నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ | nominations | Sakshi

నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ

Aug 25 2016 11:02 PM | Updated on Sep 4 2017 10:52 AM

రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఈనెల 19 న విడుదల చేసిన పంచాయతీ ఉప పోరుకు శుక్రవారం నుంచి నామినేషన్లుు స్వీకరిస్తున్నట్లు జడ్పీ సీఈవో, ఇన్‌చార్జి డీపీవో మోహన్‌లాల్‌ తెలిపారు.

జిల్లాపరిషత్‌ :
రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఈనెల 19 న విడుదల చేసిన పంచాయతీ ఉప పోరుకు శుక్రవారం నుంచి నామినేషన్లుు స్వీకరిస్తున్నట్లు జడ్పీ సీఈవో, ఇన్‌చార్జి డీపీవో మోహన్‌లాల్‌ తెలిపారు. జిల్లాలో ఖాళీ ఏర్పడిన ఒక ఎంపీటీసీ, మూడు సర్పంచ్, 38 వార్డుసభ్యుల స్థానాలకు వచ్చే నెల 8న ఎన్నికలు నిర్వహించనున్నారు. ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రిటర్నింగ్‌ అధికారులు మండల పరిషత్‌ కార్యాలయాల్లో నామినేషన్‌ పత్రాలను స్వీకరిస్తారని మోహన్‌లాల్‌ పేర్కొన్నారు. అంతకుముందు అధికారులు ఎన్నికల నోటిఫికేషన్‌ను విడుదల చేస్తారన్నారు. ఎన్నికలు జరిగే మండలాల్లో ఎన్నికల కోడ్‌ అమల్లో ఉంటుందని, పోలింగ్, ఓట్ల లెక్కింపు ఆయా గ్రామపంచాయతీ కార్యాలయంలో ఉంటుందని తెలిపారు. సిరికొండ మండలంలోని ముషీర్‌నగర్‌ ఎంపీటీసీ స్థానం ఎన్నికకు రిటర్నింగ్‌ అధికారిగా వికలాంగులశాఖ సహాయ సంచాలకులు చిన్నయ్య, అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారిగా ఎంపీడీఓ శ్రీనివాస్‌రావును నియమించగా, మిగిలిన సర్పంచి, వార్డుసభ్యుల ఎన్నికకు రిటర్నింగ్‌ అధికారులుగా స్టేజ్‌–1 ఈవోపీఆర్‌డీలను నియమించామని పేర్కొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement