినేత దృష్టికి తీసుకువెళ్లారంటున్నారు. వీరితో పాటు 24 ఏళ్లుగా పార్టీలో ఎటువంటి పదవులు ఆశించలేదంటూ తాళ్లరేవు మండలం మల్లవరానికి చెందిన దూళిపూడి బాబి యువత కోటాలో పరిగణనలోకి తీసుకోవాలని సీనియర్లను అభ్యర్థిస్తున్నారు. అయోమయంలో చిన రాజప్ప రమణబాబు, చిక్కాల విషయంలో మొదట సానుకూలత వ్యక్తం చేసిన చినరాజప్ప తాజా రాజకీయ సమీకరణల్లో భాస్కర రామారావు వైపే మొగ్గుచూపుతున్నారని సమాచారం. ప్రధానంగా రెండు కారణాలను ఇందుకు నేతలు విశ్లేషిస్తున్నారు. కాకినాడ ఎంపీ తోట నరసింహం, ఆర్థిక మంత్రి యనమల చాలాకాలంగా ఎడమొహం పెడమొహంగా ఉంటున్నారు. అటువంటి యనమలకు విరోధి అయిన ఎంపీ తోట ప్రతిపాదిస్తున్న అతని బావమరిది రమణబాబుకు సానుకూలంగా ఉంటే, భాస్కర రామారావుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన యనమలతో దూరం ఏర్పడుతుందని చినరాజప్ప మనసు మార్చుకున్నారంటున్నారు. రెండోది తన రాజకీయ భవిష్యత్తు ఒకప్పుడు పెద్దాపురం బొడ్డు భాస్కర రామారావుకు పెట్టనికోట. ఆ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న చినరాజప్ప 2019 ఎన్నికల్లో తిరిగి అక్కడి నుంచే అదృష్టాన్ని పరీక్షించుకోవాలనే నిర్ణయానికి వచ్చారు. ఇప్పుడు ఎమ్మెల్సీగా చేస్తే వచ్చే ఎన్నికల్లో పెద్దాపురంలో ‘బొడ్డు’ అడ్డు ఉండదనే ముందుచూపుతోనే చినరాజప్ప ప్లేటు ఫిరాయించారంటున్నారు. ఇది చినరాజప్ప రాజకీయ భవిష్యత్తుకు ఎంతవరకు ఉపకరిస్తుందో ఇప్పుడే అంచనాకు రావడం పొరపాటే అవుతుంది. కానీ జిల్లాలో పోలీసుల సాయంతో కాపు ఉద్యమంపై ఉక్కుపాదం మోపిన చినరాజప్పపై ఆ సామాజికవర్గం ఇప్పటికే ఆగ్రహంతో రగిలిపోతోంది. ఇప్పుడు తమ సామాజిక వర్గానికి వచ్చే అవకాశాన్ని కూడా తన రాజకీయ భవిష్యత్తు కోసం పణంగా పెడుతున్నారని టీడీపీలోని కాపు వర్గీయులు కూడా రాజప్పపై మండిపడుతున్నారు. పావులు కదుపుతున్న గన్ని... పార్టీలో సీనియర్ అయిన తనకు అవకాశం ఇవ్వాలని గన్ని కృష్ణ పట్టుబడుతున్నారు. రాజమహేంద్రవరంలో అనుచరులతో సమావేశమై రేసులో ఉన్న విషయాన్ని ఆయన స్పష్టం చేశారు. గత ఎన్నికల్లో రాజమహేంద్రవరం రూరల్, సిటీ కోసం ప్రయత్నించిన సందర్భంలో ఇచ్చిన హామీ ప్రకారం ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాలని కృష్ణ పట్టుబడుతూ తాడోపేడో తేల్చుకుంటారని గన్ని వర్గం పేర్కొంటోంది. గన్ని ఆశలపై రాజకీయ ప్రత్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి గండికొట్టే దిశగా పావులుకదుపుతున్నారని అనుమానపడుతున్నారు.‘గుడా’ చైర్మన్ కోసం దరఖాస్తు చేసుకున్న కృష్ణ ఎమ్మెల్సీ రేసులో కూడా ఉంటారా అని గోరంట్ల వర్గం ప్రశ్నిస్తోంది. ఇంకా మరి కొందరు... బ్రాహ్మణ కోటాలో డొక్కా నా«థ్బాబు, మత్స్యకార కోటాలో కాట్రేనికోన జెడ్పీటీసీ నాగిడి నాగేశ్వరరావు కూడా ఎమ్మెల్సీ ఆశిస్తున్నారు. ముమ్మిడివరం నియోజకవర్గ నేతలను వెంటబెట్టుకుని సీఎంను కలిసేందుకు నాగేశ్వరరావు వెళుతున్నారు. గురువారం ఉదయం 11 గంటలకు సీఎం అపాయింట్మెంట్ తీసుకున్నారు. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా చివరకు బొడ్డు, చిక్కాలలో ఒకరికి ఖాయమవుతుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బరిలో నిలిచే అభ్యర్థి ఎవరనేది పార్టీ అధినేత ఈ నెల 25న తేలుస్తారు. -
పొట్ట చెక్కలయ్యేలా...
యోగా అధిక బరువు ఉన్నవారికి మాత్రమే కాదు సరిపడా బరువు ఉన్నవారికి కూడా ఇబ్బందికరమైన సమస్య పొట్ట. శరీరంలో మరే ప్రాంతంలో ఉన్నా పర్లేదు కాని ఉదర భాగంలో పేరుకుపోయిన కొవ్వు మాత్రం మనిషి ఆకారాన్ని వికారంగా మార్చే అవకాశం ఉంది. అలా దర్జాగా పెరిగే పొట్ట... పొట్ట కొట్టే ఆసనాలు యోగాలో ఉన్నాయి. అవే ఈ వారం... ధనురాసనం స్టెప్–1 కుర్చీ పై నుంచి లేచి నిలబడి కుడికాలుని కుర్చీ కుడి హ్యాండిల్ కింద ఉన్న గ్యాప్లో నుంచి తీసుకెళ్లి, కుడి పాదం భూమి మీద ఉంచాలి. అలాగే ఎడమ పాదం కూడా భూమి మీద ఉంచి సీటును కుర్చీలో వీలైనంత వెనుకకు ఉంచి ఉదర భాగాన్ని కుర్చీ ముందువైపునకు అంచునకు గట్టిగా నొక్కుతూ చేతులు భూమి మీద సమాంతరంగా ఉంచాలి. వెనుక కాళ్లను స్ట్రెయిట్గా లేదా మడచి ఉంచవచ్చు. సరిగా బ్యాలెన్స్ చేయగలిగితే కేవలం పొట్ట భాగాన్ని కుర్చీలో, చేతులు పక్కలకి గాలిలో ఉంచి కాళ్ల వెనుక బాగా స్ట్రెచ్ చేస్తూ 3 లేదా 5 సాధారణ శ్వాసల వరకూ ఉండవచ్చు. శ్వాస వదులుతూ కాళ్లు రిలాక్స్ చేసి చేతులు భూమి మీద ఉంచి కొంచెం రిలాక్స్ అయిన తర్వాత మళ్లీ ఇదే విధంగా రిపీట్ చేయవచ్చు. ధనురాసనం స్టెప్–2 సీటును కుర్చీలో బాగా వెనుకకు నెట్టి (తొడ జాయింట్లు కుర్చీ అంచుకు దగ్గరగా ఉండేటట్టు) శ్వాస తీసుకుంటూ కాళ్లు రెండూ పైకి లేపి రెండు చేతులతో చీల మండలం పట్టుకునే ప్రయత్నం చేయాలి. 3 లేదా 5 సాధారణ శ్వాసల తర్వాత శ్వాస వదులుతూ చీల మండలంను వదిలిపెట్టి కాళ్లు రిలాక్స్ చేసి చేతులు రెండూ ఇంతకు ముందు ఫొటోలో చూపిన విధంగా భూమి మీద ఉంచి రిలాక్స్ కావాలి. ఉపయోగాలు: పొట్ట చుట్టూ ఎడిపోస్ టిస్యూలో ఉన్న కొవ్వు కరగడానికి, తొడ ప్రాంతంలో ఉన్న కొవ్వు తగ్గడానికి ఉపకరిస్తుంది. రుతు సమస్యలకు కిడ్నీలు సమర్ధవంతంగా పనిచేయడానికి ఉపయోగపడుతుంది. అర్ధ ఉష్ట్రాసన కుర్చీలో వజ్రాసనంలో కూర్చోవాలి. తర్వాత మోకాళ్ల మీద పైకి లేచి శరీరాన్ని వెనుకకు వాలుస్తూ కుడిచేత్తో వెనుక ఉన్న కుర్చీ హ్యాండిల్ని పట్టుకోవాలి. శ్వాస తీసుకుంటూ ఎడమ చేతిని పైకి స్ట్రెచ్ చేస్తూ పొట్ట భాగాన్ని వీలైనంత ముందుకు నెట్టాలి. తల పైకి ఎత్తి 3 లేదా 5 సాధారణ శ్వాసల తర్వాత శ్వాస వదులుతూ ఎడమ చేతిని పక్క నుంచి కిందకు సీటు భాగాన్ని తిరిగి మడమల మీదకు వజ్రాసన స్థితిలోకి రావాలి. అదే విధంగా మళ్లీ రెండో వైపు కూడా చేయాలి. జాగ్రత్తలు: స్పాండిలైటిస్, షోల్డర్ జాయింట్ లేదా ఫ్రోజెన్ షోల్డర్ వంటి సమస్యలు ఉన్నట్లయితే తలను పైకి ఎత్తకుండా స్ట్రయిట్గా ముందుకు చూస్తూ ఉండాలి. ఒకవేళ ఏదైనా గిడ్డీనెస్, తలతిరుగుతోంది అనిపించినట్టయితే అది లో బిపి వల్ల గాని లేదా లో షుగర్ లెవల్స్ వల్ల గాని జరగవచ్చు. అటువంటి పరిస్థితుల్లో కూడా తలను వెనుకకు వాల్చకొని ఉంచాలి. లేదా వెంటనే వెనక్కు వచ్చేయాలి. ఉష్ట్రాసన వజ్రాసనంలో నుంచి మోకాళ్ల మీదకి పైకి లేచి కొంచెం కొంచెం వెనుకకు వాలుతూ కుడిచేత్తో కుర్చీ కుడి హ్యాండిల్ని, ఎడమ చేత్తో ఎడమ హ్యాండిల్ని పట్టుకోవాలి. పొట్టను ముందుకు నెడుతూ, తలను వెనకకు వాల్చి, 3 లేదా 4 సాధారణ శ్వాసలు తీసుకున్న తర్వాత శ్వాస వదులుతూ వెనకకు రావాలి. జాగ్రత్తలు: ఒకవేళ సయాటికా సమస్య గాని లోయర్ బ్యాక్ ప్రాబ్లెం గాని ఉన్నట్లతతే మోకాళ్లు రెండూ వీలైనంత వరకూ దూరం ఉంచి చేయడం మంచిది. ఎన్లార్జ్డ్ థైరాయిడ్ ఉన్నవాళ్లు మరింత జాగ్రత్తగా చేయాలి. ఉపయోగాలు: పొట్టను బలంగా ముందుకు నెడుతూ ఉండడం వలన జీర్ణవ్యవస్థ, పునరుత్పత్తి వ్యవస్థ బాగా పనిచేయడానికి దోహదం చేస్తుంది. అన్ని రకాలైన వెన్నెముక సమస్యల నివారణకు చేయదగ్గ ఆసనం. మలబద్ధకాన్ని నివారిస్తుంది. భుజాల ప్రాంతం, ఛాతీ బాగా వ్యాచోచింపబడతాయి కాబట్టి శ్వాసకోస వ్యవస్థకు రక్త ప్రసరణ వ్యవస్థకు కార్డియో వాస్క్యులర్ వ్యవస్థకు, లింఫు గ్రంధులు బాగా పనిచేయడానికి ఉత్తమమైన ఆసనం. ఎ.ఎల్.వి కుమార్ ట్రెడిషనల్ యోగా ఫౌండేషన్ సమన్వయం: సత్యబాబు -
ఆసనాలపై ఆసనాలు
యోగా కూర్చోడానికి పనికి వచ్చే కుర్చీని ప్లాస్టిక్ ఆసనంగా పిలుచుకోవచ్చు. అంటే ఇక్కడ వేస్తున్న ఆసనాలు... మరో రకం ఆసనాలపై వేస్తున్నవనుకోవచ్చు. ఆసనంతో ఎన్నో ప్రయోజనాలు కదా. మరి ఆసనాలపై ఆసనాలు వేస్తే... ఆరోగ్యపరంగా ప్రయోజనాల మీద ప్రయోజనాలు చేకూరుతాయి. అవేమిటో తెలుసుకోండి. మార్జాలాసనం కుర్చీలను మ్యాట్పై కదలకుండా స్థిరంగా ఉంచాలి. రెండు మోకాళ్లను ఒకదాని తర్వాత ఒకటి కుర్చీమీదకు తీసుకురావాలి. అనంతరం శరీరాన్ని ముందుకు వంచుతూ రెండు చేతులనూ రెండవ కుర్చీ మీద ఉంచాలి. ఆసనంలో కుదురుకున్నాక నిదానంగా గాలి పీల్చుతూ నడుమును నిదానంగా లోపలకు నెడుతూ పిరుదల భాగాన్ని ముందుకు సాగదీస్తూ తలని పైకి ఎత్తాలి. ధ్యాసను నడుముపై ఉంచాలి. ఉష్ట్రాసనం ఇందులో రెండు రకాలుంటాయి. ఒకటి శరీరాన్ని ముందుకు వంచి చేసేది, రెండు వెనుకకు వంచి చేసేది. శరీరాన్ని ముందుకు వంచి... మార్జాలాసనంలోకి వెళ్లినట్టే ఈ ఆసనంలోకి కూడా వెళ్లాలి. తర్వాత నెమ్మదిగా గాలి వదులుతూ నడుమును పైకి ఎత్తాలి. పిరుదుల భాగాన్ని లోనికి నెడుతూ కంఠకూపస్థం లోనికి ఆనించాలి. ఒంటె మూపురంలా అనిపించే ఈ ఆసనంలో ఉన్నప్పుడు ధ్యాసని నడుము, గొంతు భాగంలో ఉంచాలి. ఉపయోగాలు: ఈ రెండింటినీ కలిపి సాధన చేయాల్సి ఉంటుంది. రోజువారీ జీవితంలో పనుల కారణంగా నడుము మీద పడే ఒత్తిడిని తొలగించేందుకు ఉపకరిస్తాయి. తద్వారా నడుం కుడి, ఎడమల మధ్య సమతౌల్యానికి, నడుము నొప్పి నివారణ, నడుము భాగం బలోపేతం అవుతుంది. తర్వాతి దశల్లో నడుము ఆధారంగా వేసే సంక్లిష్టమైన ఆసనాల సాధనను ఇవి సులభతరం చేస్తాయి. గొంతు సాగదీయడం, సంకోచింపజేయడం వల్ల థైరాయిడ్ గ్రంధి హార్మోన్స్ సమతుల్యానికి కారణమవుతాయి. ప్రసారిత మార్జాలాసనం మార్జాలసనంలోకి వెళ్లినట్టే ఈ ఆసనంలోకి కూడా వెళ్లాలి. తర్వాత రెండు చేతులనూ ముందు కుర్చీ మీద బలంగా పెట్టి ఉంచాలి. నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ కుడి కాలిని పైకి ఎత్తాలి. ఇప్పుడు నెమ్మదిగా కుడిచేతిని అదే విధంగా ఛాతీ, శరీరం మొత్తాన్ని కుడివైపునకు తిప్పాలి. వీలైనంత వరకూ కుడికాలు, శరీరం, తలని ఒకే వరుసలో ఉండేలా చూడాలి. చూపు కుడిచేతి కొనలను చూస్తూ ఉండాలి. ధ్యాసంతా నడుము, కటిభాగంపైనే ఉంచాలి. అలాగే ఉంచి కొన్ని శ్వాసలు తీసుకున్న తర్వాత నిదానంగా ఛాతీని ఎడమవైపు తిప్పుతూ కుడిచేతిని కిందకు దించిన తర్వాత కాలిని కూడా కిందకు తీసుకురావాలి. ఇలాగే ఎడమవైపున కూడా చేయాలి. ఉపయోగాలు: కటిభాగం వదులుగా మారడానికి, అక్కడ పేరుకుపోయిన టాక్సిన్స్ తొలగించడానికి శరీరంలోని దిగువ భాగాలకు రక్తసరఫరా మెరుగుపరచడానికి ఉపకరిస్తుంది. వజ్రాసనం కుర్చీలను ఎదురుగా ఉంచుకుని ముందుగా ఒక కుర్చీలో రెండు మోకాళ్లను ఉంచాలి. రెండు చేతులతో కుర్చీ హ్యాండిల్స్ పట్టుకుని నెమ్మదిగా సీటు భాగాన్ని కాలి మడమల మధ్య ఉంచాలి. రెండవ కుర్చీని సీటు భాగానికి సౌకర్యంగా ఉండేలా అంటే కాలి