
బిడ్డకేమి తెలుసు నాన్న ఇకలేడని..
కొలిమిగుండ్ల : ‘పాపం నాన్న ఎదపై కూర్చుని అమాయకంగా బోసి నవ్వులు చిందించడం మాత్రమే తెలిసిన ఆ పసిబిడ్డ.. ఆయన ఇక రాడని తెలియక అంతే అమాయకంగా ఎప్పటిలాగే తండ్రి మృతదేహంపై కూర్చుని ఆయన పలకరింపు కోసం తదేకంగా చూస్తూ ఉండిపోయాడు’. ఈ దృశ్యాన్ని చూసి అక్కడున్న వారి కళ్లు చెమర్చాయి.
ఈ క్రమంలో మంగâýæవారం కర్నూలు జిల్లా కొలిమిగుండ్ల మండలం అంకిరెడ్డిపల్లె గనుల్లో ట్రాక్టర్కు లోడింగ్ చేసిన దస్తగిరి అదే వాహనంలోనే ఇంటికి బయలుదేరాడు. విండ్వరల్డ్ సబ్స్టేçÙ¯ŒS సమీపానికి రాగానే ట్రాక్టర్ అదుపు తప్పి రాళ్ల గుట్ట ఎక్కడం, కుదుపుల కారణంగా దస్తగిరి కిందపడటంతో అతనిపై ట్రాక్టర్ టైర్ ఎక్కి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. విషయం తెలుసుకున్న భార్య ఆరునెలల పసిబిడ్డతో ఘటనా స్థలానికి చేరుకుని భర్త మృతదేహంపై పడి గుండెలవిసేలా రోదించింది. బాధిత కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్ఐ వెంకట సుబ్బయ్య తెలిపారు.