గ్యాస్‌ సిలిండర్‌ పేలి పెంకుటిల్లు దగ్ధం | gas cilinder house blast | Sakshi
Sakshi News home page

గ్యాస్‌ సిలిండర్‌ పేలి పెంకుటిల్లు దగ్ధం

Sep 4 2016 12:15 AM | Updated on Sep 4 2017 12:09 PM

ప్రమాదవశాత్తు గ్యాస్‌ సిలిండర్‌ పేలి పెంకుటిల్లు దగ్ధమైన సంఘటన మండలంలోని మహ్మద్‌గౌస్‌పల్లిలో శుక్రవారం రాత్రి చో టుచేసుకుంది. దండబోయిన కుమారస్వామి మహ్మద్‌గౌస్‌పల్లిలో క్రషర్‌లో ఆపరేటర్‌గా పనిచేస్తూ గ్రామంలోఓ కిరాయి ఇంట్లో ఉంటున్నాడు. శుక్రవారం రాత్రి భార్య, కూతురు ఇంట్లో వంట చేస్తున్న క్రమంలో గ్యాస్‌లీకేజీ వాసన వచ్చి ఒక్క సారిగా మంటలు వచ్చాయి.

ములుగు : ప్రమాదవశాత్తు గ్యాస్‌ సిలిండర్‌ పేలి పెంకుటిల్లు దగ్ధమైన సంఘటన మండలంలోని మహ్మద్‌గౌస్‌పల్లిలో శుక్రవారం రాత్రి చో టుచేసుకుంది. దండబోయిన కుమారస్వామి మహ్మద్‌గౌస్‌పల్లిలో క్రషర్‌లో ఆపరేటర్‌గా పనిచేస్తూ గ్రామంలోఓ కిరాయి ఇంట్లో ఉంటున్నాడు. శుక్రవారం రాత్రి భార్య, కూతురు ఇంట్లో వంట చేస్తున్న క్రమంలో గ్యాస్‌లీకేజీ వాసన వచ్చి ఒక్క సారిగా మంటలు వచ్చాయి. ఇది గమనించి వారు బయటికి పరుగుతీశారు. క్షణాల సమయంలోనే ఇంట్లో మంటలు వ్యాపించి కూలిపోయింది. రూ.1.25 లక్షలతో పాటు ఇంట్లో ఉన్న కుట్టు మిషన్, ఫర్నిచర్, బియ్యం, ఇతర సామాగ్రి దగ ్ధమైంది. విషయం తెలుసుకున్న సర్పంచ్‌ పాలెపు సరళశ్రీనివాస్‌ రూ.3వేల విలువ గల బియ్యం, ఇతర సామాగ్రిని  ఎస్సై మల్లేశ్‌యాదవ్‌ చేతుల మీదు గా ఆర్ధిక సహాయంగా అందించారు. నిరుపేద కుటుంబానికి చెందిన కుమారస్వామిని దాతలు ఆదుకోవాలని సర్పంచ్‌ కోరారు. టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీతక్క కుమారస్వామి కుటుంబానికి రూ.2వేల ఆర్థిక సాయం అందించారు. ఆమె వెంట మండల అ««దl్యక్షుడు పల్లె జయపాల్‌రెడ్డి, నాయకులు ఎర్రబెల్లి సదానందం, తిప్పారపు కిషన్, వడ్లకొండ శ్రీను, వంగ రవియాదవ్, కోట శివయ్య, దేవేందర్, బొమ్మకంటి రమేశ్‌ ఉన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement