annavaram
-
సత్యదేవుని దేవేరికి నేడు వజ్ర కిరీట సమర్పణ
అన్నవరం: కాకినాడ జిల్లా అన్నవరం శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామివారి 134వ ఆవిర్భావ దినోత్సవాలు (జయంత్యుత్సవాలు) సోమవారం ఘనంగా ప్రారంభం కానున్నాయి. దీన్ని పురస్కరించుకుని సత్యదేవుని దేవేరి అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారికి పెద్దాపురానికి చెందిన శ్రీ లలితా రైస్ ఇండస్ట్రీ అధినేతల్లో ఒకరైన మట్టే సత్యప్రసాద్ దంపతులు వజ్ర కిరీటం సమర్పించనున్నారు. సోమవారం మ«ధ్యాహ్నం స్వామివారి ప్రధాన ఆలయంలో రూ.1.50 కోట్ల విలువైన ఈ వజ్రకిరీటాన్ని అందజేయనున్నట్లు సత్యప్రసాద్ తెలిపారు. ఈ కిరీటంతో పాటు స్వామి, అమ్మవార్లకు రూ.50 లక్షలతో చేయించిన వజ్ర కర్ణాభరణాలు కూడా అందజేయనున్నట్లు చెప్పారు. కాగా, ఇకపై ప్రతి రోజూ స్వామి, అమ్మవార్లు ఈ వజ్రకిరీటాలు, వజ్ర కర్ణాభరణాలు ధరించి భక్తులకు దర్శనమివ్వనున్నారు. -
హోం మంత్రి అనుచరుల అరాచకం
సాక్షి ప్రతినిధి, కాకినాడ: కోల్కతా–చెన్నై జాతీయ రహదారిని ఆనుకుని కాకినాడ జిల్లా అన్నవరం సమీపంలోని ఓ రెస్టారెంట్లో తెలుగు తమ్ముళ్లు విధ్వంసానికి పాల్పడ్డ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచి్చంది. బాధితుల కథనం మేరకు.. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట ప్రాంతంలో తెలుగుదేశం పార్టీకి చెందిన ఒక రియల్టర్, ఇద్దరు హేచరీల నిర్వాహకులు కలిసి పొరుగున అన్నవరంలో జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న ఒక రెస్టారెంట్కు ఇటీవల వచ్చారు. రెస్టారెంట్లో ఎటువంటి ఆర్డర్ ఇవ్వకుండా గంటల తరబడి కూర్చోవడంపై రెస్టారెంట్ నిర్వాహకులు ప్రశి్నంచారు.కస్టమర్లు వస్తున్నారు, వ్యాపారం దెబ్బతింటున్నదని టేబుల్ ఖాళీ చేయాలని రెస్టారెంట్ సిబ్బంది వారికి సూచించడంతో ఒక్కసారిగా వారు రెచి్చపోయారు. హోంమంత్రి తాలూకా తమనే రెస్టారెంట్ నుంచి వెళ్లిపోమంటావా, ఖాళీ చేయిస్తావా అంటూ రెస్టారెంట్లో నానా రాద్ధాంతం సృష్టించారు. నిర్వాహకులు సర్దిచెబుతున్నా లెక్క చేయకుండా రెస్టారెంట్ ఎలా నిర్వహిస్తావో చూస్తామంటూ బెదిరించి కురీ్చలు తన్నేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. వారు అదే రోజు సాయంత్రం సుమారు 20 మంది అనుచరులతో గుంపుగా మరోసారి వచ్చి రెస్టారెంట్లో ఫుడ్ ఆర్డర్ ఇచ్చి నిర్వాహకులతో గొడవకు దిగారు.మంత్రి తాలూకా అంటూ బిల్లు ఇచ్చేది లేదని మీకు దిక్కున్న చోట చెప్పుకోమంటూ కురీ్చలు తన్నేసి నానా గొడవ సృష్టించి సిబ్బందిని బయటకు తీసుకొచ్చి చితకబాదారు. రెస్టారెంట్ నిర్వాహకులు కూడా తెలుగుదేశంపార్టీ సానుభూతిపరులే కావడంతో.. విషయాన్ని సిబ్బంది విదేశాల్లో ఉన్న హోటల్ నిర్వాహకునికి తెలియజేశారు. దీంతో ఆయన తన ఆతీ్మయుడైన సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణకు ఫోన్చేసి మంత్రి పేరు చెప్పి గలాటా సృష్టిస్తున్నారని వారిని కట్టడి చేసి కేసు నమోదు చేయాలని విజ్ఞప్తి చేశారని తెలిసింది. రెస్టారెంట్లో కురీ్చలు గిరాటేసి దాడులకు పాల్పడ్డ గలాటా తాలూకా వీడియోలు విశాఖ, అనకాపల్లి జిల్లాల్లోని సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.మంత్రి పేరు చెప్పి నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారని బాలకృష్ణ దృష్టికి తీసుకువెళ్లడంతో ఆయన సీరియస్గా తీసుకుని బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సీఎంవో ద్వారా పోలీసు ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. ఇంతలో గలాటా సృష్టించిన తెలుగు తమ్ముళ్లు అక్కడి నుంచి జారుకున్నారు. ఈ వివాదంపై రెస్టారెంట్ నిర్వాహకులు అన్నవరం పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారని తెలిసింది.విషయం తెలుసుకున్న తెలుగు తమ్ముళ్లు మంత్రి ద్వారా రాజీ కోసం ప్రయతి్నస్తూ కేసు లేకుండా పోలీసులపై ఒత్తిడి తెస్తున్నారని సమాచారం. దీంతో పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. ఇదే విషయమై అన్నవరం సబ్ ఇనస్పెక్టర్ కిశోర్బాబును సంప్రదించగా రెస్టారెంట్లో స్వల్ప వివాదం జరిగినట్టు స్థానికుల ద్వారా తెలిసిందన్నారు. అయితే గొడవ విషయంపై తమకు నిర్వాహకుల నుంచి ఎటువంటి ఫిర్యాదు అందలేదన్నారు. -
శ్రీ సత్యనారాయణ స్వామి కల్యాణోత్సవం ప్రారంభం
-
సత్యదేవునికి కేంద్ర ప్రసాద్ం లేనట్టేనా?
అన్నవరం: అంతన్నాడు.. ఇంతన్నాడు గంగరాజు...అనే సినిమా పాటలా తయారైంది అన్నవరం దేవస్థానానికి ‘ప్రసాద్ ’ స్కీం నిధులు ఇవ్వడంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి. పదేళ్లుగా దేవస్థానం అధికారులను ఊరిస్తూ రూ.96 కోట్లు ఇస్తామని చివరకు రూ. పది కోట్లు ఇస్తాం అనే పరిస్థితికి తీసుకువచ్చారు. త్వరలో లోక్సభ ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చే పరిస్థితుల్లో ఆ నిధులు కూడా ఇచ్చే పరిస్థితి లేదని సమాచారం. నిధులిస్తే ఈ పాటికే విడుదల చేసేవారని రాష్ట్ర టూరిజం శాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఎనిమిదేళ్ల క్రితమే అన్నవరం దేవస్థానం ఎంపిక కేంద్ర ప్రభుత్వం దేశంలో ప్రముఖ పుణ్యక్షేత్రాల్ని అభివృద్ధి చేయడానికి ఉద్దేశించిన పిలిగ్రిమేజ్ రీజువినేషన్ అండ్ స్ప్రిట్యువల్ అగ్మంటేషన్ డ్రైవ్ (ప్రసాద్) స్కీం కింద దాదాపు ఎనిమిదేళ్ల క్రితమే ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరంలోని శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానాన్ని ఎంపిక చేసింది. కొండమీద, కొండదిగువన భక్తులకు సౌకర్యాలు కల్పించేందుకు వివిధ నిర్మాణాల ప్రతిపాదనలు పంపమని కోరింది. దేవస్థానం అధికారులు రూ.96 కోట్లకు ప్రతిపాదనలు పంపించారు. 2020లో ప్రతిపాదనలను రూ.54 కోట్లకు కుదించి మళ్లీ ప్రతిపాదనలు పంపించాలని ఆదేశించగా దేవస్థానం అధికారులు ఆ విధంగా పంపించారు. రెండు నెలల క్రితం రూ.పది కోట్లు మాత్రమే ఇస్తాం...దానికి తగ్గట్టుగా ప్రతిపాదనలు పంపించమన్నారు. నిరాశకు లోనైన దేవస్థానం రూ.పది కోట్లతో అన్నదాన భవనం నిర్మాణానికి ప్రతిపాదనలు పంపించింది. అలా పంపించిన ప్రతిపాదనలపై ఇంతవరకు ఎటువంటి సమాచారం అటు రాష్ట టూరిజం శాఖ అధికారులకు కాని, అన్నవరం దేవస్థానానికి కాని రాలేదు. ఎదురు తెన్నులు డీపీఆర్ ప్రకారం వెంటనే నిధులివ్వాలని 2021 లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని కాకినాడ ఎంపీ వంగా గీత, ఎంఎల్ఎ పర్వత శ్రీపూర్ణచంద్రప్రసాద్, అన్నవరం దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ తదితరులు కలిసి విజ్ఞప్తి చేశారు. అయినా ఫలితం లేదు. కేంద్రం నుంచి ప్రసాద్ స్కీం నిధులు అన్నవరం దేవస్థానానికి విడుదల అయ్యే అవకాశం దాదాపుగా లేదనే చెప్పాలని రాష్ట్ర టూరిజం శాఖ ఉన్నతాధికారులు అభిప్రాయపడుతున్నారు. ఈ నెలలోనే జీఓ విడుదల అవ్వాలి. నిధులు విడుదల అవ్వాలి. టెండర్లు పిలవాలి, టెండర్లు ఖరారు కావాలి. ఇదంతా ఈ నెల రోజుల్లో జరగడం సాధ్యం కాదని వారు అభిప్రాయపడుతున్నారు. -
వస్తున్నాయ్.. సత్యదేవుని కొత్త రథాలు
అన్నవరం: రత్నగిరి వాసుడైన సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతిదేవి కోసం కొత్త రథాలు సిద్ధమవుతున్నాయి. రూ.1.42 కోట్ల వ్యయంతో నాణ్యమైన బస్తరు టేకుతో ఈ రెండు రథాలను అన్నవరం దేవస్థానం తయారు చేయిస్తోంది. వీటిలో రూ.34 లక్షలతో నిర్మించిన చిన్నరథం స్వామి, అమ్మవార్ల ఊరేగింపునకు సిద్ధమైంది. దీనికి వెండి రేకు తాపడం చేసేందుకు దాతల కోసం దేవస్థానం అన్వేషిస్తోంది. మరోవైపు రూ.1.08 కోట్లతో నిర్మిస్తున్న పెద్ద రథం పనులు చురుగ్గా జరుగుతున్నాయి. మరో మూడు నెలల్లో ఈ రథం కూడా సిద్ధమవుతుందని చెబుతున్నారు. చురుగ్గా పెద్ద రథం పనులు ♦ రూ.1.08 కోట్లతో పెద్ద రథం నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. ♦ దీని ఎత్తు 33.9 అడుగులు, వెడల్పు 14 అడుగులు, పొడవు 23.5 అడుగులు. ♦ ఈ రథంపై వివిధ లతలు, దేవతామూర్తుల చిత్రాలు, వివిధ డిజైన్లు చెక్కుతున్నారు. ♦ పెద్ద రథం పీఠం నిర్మాణ పనుల్లో శిల్పులు నిమగ్నమయ్యారు. పెద్ద రథానికి సంబంధించి స్తంభాలు సైతం చెక్కుతున్నారు. ♦ సత్యదేవునికి ఇప్పటికే రెండు రథాలున్నాయి. వీటిలో ఒకటి వెండి రథం కాగా.. మరొకటి వైశాఖ మాసంలో జరిగే వార్షిక కల్యాణ మహోత్సవాల్లో మూడో రోజు స్వామి, అమ్మవార్లను ఊరేగించే రావణ బ్రహ్మ వాహనం. వెండి రథం శిథిలావస్థకు చేరింది. ♦ కొత్త రథం తయారు చేయించాలన్న ప్రతిపాదన పదేళ్లుగా ఉన్నా వివిధ కారణాలతో అధికారులు సాహసించలేదు. ♦ వెండి, బంగారం పనులు చేయించేటప్పుడు పలు సమస్యలు ఉత్పన్నమవుతాయని వెనుకంజ వేశారు.అయితే.. గత ఈవో చంద్రశేఖర్ ఆజాద్ నూతన రథం తయారీకి ఉపక్రమించారు. ♦ వెండి రథంతోపాటు స్వామి, అమ్మవార్లను కొండ దిగువన ఊరేగించేందుకు పెద్ద రథం కూడా తయారు చేయాలని నిర్ణయించారు. ♦ పాలకవర్గం ఆమోదంతో వీటి తయారీకు గత ఈవో ఎస్ఎస్ చంద్రశేఖర్ ఆజాద్ ఆగస్ట్ నెలలో టెండర్లు పిలిచారు. ♦ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మురమళ్లకు చెందిన శ్రీమాణిక్యాంబ శిల్పకళ వుడ్ వర్క్స్ అధినేతలు కొల్లాటి కామేశ్వరరావు, కొల్లాటి శ్రీనివాస్ ఈ పనులను దక్కించుకున్నారు. సిద్ధమైన చిన్న రథం ♦ చిన్న రథం నిర్మాణం ఇప్పటికే పూర్తయింది. ఈ రథం ఎత్తు 14 అడుగులు, వెడల్పు 6.3 అడుగులు, పొడవు 7.5 అడుగులు ఉంది. నాలుగు స్తంభాలపై శిఖరం వస్తుంది. నాలుగు చక్రాల మీద అందమైన లతలు చెక్కారు. ♦ రథం మీద దేవతామూర్తుల చిత్రాలతో పాటు పలు ఆకర్షణీయమైన డిజైన్లు చిత్రీకరించనున్నారు. ముందు భాగంలో రెండు గుర్రాలను అమర్చారు. ♦ దీనిని టేకుతో తయారు చేయడానికి రూ.34 లక్షలు అవుతుండగా.. వెండి రేకు తాపడానికి సుమారు 300 కిలోల వెండి అవసరం కానుంది. దాతల సహకారంతో వెండి తాపడం చేయాలని అధికారులు ప్రయత్నిస్తున్నారు. చిన్న రథం నిర్మాణం బాగుంది చిన్న రథం నిర్మాణం పూర్తయింది. చాలా బాగుంది. ఈవో కె.రామచంద్ర మోహన్ దీనిని పరిశీలించిన అనంతరం ట్రయల్ రన్ వేస్తాం. అనంతరం దీనిని స్వామివారి సేవలో ఎప్పుడు ఉపయోగించాలో ఈవో పండితులు, నిర్ణయిస్తారు. – ఉదయ్ కుమార్, డీఈ, అన్నవరం దేవస్థానం -
కన్నుల పండువగా సత్యదేవుని తెప్పోత్సవం
అన్నవరం/అరసవల్లి: కాకినాడ జిల్లా అన్నవరంలోని రత్నగిరిపై వెలసిన శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామివారి తెప్పోత్సవం క్షీరాబ్ది ద్వాదశి పర్వదినం సందర్భంగా శుక్రవారం రాత్రి పంపా నదిలో కన్నుల పండువగా జరిగింది. సర్వాంగ సుందరంగా ముస్తాబు చేసిన హంసవాహనంపై సత్యదేవుడు, అమ్మవార్లు నదిలో విహరించారు. ఈ తెప్సోత్సవానికి భక్తులు వేల సంఖ్యలో హాజరయ్యారు. సాయంత్రం 5–30 గంటలకు సత్యదేవుడు, అమ్మవార్లను, క్షేత్రపాలకులు సీతారాములను రత్నగిరి నుంచి ఊరేగింపుగా పంపా తీరాన గత పూజా మండపం వద్దకు తీసుకొచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం 6–30 గంటలకు స్వామి అమ్మవార్లను హంస వాహనంపై కూర్చోబెట్టి తెప్పోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ కే రామచంద్ర మోహన్, ఏసీ రమే‹Ùబాబు పాల్గొన్నారు. సుమారు 150మంది పోలీసులు బందోబస్తు నిర్వహించారు. వైభవంగా ఆదిత్యుని తెప్పోత్సవం ప్రఖ్యాత అరసవల్లి ఆదిత్య క్షేత్రంలో క్షీరాబ్ధి ద్వాదశి సందర్భంగా శుక్రవారం తెప్పోత్సవం వైభవంగా నిర్వహించారు. ఉషాపద్మినిఛాయా దేవేరులతో స్వామి వారు హంస వాహనంపై పవిత్ర ఇంద్రపుష్కరిణిలో 12 సార్లు జలవిహారం చేశారు. అలాగే రోజంతా ఆదిత్యుడు పూర్తి స్వర్ణాలంకరణలో దర్శనమిచ్చారు. ఈ అద్భుత దృశ్యాలను తిలకించేందుకు సుదూర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఆలయ ఈవో వి.హరిసూర్యప్రకాష్ ఆధ్వర్యంలో ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకరశర్మ సమక్షంలో హంస నావలో శ్రీచక్రార్చన పూజలు నిర్వహించారు. -
రత్నగిరీశునికి ముత్యాల వస్త్రం
అన్నవరం: దేవతామూర్తులకు బంగారు, వజ్ర, వైఢూర్యాలతో ఆభరణాలు తయారుచేసి భక్తితో అలంకరించి తరిస్తుంటాం. అలాగే మంచి ముత్యాలతో నఖశిఖ పర్యంతం ఉండే ఒక ముత్యాల వస్త్రం (ముత్తంగి) అలంకరించడం కూడా పలు దేవాలయాల్లో ఆనవాయితీగా వస్తోంది. శ్రీరంగంలో శ్రీరంగనాథుడు, తిరుమల బ్రహ్మోత్సవాల్లో మలయప్పస్వామి, భద్రాద్రిలో సీతారాములు ముత్తంగి అలంకరణలో దర్శనమిస్తూ ఉంటారు. అన్నవరం పుణ్యక్షేత్రంలో శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామి వారు, దేవేరి అనంతలక్ష్మీ సత్యవతీదేవి, ఈశ్వరుడు కార్తీకమాసం నుంచి ముత్తంగి అలంకరణలో దర్శనమివ్వనున్నారు. దీని తయారీకి అయ్యే ఖర్చు రూ.8 లక్షలు సమకూర్చేందుకు దేవస్థానం వ్రత పురోహిత సంఘం ముందుకు వచ్చింది. ప్రాచీన కళను కాపాడుతూ.. ముత్తంగి తయారీ ప్రాచీనమైన కళ. దీన్ని హైదరాబాద్కు చెందిన సుధీర్ చరణ్ కుటుంబం వంశపారంపర్యంగా కాపాడుతూ వస్తోంది. తమిళనాడులోని శ్రీరంగంలో సుమారు 12 అడుగుల పొడవున పవళించి ఉండే శ్రీరంగనాథునికి 17వ శతాబ్దంలో నాయకర్ రాజులు ముత్తంగి తయారు చేయించి అలంకరించారు. వందేళ్ల తరువాత వన్నె తగ్గడంతో దాన్ని తీసి భద్రపరిచారని సుదీర్ చరణ్ ‘సాక్షి’కి చెప్పారు. తరువాత 1932లో చెన్నైకి చెందిన ఆయన ముత్తాత కృష్ణాజీని శ్రీరంగం దేవస్థానం ప్రతినిధులు సంప్రదించి, భద్రపరిచిన ముత్తంగిని మళ్లీ ముత్యాలు, వజ్రాలు, కెంపులతో తయారు చేయించి శ్రీరంగనాథునికి అలంకరించారు. ఎలా తయారు చేస్తారంటే.. ముత్తంగి తయారీ చాలా శ్రమ, నైపుణ్యం, ఏకాగ్రతతో కూడిన కళ. ఇందుకు అవసరమయ్యే ముత్యాల వ్యయం తక్కువే అయినప్పటికీ వాటిని వస్త్రంగా తయారు చేయడానికి నెలల తరబడి కష్టపడాల్సి ఉంటుంది. శిరస్సు దగ్గర నుంచి పాదాల వేళ్ల వరకూ దేవతామూర్తుల కొలతలు తీసుకుని, ముందుగా వెండి లేదా రాగి రేకుతో వస్త్రంలా తయారు చేసి, దానికి వివిధ సైజుల్లో ముత్యాలు అతికిస్తారు. వీటి మధ్యలో ఎటువంటి ఖాళీ ఉండదు. కేవలం స్వామి, అమ్మవార్ల ముఖాలు మాత్రమే కనిపిస్తాయి. మిగిలిన భాగమంతా మంచిముత్యాలే కనిపిస్తాయి. సత్యదేవునికీ ముత్తంగి సేవ సత్యదేవుడు, అమ్మవారు, శంకరులకు ప్రతి సోమవారం ముత్తంగి అలంకరించి, ప్రత్యేక పూజలు చేయించాలని నిర్ణయించాం. దీనికి దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్ కూడా అంగీకరించారు. దాతల ద్వారా ముత్తంగి చేయించాలనుకున్నాం. అదే సమయంలో వ్రతపురోహిత సంఘం ముందుకు వచ్చింది. – ఎస్ఎస్ చంద్రశేఖర్ ఆజాద్, ఈవో, అన్నవరం దేవస్థానం -
భక్త మహాశయులకు...
అన్నవరం: ఆధ్యాత్మిక చింతనతో.. మది నిండా భక్తిభావంతో.. ఆ స్వామివారిని స్మరిస్తూ రత్నగిరికి కాలినడక వచ్చే భక్త మహాశయులకు సౌకర్యాలు ఒనగూరుతున్నాయి.. మెట్ల మార్గం నుంచి అలసి సొలసి వచ్చేవారి కోసం విశ్రాంతి భవనం (డార్మెట్రీ) సకల హంగులతో రూపుదిద్దుకుంటోంది.. రత్నగిరిపై వనదుర్గ ఆలయం ఎదురుగా రూ.రెండు కోట్లతో దాత పెన్నాడ వెంకట రాజామణి సారథ్యంలో భక్తుల విశ్రాంతి భవన నిర్మాణం జరుగుతోంది. ఇది ఆగస్టు నెలాఖరు నాటికి పూర్తి కానుంది. గత ఏడాది ఆగస్టులో పనులు ప్రారంభం కాగా, ఇప్పటికే 90 శాతం పూర్తయ్యాయి. వచ్చే ఆగస్టు నెలాఖరుకు మిగిలిన పనులు పూర్తి చేసి డార్మెట్రీని దేవస్థానానికి అప్పగించాలని దాత నిర్ణయించారు. డార్మెట్రీని దేవస్థానానికి అప్పగించిన వెంటనే ప్రారంభించేందుకు తగిన చర్యలు తీసుకుంటామని ఈఓ చంద్రశేఖర్ అజాద్ వివరించారు. అలా పునాది పడి.. రత్నగిరి సత్యదేవుని దర్శనానికి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తరలి వస్తుంటారు. ఇందులో చాలామంది మెట్ల దారి నుంచి వచ్చి మొక్కులు తీర్చుకుంటుంటారు. అలాంటి వారికోసం డార్మెట్రీ నిర్మించాలని దేవస్థానం అధికారులు నిర్ణయించారు. బాత్రూమ్లలో స్నానం చేసి, తమ వస్తువులను అక్కడే లాకర్లలో భద్రపర్చుకునేందుకు శ్రీవనదుర్గ అమ్మవారి ఆలయం వద్ద ఈ భవనం చేపట్టాలని భావించారు. ఈ సమయంలోనే రాజమహేంద్రవరానికి చెందిన దాత పెన్నాడ వెంకట రాజామణి డార్మెట్రీ నిర్మించడానికి ముందుకు వచ్చారు. అప్పటి ఈఓ వి.త్రినాథరావు శ్రీవనదుర్గ ఆలయం వద్ద ఉన్న పాత భవనాన్ని కూల్చి వేసి ఆ స్ధలాన్ని దాతకు అప్పగించారు. ఈ నిర్మాణానికి గత ఏడాది ఆగస్టు 13న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, దేవదాయ ధర్మదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, ఎంపీ వంగా గీత, ఎమ్మెల్యే పర్వత శ్రీపూర్ణచంద్రప్రసాద్ భూమిపూజ చేశారు. వెయ్యి మంది సేదతీరేలా.. మొత్తం 3,900 చదరపు అడుగుల విస్తీర్ణంలో మూడంతస్తులలో ఈ భవనం నిర్మిస్తున్నారు. ఏకకాలంలో సుమారు వెయ్యి మంది సేదతీరే విధంగా సౌకర్యాలు కల్పిస్తున్నారు. మూడు అంతస్తులలోనూ టాయిలెట్లు, స్నానపు గదులు ఏర్పాటు చేస్తున్నారు. దీనివల్ల భక్తులు కొండపై వసతి గదుల కోసం ప్రయత్నించకుండా ఇక్కడే స్నానం చేసి స్వామివారిని దర్శనానికి రావొచ్చని అధికారులు తెలిపారు. ఈ పనులు ప్రారంభించిన మూడు నెలలకే పునాదుల దశ పూర్తి చేయగా, ఏప్రిల్ నెలలోనే మూడు శ్లాబ్ల నిర్మాణం పూర్తి చేశారు. ప్రస్తుతం నిర్మాణం పూర్తయి వెలుపల ప్లాస్టింగ్, టైల్స్ అతికించడం పనులు చేస్తున్నారు. టాయిలెట్ల నిర్మాణం, విద్యుత్తు సరఫరా పనులు కూడా దాదాపుగా పూర్తయ్యాయని నిర్మాణ కాంట్రాక్టర్ అబ్బులు తెలిపారు. -
అన్నవరం: కన్నుల పండువగా సత్యదేవుని కల్యాణం (ఫొటోలు)
-
అన్నవరం: కన్నుల పండువగా సత్యదేవుని కల్యాణం (ఫొటోలు)
అన్నవరం: కన్నుల పండువగా సత్యదేవుని కల్యాణం (ఫొటోలు) -
మధురాతి మధురం..
అన్నవరం: అమృతానికి సరిసాటి అన్నవరం శ్రీ వీర వేంకట సత్యనారాయణస్వామి వారి ప్రసాదమే అంటే అతిశయోక్తి కానే కాదు. స్వామివారి గోధుమ నూక ప్రసాదం పేరు వింటే చాలు.. నోట్లో నీరూరక మానదు. ప్రసాదంతో పాటు అది కట్టిన ఆకు కూడా నాకేయాలనిపించేంత రుచిగా ఉంటుంది. అయితే, ఇటీవల సత్యదేవుని ప్రసాదం నాణ్యతపై తరచుగా విమర్శలు వస్తున్నాయి. ప్రసాదం అంత రుచిగా ఉండటం లేదని, ఒక్క రోజు కూడా నిల్వ ఉండటం లేదని పలువురు భక్తులు విమర్శిస్తున్నారు. దీనిపై గతంలో డయల్ యువర్ ఈఓ కార్యక్రమంలో కూడా ఫిర్యాదులు వచ్చాయి. దీనికి తోడు వీఐపీల కోసం ఎక్కువ సేపు ఉడికించి తయారు చేసే స్పెషల్ ప్రసాదాన్నే సాధారణ భక్తులకు కూడా ఇవ్వాలనే డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో మరింత రుచిగా, నిల్వ ఉండేలా గోధుమ నూక ప్రసాదం తయారు చేసేందుకు దేవస్థానం అధికారులు చర్యలు చేపట్టారు. దేవస్థానం ఈఓ చంద్రశేఖర్ అజాద్ రెండు రోజుల పాటు ప్రసాద తయారీ విభాగంలో ఒక కళాయిలో భక్తులకు విక్రయించే ప్రసాదం, ఇంకో కళాయిలో వీఐపీ ప్రసాదం వండించి రెండింటి మధ్య తేడాను గమనించారు. నీరంతా ఆవిరయ్యే వరకూ బాగా ఉడికించడం వలన స్పెషల్ ప్రసాదం రంగు, రుచి బాగుంటున్నాయని నిర్ధారణకు వచ్చారు. ఈ నేపథ్యంలో సాధారణ భక్తులకు విక్రయించే ప్రసాదం కూడా అదే విధంగా తయారు చేయాలని నిర్ణయించారు. మరింతగా యాలకుల పొడి ప్రసాదం తయారీకి ఒక్కో కళాయిలో వంద డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద మరిగించిన 40 లీటర్ల నీరు, 15 కేజీల గోధుమ నూక, రెండు విడతలుగా 30 కిలోల పంచదార వేస్తారు. గోధుమ నూక ఉడికాక ఆరు కేజీల నెయ్యి, 150 గ్రాముల యాలకుల పొడి కలుపుతారు. ప్రసాదం తయారయ్యాక దానిని తొట్టెలో వేసి, దానిపై కూడా యాలకుల పొడి చల్లి, కాస్త చల్లారాక ప్యాకెట్లు కడతారు. ప్యాకింగ్ చేసేటప్పుడు మరో రెండు కిలోల నెయ్యి కలుపుతారు. గంటన్నర వ్యవధిలో ఒక్కో కళాయికి 80 కేజీల ప్రసాదం తయారవుతుంది. కళాయి ప్రసాదం తయారీకి సుమారు 4.730 కిలోల గ్యాస్ వినియోగమవుతోంది. ఒక్కో కళాయి ప్రసాదం తయారీకి వినియోగిస్తున్న యాలకుల పొడిని ఇకపై 200 గ్రాములకు పెంచాలని, ప్రసాదాన్ని గంటన్నరకు బదులు రెండు గంటల పాటు ఉడికిస్తే రుచి పెరుగుతుందని ధర్మకర్తల మండలి సమావేశంలో ఈఓ అజాద్ ప్రతిపాదించారు. మరో అరగంట ఎక్కువగా ప్రసాదాన్ని ఉడికించడం వలన కళాయి ప్రసాదం తయారీకి 6 కిలోల (అదనంగా 1.270 కిలోలు) వరకూ గ్యాన్ వినియోగమవుతుంది. ఈ ప్రతిపాదనలకు ధర్మకర్తల మండలి ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. కళాయి ప్రసాదానికి 150 గ్రాముల ప్రసాదం ప్యాకెట్లు 533 వస్తాయి. తాజా మార్పుల వలన ఒక్కో కళాయి ప్రసాదం తయారీకి సుమారు రూ.180 అదనంగా ఖర్చవుతుందని అంచనా వేశారు. అంటే ప్రతి ప్యాకెట్కు అదనంగా 35 పైసలు ఖర్చు కానుంది. దేవస్థానంలో ఏటా 1.80 కోట్ల ప్రసాదం ప్యాకెట్లు తయారవుతాయి. కొత్తగా చేపట్టే మార్పుల వలన ఏటా అదనంగా సుమారు రూ.60 లక్షలు ఖర్చయ్యే అవకాశం ఉందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఆ మేరకు దేవదాయ శాఖ కమిషనర్ అనుమతి తీసుకోవాలని నిర్ణయించారు. ఏటా రూ.40 కోట్ల ఆదాయం సత్యదేవుని ప్రసాదం విక్రయాల ద్వారా అన్నవరం దేవస్థానానికి ఏటా రూ.40 కోట్ల ఆదాయం వస్తోంది. రత్నగిరిపై 2 కౌంటర్లలో ఉదయం నుంచి రాత్రి వరకు, కొండ దిగువన తొలి పావంచా, నమూనా ఆలయం వద్ద 24 గంటలూ స్వామివారి ప్రసాదాలు విక్రయిస్తున్నారు. ఈ కౌంటర్ల ద్వారా 150 గ్రాముల బరువైన ప్రసాదం ప్యాకెట్లను ఏటా దాదాపు 1.80 కోట్లు విక్రయిస్తున్నారు. విశాఖపట్నం నుంచి రాజమహేంద్రవరం వైపు ఉన్న జాతీయ రహదారి పక్కన కూడా మరో ప్రసాదం కౌంటర్, నమూనా ఆలయం నిర్మాణానికి ఏర్పాట్లు చేస్తున్నారు. దీని ద్వారా కూడా ప్రసాదం విక్రయాలు మరింత పెరిగే అవకాశం ఉంది. భక్తుల కోసమే.. సత్యదేవుని ప్రసాదం మరింత రుచిగా తయారు చేసి భక్తులకు అందించాలనేదే మా ప్రయత్నం. ఇందులో భాగంగా ప్రయోగాత్మకంగా యాలకుల పొడి పరిమాణం పెంచి, ఎక్కువసేపు పొయ్యి మీద ఉడికిస్తే బాగా రుచిగా తయారైంది. అదేవిధంగా ప్రసాదం తయారు చేసి భక్తులకు అందించాలని నిర్ణయించాం. దీనికి కమిషనర్ అనుమతి తీసుకోవాల్సి ఉంది. – చంద్రశేఖర్ అజాద్, కార్యనిర్వహణాధికారి, అన్నవరం దేవస్థానం -
3 ప్రముఖ ఆలయాలకు ట్రస్టు బోర్డుల నియామకం
సాక్షి, అమరావతి/ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ): రాష్ట్రంలో దేవదాయ శాఖ పరిధిలోని మూడు ప్రముఖ ఆలయాలకు ప్రభుత్వం మంగళవారం ట్రస్టు బోర్డులను నియమించింది. కాకినాడ జిల్లా అన్నవరం శ్రీవీరవెంకటసత్యనారాయణ స్వామి వారి దేవస్థానానికి ఆ ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త ఐ.వి.రోహిత్ను ట్రస్టు బోర్డు చైర్మన్గా, మరో 13 మంది ట్రస్టు బోర్డు సభ్యులుగా నియమిస్తూ దేవదాయశాఖ ముఖ్య కార్యదర్శి హరిజవహర్లాల్ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామి దేవస్థానానికి ఆ ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త ఎస్వీ సుధాకరరావును ట్రస్టు బోర్డు చైర్మన్గా, మరో 14 మంది ట్రస్టు బోర్డు సభ్యులుగా నియమించారు. అదే విధంగా విజయవాడ శ్రీదుర్గమల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానానికి 15 మంది ట్రస్టు బోర్డు సభ్యులను నియమించారు. ఈ మూడింటికి వేర్వేరుగా ఉత్తర్వులు జారీ చేశారు. విజయవాడ దుర్గగుడి ట్రస్టు బోర్డు చైర్మన్ను సభ్యులు ప్రమాణ స్వీకారం అనంతరం సమావేశమై ఎన్నుకుంటారు. అదనంగా ఆయా ఆలయాలలో ప్రధాన అర్చకులుగా పనిచేస్తున్న వారు ఆయా ట్రస్టు బోర్డులో ఎక్స్ అఫిషియో సభ్యులుగా కొనసాగుతారని ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఆయా ఆలయాల ట్రస్టు బోర్డులలోని సభ్యులు పదవీ బాధ్యతలు చేపట్టిన రోజు నుంచి రెండేళ్ల పాటు ఆ పదవుల్లో కొనసాగుతారని తెలిపింది. దుర్గమ్మ ఆలయ చైర్మన్గా కర్నాటి రాంబాబు ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని శ్రీదుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థాన నూతన పాలక మండలి సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం మంగళవారం జరిగింది. చైర్మన్గా కర్నాటి రాంబాబు, సభ్యులుగా కేసరి నాగమణి, కట్టా సత్తెయ్య, బుద్దా రాంబాబు, దేవిశెట్టి బాలకృష్ణ, చింతా సింహాచలం, బచ్చు మాధవీకృష్ణ, అనుమోలు ఉదయలక్ష్మి, నిడమనూరి కళ్యాణి, నంబూరి రవి, చింకా శ్రీనివాసరావు, మారం వెంకటేశ్వరరావు, అల్లూరి కృష్ణవేణి, తొత్తడి వేదకుమారి చేత ఈవో భ్రమరాంబ ప్రమాణ స్వీకారం చేయించారు. కొలుకులూరి రామసీత ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంది. -
అన్నవరానికి ఆధ్యాత్మిక శోభ ...
-
కన్నులపండుగగా అన్నవరం సత్యదేవుని కళ్యాణం
-
అధ్యాపకుడి అరుదైన చదివింపు
అన్నవరం: చదువుల్లో రాణించాలని, లక్ష్యాలు సాధించాలని విద్యార్థులకు బోధించే అధ్యాపకులు చాలా కళాశాలల్లో కనిపిస్తారు. కాని కళాశాలల్లో పేద విద్యార్థులకు మధ్యాహ్న భోజన సదుపాయం కూడా కల్పిస్తే వారు మరింత బాగా కష్టపడి చదివి ఉన్నత స్థానాలకు చేరుకుంటారని భావించి అందుకోసం సొంత సొమ్మును ఖర్చు చేసే అధ్యాపకులు చాలా అరుదు. అటువంటి కోవలోకే వస్తారు సత్యదేవ డిగ్రీ కళాశాల విశ్రాంత ప్రిన్సిపాల్ భీమలింగం సూర్యనారాయణమూర్తి. ఆయన తన భార్య పద్మావతితో కలిసి సోమవారం శ్రీ సత్యదేవ నిత్యాన్నదాన పథకానికి సత్యదేవ డిగ్రీ కళాశాల విద్యార్థుల పేరుతో రూ.ఐదు లక్షలు విరాళాన్ని దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ వి.త్రినాథరావుకు అందజేసిన విషయం తెలిసిందే. మధ్యాహ్న భోజనం పునరుద్ధరించాలనే లక్ష్యంతో... విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పునరుద్ధరించాలనే లక్ష్యంతో తన వంతు సాయంగా ఈ విరాళాన్ని అందచేసినట్టు ఆయన ‘సాక్షి’కి తెలిపారు. స్థానిక సత్యదేవ డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్గా 2015–17 మధ్య సేవలందించిన సూర్యనారాయణమూర్తి ప్రస్తుతం తమ స్వగ్రామమైన పెద్దాపురం మండలంలోని సిరివాడలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆయన ప్రిన్సిపాల్గా వ్యవహరించిన సమయంలో దూరప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులు మధ్యాహ్న భోజనం లేక ఇబ్బంది పడుతున్న విషయాన్ని అప్పటి దేవస్థానం చైర్మన్ రాజా ఐవీ రామ్కుమార్, ఈఓ కాకర్ల నాగేశ్వరరావు దృష్టికి తీసుకువెళ్లారు. ఫలితంగా 2016లో అక్టోబర్ నుంచి 2017 ఏప్రిల్ వరకు డిగ్రీ కళాశాల విద్యార్థులకు అన్నదానం పథకం నుంచి మధ్యాహ్న భోజనం పంపించారు. అన్నదానం పథకానికి దాతలు ఇచ్చిన విరాళాలు భక్తులకు భోజనానికి ఉపయోగించాలి తప్ప విద్యార్థుల భోజనానికి కాదని ఆడిట్ అధికారులు అభ్యంతరం చెప్పడంతో దేవస్థానం ఆ భోజనాన్ని పంపించడం నిలిపివేసింది. 2018లో సూర్యనారాయణమూర్తి పదవీ విరమణ చేశారు. అయితే విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పునరుద్ధరించేందుకు ఆయన చాలా ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. దీంతో తన వంతు విరాళంగా ఆయన రూ.ఐదు లక్షలు అందజేశారు. మధ్యాహ్న భోజన సౌకర్యం పునరుద్ధరించాలని కోరాను కళాశాలలో చదివే విద్యార్థులు 600 మందిలో 400 మంది పేద, మధ్యతరగతి వారు. వీరికి భోజన సౌకర్యం పునరుద్ధరించాలని ఆలయ పెద్దలను కోరాను. నేను ఇచ్చిన విరాళంపై వడ్డీతో రోజుకు కనీసం పది మంది విద్యార్థులకు అన్నదాన పథకంలో (కళాశాల పనిదినాలు 180 రోజుల్లో) భోజనం పెట్టమని కోరాను. – సూర్యనారాయణమూర్తి, విశ్రాంత ప్రిన్సిపాల్ కమిషనర్తో చర్చిస్తాం డిగ్రీ కళాశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఏర్పాటుపై గతంలో ఆడిట్ అభ్యంతరాలు రావడంతో నిలిపివేయాల్సి వచ్చింది. మళ్లీ భోజనం పెట్టాలంటే దేవదాయశాఖ కమిషనర్ ఆదేశాలివ్వాలి. ఆ దిశగా ప్రయత్నం చేస్తాం. – చైర్మన్ రోహిత్, ఈఓ త్రినాథరావు -
రూ.1.50 కోట్లతో సత్యదేవునికి వజ్రకిరీటం
అన్నవరం(తూర్పుగోదావరి): అన్నవరంలోని శ్రీ సత్యదేవుడు త్వరలో వజ్రకిరీటంతో భక్తులకు దర్శనమివ్వనున్నాడు. పెద్దాపురంలోని శ్రీలలితా రైస్ ఇండస్ట్రీ డైరెక్టర్లలో ఒకరైన మట్టే సత్యప్రసాద్ రూ.1.5 కోట్లతో వజ్రకిరీటం చేయించి అందజేసేందుకు ముందుకువచ్చారు. దేవస్థానం చైర్మన్ రోహిత్, ఈవో త్రినాథరావు శనివారం ఈ విషయాన్ని తెలిపారు. చదవండి: పథకమా.. పన్నాగమా.. అచ్చెన్నాయుడు మాస్టర్ ప్లాన్? సత్యప్రసాద్ దంపతులు ఇప్పటికే రూ.5.5 కోట్లతో స్వామివారి ప్రసాద భవనాన్ని, రూ.35 లక్షలతో సహస్రదీపాలంకార సేవకు మండపాన్ని నిర్మించారు. స్వామివారి పంచహారతుల సేవకు వెండి దీపాలను అందజేశారు. స్వామివారి నిత్య కల్యాణమండపాన్ని ఏసీ చేయించడంతో బాటు స్వామివారికి నిత్యం నివేదనకు బియ్యాన్ని అందజేస్తున్నారని ఈవో తెలిపారు. వజ్రకిరీటం చేయించే అవకాశం కలగడం తమకు దక్కిన అదృష్టంగా భావిస్తున్నామని సత్యప్రసాద్ తెలిపారు. -
అన్నవరం: ఇక పేదలకు కల్యాణ వైభోగమే..
సాక్షి, అన్నవరం: సత్యదేవుని సన్నిధిన పేదలు ఉచితంగా పెళ్లి చేసుకునేందుకు ‘శ్రీ సత్య శ్రీనివాస ఉచిత కల్యాణ మండపం’ వేదిక కానుంది. దేవస్థానం అధికారులు ఇందుకు అనుమతిచ్చారు. ఆధునిక వసతులతో ఒకేసారి 12 వివాహాలకు వీలుగా ఇక్కడ వేదికలు నిర్మించిన సంగతి తెలిసిందే. శ్రావణ మాసంలో జరిగే పెళ్లిళ్లకు అప్పుడే రిజర్వేషన్లు మొదలయ్యాయి. అన్నవరంలో పెళ్లి అదో ‘వరం’ రత్నగిరిపై పెళ్లి చేసుకున్న వారి బతుకులు బాగుంటాయన్నది భక్తుల విశ్వాసం. ఈ కారణంతోనే ఉభయ గోదావరి జిల్లాల వారే కాదు ఇతర ప్రాంతాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడ వివాహాలకు ఆసక్తి చూపిస్తుంటారు. ఆర్థిక స్తోమతను బట్టి ఇక్కడ కల్యాణ మండపాలను అద్దెకు తీసుకుంటారు. ఏటా ఐదు వేలు పైగా పెళ్లిళ్లు జరుగుతాయి. తక్కువ ఖర్చుతో వివాహం చేసుకోవాలనుకునేవారు ఇప్పటి వరకూ ఆరుబయట చేసుకునేవారు. వర్షం వస్తే వీరు చాలా ఇబ్బంది పడేవారు. పెళ్లి మధ్యలో వర్షం వస్తే షెల్టర్ కిందకు పరుగులు పెట్టిన సందర్భాలెన్నో. శ్రీసత్య శ్రీనివాస ఉచిత కల్యాణ మంటపం 3.5 కోట్లతో కల్యాణ మండపం కొండపై పెళ్లిళ్లకు పేదలు పడుతున్న ఇబ్బందులకు స్పందించి శ్రీ లలితా రైస్ ఇండస్ట్రీస్ అధినేతల్లో ఒకరైన మట్టే శ్రీనివాస్, విద్యుల్లత దంపతులు పెద్ద మనసు చాటుకున్నారు. రూ.3.5 కోట్లతో శ్రీసత్య శ్రీనివాస ఉచిత కల్యాణ మంటపం (ఏసీ) నిర్మించారు. ఈ నెల 16న టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దంపతులు దీనిని ప్రారంభించారు. మంటపం కేటాయింపులో పేదలకే అగ్రాసనమని ఆలయ ఈఓ త్రినాథరావు తెలిపారు. కల్యాణ మంటపంలో వివాహ వేదికలు సదుపాయాలివీ.. ► వివాహానికి 50 కుర్చీలు, జంబుఖానా, పెళ్లిపీటలు, కాడి, ఇతర వివాహ సామగ్రి. వధూవరులకు రెండు గదులు, బాత్రూం సౌకర్యం. ► వివాహ వేదికలు కావాలంటే వధూవరుల ఆధార్ కార్డులు, శుభలేఖ లేదా పురోహితుని లగ్నపత్రిక, అవసరం. ► నెల రోజులు ముందుగా రిజర్వ్ చేసుకోవాలి. ఆగస్టులో పెళ్లికి బుక్ చేసుకున్నాం ఉచిత కల్యాణ మంటపం చాలా బాగుంది. వేదికలు ఇంకా బాగున్నాయి. ఆగస్టు 25న రాత్రి 2.37 గంటలకు జరిగే పెళ్లికి కల్యాణ వేదికను బుక్ చేసుకున్నాం. దాతకు, దేవస్థానం అధికారులకు కృతజ్ఞతలు. – ఎన్.శ్రీనివాస్, అరసవిల్లి, శ్రీకాకుళం జిల్లా -
పాలుపోస్తే.. ఓటర్లు పదవి ఇచ్చారు
అన్నవరం: ఉపసర్పంచ్ వెంకన్నగారు.. పాలు పలుచగా ఉన్నాయండీ.. అని ప్రజలు అడుగుతుంటే.. ఉపసర్పంచ్కి పాలకి సంబంధం ఏంటని కొత్త వారు ఆశ్చర్యపోతుంటారు. పాల వ్యాపారం చేసే వెంకన్న ఉపసర్పంచ్గా ఎన్నికైనా యథావిధిగా సైకిల్ మీద ఖాతాదారులకు పాలు విక్రయిస్తున్నారు. ఇది తూర్పుగోదావరి జిల్లా అన్నవరం పంచాయతీ ఉప సర్పంచ్ సంగతి. స్థానిక వెలంపేటలో ఉండే బొబ్బిలి వెంకన్నబాబు 35 సంవత్సరాలుగా పాల వ్యాపారం చేస్తున్నారు. పాల వెంకన్నగా పేరు పొందారు. మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి, ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అంటే ఎంతో అభిమానం. 2013లో తొమ్మిదో వార్డు పదవికి పోటీచేసి రెండు ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఈనెల తొమ్మిదో తేదీన జరిగిన పంచాయతీ ఎన్నికల్లో అదే తొమ్మిదో వార్డు నుంచి వైఎస్సార్సీపీ అభిమానిగా పోటీచేసి 182 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. పంచాయతీ వార్డు సభ్యుల్లో ఇదే అత్యధిక మెజార్టీ. అన్నవరం పంచాయతీ సర్పంచ్ పదవితోపాటు 16 వార్డులకుగాను 15 వార్డుల్లో వైఎస్సార్సీపీ అభిమానులే విజయం సాధించారు. దీంతో ఉపసర్పంచ్ పదవికి తీవ్రపోటీ ఏర్పడింది. దీర్ఘకాలంగా పార్టీ విధేయుడిగా ఉండడం, బీసీ వర్గానికి చెంది అత్యధిక మెజార్టీతో విజయం సాధించడం, అన్నింటికి మించి వివాద రహితుడనే పేరుండడంతో బొబ్బిలి వెంకన్నబాబును ఉపసర్పంచ్ పదవికి ప్రత్తిపాడు శాసనసభ్యుడు పర్వత పూర్ణచంద్రప్రసాద్ ప్రతిపాదించారు. సర్పంచ్ శెట్టిబత్తుల కుమార్రాజా దీన్ని బలపర్చగా సభ్యులు ఏకగ్రీవంగా మద్దతు తెలిపారు. దీంతో వెంకన్న ఉపసర్పంచ్ అయ్యారు. ఆ మరుసటి రోజు నుంచే ఆయన తన మోటారు సైకిల్ మీద ఖాతాదారులకు పాలు విక్రయిస్తున్నారు. ఉదయం ఆరుగంటల నుంచి పదిగంటల వరకు, సాయంత్రం ఆరుగంటల నుంచి రాత్రి పదిగంటల వరకు పాల వ్యాపారం చేస్తానని, ఉదయం పదిగంటల నుంచి సాయంత్రం ఆరుగంటల వరకు ఉపసర్పంచ్గా గ్రామానికి సేవచేస్తానని వెంకన్నబాబు తెలిపారు. -
ఒంటరైన మూడేళ్ల చిన్నారి
భార్య, భర్త, మూడేళ్ల బాబు.. అందమైన కుటుంబం.. జీవితం ఎంతో సరదాగా సాగిపోతోంది. భర్త ఓ కంపెనీలో అసిస్టెంట్ ఎలక్ట్రికల్ ఇంజినీర్, భార్య గృహిణి. మూడు రోజుల క్రితం కుటుంబం అందరూ కలసి నూతన సంవత్సరం వేడుకల కోసం తుని నుంచి రాజమహేంద్రవరం వెళ్లారు. అక్కడ కుటుంబ సభ్యులతో సరదాగా గడిపారు. ఆదివారం మధ్యాహ్నం డ్యూటీ ఉండడంతో తిరిగి తుని బయల్దేరి వస్తుండగా.. విధి ఆ కుటుంబంపై పగబట్టింది. రోడ్డు ప్రమాద రూపంలో వారి జీవితాలను చిదిమేసింది. భార్యభర్తలను మృత్యు ఒడికి చేర్చి.. ఆ మూడేళ్ల చిన్నారిని తల్లి, తండ్రి లేని ఒంటరిని చేసింది. తీవ్రగాయాలతో ఆసుపత్రిలో చేరిన ఆ బాలుడికి ఏం జరిగిందో, అమ్మా, నాన్న ఏమయ్యారో తెలియక బిత్తరచూపులు చూస్తున్నాడు. సాక్షి, అన్నవరం: జాతీయ రహదారిపై ఆదివారం అన్నవరం వద్ద మధ్యాహ్నం డివైడర్ను బైక్ ఢీ కొట్టిన ప్రమాదంలో దానిపై ప్రయాణిస్తున్న భర్త మహ్మద్ కరీం(32) అక్కడికక్కడే మృతి చెందగా, భార్య మహ్మద్ అరీష్ కోమల్(26) తుని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందింది. బండి మీద వారిద్దరి మధ్య కూర్చున్న మూడేళ్ల బాలుడు కరీముల్లా ఖాదరీఫ్ తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసుల కథనం ప్రకారం.. రాజమహేంద్రవరానికి చెందిన మహ్మద్ కరీం పదేళ్లుగా విశాఖ జిల్లా రాజవరంలోని డక్కన్ కెమికల్స్లో అసిస్టెంట్ ఎలక్ట్రికల్ ఇంజినీర్గా విధులు నిర్వహిస్తున్నారు. ఆయనకు 2014లో కాకినాడకు చెందిన మహ్మద్ అరిష్ కోమల్తో వివాహమైంది. వీరు ఆరేళ్లుగా తునిలో నివాసం ఉంటున్నారు. మూడు రోజుల క్రితం నూతన సంవత్సర వేడుకల కోసం రాజమహేంద్రవరం వెళ్లిన వీరు ఆదివారం హీరోహోండా గ్లామర్ బైక్(ఏపీ05, డీబీ 6213)పై తిరిగి తుని బయల్దేరారు. వారి కుమారుడు ఖాదరీఫ్ను మధ్యలో కూర్చోబెట్టుకున్నారు. అన్నవరం జాతీయ రహదారిపై ప్రయాణిస్తుండగా.. స్నేహ రెసిడెన్సీ సమీపంలో డివైడర్ను వీరి బైక్ ఢీకొని ఒక్కసారిగా కింద పడిపోయారు. మహ్మద్ కరీం, భార్య అరిష్ కోమల్ రోడ్డు పక్కనే పడిపోగా, కుమారుడు ఖాదరీఫ్ పక్కనే ఉన్న తుప్పల్లో పడ్డాడు. స్థానికులు వీరిని గమనించి వెంటనే 108 అంబులెన్స్కు ఫోన్ చేయగా.. 108 సిబ్బంది అక్కడికి చేరుకుని వారిని పరీక్షించగా మహ్మద్ కరీం అప్పటికే చనిపోయాడు. భార్య, తీవ్ర గాయాలతో తుప్పల్లో పడి ఉన్న కుమారుడు ఖాదరీఫ్ను గమనించి వెంటనే తుని ఆసుపత్రికి తరలిస్తుండగా భార్య అరిష్ కోమల్ మార్గం మధ్యలో చనిపోయినట్టు పోలీసులు తెలిపారు. బాలుడు ఖాదరీఫ్కు తీవ్ర గాయాలవ్వడంతో అతడిని తుని ప్రభుత్వాసుపత్రి వైద్యుల సిఫారసుతో కాకినాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అన్నవరం ఎస్సై అజయ్ బాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: అడ్వాన్స్ ఇవ్వలేదని ప్రయాణికురాలి పీక కోశాడు..) -
మందుగుండు సామాగ్రి తయారీలో అపశ్రుతి
సాక్షి, విశాఖ : దీపావళి పండుగ సందర్భంగా మందుగుండు సామాగ్రి తయారీలో అపశ్రుతి చోటుచేసుకుంది. మందుగుండు తయారు చేస్తూ నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. చోడవరం పట్టణం అన్నవరం కాలనీలోని అంబేద్కర్ వీధికి చెందిన మహేష్(20) నిఖిల్(13) జ్యోసిత(13) దివ్య శనివారం బాణసంచా సామాగ్రి తయారు చేస్తుండగా ప్రమాదం జరిగింది. ముగ్గురికి కాళ్లు, చేతులు కాలడంతో చోడవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు జ్యోసిత తీవ్రంగా గాయపడటంతో ఆమెను అనకాపల్లిలోని ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
అన్నవరంలో దర్శనాలు నిలిపివేత
అన్నవరం: తూర్పుగోదావరి జిల్లా అన్నవరంలోని శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో దర్శనాలను ఆగస్టు 23 వరకు నిలిపివేస్తున్నట్లు దేవస్థానం ఈవో త్రినాథరావు తెలిపారు. ఇటీవల దేవస్థానం సిబ్బందిలో 650 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 50 మందికి పాజిటివ్గా నిర్థారణ అయ్యింది. దీంతో ఈ నెల 9 నుంచి 14 వరకు ఆలయంలో దర్శనాలను నిలిపివేశారు. ఈ నెల 11న మరో 250 మంది సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. ఆ ఫలితాలు రావాల్సి ఉంది. రెండ్రోజుల్లో మరో 200 మందికి పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా ఈ నెల 23 వరకు దర్శనాలు నిలిపివేస్తున్నట్లు దేవస్థానం ప్రకటించింది. వ్రతాలు, కల్యాణం, చండీ, ఆయుష్య హోమాలు, త్రికాల పూజలన్నీ ఏకాంతంగా నిర్వహించనున్నట్లు ఈ వో తెలిపారు. చదవండి: ఆన్లైన్లో శ్రీవారి కల్యాణోత్సవ సేవ -
బండరాయిని ఢీకొన్న కారు
అన్నవరం: తూర్పుగోదావరి జిల్లా అన్నవరం వద్ద 16వ నంబర్ జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారు జామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. వేగంగా వెళ్తున్న కారు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న పెద్ద బండరాయిని ఢీకొని పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో కారు నడుపుతున్న కట్టా శ్రీనివాసులు (30), ముందు సీట్లో కూర్చున్న దొమ్మేటి పవన్కుమార్ (33) అక్కడికక్కడే మృతి చెందారు. వెనుక సీట్లో కూర్చున్న గుత్తుల బాలు, దొమ్మేటి వెంకటేష్ గాయపడ్డారు. మృతులు శ్రీనివాసులుది జిల్లాలోని అమలాపురం మండలం గున్నేపల్లి అగ్రహారం. పవన్కుమార్ది అంబాజీపేట. గాయపడిన ఇద్దరిలో దొమ్మేటి వెంకటేష్ది అంబాజీపేట కాగా, గుత్తుల బాలుది విశాఖ జిల్లా గాజువాక. శనివారం రాత్రి కాకినాడలో జరిగిన స్నేహితుడి వివాహానికి హాజరైన ఈ నలుగురూ కారులో విశాఖపట్నం బయలుదేరారు. తెల్లవారుజామున 4.30 గంటలకు అన్నవరంలోని మండపం జంక్షన్ ముందున్న వై జంక్షన్ వద్ద కారు అదుపు తప్పి రోడ్డు పక్కన ఖాళీస్థలంలో ఉన్న పెద్ద బండరాయిని బలంగా ఢీకొంది. అనంతరం రెండు పల్టీలు కొట్టి, పది మీటర్ల అవతల రోడ్డు మీద బోల్తా పడింది. మృతి చెందిన, గాయపడిన నలుగురూ 30–35 మధ్య వయసు వారే. కోనసీమలో పుట్టిన వీరు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లి, వివిధ వృత్తుల్లో స్థిరపడ్డారు. అన్నవరం ఎస్సై మురళీమోహన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అప్పుడు దోపీడి చేసి ఇప్పుడు నీతులు..
సాక్షి, తూర్పుగోదావరి: అమరావతిలో భూముల రేట్లు పడిపోతాయని యనమల రామకృష్ణుడు రకరకాల ప్రేలాపణలు చేస్తున్నారని ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా మండిపడ్డారు. ఆయన గురువారం జిల్లాలోని అన్నవరంలో మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని అన్ని విధాలుగా దోపీడి చేసి ఇప్పుడు యనమల రామకృష్ణుడు నీతులు చెబుతున్నారని దుయ్యబట్టారు. అమరావతిలో యనమలతో పాటుగా ఆయన సోదరుడు, అల్లుడు భూములు కొన్నారని దాటిశెట్టి రాజా విమర్శించారు. ప్రజాధనాన్నీ.. యనమల, చంద్రబాబు కలిసి ఏలా దోచుకున్నారో త్వరలోనే బయట పెడతామన్నారు. పరిశ్రమల పెట్టుబడుల కోసం వైజాగ్లో నిర్వహించిన కార్యక్రమాలకు టీడీపీ వేల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిందని ఆయన ధ్వజమెత్తారు. చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన పారిశ్రామికవేత్తలు బస చేసిన ఒక్కో హోటల్కు రూ. 250 నుంచి రూ.300 కోట్లు చెల్లించారని దాడిశెట్టిరాజా మండిపడ్డారు. టీడీపీ పాలనలో రాష్ట్రం అధోగతి పాలైందని ఆయన తీవ్రంగా విమర్శించారు. టీడీపీ హయాంలో డబుల్ డిజిట్ గ్రోత్ ఎక్కడ వచ్చిందో యనమల చెప్పాలని రాజా డిమాండ్ చేశారు. కేవలం ఫిషింగ్ సెక్టార్లో డబుల్ డిజిట్ గ్రోత్ వచ్చిందని.. ఆ సెక్టార్లో వచ్చిన గ్రోత్ను పట్టుకుని అన్ని సెక్టార్లలో వచ్చినట్లు మీడియాతో ప్రచారం చేయించుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లూలూ గ్రూప్ అనేది ఓ షాపింగ్ మాల్ లాంటిదని దాటిశెట్టిరాజా అన్నారు. గట్టిగా ఐదువందల మందికి కూడా ఈ కంపెనీలో ఉద్యోగాలు రావని ఆయన రాజా విమర్శించారు. అటువంటి షాపింగ్ మాల్కు రూ.10వేల కోట్ల పెట్టుబడులు ఎలా పెడతారని ప్రశ్నించారు. లూలూ గ్రూప్ ప్రపంచంలో పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ అని.. యనమలతో పాటు చంద్రబాబు, లోకేష్ బిల్డప్ ఇస్తున్నారని దాడిశెట్టి రాజా ఎద్దేవా చేశారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వైజాగ్లో పర్యటిస్తే వేలాది మంది వచ్చారని ఆయన తెలిపారు. చంద్రబాబులా తాము పేయిడ్ ఆర్టిస్టులను తెచ్చుకోమని రాజా అన్నారు. -
బాలికపై లైంగిక దాడి కేసులో నిందితుడి పట్టివేత
అన్నవరం (ప్రత్తిపాడు): వైఎస్సార్ జిల్లా సుండుపల్లె పోలీస్ స్టేషన్ పరిధి రెడ్డివారిపల్లెకు చెందిన గిరిజన బాలికపై గత నెల 27న లైంగిక దాడికి పాల్పడి పరారీలో ఉన్న అర్చకుడు రవి అలియాస్ సత్యనారాయణను తూర్పు గోదావరి జిల్లా అన్నవరం పోలీసులు పట్టుకున్నారు. పరారీలో ఉన్న నిందితుడు ఓ కాల్ చేసుకోవాలంటూ పలువురి ఫోన్లు తీసుకుని, తన సన్నిహితుడికి ఫోన్ చేసేవాడు. అతడి ఫోన్ను ట్రాప్ చేసిన పోలీసులు చివరి కాల్ అన్నవరం రైల్వే స్టేషన్ నుంచి వచ్చిందని గుర్తించి నిందితుడి వివరాలు అన్నవరం పోలీసులకు పంపించారు. స్పందించిన అన్నవరం పోలీసులు రైల్వే స్టేషన్కు చేరుకుని శనివారం రాత్రి 7.30కు విజయవాడ వైపు వెళ్లే గోదావరి ఎక్స్ప్రెస్ ఎక్కేందుకు ప్రయత్నిస్తుండగా రవిని అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం సుండుపల్లె పోలీసులకు అప్పగించారు. -
ఇంగ్లీష్ విద్య కూడా అవసరం: స్వరూపానందేంద్ర స్వామీజీ
-
ఇంగ్లీష్ విద్యపై స్పందించిన స్వరూపానందేంద్ర
సాక్షి, తూర్పుగోదావరి: ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెడుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై విశాఖ శ్రీ శారద పీఠం పీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ హర్షం వ్యక్తం చేశారు. శనివారం అన్నవరంలో స్వామీజీ మాట్లాడుతూ.. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయానికి తన ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉంటుందని అన్నారు. భావితరాలు ముందుకు ఎదగడానికి ఇంగ్లీష్ ఎంతో అవసరమని.. దీంతో సామాన్య, పేద ప్రజల పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో చదివి ఉన్నత స్థాయిలో రాణిస్తారని అభిలాషించారు. నేడు బతకడానికి, బతుకుదెరువుకు ఇంగ్లీష్ అవసరం ఉందని.. లేదంటే దేశ, విదేశాల్లో ఉన్న మన తెలుగు బిడ్డలు రాణించడం కష్టమవుతుందని.. ఎలా బతుకుతారనే సందేహం వెలిబుచ్చారు. ఇంగ్లీష్ కారణంగానే ఏపీ, తెలంగాణకు చెందిన వారు ఎందరో దేశ, విదేశాల్లో ఉన్నత స్థాయిలో ఉన్నారని అన్నారు. అయితే అమ్మా అని పిలవడానికి తెలుగు కావాలని, తెలుగు మన కన్నతల్లి వంటిదని అభిప్రాయపడ్డారు. అటువంటి మన తెలుగు భాషను పరిరక్షించుకోవాలని కాంక్షించారు. -
అప్పుల బాధతో దంపతుల ఆత్మహత్య
అన్నవరం (ప్రత్తిపాడు): అప్పుల బాధ తట్టుకోలేక దంపతులు ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన తూర్పుగోదావరి జిల్లా అన్నవరంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్కు చెందిన భార్యాభర్తలు దుడ్డు ఎస్వీఆర్ పవన్ (50), దివ్యలక్ష్మి (45) ఆదివారం అన్నవరం వచ్చి ఓ హోటల్లో దిగారు. మంగళవారం ఉదయం ఎంతసేపటికీ వారు గది నుంచి బయటకు రాకపోవడంతో హోటల్ నిర్వాహకులు కిటికీ తీసి చూడగా దంపతులిద్దరూ ఫ్యాన్కు ఉరి వేసుకుని విగతజీవులై కనిపించారు. దీంతో హోటల్ నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దంపతులు బస చేసిన గదిలో సూసైడ్ నోట్ లభ్యమైంది. అందులో అప్పుల బాధ తాళలేక, అవి తీరే దారి లేక ఆత్మహత్య చేసుకుంటున్నట్టు పేర్కొన్నారు. -
వరాల మాట సరే.. చోరీల సంగతేంటి స్వామీ
తూర్పుగోదావరి ,అన్నవరం (ప్రత్తిపాడు): ఏ దిక్కు లేనివాళ్లకు దేవుడే దిక్కంటారు. మరి ఆ దేవుడు సన్నిధిలోనే దొంగతనాలు జోరుగా జరుగుతుంటే ఏం చేయాలి? ఎవరితో చెప్పుకోవాలి? ప్రస్తుతం అన్నవరం సత్యదేవుని సన్నిధిలో భక్తులు అదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. తమ కోర్కెలు స్వామికి చెప్పుకుందామని వస్తున్న వారు.. మా కార్ల అద్దాలు ఎవరూ పగులకొట్టకుండా.. మా పర్సులు, ఆభరణాలు ఎవరూ అపహరించకుండా చూడు స్వామీ అని వేడుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఆదివారం రత్నగిరిపై కారు అద్దాలు పగలగొట్టి రూ.20 వేల నగదు, మూడు సెల్ఫోన్లు పట్టుకుపోయిన విషయం తెలిసిందే.దీంతో సోమవారం దేవస్థానానికి వచ్చిన భక్తులు తమ కార్లకు తామే కాపలా కాసుకోవల్సిన పరిస్థితి ఏర్పడింది. కాగా ఆ కారు నిలిపి ఉంచిన ప్రదేశంలో సీసీ కెమెరా లేకపోవడంతో దొంగ ఆచూకీ దొరకలేదని పోలీసులు తెలిపారు. కీలక ప్రదేశాల్లో సీసీ కెమెరాలు పెట్టాలని ఈఓ ఆదేశించినా.. దేవస్థానంలో తరచూ చోరీలు జరుగుతున్న విషయాన్ని, కీలక ప్రదేశాల్లో సీసీ కెమెరాలు లేకపోవడాన్ని వివరిస్తూ ఈ నెల ఐదో తేదీన ‘సత్తెన్న.. భద్రతేదీ’ శీర్షికన ‘సాక్షి’లో కథనం ప్రచురితమైన విషయం విదితమే. దీనిపై స్పందించిన దేవస్థానం ఈఓ త్రినాథరావు భద్రత విషయంలో నిర్లక్ష్యంగా ఉండవద్దని దేవస్థానం సిబ్బందిని ఆదేశించి అన్ని కీలక ప్రాంతాల్లో సీసీ కెమెరాలు అమర్చాలని ఆదేశించారు. అయితే ఈఓ ముందు తల ఊపిన సంబంధిత సెక్షన్ అధికారులు కొన్ని చోట్ల మాత్రమే సీసీ కెమెరాలు అమర్చి చేతులు దులుపుకొన్నారు. వీఐపీలు బస చేసే వినాయక అతిథిగృహం వద్ద, ఆ పరిసరాల్లో భక్తులు తమ కార్లు నిలిపి ఉంచే పార్కింగ్ స్థలంలో కాని సీసీ కెమెరాలు అమర్చలేదు. ఇదే అదనుగా భావించిన దొంగ ఆదివారం తణుకుకు చెందిన కె.శ్రీనివాస్ కారు అద్దాలు పగలగొట్టి రూ.20 వేల నగదు, మూడు సెల్ఫోన్లు అపహరించారు. అంతే కాదు సీసీ కెమెరాలు లేని మార్గాల్లో అక్కడి నుంచి పరారయ్యాడు. ఆ దొంగ దేవస్థానంలోని అన్ని ప్రాంతాలు తెలిసిన వాడడం వల్లే అలా పరారవ్వగలిగాడనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. చోరీ జరిగినందుకు కొంత, కారు అద్దాలు పగలుకొట్టినందున కొత్త అద్దం వేయడానికి మరో రూ.40 వేల వరకు ఖర్చవుతుందని బాధితుడు శ్రీనివాస్ వాపోయారు. చోరీలు అరికట్టాలంటే.. ♦ రత్నగిరిపై చోరీలకు అడ్డుకట్ట వేయాలంటే.. దేవస్థానంలో పలు నిర్ణయాలను అమలు చేయాల్సి ఉంది. ♦ కొండ దిగువ నుంచి కొండ మీద వరకు ప్రతి పాయింట్ సీసీ కెమెరాలో కవర్ అయ్యేలా చర్యలు తీసుకోవాలి. ♦ దేవస్థానంలో భక్తుల కార్లు నిలిపేచోట సెక్యూరిటీ సిబ్బంది ని ఎక్కువగా నియమించాలి. ఆ ప్రాంతాలలో సీసీ కెమెరాలు తప్పక ఏర్పాటు చేయాలి. వీఐపీ కాటేజీల్లో కూడా వీటిని ఏర్పాటు చేయాలి. పోలీస్ అవుట్పోస్టు ఏర్పాటు చేయాలి. ఒక కానిస్టేబుల్ ప్రతి రెండు గంటలకు దేవస్థానంలో అన్ని పాయింట్లు చెక్ చేసి అక్కడ ఉన్న సెక్యూరిటీ సిబ్బందిని అలర్ట్ చేయాలి. ♦ దొంగతనం చేస్తూ పట్టుబడిన వారి ఫొటోలను దేవస్థానంలోని కీలక ప్రదేశాల్లో ప్రదర్శించి భక్తులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలి. ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పదిగంటల వరకు సీసీ టీవీ లను పరిశీలించేందుకు సిబ్బందిని నియమించాలి. ♦ ప్రధానంగా చోరీ సంఘటనలు జరిగినపుడు అక్కడ సిబ్బందిపై చర్యలు ఉండాలి. దేవస్థానంలో భద్రతను కట్టుదిట్టం చేస్తాం: ఈఓ త్రినాథరావు ఆదివారం జరిగిన చోరీ సంఘటన దురదృష్టకరం. దేవస్థానంలో చాలా చోట్ల సీసీ కెమెరాలు లేవని ‘సాక్షి’లో వార్త వచ్చినపుడు అన్ని ప్రదేశాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సిబ్బందిని ఆదేశించా. కానీ ఆ కారు నిలిపినచోట సీసీ కెమెరాలు లేవని తెలిసింది. సోమవారం ఉదయం ఆ ప్రాంతానికి వెళ్లి చూడగా ఎక్కడా సీసీ కెమెరా కనిపించలేదు. అంత కీలకమైన చోట ఎందుకు సీసీ కెమెరా పెట్టలేదో వివరణ ఇవ్వాలని సిబ్బందిని ఆదేశించాను. నాలుగు రోజుల్లో అన్ని చోట్ల కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించాను. పోలీసులు గస్తీ తిరిగేలా చర్యలు తీసుకుంటాం. ఈ మేరకు ఉన్నతాధికారులతో మాట్లాడతాను. -
బ్యాంకులో బంగారం విడిపిస్తానని ఫైనాన్సియర్ను నమ్మించి..
సాక్షి, తూర్పుగోదావరి(అన్నవరం) : బ్యాంకులో కుదువ పెట్టిన రూ.ఏడు లక్షల విలువైన బంగారాన్ని విడిపించుకోవడానికి రూ.2.20 లక్షలు సహాయం చేస్తే ఆ బంగారాన్ని తక్కువ ధరకు మీకే విక్రయిస్తానని ఫైనాన్సియర్ను నమ్మించి ఆ సొమ్ము తీసుకుని పరారైన ఘరానా మోసగాడి ఉదంతమిది. తొండంగి ఎస్సై గోపాలకృష్ణ కథనం ప్రకారం.. మండలంలోని గోపాలపట్నంలోని ఎస్బీఐ బ్రాంచ్ ఇటీవల బ్యాంకులో ఖాతాదారులు విడిపించుకోని బంగారాన్ని వేలం వేస్తున్నట్టు పత్రికలో ప్రకటన ఇచ్చింది. అది చూసిన పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన కుమార్ అనే వ్యక్తి విజయవాడలోని ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీకి ఫోన్ చేశాడు. ఆ కంపెనీ బ్యాంకు వేలం వేసే బంగారాన్ని పాడుకుని తిరిగి లాభాలకు విక్రయిస్తుంది. ఈ కంపెనీకి ఈనెల ఆరో తేదీన కుమార్ ఫోన్ చేసి గోపాలపట్నంలో గల స్టేట్బ్యాంక్ శాఖలో రూ.ఏడు లక్షల విలువ చేసే తన బంగారం సోమవారం వేలం వేస్తున్నారని, తన వద్ద రూ.ఐదు లక్షలు మాత్రమే ఉన్నాయని, మిగిలిన డబ్బు మీరు సర్దితే ఆ బంగారాన్ని విడిపించి వెంటనే మీకు అమ్ముతానని తెలిపాడు. అది నిజమని నమ్మిన ఆ ఫైనాన్స్ కంపెనీ యజమాని రూ.2.20 లక్షలు తమ వద్ద పనిచేసే టి.సురేష్ అనే వ్యక్తికి ఇచ్చి సోమవారం ఉదయం ఆ బ్యాంక్కు పంపించారు. మరోవైపు కుమార్ సోమవారం ఉదయం అన్నవరం ఆర్టీసీ కాంప్లెక్స్లో బస్ దిగి, తాను ఆర్టీసీలో డీఎంనని అక్కడ క్యాంటీన్ నిర్వహిస్తున్న కర్రి లోవదొరను పరిచయం చేసుకున్నాడు. అర్జెంట్ గా స్టేట్బ్యాంక్కు వెళ్లాలని కారు కావాలని అడిగాడు. దీంతో లోవదొర తన కారు ఇచ్చి తన బంధువుతో అతడిని బ్యాంకుకు పంపించాడు. ఆ బ్యాంకు వద్ద వేచి ఉన్న ఫైనాన్స్ కంపెనీ ఉద్యోగి సురేష్ వద్దకు వెళ్లి ఈ కారు తనదేనని చెప్పి బీఎం వద్దకు వెళ్లి మాట్లాడివస్తానని వెళ్లాడు. తరువాత కొంతసేపటికి వెనక్కి వచ్చి డబ్బు ఇవ్వండి బ్యాంకు మేనేజర్కు కట్టేస్తాను అని రూ.2.20 లక్షలు తీసుకుని మరలా బ్యాంక్ మేనేజర్ రూమ్లోకి వెళ్లి ఆయనతో మాట్లాడి వెనక్కి వచ్చాడు. అర్జంటుగా బయటకు వెళ్లి ఒక సంతకం పెట్టాలి ఇప్పుడే వస్తాను అని చెప్పి వెళుతుండగా ఆ ఫైనాన్స్ ఉద్యోగి అతడిని నిలదీశాడు. ‘‘మా కారు ఇక్కడే ఉంది. నేను ఇప్పుడే వచ్చేస్తా’’ అని చెప్పి రోడ్డు మీదకు వెళ్లాడు. ఎంతసేపటికి అతడు రాకపోవడంతో ఆఫైనాన్స్ ఉద్యోగి బ్రాంచ్ మేనేజర్ వద్దకు వెళ్లి గోల్డ్లోన్ వేలం గురించి, తన వద్ద డబ్బు చెల్లించాలని తీసుకున్న విషయం చెప్పాడు. అయితే తనను ఆ విషయాలు అతడు అడగలేదని, పర్సనల్ లోన్ కావాలని మాత్రమే అడిగాడని బీఎం చెప్పారు. దీంతో ఆ ఫైనాన్స్ కంపెనీ ఉద్యోగి సురేష్ మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు బ్యాంకుకు వచ్చి సీసీటీవీ పుటేజీ పరిశీలించి ఆ మోసగాడి ఫొటో డౌన్లోడ్ చేశారు. ఈ మోసగాడిపై ఇప్పటికే ఉభయ గోదావరి, కృష్ణాజిల్లాల్లో పదికి పైగా కేసులు పెండింగ్ లో ఉన్నాయని పరిశీలనలో తేలిందని ఎస్సై తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. -
సత్యదేవుని ఆవిర్భావ వేడుకలకు అంకురార్పణ
సాక్షి, అన్నవరం (తూర్పుగోదావరి) : రత్నగిరివాసుడు శ్రీ సత్యదేవుని 129వ ఆవిర్భావ దినోత్సవాన్ని గురువారం వైభవంగా ప్రారంభించారు. ఉదయం 9.15 గంటలకు గణపతి పూజ, పుణ్యాహవచనం, పారాయణ తదితర కార్యక్రమాలను వైభవంగా నిర్వహించారు. 125 మంది రుత్విక్కులు, ఆలయ వైదిక సిబ్బందికి దీక్షావస్త్రాలను దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ ఎం.సురేష్ బాబు, ఏసీ డీఎల్వీ రమేష్బాబు అందజేశారు. సాయంత్రం దర్భారు మంటపంలో కలశ స్థాపన, మంటపారాధన చేశారు. అనంతరం స్వామి, అమ్మవార్లకు నీరాజన మంత్ర పుష్పాలతో సేవ చేశారు. దేవస్థానం వేద పండితులు కపిలవాయి రామశాస్త్రి, ముష్టి కామశాస్త్రి, గొల్లపల్లి ఘనపాఠీ, ప్రధానార్చకుడు కొండవీటి సత్యనారాయణ, స్పెషల్ గ్రేడ్ వ్రత పురోహితులు నాగాభట్ల కామేశ్వర శర్మ, ముత్య సత్యనారాయణ, ఛామర్తి కన్నబాబు, రవిశర్మ, అంగర సతీష్, పాలంకి పట్టాభి తదితరులు పూజాదికాలు నిర్వహించారు. దేవస్థానం ఏసీ రమేష్బాబు, ఏఈఓ ఎంకేటీఎన్వీ ప్రసాద్ ఏర్పాట్లను పర్యవేక్షించారు, నేడు ఆవిర్భావ వేడుక సత్యదేవుని ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా శుక్రవారం తెల్లవారుజామున నాలుగు గంటలకు స్వామి, అమ్మవార్ల మూలవిరాట్లకు మహాన్యాసపూర్వక అభిషేకం, పట్టువస్తాలు, స్వర్ణాభరణాలతో అలంకరించి ప్రత్యేక పూజలు చేస్తారు. ఎనిమిది గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. అనంతరం స్వామివారి విశేష పూజలు, హోమం నిర్వహిస్తారు. ఫల పుష్పసేవకు ఏర్పాట్లు రాత్రి 7.30 గంటలకు శ్రీ స్వామివారి నిత్యకల్యాణ మంటపంలో సత్యదేవుడు, అమ్మవార్లకు ఫల పుష్పసేవకు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు. 20 రకాల ఫలాలు, 30 రకాల పుష్పాలతో మంటపాన్ని ముస్తాబు చేస్తున్నారు. తాపేశ్వరంలోని సురుచి ఫుడ్స్ అధినేత పోలిశెట్టి మల్లిబాబు అందజేసే మహాలడ్డూను స్వామివారికి నివేదన చేస్తారు. తాపేశ్వరం లడ్డూ నేడు అన్నవరం తరలింపు తాపేశ్వరం (మండపేట): అన్నవరం సత్యదేవుని జన్మ దినోత్సవాల సందర్భంగా స్వామివారికి తాపేశ్వరంలోని మడత కాజా మాతృ సంస్థ సురుచి ఫుడ్స్ 500 కిలోల లడ్డూ తయారీ ప్రారంభమైంది. ప్రత్యేక పూజలు అనంతరం గురువారం సంస్థ అధినేత పోలిశెట్టి మల్లిబాబు లడ్డూ తయారీని ప్రారంభించారు. అర టన్ను బరువుతో ఈ లడ్డూ తయారీకి 220 కిలోల పంచదార, 130 కేజీల శనగపిండి, 110 కేజీల ఆవు నెయ్యి, 23 కేజీల జీడిపప్పు, ఆరు కేజీల బాదం పప్పు, రెండు కేజీల యాలికలు, అర కేజీ పచ్చకర్పూరం వినియోగి స్తున్నట్టు ఆయన తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం ప్రత్యేక వాహనంలో ఈ లడ్డూను అన్నవరం సత్యదేవుని సన్నిధికి తరలిస్తామని తెలిపారు. -
నేడు ఆలయాల మూసివేత
తిరుమల/అన్నవరం(ప్రత్తిపాడు)/ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): ఈనెల 17వ తేదీన చంద్రగ్రహణం కారణంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రముఖ ఆలయాలు మూసివేయనున్నారు. మంగళవారం రాత్రి 7 గంటల నుంచి మరుసటిరోజు తెల్లవారుజామున 5 వరకు తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయం తలుపులు మూసివేస్తారు. 17న బుధవారం ఉదయాత్పూర్వం 1.31 నుంచి 4.29 గంటల వరకు చంద్రగ్రహణం ఉంటుంది. గ్రహణ సమయానికి 6 గంటల ముందుగా ఆలయం తలుపులు మూసివేయడం ఆనవాయితీ. 17న ఉదయం 5 గంటలకు సుప్రభాతంతో ఆలయ తలుపులు తెరిచి శుద్ధి పుణ్యాహవచనం నిర్వహిస్తారు. అనంతరం తోమాలసేవ, కొలువు, పంచాంగ శ్రవణం, అర్చన సేవలను ఏకాంతంగా నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు సర్వదర్శనం ప్రారంభమవుతుంది. 16న దివ్యదర్శనం, సర్వదర్శనం టోకెన్లను రద్దు చేశారు. సత్యదేవుని ఆలయం.. చంద్రగ్రహణం కారణంగా అన్నవరంలోని సత్యదేవుని ఆలయాన్ని సాయంత్రం నాలుగు గంటలకు మూసివేయనున్నట్లు ఆలయాన్ని శుద్ధి చేసిన అనంతరం బుధవారం ఉదయం తొమ్మిది గంటల నుంచి భక్తులకు స్వామివారి దర్శనాలతోపాటు వ్రతాలు, ఇతర పూజా కార్యక్రమాలు యథావిధిగా జరుగుతాయని తెలిపారు. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై శాకంబరి ఉత్సవాలు జరుగుతున్నాయి. మంగళవారంతో శాకంబరిదేవి ఉత్సవాలు ముగియనున్నాయి. చంద్రగ్రహణం కారణంగా మంగళవారం సాయంత్రం 6 గంటల వరకే భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. మల్లేశ్వర స్వామి వారి ఆలయం, ఇతర ఉప ఆలయాలు మూసివేస్తారు. -
అన్నవరంలో అమానుషం
అన్నవరం (ప్రత్తిపాడు): సత్యదేవుడు కొలువైన తూర్పుగోదావరి జిల్లా అన్నవరంలో సోమవారం విషాదం చోటుచేసుకుంది. దేవస్థానం మొదటి ఘాట్రోడ్ దిగువన ఓ ఇంట్లో నివాసం ఉంటున్న ఓ వివాహిత, ఆమె ఇద్దరు చిన్నారులు సోమవారం అనుమానాస్పదస్థితిలో మృతి చెందారు. వివరాలు ఇలా ఉన్నాయి... అన్నవరంలోని జూనియర్ కళాశాల వెనుకనున్న ఇంట్లో నివాసం ఉంటున్న తాళ్లపురెడ్డి సుష్మ రాజ్యలక్ష్మి (26), ఆమె కుమారులు సాత్విక్ (ఐదు), రెండో కుమారుడు యువన్ (7 నెలలు) సోమవారం ఉదయం విగతజీవులుగా కనిపించారు. తాము ఇంట్లో లేని సమయంలో తమ కోడలు పిల్లలను చంపి, ఉరి వేసుకుని చనిపోయిందని మృతురాలి మామ చంద్రరావు అన్నవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే తమ కుమార్తెను భర్త, అత్త, మామలు తరుచూ వేధించేవారని, వారే పిల్లలను, తమ కుమార్తెను హత్య చేయడమో, లేక ఆత్మహత్య చేసుకునే విధంగా ప్రేరేపించడమో చేశారని రాజ్యలక్ష్మి తల్లిదండ్రులు, బంధువులు ఆరోపిస్తున్నారు. పండుగకు వెళ్లి వచ్చి... సుష్మ రాజ్యలక్ష్మిది విశాఖపట్నం జిల్లా నాతవరం మండలం కిత్తనాయుడుపాలెం గ్రామం. 2013 సంవత్సరంలో అన్నవరానికి చెందిన తాళ్లపురెడ్డి లోవ వెంకట రమేష్తో వివాహమైంది. వివాహ సమయంలో కట్న, కానుకలు కింద రూ.రెండు లక్షలు ఇచ్చినట్లు మృతురాలి తండ్రి కొరుప్రోలు పెదరాజబాబు తెలిపారు. అయితే వివాహమైనప్పటి నుంచి తన భర్త, అత్త మామలు, ఆడపడుచులు తరుచూ తనను సూటిపోటి మాటలతో వేధిస్తున్నారంటూ తన కుమార్తె తరచూ చెప్పేదని తెలిపారు. గత నెలలో స్వగ్రామంలో జరిగిన పండుగకు తమ కుమార్తె పిల్లలతో పాటు వచ్చిందని, ఈ నెల ఆరో తేదీన తిరిగి అన్నవరం పంపించామని, ఇంతలోనే ఈ ఘోరం జరిగిపోయిందని రోధించారు. కాగా మృతురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు వరకట్న చావు, హత్య కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అన్నవరం ఎస్ఐ మురళీమోహన్ తెలిపారు. అత్త, మామ, భర్తలను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు తెలిపారు. పోస్టుమార్టానికి తరలించకుండా అడ్డుకున్న బంధువులు సుష్మరాజ్యలక్ష్మి, ఆమె పిల్లల చావుకు కారణమైన వారిని కఠినంగా శిక్షించే వరకూ మృతదేహాలను పోస్టుమార్టానికి కదలనిచ్చేది లేదని మృతురాలు ఇంటివద్ద ఆమె బంధువులు బైఠాయించారు. మృత దేహాలను తరలించేందుకు వచ్చిన అంబులెన్స్ను కూడా అడ్డుకున్నారు. -
శ్రీసత్య నారాయణుడి కల్యాణం చూతము రారండీ...
సాక్షాత్తూ శ్రీమన్నారాయణుడే లక్ష్మీ సమేతుడై వెలసిన ప్రముఖ పుణ్యక్షేత్రం తూర్పుగోదావరి జిల్లాలోని అన్నవరం, ఇక్కడ రత్నగిరి పై పంపానదీ తీరాన 128 సంవత్సరాల క్రితం వెలసిన భక్తవరదుడు శ్రీ వీర వేంకటసత్యనారాయణ స్వామి. లక్ష్మీదేవి అంశ అయిన శ్రీ అనంతలక్ష్మీ సత్యవతీదేవి, శంకరుడు ఒకే పానపట్టంపై దర్శనమిచ్చి భక్తుల కోరిన కోర్కెలు తీర్చే స్వామిగా సత్యదేవుని ఖ్యాతి జగద్విదితం. శివ కేశవులకు భేదం లేదని తెలిపే విధంగా విష్ణుమూర్తి శివుడు, శక్తి స్వరూపం అనంతలక్ష్మీ అమ్మవారు పక్కపక్కనే దర్శనమివ్వడం ఇక్కడ విశేషం. 14 నుంచి స్వామివారి దివ్యకల్యాణమహోత్సవాలు శ్రీ సత్యదేవుని దివ్యకల్యాణమహోత్సవాలు వైశాఖ శుద్ధ దశమి అనగా మే14 వ తేదీ నుంచి వైశాఖ బహుళ పాడ్యమి 19వ తేదీ వరకూ అంగరంగ వైభవంగా నిర్వహించడానికి దేవస్థానం ఏర్పాట్లు చేసింది. వైశాఖ శుద్ధ ఏకాదశి, మే 15 రాత్రి తొమ్మిది గంటల నుంచి 11–30 గంటల వరకూ స్వామివారి దివ్య కల్యాణమహోత్సవం ఘనంగా జరుగనుంది. స్వామివారి కల్యాణమహోత్సవం అనంతరం భక్తులకు స్వామివారి తలంబ్రాలు, ప్రసాదాలను కూడా పంపిణీ చే యనున్నారు.ఈసారి స్వామి కల్యాణమహోత్సవాలు ఏడు రోజులకు బదులు ఆరు రోజులు మాత్రమే జరుగుతాయని అధికారులు తెలిపారు. వైశాఖ శుద్ధద్వాదశి, త్రయోదశి రెండు తిథులు ఒకే రోజు వచ్చినందున ఆ రెండు రోజుల కార్యక్రమాలు ద్వాదశినే నిర్వహిస్తున్నారు.భద్రాద్రి రాముని కల్యాణం తరువాత తెలుగు రాష్ట్రాలలో అంత ప్రాముఖ్యత కలిగిన వేడుక రత్నగిరి శ్రీసత్యదేవుని దివ్యకల్యాణం. ఈ వేడుకకి పెళ్లి పెద్దలుగా శ్రీసీతారాములే వ్యవహరిస్తారు. అన్నవరం క్షేత్రానికి క్షేత్రపాలకునిగా శ్రీరాముడు పూజలందుకుంటున్న విషయం తెలిసిందే. ఆ హోదాలో ఆ వేడుకలకు పెళ్లి పెద్దలుగా వ్యవహరిస్తారు. 15 నుంచి ‘పంచహారతుల సేవ’ ఈ కల్యాణమహోత్సవాల వేడుకల్లో భాగంగా శ్రీసత్యదేవుడు, అమ్మవారికి నూతనంగా ‘పంచ హారతుల సేవ’ను ఈ నెల 15వ తేదీ నుంచి ప్రారంభిస్తున్నట్లు దేవస్థానం ఈఓ ఎంవీ సురేష్ బాబు తెలిపారు. ఈ సేవకు పెద్దాపురానికి లలితాబ్రాండ్ రైస్ కంపెనీ అధినేతలు మట్టే సత్యప్రసాద్, శ్రీనివాస్ సోదరులు సుమారు 12కిలోల వెండితో చేయించిన ఎనిమిది రకాల ఆకృతులతో వెండిహారతి సామాగ్రి విరాళంగా అందచేస్తున్నారని తెలిపారు. రోజూ రాత్రి ఏడు గంటల నుంచి అర్ధగంట సేపు ఈ సేవ స్వామివారి ప్రధానాలయంలో నిర్వహిస్తారు. రూ.500 టికెట్తో రోజూ 20 దంపతులను మాత్రమే ఈ కార్యక్రమానికి అనుమతిస్తారు. మే 14, వైశాఖ శుద్ధ దశమి మంగళవారం సాయంత్రం నాలుగు గంటలకు స్వామివారి దేవాలయ ప్రాంగణంలోని అనివేటి మండపంలో శ్రీసత్యదేవుడు, అమ్మవారిని వధూవరులను చేస్తారు. అనంతరం రామారాయ కళావేదిక మీద స్వామి, అమ్మవార్లకు ఎదుర్కోలు ఉత్సవం నిర్వహిస్తారు. 15, వైశాఖ శుద్ధ ఏకాదశి, బుధవారం రాత్రి తొమ్మిది నుంచి 11–30 గంటల వరకూ కల్యాణవేదిక మీద స్వామి, అమ్మవార్లకు దివ్యకల్యాణమహోత్సవం నిర్వహిస్తారు. 16, వైశాఖ శుద్ధ ద్వాదశి, త్రయోదశి, గురువారం ప్రధాన స్థాలీపాక హోమాలు, రాత్రి ఏడు గంటలకు అరుంధతి దర్శనం, అనంతరం స్వామి అమ్మవార్లను రాత్రి తొమ్మిది గంటల నుంచి రావణవాహనం మీద, పొన్నవాహనం మీద స్వామి, అమ్మవార్లను ఊరేగిస్తారు. 17, వైశాఖశుద్ధ చతుర్దశి, శుక్రవారం మధ్యాహ్నం 2–30కు అనివేటి మండపంలో పండిత సదస్యం, సాయంత్రం ఐదు గంటలకు కొండదిగువన దేవస్థానం గార్డెన్స్లో శ్రీవారి వనవిహారం. 18, వైశాఖ శుద్ధ్ద పౌర్ణమి, శనివారం ఉదయం 8–30 గంటలకు పంపానదిలో నిర్మించిన పుష్కరిణిలో స్వామివారి ‘శ్రీచక్రస్నానం’. సాయంత్రం 4 గంటలకు రత్నగిరిపై అనివేటి మండపంలో నీలలోహిత గౌరీపూజ, నాకబలి, దండియాడింపు, ధ్వజావరోహణం, కంకణ విమోచన. 19, వైశాఖ బహుళ పాడ్యమి, ఆదివారం రాత్రి ఏడు గంటలకు స్వామివారి నిత్య కల్యాణమండపంలో శ్రీస్వామి, అమ్మవార్లకు శ్రీపుష్పయోగం కార్యక్రమంతో ఉత్సవాలు ముగుస్తాయి. నాగఫణిశర్మ అష్టావధానం ఈసారి శ్రీసత్యదేవుని దివ్యకల్యాణమహోత్సవాలలో ద్విసహస్రావధాని మాడుగుల నాగఫణిశర్మ అష్టావధాన కార్యక్రమం 16వ తేదీ సాయంత్రం ఏర్పాటు చేశారు. నాగఫణిశర్మ 14న ఎదుర్కోలు ఉత్సవంలో, 15న స్వామివారి కల్యాణమహోత్సవాలలో వ్యాఖ్యాతగా వ్యవహరిస్తారు.కాగా పంపలో నీరు లేకపోవడంతో తాత్కాలిక పుష్కరిణి నిర్మించారు. ఆ పుష్కరిణికి ఏలేరు జలాలు తరలించడంతో పుష్కరిణి కళకళ లాడుతోంది. ఈ పుష్కరిణి లోనే 18న సత్యదేవుని చక్రస్నాన కార్యక్రమం నిర్వహించనున్నారు. అనిశెట్టి వేంకట రామకృష్ణ సాక్షి, అన్నవరం, -
అప్పుడే పెళ్లి చేసుకున్న ప్రేమ జంటపై ..
సాక్షి, కృష్ణా : అప్పుడే పెళ్లి చేసుకొని ఇంటికి తిరిగి ఇంటికి వస్తున్న ప్రేమ జంటపై యువతి బంధువుల దాడి చేసి నవవధువును లాక్కెళ్లిన ఘటన కృష్ణా జిల్లా అవనిగడ్డలో చోటు చేసుకుంది. గుంటూరు జిల్లా రేపల్లె మండలం అరవపల్లికి చెందిన వేపూరి గోపి(23), అదే గ్రామానికి చెందిన భూపతి పూజిత(20) గత కొద్ది రోజులుగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడంతో అన్నవరం గుడిలో వివాహం చేసుకున్నారు. వివాహనంతరం తిరిగి సొంత గ్రామానికి వస్తుండగా పులిగడ్డ టోల్గేట్ వద్ద నవ దంపతులపై యువతి బంధువలు దాడి చేశారు. గోపిని తీవ్రంగా గాయపరచి పూజితను కిడ్నాప్ చేశారు. ఈ దాడిపై నవవరుడు గోపి అవనిగడ్డ పీఎస్లో ఫిర్యాదు చేశారు. -
మోగనున్న పెళ్లిబాజా
శుభకార్యాలు నిర్వహించుకోవడం కోసం చాలామంది ఎదురు చూసే మాఘమాసం రానే వచ్చింది. మంగళవారం నుంచి మార్చి ఆరో తేదీ వరకూ మాఘమాసం కొనసాగనుంది. ఈ పవిత్ర మాసంలో మంచి ముహూర్తాలు ఉండడంతో వివాహాలు, గృహప్రవేశాలు, శంకుస్థాపనలు తదితర శుభకార్యాలు జోరుగా జరగనున్నాయి. ప్రతి గ్రామంలోనూ పెళ్లిబాజాలు మోగనున్నాయి. ముఖ్యంగా ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం శ్రీ వీర వేంకట సత్యనారాయణస్వామి వారి దేవస్థానంలో పెళ్లిళ్లు జోరుగా జరగనున్నాయి. దీంతోపాటు పలు పర్వదినాలు కూడా ఉన్న నేపథ్యంలో దేవస్థానం అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. తూర్పుగోదావరి, అన్నవరం (ప్రత్తిపాడు): జిల్లాలో వివాహాది శుభకార్యాలు చివరిగా మార్గశిర బహుళ నవమి అంటే డిసెంబర్ 30న జరిగాయి. తిరిగి 35 రోజుల విరామం అనంతరం బుధవారం నుంచి ఈ నెల 28వ తేదీ వరకూ వివాహాలు జరగనున్నాయి. వీటిలో ఈ నెల 8, 9, 10, 11 తేదీల్లో ఉన్న ముహూర్తాల్లో పెద్ద సంఖ్యలో వివాహాలు చేసేందుకు చాలామంది ఏర్పాట్లు చేసుకున్నారు. అలాగే మార్చి ఏడో తేదీ నుంచి మొదలయ్యే ఫాల్గుణ మాసంలో కూడా మార్చి 30వ తేదీ వరకూ వివాహాలు జరుగుతాయని పండితులు తెలిపారు. సుముహూర్తాల నేపథ్యంలో రత్నగిరిపై సందడి మొదలైంది. వివాహాలు చేసుకునే పెళ్లిబృందాలు ఇప్పటికే సత్రాల్లో గదులు, వివాహ మండపాలను రిజర్వ్ చేసుకున్నాయి. ఆ రోజుల్లో ఇతర భక్తులకు వసతి గదులు తక్కువగా మాత్రమే లభ్యమయ్యే పరిస్థితి ఏర్పడింది. వివాహముహూర్తాల నేపథ్యంలో రత్నగిరిపై పురోహితులు, క్యాటరింగ్, బజంత్రీలకు డిమాండ్ పెరిగింది. పర్వదినాలకు ఏర్పాట్లు ఇదిలా ఉండగా మాఘమాసంలో వచ్చే పర్వదినాలైన రథసప్తమి, భీష్మ ఏకాదశిని దృష్టిలో ఉంచుకొని దేవస్థానంలో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. రథసప్తమి నాడు సూర్యభగవానుడికి ప్రత్యేక పూజలు, సూర్యనమస్కారాలు తదితర కార్యక్రమాలు నిర్వహిస్తారు. అలాగే 16వ తేదీన భీష్మ ఏకాదశి సందర్భంగా తెల్లవారుజాము నుంచి రత్నగిరిపై వ్రతాలు ప్రారంభించడంతోపాటు సత్యదేవుని దర్శనానికి భక్తులను అనుమతిస్తారు. మార్చి నాలుగో తేదీన మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా రాత్రి 12 గంటలకు సత్యదేవుని మూలవిరాట్ పక్కనే ఉన్న శివలింగానికి ప్రత్యేక అభిషేకం చేయనున్నారు. లక్షమంది భక్తులు వస్తారనే అంచనాతో.. భీష్మ ఏకాదశి పర్వదినం నాడు సుమారు లక్ష మంది భక్తులు స్వామివారి దర్శనానికి వస్తారనే అంచనాతో ఏర్పాట్లు చేస్తున్నాం. ప్రత్యేక క్యూ లైన్లు, వ్రతాల కోసం అదనపు మండపాలు అందుబాటులోకి తెస్తాం. భక్తుల కోసం ప్రత్యేక ప్రసాదం కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నాం. ఉదయం నుంచీ భక్తులకు పులిహోర, దద్ధోజనం పంపిణీ చేస్తాం.– వి.త్రినాథరావు, ఇన్చార్జి ఈఓ, అన్నవరం దేవస్థానం -
అన్నవరంలో ప్రేమజంట ఆత్మహత్యాయత్నం
-
నేడు అన్నవరం సత్యదేవుని కల్యాణోత్సవం
-
నడిరోడ్డుపై ప్రసవం
అన్నవరం (ప్రత్తిపాడు): సోమవారం ఉదయం పది గంటలు. 35 డిగ్రీలకు మించిన ఎండ. ఆ సమయంలో అన్నవరం పాతబస్టాండ్లో ఒక ఆటో ఆగింది. దానిలో నుంచి నిండుగర్భిణి, ఆమె తల్లి కిందకు దిగారు. అప్పటికే ఆ మహిళ తీవ్రంగా నొప్పులు పడుతోంది. కిందకు దిగిన మరుక్షణం ఆమె కిందకు వాలిపోయింది. ఆ వెంటనే పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. అసలేం జరిగిందో తెలుసుకునేలోపే ప్రసవం జరిగిపోయింది. ఆ మహిళ వెంట వచ్చిన ఆమె తల్లి ఆ శిశువును తన పొత్తిళ్లలోకి తీసుకోగా ఆ మహిళ కొంతసేపు అలానే నేలమీద కూర్చుండి పోయింది. అక్కడ ఉన్న వారు కొంతమంది 108కు ఫోన్ చేయగా వెంటనే సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. ఆమె చెప్పిన వివరాల మేరకు ప్రాథమిక చికిత్స చేసి తొండంగి పీహెచ్సీ కి తరలించారు. వివరాలివీ.. 108 సిబ్బంది కథనం ప్రకారం.. తొండంగి మండలం సీతారాం పురం గ్రామానికి చెందిన మహిళపేరు మారుకొండ పెద్దాపురం అని తెలిపారు. తొండంగి వైద్యాధికారి డాక్టర్ నాగభూషణం ఆమె గర్భం దాల్చినప్పటి నుంచి రెగ్యులర్గా చెకప్ చేస్తున్నారని తెలిపారు. ఆమె కు ఈ నెల 29న డెలివరీ అయ్యే అవకాశం ఉందని అంచనా వేశారు. అయితే కాకినాడలో కూడా పరీక్షలు చేయించుకోవాలని చెప్పడంతో కాకినాడ ఆసుపత్రికి వెళ్లేందుకు తొండంగి నుంచి అన్నవరం రాగా, అక్కడే డెలివరీ అయినట్టు తెలిపారు. తల్లి పిల్లలను తొండంగి ఆసుపత్రిలో చూపించిననంతరం వైద్యాధికారి సూచనల మేరకు కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించినట్టు తెలిపారు. తల్లీపిల్ల క్షేమంగా ఉన్నట్టు తెలిపారు. -
కిడ్నాప్ కలకలం
అన్నవరం(ప్రత్తిపాడు): అన్నవరంలో ఓ వివాహితను కిడ్నాప్ చేసేందుకు ఓ అగంతకుడు ప్రయత్నించగా ఆమె చాకచక్యంగా కారులో నుంచి దూకి తప్పించుకుంది. ఆ ఘటన వివరాలను గురువారం రాత్రి అన్నవరం పోలీస్స్టేషన్లో ప్రత్తిపాడు సీఐ అద్దంకి శ్రీనివాసరావు ఇలా వెల్లడించారు. సామర్లకోట మండలం హుస్సేన్పురంలో ఉంటున్న ఏనుగుల శిరీషకు విశాఖ జిల్లా చింతపల్లికి చెందిన మహేష్తో ఏడాది క్రితం వివాహమైంది. శిరీష కాకినాడ ఆదిత్య డిగ్రీ కళాశాలలో చదువుతూ తన స్వగ్రామం హుస్సేన్పురంలోనే ఉంటూ రోజూ కాకినాడ కళాశాలకు వెళ్లి వస్తోంది. బుధవారం సాయంత్రం మహేష్ అన్నవరానికి చెందిన తన బంధువులకు చెందిన నీలి రంగు రెనాల్ట్ పల్స్ కారు(ఏపీ 5 బీడీ 1567)లో హుస్సేన్ పురం వెళ్లాడు. అక్కడి నుంచి భార్యాభర్తలు ఇరువురు గురువారం ఉదయం అన్నవరంలోని శ్రీసత్యదేవుని ఆలయానికి వచ్చి స్వామివారి వ్రతమాచరించి దర్శనం చేసుకున్నారు. అనంతరం కొండ దిగువకు వచ్చి ఎస్బీఐ ఏటీఎం వద్ద కారు ఆపి తన బంధువులకు ఫోన్ చేసి కారు తీసుకెళ్లిపోమని చెప్పాడు. తరువాత ఆ కారు ఇంజిన్ ఆపకుండా మహేష్ అందులో నుంచి దిగి వాటర్ బాటిల్ కొనుక్కోవడానికి వెళ్లాడు. ఈ లోపు ఓ అగంతకుడు ఆ కారు డ్రైవర్ సీటులోకి ఎక్కి అతి వేగంగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్లిపోతుండడంతో మహేష్తో పాటు అతడి బంధువులు ఆ కారును ఆపేందుకు ప్రయత్నించారు. ఫలితం లేక మోటార్ సైకిల్పై వెంబడించారు. కారులో ఉన్న శిరీష కూడా గట్టిగా కేకలు వేస్తుండడంతో బెండపూడి వద్ద అగంతకుడు కారు ఆపాడు. ఆమె కారు డోర్ తీసుకుని కిందకు దూకేసింది. ఈ లోపు మహేష్, అతడి బంధువులు అక్కడికి చేరుకోవడంతో ఆ అగంతకుడు కారు వేగంగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్లిపోయాడు. కారును ధర్మవరం వరకు వెంబడించిన మహేష్ బంధువులు ఆ తరువాత కారు ఆచూకీ తెలియక వెనుదిరిగారు. అప్రమత్తమైన పోలీసులు కిడ్నాప్ విషయం తెలుసుకున్న పోలీసులు అప్రమత్తమయ్యారు. కృష్ణవరం టోల్గేట్ సిబ్బందికి ఫోన్ చేసి కారును ఆపాలని సూచించారు. హైవే మీద అన్ని పోలీస్స్టేషన్లను అలర్ట్ చేశారు. గురువారం రాత్రి మహేష్, శిరీష, వారి బంధువుల నుంచి సీఈ శ్రీనివాసరావు పూర్తి వివరాలు సేకరించారు. త్వరలోనే ఆ నిందితుడిని పటుకుంటామని తెలిపారు. అగంతకుడు ముఖానికి గుడ్డ కట్టుకున్నాడని, కారులో తన ఫోన్, బ్యాగ్ ,పర్స్ ఉన్నాయని శిరీష తెలిపింది. -
కార్తిక మాసోత్సవాలకు రత్నగిరి సన్నద్ధం
అన్నవరం (ప్రత్తిపాడు): ఈ నెల 20వ తేదీ నుంచి నవంబర్ 18 వరకూ కొనసాగనున్న కార్తి్తకమాసంలో సత్యదేవుని ఆలయానికి వచ్చే భక్తులకు అన్ని ప్రభుత్వ శాఖల సహకారంతో ఎటువంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని దేవస్థానం, ప్రభుత్వశాఖల సమన్వయకమిటీ సమావేశంలో తీర్మానించారు. శుక్రవారం దేవస్థానంలోని ఈఓ చాంబర్లో జరిగిన ఈ సమావేశానికి పెద్దాపురం ఆర్డీఓ విశ్వేశ్వరరావు అ«ధ్యక్షత వహించారు. దేవస్థానం ఇన్చార్జి ఈఓ ఈరంకి జగన్నాథరావు మాట్లాడుతూ దేవస్థానంలో చేస్తున్న ఏర్పాట్లను వివరించారు. సమావేశంలో శంఖవరం ఎంపీడీఓ శ్రీను, పంపా రిజర్వాయర్ ఏఈ వీరబాబు, తుని ఫైర్ సర్వీస్ అధికారి కేవీ రమణ, దేవస్థానం వైద్యాదికారి డాక్టర్ పాండురంగారావు, గ్రామపంచాయతీ కార్యదర్శి రామశ్రీనివాసరావు, ఆర్టీసీ, వైద్య ఆరోగ్యశాఖ, రెవిన్యూ, పోలీస్, తదితర విభాగాల అధికారులు సమావేశంలో పాల్గొన్నారు. సమన్వయకమిటీ సమావేశం నిర్ణయాలు ముఖ్యమైన పర్వదినాలు: ఈ నెల 23, 30, నవంబర్ ఆరోతేదీ, నవంబర్ 13వ తేదీ కార్తి్తకమాస సోమవారాలు. 21, 28 నవంభర్ నాలుగో తేదీ 11, 18 తేదీలు శనివారాలు, 22,29, నవంభర్ 5, 12 వ తేదీలు ఆదివారాలు. 31 వ తేదీ, నవంబర్ 14 వ తేదీ కార్తిక శుద్ధ, బహుళ ఏకాదశి పర్వదినాలు వచ్చినందున ఆ రోజుల్లో భక్తుల రద్దీ అధికంగా ఉండే అవకాశం ఉంది. ఆ రోజుల్లో తెల్లవారుజామున రెండు గంటలకే ఆలయం తెరిచి భక్తులకు సర్వదర్శనాలు కల్పిస్తారు. ఆ రోజుల్లో పోలీసులు అదనపు బందోబస్తు ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. భక్తులకు ఉదయం ఏడు గంటల నుంచి పులిహోర పంపిణీ చేయాలని నిర్ణయించారు. నవంబర్ 1న తెప్పోత్సవం: క్షీరాబ్ది ద్వాదశి పర్వదినం సందర్బంగా నవంబర్ ఒకటో తేదీ సాయంత్రం 6–30 గంటల నుంచి 8–30 గంటల వరకూ సత్యదేవుని తెప్పోత్సవానికి పంపా నదిలో తగినంత నీటిమట్టం ఉండేలా చర్యలు తీసుకోవాలి. బాణసంచా కాల్చేటపుడు ఎటువంటి ప్రమాదాలు జరుగకుండా తుని ఫైర్ సిబ్బంది చర్యలు తీసుకోవాలి. పోలీసు బందోబస్తు నిర్వహించాలి. నాలుగో తేదీన గిరిప్రదక్షిణ : నవంబర్ నాలుగో తేదీన కార్తీకపౌర్ణమి సందర్భంగా స్వామివారి గిరిప్రదక్షిణ ఉదయం ఎనిమిది గంటల నుంచి నిర్వహించాలని నిర్ణయించారు. మూడో తేదీ మధ్యాహ్నం నుంచి వచ్చినందున ఆరోజు రాత్రి జ్వాలాతోరణం, పంపా నదీ హారతులు నిర్వహిస్తారు. సహస్ర దీపాలంకరణ సేవ ప్రారంభం: దేవస్థానంలో సహస్రదీపాలంకార సేవను కార్తీకమాసంలోనే ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ మేరకు అవసరమైన షెడ్డు నిర్మాణం, ఇతర వస్తుసామగ్రిని కార్తీక పౌర్ణమి నాటికి సమకూర్చుకోవాలని నిర్ణయించినట్లు ఇన్చార్జి ఈఓ జగన్నాథరావు సాక్షి కి తెలిపారు. కార్తీకమాసంలోని పర్వదినాల్లో తెల్లవారుజాము నుంచి వ్రతాలు ప్రారంభిస్తారు. భక్తుల రద్దీ ఎక్కువ ఉన్నపుడు అంతరాలయ దర్శనం రద్దు చేసి ప్రత్యేక దర్శనం టిక్కెట్ భక్తులకు ప్రత్యేక క్యూ లైన్ అమలు చేస్తారు. కార్తీకమాసం నెల రోజులు రత్నగిరికి ఆర్టీసీ ప్రత్యేక బస్లు నడపాలని, వైద్య నిర్వహించాలని నిర్ణయించారు. -
రత్నగిరికి పోటెత్తిన భక్తులు
ఘాట్ రోడ్లో ట్రాఫిక్ జామ్ అన్నవరం(ప్రత్తిపాడు) : రత్నగిరిపై కొలువైన శ్రీసత్యదేవుని ఆలయానికి ఆదివారం భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. స్వామివారి ఆలయంతో పాటు, ప్రాంగణం భక్తులతో నిండిపోయింది. తెల్లవారుజామున ఐదు గంటల నుంచి సాయంత్రం వరకూ భక్తులు తండోప తండాలుగా వస్తూనే ఉన్నారు. శనివారం రాత్రి, ఆదివారం ఉదయం రత్నగిరిపై వివాహాలు జరిగాయి. దానికి తోడు వరుస సెలవులు కావడం కూడా భక్తులు పోటెత్తడానికి కారణమైంది. వ్రతాల కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు.. సత్యదేవుని వ్రతాలాచరించేందుకు భక్తులు గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చింది. ప్రధానంగా రూ.200, రూ.400 వ్రతాలాచరించే భక్తులైతే భారీ క్యూలో వేచి ఉన్నారు. ధ్వజస్తంభం వద్ద వ్రతాలాచరించేందుకు రూ.1500 టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు కూడా ఇబ్బందులు తప్పలేదు. స్వామి దర్శనానికి మూడు గంటలు సత్యదేవుని దర్శనానికి మూడు గంటలు సమయం పట్టింది. స్వామివారి అంతరాలయం దర్శనం కోసం రూ.వంద టిక్కెట్ తీసుకున్న భక్తులు కూడా రెండు గంటలు వేచియుండాల్సి వచ్చింది. వృద్ధులు, చిన్న పిల్లలు ఇబ్బంది పడ్డారు. ఆలయానికి సుమారు ఎనిమిది వేల వాహనాలలో భక్తులు తరలివచ్చారు. పలుమార్లు ఘాట్రోడ్లో వాహనాలు నిలిచిపోయాయి. గతంలో భక్తుల రద్దీ ఉన్న సమయంలో చిన్న కార్లు, ఇతర వాహనాలను ప్రకాష్సదన్ వెనుక గల మైదానంలో నిలిపివేసేవారు. ఈ సారి వాహనాలను యథేచ్ఛగా వదిలేయడంతో కార్లను పశ్చిమ రాజగోపురం ముందు నిలిపివేశారు. అదే విధంగా ఆటోలను కూడా నిలిపివేయడంతో భక్తులకు ఇక్కట్లు తప్పలేదు. పాలకమండలి సమావేశంలో అధికారులు సత్యదేవుని దర్శనానికి భారీగా భక్తులు వస్తారని తెలిసి కూడా అదే రోజు పాలక మండలి సమావేశం నిర్వహించడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. పాలకమండలి సమావేశంలో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకూ దేవస్థానం చైర్మన్, సభ్యులు, ఇన్చార్జి ఈఓ, వివిద విభాగాల ఏఈఓలు, సూపరింటెండెంట్లు, ప్రధానార్చకుడు, అందరూ పాల్గొన్నారు. ఓ వైపు వేలాది మంది భక్తులు ఆలయప్రాంగణంలో ఇబ్బంది పడుతుంటే గుమస్తాలు, నాలుగో తరగతి ఉద్యోగులు మాత్రమే వారికి సేవలందించాల్సిన పరిస్థితి నెలకొంది. గతంలో ఇటువంటి రద్దీ రోజుల్లో మిగిలిన విభాగాల సిబ్బందికి కూడా ఆలయం వద్ద, వ్రత మండపాల వద్ద ప్రత్యేక డ్యూటీలు వేసేవారు. చైర్మన్, ఇన్చార్జి ఈఓ ఆలయ ప్రాంగణం అంతా తిరిగి సిబ్బందికి సూచనలిచ్చేవారు. ఈ సారి అందుకు విరుద్ధంగా అక్కడ విధుల్లో ఉండాల్సిన అధికారులు కూడా భక్తులను గాలికి వదిలేసి పాలక మండలి సేవలో తరించడం విశేషం స్వామిని దర్శించిన 45 వేల మంది భక్తులు సత్యదేవుని ఆలయానికి సుమారు 45 వేల మంది భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. వ్రతాలు 4,185 జరగగా రూ.40 లక్షల ఆదాయం సమకూరిందని అధికారులు తెలిపారు. -
రత్నగిరిపై బయో గ్యాస్ప్లాంట్
35.49 లక్షలతో ఏర్పాటుకు చర్యలు కొండదిగువన గోశాలలో రెండు షెడ్ల నిర్మాణం దేవస్థానం కళాశాల మైదానంలో వాకింగ్ ట్రాక్ పాలకమండలి సమావేశంలో తీర్మానాలు అన్నవరం (ప్రత్తిపాడు) : అన్నవరం దేవస్థానంలోని నిత్యాన్న దాన పథకంలోని ఆహార వ్యర్థాలు, వ్రతాల విభాగంలో వచ్చే వ్యర్థాలను వినియోగిస్తూ రత్నగిరి కొండమీద బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని దేవస్థానం పాలకమండలి నిర్ణయించింది. పాలక మండలి సమావేశం ఆదివారం దేవస్థానంలోని ప్రకాష్సదన్లో గల సమావేశ మందిరంలో చైర్మన్ ఐవీ రోహిత్ అధ్యక్షతన జరిగింది. సమావేశపు అజెండాలో పొందుపరచిన 41 అంశాలపై సభ్యులు చర్చించి తీర్మానాలు చేశారు. సమావేశంలో సభ్యులు చిర్ల శేషుకుమారి, కొత్త వేంకటేశ్వరరావు, సత్తి వీరదానరెడ్డి, రొబ్బి విజయశేఖర్, మారెడ్డి శింగారెడ్డి, రావిపాటి సత్యనారాయణ, యనమల రాజేశ్వరరావు, యడ్ల భేతాళుడు, అవసరాల వీర్రాజు, కందుల విశ్వేశ్వరరావు, నున్న రామచంద్రరావు, మట్టే సత్యప్రసాద్, సింగిలిదేవి సత్తిరాజు, పర్వత రాజబాబు, ఎక్స్ అఫీషియో సభ్యుడు ప్రధానార్చకుడు కొండవీటి సత్యనారాయణ, ఇన్చార్జి ఈఓ ఈరంకి జగన్నాధరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు. సమావేశం అనంతరం వివరాలను అధికారులు తెలియజేశారు. ముఖ్యమైన తీర్మానాలు దేవస్థానంలోని శ్రీవనదుర్గ, శ్రీకనకదుర్గ ఆలయాలు, తొలిపాంచా, ప్రసాదం కౌంటర్ కు రంగులు వేయడానికి తీర్మానించారు. దేవస్థానంలో గత నెలలో ఈ–ప్రోక్యూర్మెంట్ కం బహిరంగవేలం ద్వారా 14 టీ, కాఫీ మిషన్ల నిర్వహణకు గాను హెచ్చు పాటను ఖరారు చేశారు. కొండదిగువన గోశాలలో రూ.19.95 లక్షలతో ఏసీ షీటుతో రెండు షెడ్లు నిర్మించేందుకు తీర్మానించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు చెందుర్తిలో నిర్మించిన గోశాలలో గోవుల పరరక్షణ, మేత, దాణా సరఫరా అన్నవరంలోని గోశాల ద్వారా చేసేందుకు పాలకమండలి తీర్మానించింది. రూ.30 లక్షలతో దేవస్థానంలోని ప్రకాష్ సదన్ సత్రం వెనుక గల పవర్ హౌస్లో, కొండదిగువన గల పంపా తీరంలో గల పవర్హౌస్లో అధునాతన పేనల్ బోర్డులు ఏర్పాటు చేయడానికి తీర్మానించారు. విశాఖ జిల్లాలోని నర్సీపట్నం శివారు బలిఘట్టంలో గల శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి దేవాలయాన్ని దత్తత తీసుకోవడానికి కమిషనర్ అనుమతి కోసం రాయాలని తీర్మానించారు. సత్యదేవుని ఆలయం వద్ద గల శయన మందిరం వద్ద రూ.2.75 లక్షలతో వ్యయంతో జియో షీట్తో షెడ్డు నిర్మాణం ప్రతిపాదనకు అంగీకరిస్తూ తీర్మానించారు. ప్రకాష్సదన్ వద్ద రూ.7.75 లక్షలతో టాయ్లెట్స్ మరమ్మతులకు తీర్మానించారు. శ్రీసత్యదేవ జూనియర్ కళాశాల మైదానంలో ఉపాధి హామీ నిధులతో వాకింగ్ ట్రాక్ నిర్మాణానికి అనుమతి మంజూరు చేస్తూ తీర్మానించారు. -
తొలగిన'తల’భారం
అన్నవరం దేవస్థానంలో నిల్వ ఉన్న 700 కిలోల తలనీలాలు వేలంపాట దారునికి అప్పగించేందుకు కమిషనర్ అనుమతి రూ.20 లక్షలు ఆదాయం వచ్చే అవకాశం అన్నవరం(ప్రత్తిపాడు) : దేవాదాయశాఖ కమిషనర్ జారీ చేసిన ఓ ఆదేశం అన్నవరం దేవస్థానం అధికారుల తల బరువు దించినట్టయింది. దేవస్థానంలోని కేశఖండన శాలలో గత తొమ్మిది నెలలుగా నిల్వ ఉన్న సుమారు 700 కేజీల తలనీలాలను పాటదారునికి అప్పగించేందుకు దేవాదాయశాఖ కమిషనర్ వైవీ అనూరాధ అనుమతి మంజూరు చేస్తూ ఇచ్చిన ఆదేశాలు జారీ చేశారు. దేవస్థానంలో భక్తులు సమర్పించిన తలనీలాలను తీసుకునేందుకు ఏటా వేలం పాట నిర్వహిస్తారు. గతేడాది కూడా ఇదే విధంగా వేలంపాట నిర్వహించగా రూ.1.28 కోట్లకు పాట వెళ్లింది. అయితే పాటదారుడు రూ.పది లక్షలు మాత్రమే చెల్లించడంతో ఆ విలువ మేరకు తల నీలాలను అప్పగించారు. నవంబర్ 17 నుంచి వచ్చిన తల నీలాలను కేశఖండనశాలలోని గదిలో దేవస్థానం అధికారులు భద్రపరుస్తున్నారు. అయితే తల నీలాలు మూడు నెలలు వరకూ మాత్రమే భద్రపర్చడానికి వీలు ఉంటుంది. అంతకన్నా ఎక్కువ రోజులు భద్రపర్చాలంటే కెమికల్స్తో ప్రాసెస్ చేయాలి. అలాంటి ఏర్పాటు దేవస్థానంలో లేదు. ఈ నేపథ్యంలో గత నెలలో వేలం నిర్వహించారు. తల పొడవును బట్టి గ్రేడ్ల వారీగా విభజించి పాట నిర్వహించారు. ఇందులో అత్యధికంగా రూ.20 లక్షల వరకూ పాట వెళ్లింది. ఈ వేలం పాట ను పాలకమండలి కూడా ఖరారు చేయడంతో కమిషనర్ అనుమతికి పంపించారు. తలనీలాలను పాట దారునికి అందచేయడానికి కమిషనర్ మంగళవారం సాయంత్రం ఆదేశాలు జారీ చేశారు. దీంతో తలనీలాలను పాటదారునికి అప్పగిస్తామని ఇన్చార్జి ఈఓ జగన్నాథరావు తెలిపారు. -
సరస్వతీనమస్తుభ్యం..
