'రేపు సాయంత్రం జల జాగరణ చేపడతాం' | Jala Jagarana at beluguppa in tomorrow | Sakshi
Sakshi News home page

'రేపు సాయంత్రం జల జాగరణ చేపడతాం'

Published Fri, May 6 2016 6:37 PM | Last Updated on Sun, Sep 3 2017 11:32 PM

అనంతపురం జిల్లా బెలుగుప్పలో శనివారం సాయంత్రం జల జాగరణ చేపడతామని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి శుక్రవారం అనంతపురంలో స్పష్టం చేశారు.

అనంతపురం : అనంతపురం జిల్లా బెలుగుప్పలో శనివారం సాయంత్రం జల జాగరణ చేపడతామని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి శుక్రవారం అనంతపురంలో స్పష్టం చేశారు. హాంద్రీనీవా ఆయుకట్టుకు వెంటనే నీరు విడుదల చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హంద్రీనీవా డిస్ట్రిబ్యూటరీ పనులు నిలిపివేయడం దుర్మార్గమని అన్నారు.

కృష్ణా జలాల అనంతపురంకు తీసుకువచ్చిన  ఘనత దివంగత ముఖ్యమంత్రి, మహానేత వైఎస్ఆర్దే అని విశ్వేశ్వరరెడ్డి గుర్తు చేశారు. అనంతపురానికి నీరు ఇచ్చిన తర్వాతే ఇతర ప్రాంతాలకు నీరు ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement