వరంగల్ మార్కెట్లో స్తంభించిన నామ్ సేవలు
Published Tue, Aug 30 2016 12:58 AM | Last Updated on Tue, Jun 4 2019 5:02 PM
వరంగల్ సిటీ : వరంగల్ వ్యవసాయ మార్కెట్లో సోమవారం నామ్ సేవలు స్థంభించాయి. దీంతో అన్ని పంట సరుకులకు జెండా పాట ద్వారానే ధర నిర్ణయించగా, క్రయవిక్రయాలు జరిగాయి. నామ్ ద్వారా పంట సరుకుల క్రయవిక్రయాలకు ఎన్ఎఫ్సీఎల్ సహకారంతో సాఫ్ట్వేర్ అందించగా, సాంకేతిక కారణాలతో సర్వర్ డౌన్ అయింది. దీంతో గేట్ ఎంట్రీలు ఇవ్వడం కుదరకపోవడంతో కార్యదర్శి రాజు ఆదేశాల మేరకు రైతులు ఇబ్బంది పడకుండా జెండా వేలం పాటలు చేపట్టారు. కాగా, యార్డు ఇన్చార్జిల అంశంపై కార్యదర్శి రాజు మాట్లాడుతూ కేటాయించిన విధుల్లో చేరేందుకు మరో రెండు రోజుల గడువు ఇచ్చినట్లు తెలిపారు.
Advertisement
Advertisement