పోలీసుల అదుపులో నయీం అనుచరులు..?
Published Fri, Aug 12 2016 11:55 PM | Last Updated on Tue, Aug 21 2018 5:54 PM
యాదగిరిగుట్ట : గ్యాంగ్స్టర్ నయీం మరణించడంతో తన అనుచర వర్గం ఒక్కొక్కరుగా బయటకి వస్తున్నారు. భువనగిరి డివిజన్కు అతి సమీపంలో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్టలో సైతం అతడి అనుచరులు ఉండడంతో పోలీసులు ప్రత్యేక నిఘాపెట్టి శుక్రవారం రాత్రి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. వీరిని పోలీస్స్టేషన్లో విచారిస్తున్నట్లు తెలుస్తోంది. యాదగిరిగుట్ట ప్రాంతంలో భూములు ఏమైన కబ్జా చేశారా లేకా నయీం ఏవరినైనా బెదిరింపులకు గురి చేసి డబ్బులు వసూలు చేశారా అనే కోణాల్లో విచారిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.
Advertisement
Advertisement