ఏలూరు: ఆగి ఉన్న లారీని ఓ బైక్ ఢీకొన్న ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ప్రమాదం పశ్చిమగోదావరి జిల్లా పెరవలి మండలం తీపర్రు వద్ద చోటుచేసుకుంది. అతివేగంతో బైక్ నడపటంతో పాటు తెల్లవారుజాము సమయం కావడంతో ముందు ఉన్న వాహనం కనిపించకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చునని అధికారులు భావిస్తున్నారు. బాధితుల వివరాలు తెలియాల్సి ఉంది.