
కొండపై వాన
సాక్షి, తిరుమల : తిరుమలలో సోమవారం వేకువజాము 2 గంటల నుంచి 3 గంటల వరకు భారీ వర్షం కురిసింది. తర్వాత సాయంత్రం 4 గంటల నుంచి అరగంటపాటు మోస్తరుగా జల్లులు పడ్డాయి. భక్తులు వర్షంలో తడుస్తూ వెళ్లడం కనిపించింది. వృద్ధులు, చంటి బిడ్డలు తిప్పలు ఎదుర్కొన్నారు.