వైభవం.. సామూహిక వరలక్ష్మీవ్రతం | grandly celebrate varalakshmi vratham | Sakshi
Sakshi News home page

వైభవం.. సామూహిక వరలక్ష్మీవ్రతం

Published Sat, Aug 27 2016 12:28 AM | Last Updated on Mon, Sep 4 2017 11:01 AM

వరలక్ష్మీ వ్రత పూజలు చేస్తున్న మహిళలు

వరలక్ష్మీ వ్రత పూజలు చేస్తున్న మహిళలు

 
కాణిపాకం(ఐరాల): 
కాణిపాకం వరసిద్ధి వినాయకస్వామి వారి ఆలయం వద్ద శుక్రవారం సామూహిక వరలక్ష్మీ వ్రతం వేడుకగా నిర్వహించారు. ఆలయ ఈవో పూర్ణచంద్రారావు ఆధ్వర్యంలో స్వామివారి మూల విగ్రహనికి అభిషేకాలు, పూజలు నిర్వహించారు. అనంతరం అలంకార మండపంలో సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామి వారి ఉత్సవమూర్తులను కొలువుదీర్చి కల్యాణం జరిపారు. అనంతరం స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను మాడవీధుల ఊరేగింపు నిర్వహించారు. తరువాత ఆలయ ఆస్థాన మండపంలో సిద్ధి బుద్ధి సమేత వర సిద్ధి వినాయక స్వామి వారిని ఆశీనులు గావించి, పూజలు చేశారు. ఆ తరువాత వ్రత కలశాలను ఏర్పాటు చేసి వరలక్ష్మీ వ్రతం జరిపారు. ఈ సందర్బంగా వేదపండితులు భక్తులకు వరలక్ష్మీ దేవి వ్రత కల్పాలను చదివి వినిపించారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి మహిళలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. భక్తులందరిMీ  అధికారులు  తీర్థప్రసాదాలు పంచి పెట్టారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ కేశవరావు,సూపరింటెండెంట్‌ రవీంద్ర బాబు పాల్గొన్నారు.
 
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement