సత్యదేవుని నిత్యాన్నదానానికి రూ.లక్ష విరాళం
Published Mon, Oct 31 2016 9:33 PM | Last Updated on Fri, Oct 5 2018 6:36 PM
అన్నవరం :
సత్యదేవుని నిత్యాన్నదాన పథకానికి కాకినాడ రూరల్ మండలం రాయుడు పాలెం గ్రామానికి చెందిన ఆకుల రామచంద్రరావు రూ.లక్ష విరాళాన్ని దేవస్థానం ఈఓ కె.నాగేశ్వరరావుకు సోమవారం అందజేశారు. ఈ మొత్తంపై వచ్చే వడ్డీతో ఏటా ముక్కోటి ఏకాదశి నాడు ఆకుల రామన్న, సూరేకాంతం, న ర్సింహరావు, కృష్ణకుమారి పేర్ల మీదుగా భక్తులకు అన్నదానం చేయమని కోరినట్టు అధికారులు తెలిపారు.
దేవాదాయశాఖ డీసీగా రమేష్బాబు
బోట్క్లబ్(కాకినాడ) : దేవాదాయశాఖ డీసీగా(ఎఫ్ఏసీ) రాజమండ్రి ఎసీ డీఎల్వీ రమేష్బాబును నియమిస్తూ దేవాదాయశాఖ కమిషనర్ అనురాధ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. డీసీగా పని చేసిన చందు హనుమంతరావు పదవీ విరమణ చేయడంతో ఆయన స్థానంలో రమేష్బాబును నియమించారు. రమేష్బాబు మంగళవారం బాధ్యతలు స్వీకరించనున్నట్టు తెలిసింది.
Advertisement
Advertisement