చీలమండలం దగ్గరగా ఉండేలా సరిచేసుకోవాలి. మోకాళ్ల నొప్పులు ఉన్నవారు మోకాళ్ల కింద టవల్గాని కుషన్గాని ఏర్పాటు చేసుకోవాలి. ధ్యాసంతా శరీరం వెనుక భాగంలో నడుము కింద నుంచి శరీర భాగాలపై ఉంచాలి. అలా కాసేపున్న తర్వాత రెండు చేతులతో కుర్చీ హ్యాండిల్ని పట్టుకుని సీటు భాగాన్ని పైకి లేపి మోకాళ్ల మీదకు రావాలి. ఉపయోగాలు: వెన్నెముకను నిటారుగా ఉంచుతుంది. జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. కాలి మడమలు, చీల మండలం... దగ్గర ఉన్న సమస్యలను నివారిస్తుంది. ఎ.ఎల్.వి కుమార్ ట్రెడిషనల్ యోగా ఫౌండేషన్ -
ఎమ్మెల్సీ సీటు కోసం.. టీడీపీలో కుమ్ములాట
► కొల్ల ఆశలకు నాయకుల గండి? ► ‘డబ్బు’న్న వారివైపే మొగ్గు! ► సీటు కోసం బగ్గు గాలం? ► కలిశెట్టి ఆశలు నెరవేరేనా? ► అచ్చెన్న, కళా చెరోవైపు పావులు ► అధిష్టానం ఎంపికపైనే ఉత్కంఠ ‘తమ్ముళ్లూ... తొలినుంచి పార్టీ జెండా మోస్తున్నవారెవ్వరో నాకు తెలుసు... నన్ను నమ్ముకున్నవారికి న్యాయం చేస్తా! నన్ను నమ్మండి తమ్ముళ్లూ...’ అంటూ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు జిల్లాకు వచ్చినప్పుడల్లా ఇచ్చిన హామీతో ఆ పార్టీలో పలువురు ఆశావహులు పెద్దల సభలో అడుగుపెట్టాలని కలలుగంటున్నారు! స్థానిక సంస్థల కోటా నుంచి ఎమ్మెల్సీగా ఉన్న పీరుకట్ల విశ్వప్రసాద్ పదవీకాలం మరో నెలలో ముగియనుంది. ఆ సీటు కోసం ఇంకా నోటిఫికేషన్ రాకముందే అధికార పార్టీలో పోటీ మొదలైంది. ఎలాగైనా సరే ఈ సీటు దక్కించుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. జిల్లాలో రెండు గ్రూపులకు నాయకత్వం వహిస్తున్న మంత్రి అచ్చెన్నాయుడు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కళావెంకటరావులను ప్రసన్నం చేసుకొనే పనిలో తలమునకలై ఉన్నారు. అయితే తమకు అనుకూలమైనవారిని, అదీ భవిష్యత్తులో తమ రాజకీయ అవసరాలకు ఉపయోగపడేవారిని ఆ సీటులో కూర్చోబెట్టేందుకు ఇరువురు నాయకులు కూడా తమదైన శైలిలో పావులు కదుపుతున్నారని ఆ పార్టీవర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. గతానుభవాల నేపథ్యంలో ఏదిఏమైనా ‘డబ్బు’న్నవారివైపే అధిష్టానం మొగ్గు చూపిస్తుందనే అనుమానాలూ లేకపోలేదు. ఇదే జరిగితే సుదీర్ఘకాలంగా ఎమ్మెల్సీ కావాలని కోరుకుంటున్నవారి ఆశలపై నీళ్లు చల్లినట్లే! సాక్షి ప్రతినిధి శ్రీకాకుళం: ఎమ్మెల్సీ సీటు కోసం అధికార పార్టీలో గత దఫాలో వినిపించిన పేర్లే మరోసారి తెరపైకి వచ్చాయి. పార్టీ అధికారంలో ఉండటం, ప్రతిపక్ష పార్టీ నుంచి కొంతమంది ఎంపీటీసీలు, జడ్పీటీసీ సభ్యులను రకరకాలుగా ప్రలోభపెట్టి లాక్కొన్న నేపథ్యంలో సీటు వస్తే గెలుపు ఖాయమనే ధీమా టీడీపీ వారిలో కనిపిస్తోంది. దీంతో ఏ రకంగానైనా సరే సీటు దక్కించుకోవాలని ఎవ్వరికివారే విశ్వప్రయత్నాలు అప్పుడే ప్రారంభించేశారు. గత వారం శ్రీకాకుళంలో జరిగిన టీడీపీ కార్యవర్గ సమావేశంలో కొంతమంది పేర్లు పరిశీలనలోకి వచ్చాయి. సీనియర్ నాయకుడు, సంతకవిటి మండలంలో నాలుగుసార్లు ఎంపీపీ పదవి నిర్వహించిన కొల్ల అప్పలనాయుడు ఈ సీటు రేసులో ముందున్నారు. అలాగే మరో సీనియర్ నేత, నరసన్నపేట మాజీ ఎమ్మెల్యే బగ్గు లక్ష్మణరావు తనదైన శైలిలో చక్రం తిప్పుతున్నారు. కలిశెట్టి అప్పలనాయుడు, చౌదరి నారాయణమూర్తి (బాబ్జీ), ఎల్ఎల్ నాయుడు, నడుకుదిటి ఈశ్వరరావుల పేర్లు వినిపిస్తున్నాయి. ఈ వేడిని తగ్గించడం కోసం మందసకు చెందిన జుత్తు నీలకంఠం, కోటబొమ్మాళికి చెందిన బోయిన గోవిందరాజులు, డీసీసీబీ మాజీ చైర్మన్ సింతు సుధాకర్, దివంగత నాయకుడు గొర్లె హరిబాబునాయుడు భార్య లలితకుమారి పేర్లను వ్యూహాత్మకంగా తెరపైకి తెస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇక జిల్లా టీడీపీలో ఎస్సీ సామాజిక వర్గానికి తగిన ప్రాధాన్యం ఇవ్వట్లేదనే ఫిర్యాదులున్న నేపథ్యంలో ఈసారి ఎమ్మెల్సీ సీటు ఆ సామాజికవర్గానికి కేటాయించాలనే వాదనలు మొదలయ్యాయి. దీంతో ఎస్వీ రమణమాదిగ తదితరులు ఆశలు పెంచుకుంటున్నారు. ఎవ్వరి మాట నెగ్గేనో? జిల్లా టీడీపీలో ఆధిపత్య పోరులో ఇప్పటివరకూ అచ్చెన్న మాటే నెగ్గుతూ వచ్చింది. అయితే చిన్నబాబు ప్రోద్భలంతో కళావెంకటరావు జిల్లాపై తన పెత్తనాన్ని ఇప్పుడిప్పుడే పెంచుతున్నారు. దీంతో ఎమ్మెల్సీ సీటుకు అభ్యర్థి ఎంపికపై ఎవ్వరి మాట నెగ్గుతుందోనని పార్టీలో సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే కొల్ల అప్పలనాయుడికి వీరిద్దరి నుంచి సహకారం లభించే పరిస్థితి కనిపించట్లేదు. కొల్ల పేరు గతంలో జడ్పీ చెర్మన్, ఎమ్మెల్సీ పదవుల కోసం పరిశీలనలోకి వచ్చింది. ఆఖరి నిమిషంలో చాన్స్ దక్కలేదు. వచ్చేసారి ఎమ్మెల్సీ సీటు తప్పకుండా ఇస్తామని ఆశచూపించి గత శాసనసభ ఎన్నికలలో ఆయన సేవలను వాడుకున్నారు. కళావెంకటరావు టీడీపీ నుంచి ప్రజారాజ్యంలోకి వెళ్లిపోయినప్పుడు రాజాం ప్రాంతంలో పార్టీని నిలబెట్టడంలో కొల్ల కీలక పాత్ర పోషించారు. కళా మళ్లీ తిరిగి టీడీపీలోకి రావడం, ఏకంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా ఆయన వ్యవహరిస్తున్న నేపథ్యంలో కొల్ల ఆశలు గల్లంతయ్యే అవకాశం ఉందనే వాదన పార్టీలో వినిపిస్తోంది. ఎమ్మెల్సీని చేస్తానంటూ గతంలో కొల్లకు దివంగత నాయకుడు ఎర్రన్నాయుడు ఇచ్చిన మాటను అతని సోదరుడు అచ్చెన్నాయుడు నెరవేర్చలేకపోయాడనే నిందను ఆపాదించేందుకు కళావర్గానికి ఇదొక మంచి అవకాశమనే గుసగుసలు వినిపిస్తున్నాయి. బగ్గు వైపే అచ్చెన్న మొగ్గు! ఒకవేళ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ జరిగితే టెక్కలి నియోజకవర్గంలోకి సారవకోట, పోలాకి మండలాలు కలిసే అవకాశం ఉందనే ప్రచారం జరగడం, అదే జరిగితే అక్కడి గట్టి పట్టువున్న మాజీ ఎమ్మెల్యే బగ్గు లక్ష్మణరావు నుంచి 2019 సాధారణ ఎన్నికలలో తనకు సీటు విషయంలో పోటీ లేకుండా చూసుకోవడమనే వ్యూహంతో అచ్చెన్న పావులు కదుపుతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అలాగే ఆర్థికంగానూ బలమైన బగ్గును ఎమ్మెల్సీ చేస్తే తనకు అన్నివిధాలా ఉపయోగం ఉంటుందని అచ్చెన్న ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ‘పార్టీ మారి తిరిగి రావడం ఎమ్మెల్సీకి అర్హతా?’ అని పలాస ఎమ్మెల్యే, సీనియర్ నాయకుడు జీఎస్ఎస్ శివాజీ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. పార్టీలో కరివేపాకులేనా? పార్టీలో ఎర్రన్నాయుడికి అనుచరుడిగా ఎదిగిన కలిశెట్టి అప్పలనాయుడు... పార్టీకి తాను చేసిన సేవల దృష్ట్యా తనకు ఎమ్మెల్సీ సీటు ఇవ్వాలని కోరుతున్నాడు. గతంలో పాతపట్నం సీటు పోటీ నుంచి కలిశెట్టిని తప్పించడానికి ఎమ్మెల్సీ సీటు ఆశ చూపించారనే ప్రచారం కూడా ఉంది. ఇప్పుడు ఆ అంశాలతోనే నేరుగా అధిష్టానం దృష్టిలో పడేందుకు ఆయన తాపత్రయపడుతున్నారు. గతంలో మూడు పర్యాయాలు పార్టీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన చౌదరి బాబ్జీ, అలాగే బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ ఎల్ఎల్ నాయుడు పేర్లను కేవలం వారి సామాజికవర్గ కోణంలో మాత్రమే తెరపైకి తెచ్చారనే వాదన ఉంది. అంత రాజకీయ అనుభవం లేకపోయినా కేవలం గత ఎన్నికలలో కళా వెంకటరావుకు అన్ని రకాలుగా సాయపడిన నడుకుదిటి ఈశ్వరరావు పేరును జాబితాలో చేర్చారు. ఇక సింతు సుధాకర్, జుత్తు నీలకంఠం, బోయిన గోవిందరాజులు జాబితాలో పేరుకే పరిమితమనే గుసగుసలు వినిపిస్తున్నాయి. -
భగ్గుమంటున్న అబ్బాయి, బాబాయ్ల వివాదం
సమాజ్వాద్ అధికార పార్టీ ఇంట నెలకొన్న రాజకీయ సంక్షోభం, సీట్ల పంపకం విషయంలో మళ్లీ తారాస్థాయికి వెళ్తోంది. టిక్కెట్ల పంపిణీల్లో బాబాయి శివ్పాల్ యాదవ్, అబ్బాయి అఖిలేష్ యాదవ్ మధ్య విభేదాలు ముదురుతున్నాయి. టిక్కెట్ల విషయంలో బెంగ పడొద్దని ఎమ్మెల్యేలకు భరోసా ఇచ్చిన అఖిలేష్, 403 మంది అభ్యర్థులతో కూడిన సొంత జాబితాను తయారుచేసి బాబాయి శివ్పాల్కు పంపించారు. అయితే ఆ జాబితాపై శివపాల్ అసంతృప్తి వ్యక్తంచేసినట్టు తెలుస్తోంది. క్రమశిక్షణ ఉల్లంఘించిన వారికి టిక్కెట్ ఇచ్చే ప్రసక్తే లేదని శివ్ పాల్ తేల్చిచెప్పినట్టు రిపోర్టులు పేర్కొన్నాయి. ఈ జాబితాలోనే బుందేల్ ఖండ్లోని రెండు స్థానాల నుంచి తాను పోటీచేయనున్నట్టు అఖిలేష్ తెలిపారు. బబినా, మహోబ నుంచే అఖిలేష్ పోటీచేస్తున్నారని రిపోర్టులు తెలిపాయి. ఉత్తరప్రదేశ్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుగబోతున్న అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల పంపక బాధ్యతలను రాష్ట్ర పార్టీ చీఫ్ శివ్పాల్ నిర్వహిస్తున్నారు. ఈ పంపక విషయంలో తనకు ఇష్టంలేని వారికి, క్రిమినల్స్కు బాబాయ్ టిక్కెట్లు ఇస్తారని అఖిలేష్ గుర్రుగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తనకిష్టమైన వారితో సొంత జాబితా సిద్ధం చేసి శివ్పాల్కు పంపించారు. కానీ అఖిలేష్ పంపిన జాబితాపై శివ్పాల్ అసంతృప్తి వ్యక్తంచేయడం మళ్లీ వీరిద్దరి మధ్య తీవ్రస్థాయిలో చిచ్చు రేపుతోంది. -
జిప్మర్లో ‘అనంత’ విద్యార్థికి సీటు
జేఎన్టీయూ : జవహర్లాల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పోస్టుగ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (జిప్మర్)లో అనంతపురం నగరానికి చెందిన తప్పెట తేజస్విణి మెడికల్ సీటు సాధించింది. జిప్మర్ జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలో 134వ ర్యాంకు (99.90 శాతం) సాధించింది. ఫలితాలు గత నెలలో విడుదలయ్యాయి. జాతీయ స్థాయిలో అత్యుత్తమ నాణ్యత ప్రమాణాలు పాటిస్తున్న మెడికల్ సంస్థ జిప్మర్ ఒకటి. పాండిచ్చేరిలో ప్రెంచ్ ప్రభుత్వం 1823లో ఈ సంస్థను ఏర్పాటు చేసింది. మెడిసిన్లో ర్యాంకు తెచ్చుకోవడమే అరుదైన విషయం. మెడిసిన్ ప్రవేశ పరీక్షలో అనంతపురానికి చెందిన తప్పెట తేజస్విణి అత్యుత్తమ ప్రతిభతో మెరుగైన ర్యాంకు సాధించింది. అరుదైన రికార్డును ఆమె కైవసం చేసుకుంది. గతంలో ఏపీ ఎంసెట్–2016 ఫలితాల్లో తప్పెట తేజస్విణి మెడిసిన్లో రాష్ట్ర స్థాయి 29వ ర్యాంకు సాధించింది. ఎస్వీయూ రీజియన్లో 4వ ర్యాంకు (లోకల్ ర్యాంకు ) దక్కింది. ఏపీ ఎంసెట్లో 160 మార్కులకు గాను 147 మార్కులు సాధించి అత్యుత్తమ ర్యాంకు సాధించింది. తెలంగాణ ఎంసెట్–1లో మెడిసిన్లో 16 వర్యాంకు, తెలంగాణ ఎంసెట్–2లో మెడిసిన్లో 7 వ ర్యాంకు, తాజాగా తెలంగాణ ఎంసెట్–3లో మూడో ర్యాంకు (160కి 151 మార్కులు) సాధించారు. జిప్మర్లో 134వ ర్యాంకు సాధించి, అడ్మిషన్ పొందింది. -
ఆ కారు ఓన్లీ ఫర్ లేడీస్..
చిన్నగా... పర్ఫుల్ కలర్లో కనిపించే ఈ కారు చూడానికి భళే ఉందికదా! ఎప్పుడూ మగవారికోసమే కార్లు, బైక్స్ ఏం తయారుచేస్తాంలే అని భావించిన ఓ రెండు కంపెనీలు జతకట్టి మహిళల కోసం ప్రత్యేకంగా ఓ కారును డిజైన్ చేశాయి. స్పానిస్ కారు తయారీదారి సీట్, లేడిస్ లైఫ్ స్టైల్ పబ్లికేషన్ కాస్మోపాలిటన్ కలిసి కేవలం మహిళల కోసం ఓ కొత్త కారు రూపొందించి లండన్ కాస్మోపాలిటన్స్ ఫ్యాస్ఫెస్ట్ ఈవెంట్లో లాంచ్ చేశాయి. మహిళలు ఎలాగైతే మేకప్ చేసుకుంటారో అదేమాదిరి కారును డిజైన్ చేశారు. జ్యువెల్ ఎఫెక్ట్ రిమ్స్, హ్యాండ్ బ్యాగ్ హుక్, ఐలైనర్ హెడ్లైట్స్ తో సీట్ మి కారు మార్కెట్లోకి వచ్చింది. సీట్ కారు తయారీదారి, లేడీస్ మ్యాగజైన్ రెండేళ్ల రీసెర్చ్, డెవలప్మెంట్తో మహిళల అభిరుచులకు అనుగుణంగా దీన్ని ఎక్స్క్లూజివ్గా డిజైన్ చేసినట్టు కంపెనీ చెబుతోంది. అయితే ఓ వైపు ఈ కారు రూపొందించినందుకు కృతజ్క్షతలు చెబుతూనే మరోవైపు సెటైర్లు కూడా వేస్తున్నారు. తమ సుతిమెత్తని చేతుల మాదిరి స్టీరింగ్ వీల్ చిన్నదిగా ఉందా అంటూ ట్వీట్లు వస్తున్నాయి. మహిళల డిజైన్తో ఈ కారు రూపొందించడం గుడ్ ఐడియానా అంటూ ట్వీట్ చేస్తున్నారు. ఈ ట్వీట్లపై స్పందించిన సీట్ కారు తయారీదారు ఈ కారు కేవలం కాస్మోపాలిటన్ రీడర్స్ కోసమే తయారుచేసినట్టు చెబుతోంది. కాస్మోపాలిటన్ రీడర్స్, ఎడిటర్స్, మ్యాగజైన్ క్రియేటివ్ టీమ్ సహకారంతో కేవలం పరిమిత టార్గెట్తోనే వచ్చినట్టు పేర్కొంది. మహిళల అందరికోసమేమీ ఈ కారు తయారుచేయలేదని పేర్కొంది. కానీ లాంచ్ చేసిన కొన్నిరోజులకే ఈ బ్రాండెడ్ న్యూ కారుపై ఎదురుదెబ్బ తగలడం గమనార్హం. Wow, thanks @SEAT_cars_UK & @Cosmopolitan for designing a car just for women. Is the steering wheel small for my delicate hands?! #its2016!! How did ANYONE think making a #carforwomen would be a good idea? #ThisisMii https://t.co/yQ6eRrAe9G — Bethany Hill (@andbethanysays) 21 September 2016 — Hannah Walker (@bananhan) 16 September 2016 -
పీజీ రెండవ దశ సీట్ల కేటాయింపు
కమాన్చౌరస్తా : కాకతీయ, శాతవాహన యూనివర్సిటీల పరిధిలో పీజీ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలు పొందేందుకు రెండవ దశ సీట్లను కేటాయించడం శనివారం జరిగిందని కాకతీయ యూనివర్సీటీ ప్రవేశాల విభాగం అధికారులు డాక్టర్ వెంకయ్య, లక్ష్మీనాయక్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సీటు పొందిన విద్యార్థులు కోర్సు, సై ్లడింగ్ ఫీజును స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చలాన ద్వారా కానీ, నెట్బ్యాంకింగ్ ద్వారా చెల్లించవచ్చని సూచించారు. సీటు అలాట్మెంట్ను డౌన్లోడ్ చేసుకొని సంబంధిత కళాశాలల్లో రిపోర్టు చేయాలని లేనిచో ప్రవేశాలు రద్దవుతాయని వెల్లడించారు. ప్రత్యేక విభాగాలు ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ, స్పోర్ట్స్, ఇతర విభాగాలకు సర్టిపికేట్ల పరిశీలన, సీట్ల కేటాయింపు ఈ నెల 8న కాకతీయ ప్రవేశాల విభాగంలో ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతందని తెలిపారు. చివరి దశ సీట్లను ఈనెల 9న కేటాయిస్తామని తెలిపారు. వెబ్ ఆప్షన్లు 9 నుంచి 11 తేది వరకు ఉంటాయని పేర్కొన్నారు. తుది దశలో సీటు పొందిన విద్యార్థులు తప్పనిసరిగా ఆయా కళాశాలల్లో ప్రవేశాలు తీసుకోవాలని లేనిచో వారి అడ్మిషన్లు రద్దు అవుతాయని సూచించారు. -
డైట్ సీట్ల భర్తీకి కౌన్సెలింగ్
అంగలూరు (గుడ్లవల్లేరు) : జిల్లాలోని డైట్ సీట్ల భర్తీకి 223 దరఖాస్తులను స్వీకరించి నట్లు అంగలూరు ప్రభుత్వ జిల్లా ఉపాధ్యాయ శిక్షణా సంస్థ(డైట్) ప్రిన్సిపాల్ జి. వెంకటేశ్వరరావు తెలిపారు. ఆదివారం నుంచి డైట్లో జిల్లాకు సంబంధించిన సీట్లకు ఆయన కౌన్సిలింగ్ చేపట్టారు. జిల్లాలోని 32డైట్లు ఉన్నాయన్నారు. వాటిలోని 2,750సీట్లలో తొలి విడతగా 1,458 సీట్లను కేటాయించారని తెలిపారు. మేనేజ్మెంట్ సీట్లు 530 ఉన్నాయని చెప్పారు. ఆన్లైన్లో ఏ అభ్యర్థులకు ఏ సమయం కేటాయిస్తే ఆ సమయంలోనే కౌన్సిలింగ్కు రావాలని సూచించారు. వచ్చేటపుడు, ప్రొవిజినల్ ఎలాట్మెంట్ లెటర్, ఆన్లైన్ అప్లికేషన్ లెటర్, డైట్సెట్ ర్యాంకు కార్డు, 10వ తరగతి మార్క్స్ లిస్ట్, ఇంటర్మీడియట్ మార్క్స్ లిస్ట్, ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్(టీసీ), 4నుంచి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్లు , కుల ధృవీకరణ సర్టిఫికెట్(మీ–సేవా ద్వారా తీసుకున్నవి), ఆదాయ ధృవీకరణ సర్టిఫికెట్ లేదా రేష్కార్డు జిరాక్స్(రేషన్కార్డు అయితే వెరిఫికేషన్ ఆఫీసర్కు ఒరిజినల్ కార్డు చూపించాలి), ³హెచ్సీ, స్పోర్ట్, ఆర్మీ కోటా అభ్యర్థులు సంబంధిత సర్టిఫికెట్లు ఈ కింది ధృవపత్రాలను తీసుకురావాలని కోరారు. -
డిగ్రీ కళాశాలల్లో సగం సీట్లు ఖాళీ!
కేయూ పరిధిలో ముగిసిన మూడో దశ దరఖాస్తు గడువు రెండు దశల్లో కలిపి 43,578 మందికి ప్రవేశాలు రేపు సీట్ల కేటాయింపు ఇప్పటివరకు 26 కళాశాలల్లో ప్రవేశాలే లేవు.. కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల డిగ్రీ కళాశాలల్లో ఈ ఏడాది సగానికి పైగా సీట్లు ఖాళీగానే ఉండనున్నాయి. యూనివర్సిటీ పరిధిలో 1,28,080 సీట్లు ఉన్నాయి. ఇప్పటివరకు మూడు దశల్లో ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించారు. మొదటి దశలో 41,909, రెండో దశలో 17,563 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా.. పలువురు వెబ్ ఆప్షన్లు ఇవ్వలేదు. రెండు దశల్లో కలిపి మొత్తంగా 43,578 మంది విద్యార్థులు వివిధ కళాశాలల్లో ప్రవేశాలు పొందారు. కాగా, యూనివర్సటీ పరిధిలోని 26 డిగ్రీ కళాశాలల్లో అసలు ఒక్కరు కూడా చేరకపోవడం గమనార్హం. మరో ఎనిమిది కళాశాలల్లో పది మంది లోపు విద్యార్థులే చేరారు. దీంతో ఆయా కళాశాలలను మూసివేయక తప్పదనే భావన నెలకొంది. మూడో దశలో 4,943 దరఖాస్తులు యూనివర్సిటీ పరిధిలోని పెద్దసంఖ్యలో కళాశాలల్లో సీట్లు ఖాళీగా ఉండడంతో మళ్లీ మూడో దశలో దరఖాస్తులు స్వీకరించారు. గతంలో దరఖాస్తు చేసుకుని వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోని వారు, మొదటి దశలో సీట్లు రాని వారు, కొందరు కళాశాలల్లో చేరినా మార్పు కోసం మళ్లీ వెబ్ ఆప్షన్లు ఇచ్చుకునేందుకు ఈ దశలో అవకాశం కల్పించారు. అయితే, మూడో దశలో ఆన్లైన్ దరఖాస్తు గడువు శనివారం ముగియగా మొత్తం 4,943 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 492మంది ఇతర రాష్ట్రాల విద్యార్థులు కూడా ఉన్నారు. అయితే, ఈ దశలో దరఖాస్తు చేసుకున్న వారికి, గతంలో దరఖాస్తులు చేసి ఇప్పుడు వెబ్ఆఫ్షన్లు ఇచ్చుకున్న వారికి, కళాశాలల మార్పునకు ఆప్షన్లు ఇచ్చుకున్న వారికి మంగళవారం సీట్ల కేటాయింపు జరగనుంది. ఆయా విద్యార్థులు 4వ తేదీన కళాశాలల్లో చేరా>ల్సి ఉంటుంది. మూడో దశ అడ్మిషన్ల ప్రక్రియ ముగిసే నాటికి మొత్తంగా యూనివర్సిటీ పరిధిలో 1,28,080 సీట్లలో 50శాతం సీట్లు కూడా భర్తీ అవుతాయా అనేది అనుమానంగా ఉంది. 50శాతంలోపే సీట్లు భర్తీ అవుతాయని భావిస్తున్నారు. ఇప్పటివరకు జరిగిన అడ్మిషన్లలో యూనివర్సిటీ పరిధిలో కొన్ని కళాశాలల్లో సీట్లు ఎక్కువ శాతం మేర భర్తీ కాగా మరికొన్ని కళాశాలల్లో అంతంత మాత్రంగానే సీట్లు నిండాయి. ఇక కొన్ని రకాల కాంబినేషన్ కోర్సులకైతే అసలే ఆదరణ లేనట్లు సమాచారం. అలాగే, పలు ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో తక్కువ సంఖ్యలో విద్యార్థులు చేరినట్లు తెలుస్తోంది. మూడో దశ సీట్ల కేటాయింపు, విద్యార్థుల చేరిక ప్రక్రియ పూర్తయితే తప్ప ఎన్ని సీట్లు మిగిలిపోతాయనే అంశం తేలనుంది. కాగా, 4వ తేదీ నుంచి డిగ్రీ మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభం కానున్నాయి.