కర్నూలు సిటీ: ఉస్మానియా కాలేజీలో హిందీ అధ్యాపకుడిగా పని చేస్తున్న డాక్టర్ షేక్ సలీంబాషాకు డాక్టర్ అబ్దుల్ కలాం జీవిత సాఫల్య జాతీయ పురస్కారం లభించింది. ఈ మేరకు మంగళవారం ఆ కాలేజీలో అభినందన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అవార్డు గ్రహీత మాట్లాడుతూ.. అంతర్జాతీయ సాంఘిక, ఆర్థిక సంస్థ గత నెల 28వ తేదీన బెంగళూరులో అవార్డు ప్రదానం చేసిందన్నారు. అభినందన కార్యక్రమంలో ఆ కాలేజీ కరస్పాండెంట్ అజ్రాజావెద్, ప్రిన్సిపాల్ డా.సిలార్ మహ్మద్, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.