శ్రీసరస్వతీ అమ్మవారిగా పూజలందుకున్న శ్రీవనదుర్గ మూడో రోజు ఘనంగా శ్రావణమాస జాతర మహోత్సవాలు అన్నవరం : రత్నగిరిపై జరుగుతున్న శ్రీవనదుర్గ అమ్మవారి శ్రావణమాస జాతర మహోత్సవాల మూడో రోజు శ్రావణశుద్ధ ద్వాదశి శుక్రవారం శ్రీవనదుర్గ అమ్మవారు శ్రీసరస్వతీ దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చి పూజలందుకున్నారు. ఉదయం 9.30 గంటలకు శ్రీవనదుర్గ అమ్మవారి ఆలయంలో రుత్వీకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. నవగ్రహ జపాలు, లింగార్చన, శ్రీచక్రార్చన, శ్రీ పురుష సూక్త పారాయణలు, మూలమంత్ర జపాలు, సూర్యనమస్కారాలు, సప్తశతీ పారాయణలు, మూలమంత్ర జపాలు తదితర కార్యక్రమాలను నిర్వహించారు. సాయంత్రం అమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహించారు. మూడోరోజు కూడా రుత్వీకులు చండీహోమం కొనసాగించారు. అనంతరం అమ్మవారికి నీరాజన మంత్రపుష్పాలు సమర్పించారు. ప్రసాదాల నివేదన చేసి భక్తులకు పంపిణీ చేశారు. వేదపండితులు, ప్రధానార్చకులు గాడేపల్లి వేంకట్రావు, స్పెషల్గ్రేడ్ వ్రతపురోహితులు నాగాభట్ల కామేశ్వరశర్మ, ముత్య సత్యనారాయణ, కల్యాణబ్రహ్మ ఛామర్తి కన్నబాబు, పురోహితులు పాలంకి పట్టాభి, ప్రసాద్, మూర్తి, శ్రీవనదుర్గ అర్చకులు గాడేపల్లి సత్యనారాయణ తదితరులు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కిటకిటలాడిన దుర్గాలయాలు శ్రావణ శుక్రవారం, వరలక్ష్మీ పూజ పర్వదినం సందర్భంగా రత్నగిరి దుర్గామాతలు శ్రీవనదుర్గ, శ్రీకనకదుర్గ అమ్మవారి ఆలయాలను పెద్దసంఖ్యలో భక్తులు దర్శించి పూజలు చేశారు. దుర్గాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. -
పట్టు తప్పుతున్న పాలన
రెగ్యులర్ ఈఓ లేక అనిశ్చితి చైర్మన్ రోహిత్ అనుభవరాహిత్యం ఇన్చార్జి ఈఓ మెతకతనం సత్యదేవుని ఆలయంలో రాజ్యమేలుతున్న వివాదాలు అన్నవరం (ప్రత్తిపాడు) : సత్యదేవుని ఆలయంలో పరిపాలన అధికారుల పట్టు జారుతోంది. ఈఓ కె.నాగేశ్వరరావును బదిలీ చేసి దాదాపు 40 రోజులైనా రెగ్యులర్ ఈఓను నియమించలేదు. ఇన్చార్జి ఈఓ ఈరంకి వేంకట జగన్నాథరావు మెతక వైఖరి, ఆయన హోదా తాత్కాలికమే కావడంతో సిబ్బంది ఆయనను ఖాతరు చేయడం లేదు. దీంతో ఆలయ పాలనలో అనిశ్చితి నెలకొంది. దేవస్థానంలో సుమారు 30 ఏళ్ల పైబడి ఉద్యోగం చేస్తున్న జగన్నాథరావు ఈఓలు మారినప్పుడు, కొత్త ఈఓ రావడానికి మధ్య కాలంలో ఇన్చార్జి ఈఓగా సుమారు ఏడు పర్యాయాలు చేశారు. ఆ సమయంలో అప్పటి చైర్మన్ ఐవీ రామ్కుమార్ అండదండలు ఉండడంతో పాలన సజావుగా సాగించేవారు. అనుభవ రాహిత్యంలో చైర్మన్ రోహిత్ : రామ్కుమార్ ఆకస్మికమృతితో చైర్మన్గా వచ్చిన ఆయన కుమారుడు ఐవీ రోహిత్ అనుభవ రాహిత్యం వల్ల దేవస్థానంలోని వ్యవహరాలు పూర్తిగా అర్ధం కావడం లేదు. ఎప్పుడు, ఎక్కడ, ఎలా వ్యవహరించాలో తెలియక చిక్కులు ఎదుర్కొంటున్నారు. దీనిని అలుసుగా తీసుకుని కొంతమంది ఉద్యోగులు చిన్న వివాదాన్ని కూడా పెద్దదిగా చిత్రీకరించి ఆయనను దెబ్బ తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. దీనికి తోడు ఐవీ రామ్కుమార్కు రాజకీయ నాయకులతో కొంత పరిచయం ఉండేది. రోహిత్కు అటువంటి పరిచయాలేవీ లేకపోవడం కూడా ఆయనకు ప్రతిబంధకంగా మారింది. వీటికితోడు పాత ఈఓ నాగేశ్వరరావు అనుసరించిన విధానాలే కరెక్ట్ అనే అభిప్రాయంతో ఉండడం కూడా సిబ్బందికి ఆయనకు మధ్య దూరం పెంచుతోంది. సిబ్బందిలో లోపించిన క్రమశిక్షణ: పాత ఈఓ నాగేశ్వరరావు అనుసరించిన విధానాలపై పలు విమర్శలున్నా సిబ్బందిలో భయముండేది. ఆ భయం వల్ల క్రమశిక్షణతో ఉండేవారు. కాని ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. సిబ్బందిలో కొంతమంది మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వెడితే బయోమెట్రిక్ అటెండెన్స్ సమయానికే మళ్లీ కొండమీదకు వస్తున్నారన్న విమర్శ వినిపిస్తోంది. ఫేస్బుక్, వాట్సాప్ రాజకీయం: భక్తులకు, సిబ్బందికి ఇబ్బందులు ఎదురైతే ఫొటోలు తీసి తనకు వాట్సఫ్లో పెట్టాలని పాత ఈఓ కే నాగేశ్వరరావు చెప్పేవారు. అయితే భక్తులు అలా వాట్సప్లో పెట్టినది తక్కువ. అయితే ప్రస్తుతం సిబ్బంది మాత్రం సీసీటీవీ పూటేజ్లను తిలకిస్తూ తమకు గిట్టని వారి గురించి ఆ సీసీటీవీ పూటేజ్లతో ఛైర్మన్, ఈఓ లకు వాట్సప్ ద్వారా ఫిర్యాదు చేస్తున్నారు. కొంతమంది ఫేస్బుక్లో కూడా పెడుతున్నారు. ఈ దృశ్యాల ఆధారంగా చర్యలు తీసుకోవడం కూడా వివాదాస్పదమవుతోంది. దీంతో సిబ్బంది వర్గాలుగా చీలిపోతున్నారు. ఇదే అదనుగా కొంతమంది తమ పబ్బం గడుపుకునేందుకు సిబ్బందిని రెచ్చగొడుతున్నారన్న విమర్శలు కూడా ఉన్నాయి. దీనికితోడు అంతర్గత బదిలీలు కూడా ఏకపక్షంగా జరుగుతున్నాయన్న అభిప్రాయం కలుగుతోంది. రెగ్యులర్ ఈఓ లేకపోతే మరంత ఇబ్బంది: రూ.వంద కోట్లు పైబడిన ఆదాయం కలిగిన అన్నవరం దేవస్థానానికి రెగ్యులర్ ఈఓను నియమించకుండా నెలల తరబడి కాలయాపన చేయడం కూడా సరి కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈఓగా సీనియర్ ఆర్జేసీ, గతంలో ఇక్కడ పనిచేసిన ఎం.రఘునా«ద్ నియామకం ఖరారైందన్న వార్త నెల రోజులుగా చక్కర్లు కొడుతున్నా ఆదేశాలు మాత్రం వెలువడలేదు. ఆయనను ఈఓగా నియమించవద్దని దేవస్థానం ఉద్యోగుల సంఘం పేరుతో ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడం ఇక్కడ నెలకొన్న పరిస్థితికి తార్కాణం. అయితే ఆ ఫిర్యాదుతో తమకు సంబంధం లేదని ఆ నేతలు చెప్పడం గమనార్హం. దేవస్థానంలో నెలకొన్న పరిస్థితి ఇంకా ముదరకుండానే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. రఘునా«థ్ కాకపోతే మరో సమర్థుడైన అధికారిని ఈఓగా ఇక్కడ నియమించాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
ముగిసిన సత్యదేవుని జయంత్యుత్సవాలు
-పంచామృతాభిషేకం, ఆయుష్యహోమం -భక్తులకు పవిత్రాల పంపిణీ అన్నవరం (ప్రత్తిపాడు): రత్నగిరిపై గత మూడు రోజులుగా వైభవంగా జరుగుతున్న సత్యదేవుని 127వ ఆవిర్భావదినోత్సవాలు (జయంత్యుత్సవాలు) బుధవారం ముగిశాయి. స్వామివారి జన్మనక్షత్రం మఖ సందర్భంగా తెల్లవారుజామున 2 నుంచి 5 గంటల వరకూ స్వామి, అమ్మవార్ల మూలవిరాట్లకు పంచామృతాభిషేకం నిర్వహించారు. ఉదయం 9 నుంచి 11 గంటల వరకూ దర్బారు మండపంలో ఆయుష్యహోమం నిర్వహించారు. హోమం పూర్ణాహుతి కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, పాలకమండలి సభ్యుడు అవసరాల వీర్రాజు, ఇన్చార్జి ఈఓ జగన్నాథరావు పాల్గొన్నారు. కాగా సత్యదేవుని సన్నిధిలో భక్తులు, అర్చక, పురోహిత, సిబ్బంది వలన తెలిసీ తెలియక జరిగే అపచారాల నివృత్తికి గత మూడు రోజులుగా నిర్వహిస్తున్న పవిత్రోత్సవాలు కూడా బుధవారంతో ముగిశాయి. ఈ సందర్బంగా పవిత్రాలను (చేతులకు కట్టుకునే కంకణాల వంటివి) స్వామి సన్నిధిలో ఉంచి పూజలు చేసి, అనంతరం భక్తులకు పంపిణీ చేశారు. వేదపండితులు కపిలవాయి రామశాస్రి, ముష్టి కామశాస్త్రి, గొల్లపల్లి ఘనాపాఠి, యనమండ్ర శర్మ అవధాని, ప్రధానార్చకులు గాడేపల్లి వేంకట్రావు, కొండవీటి సత్యనారాయణ, స్పెషల్ గ్రేడ్ వ్రతపురోహితులు నాగాభట్ల కామేశ్వరశర్మ, ముత్య సత్యనారాయణ, కల్యాణబ్రహ్మ చామర్తి కన్నబాబు, తదితరులు కార్యక్రమాలను నిర్వహించారు. -
ఘనంగా సత్యదేవుని 127వ జయంత్యుత్సవం
స్వామివారి మూలవిరాట్కు పంచామృత అభిషేకం శాస్త్రోక్తంగా ఆయుష్యహోమం పూర్ణాహుతి ఆరుగురు వేదపండితులకు ఘన సత్కారం వైభవంగా స్వామివారి వెండి రథోత్సవం అన్నవరం(ప్రత్తిపాడు) : సత్యదేవుని 127వ ఆవిర్భావ దినోత్సవాన్ని (జయంత్యుత్సవాన్ని) శ్రావణశుద్ధ విదియ మంగళవారం రత్నగిరిపై ఘనంగా నిర్వహించారు. సత్యదేవుడు, అమ్మవార్ల మూలవిరాట్లకు పంచామృతాభిషేకం, ఆయుష్యహోమం పూర్ణాహుతి, పండితులకు ఘన సత్కారం, రథోత్సవం తదితర కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. పంచామృతాలతో స్వామికి అభిషేకం స్వామివారి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంగళవారం తెల్లవారుజామున రెండు గంటల నుంచి ఉదయం ఐదు గంటల వరకు సత్యదేవుడు, అమ్మవారు, ఈశ్వరుల మూలవరులకు పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఇన్చార్జి ఈఓ ఈరంకి వేంకట జగన్నాథరావు పాల్గొన్నారు. శాస్త్రోక్తంగా ఆయుష్యహోమం పూర్ణాహుతి దర్బారు మండపంలో నిర్వహిస్తున్న ఆయుష్యహోమం పూర్ణాహుతి కార్యక్రమం ఘనంగా జరిగింది. ఉదయం 11 గంటలకు పండితులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించగా ఇన్చార్జి ఈఓ జగన్నాథరావు, ఆలయ ఏఈఓ ఎంకేటీఎన్వీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు శ్రీసూక్త, పురుషసూక్త జపాలు, నవావరణార్చన, సువాసినీ పూజలు, లింగాష్టకం తదితర కార్యక్రమాలు నిర్వహించారు. ఆరుగురు పండితులకు సత్కారం సత్యదేవుని ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వేదాలలో నిష్ణాతులైన ఆరుగురు పండితులను దేవస్థానం ఇన్చార్జి ఈఓ ఈరంకి జగన్నాథరావు సత్కరించారు. రాజమండ్రికి చెందిన మహామహోపాధ్యాయ విశ్వనాథ గోపాలకృష్ణశాస్త్రి, వేదపండితులు చిర్రావూరి శ్రీరామశర్మ, ఉప్పులూరి సత్యనారాయణ అవధాని, సింహాచలం దేవస్థానం వేదపండితులు కపిలవాయి వేంకటేశ్వర అవధాని, వడ్లమాని వేంకటేశ్వర అవధాని, పశ్చిమగోదావరి జిల్లా బోడపాడుకు చెందిన సత్యనారాయణ అవధాని లకు రూ.2500 చొప్పున పారితోషికం, పంచె కండువా, స్వామివారి ప్రసాదాలను బహూకరించి సత్కరించారు. వెండి రథంపై స్వామివారి ఊరేగింపు స్వామివారి ఆలయప్రాకారంలోని మాడావీధుల్లో స్వామి, అమ్మవార్ల ఊరేగింపు కార్యక్రమం మంగళవారం ఘనంగా జరిగింది. ఇన్చార్జి ఈఓ జగన్నాథరావు ఈ ఊరేగింపు ప్రారంభించారు. వేదపండితులు, అర్చకస్వాములు, పెద్దసంఖ్యలో విచ్చేసిన భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భక్తులు స్వామివారి రథాన్ని లాగేందకు పోటీపడ్డారు. నేడు స్వామివారి మూలవిరాట్కు పంచామృతాభిషేకం మఖ నక్షత్రం సందర్భంగా బుధవారం తెల్లవారుజామున స్వామి, అమ్మవార్లకు పంచామృతాభిషేకం నిర్వహిస్తారని పండితులు తెలిపారు. అదే విధంగా ఉదయం తొమ్మిది గంటలకు ఆయుష్యహోమం ప్రారంభించి 11 గంటలకు పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహిస్తారు. -
సత్యదేవుని జయంత్యుత్సవం ప్రారంభం
-ఆయుష్య హోమానికి శ్రీకారం -నేడు, రేపు మూలవిరాట్కు అభిషేకాలు అన్నవరం (ప్రత్తిపాడు): శ్రీసత్యదేవుని 127వ ఆవిర్భావ దినోత్సవాలు( జయంత్యోత్సవాలు) శ్రావణ శుద్ధ పాడ్యమి సోమవారం రత్నగిరిపై ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటలకు ఆలయంలో అర్చకస్వాములు ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి ఆవిర్భావ దినోత్సవ పూజలను నిర్వహించే పండితులు, అర్చకస్వాములు, వంద మంది రుత్విక్కులకు దేవస్థానం ఛైర్మన్ ఐవీ రోహిత్, ఇన్ఛార్జి ఈఓ ఈరంకి వేంకట జగన్నాథరావు వరుణలు, దీక్షావస్త్రాలను బహూకరించారు. మధ్యాహ్నం మండపారాధన, కలశస్థాపన, శ్రీసూక్త, పురుషసూక్త జపాలు, నవావరణ అర్చన, సువాసినీ పూజలు, లింగాష్టకం తదితర కార్యక్రమాలు నిర్వహించారు. దేవస్థానం వేదపండితులు కపిలవాయి రామశాస్త్రి, ముష్టి కామశాస్త్రి, గొల్లపల్లి ఘనాపాఠీ, గొర్తి సుబ్రహ్మణ్య ఘనాపాఠీ, ప్రధానార్చకులు గాడేపల్లి వేంకట్రావు, కొండవీటి సత్యనారాయణ, స్పెషల్గ్రేడ్ వ్రతపురోహితులు నాగాభట్ల కామేశ్వరశర్మ, ముత్య సత్యనారాయణ, కల్యాణబ్రహ్మ ఛామర్తి కన్నబాబు, తదితరులు పాల్గొన్నారు. ఆవిర్భావ దిన వేడుకల్లో భాగంగా సత్యదేవుని ఆయుష్యహోమానికి పండితులు సోమవారం సాయంత్రం అంకురార్పణ చేశారు. మంత్రోచ్చరణల మధ్య కొయ్యల రాపిడితో హోమాగ్నిని వెలిగించి గుండంలో వేసి హోమాన్ని ప్రారంభించారు. హోమం పూర్ణాహుతి కార్యక్రమం బుధవారం జరుగుతుంది. మంగళవారం తెల్లవారుజామున రెండు గంటలకు స్వామి, అమ్మవారు, శంకరుల మూలవిరాట్ లకు పంచామృతాభిషేకం నిర్వహిస్తారు. అనంతరం స్వామి, అమ్మవార్లను స్వర్ణాభరణాలు, పట్టువస్త్రాలతో సర్వాంగసుందరంగా అలంకరించి పూజలు చేశాక దర్శనానికి భక్తులను అనుమతిస్తారు. మఖ న క్షత్రం సందర్భంగా బుధవారం తెల్లవారుజామున కూడా స్వామి, అమ్మవార్లకు పంచామృతాభిషేకం నిర్వహిస్తారు. -
నేటి నుంచి సత్యదేవుని ఆవిర్భావ వేడుకలు
అన్నవరం (ప్రత్తిపాడు) : సత్యదేవుని 127వ ఆవిర్భావ దినోత్సవాలకు రత్నగిరి ముస్తాబైంది. సోమవారం నుంచి బుధవారం వరకూ మూడు రోజుల పాటు ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని దేవస్థానం నిర్ణయించింది. ఉత్సవాలకు సోమవారం అంకురార్పణ చేస్తారు. ఈ సందర్భంగా రుత్విక్కులకు దీక్షావస్త్రాలు బహూకరిస్తారు. స్వామివారి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంగళవారం తెల్లవారుజామున రెండు గంటలకు స్వామి, అమ్మవారు, శంకరుల మూలవిరాట్లకు పంచామృతాభిషేకం నిర్వహిస్తారు. అదే రోజు ఉదయం తొమ్మిది గంటలకు స్వామివారి ఆయుష్య హోమానికి అంకురార్పణ చేస్తారు. ఈ ఏడాది కొత్తగా పవిత్రోత్సవాలను కూడా ప్రారంభించనున్నారు. స్వామివారికి వివిధ కూరగాయలు, సుగంధద్రవ్యాలతో వండిన పిండివంట ‘కాయం’ నివేదిస్తారు. స్వామివారి జన్మనక్షత్రం మఖ సందర్భంగా బుధవారం తెల్లవారుజామున కూడా స్వామి, అమ్మవార్లకు పంచామృతాభిషేకం నిర్వహిస్తారు. రెండో రోజు కూడా పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. అనంతరం చేతికి కట్టుకునే కంకణాలను భక్తులకు బహూకరిస్తారు. ఉత్సవాల సందర్భంగా దేవస్థానంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. శ్రీరామునికి ఘనంగా జన్మనక్షత్ర పూజలు రత్నగిరి క్షేత్రపాలకుడు శ్రీరామచంద్రమూర్తి జన్మనక్షత్రం పునర్వసు సందర్భంగా రామాలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. రామచంద్రమూర్తి పట్టాభిషేక మహోత్సవం కూడా ఘనంగా నిర్వహించారు. కల్యాణ వేదికపై సూర్యనమస్కారాలు ప్రతి ఆదివారం రత్నగిరిపై సత్యదేవుని కల్యాణ వేదిక మీద నిర్వహిస్తున్న సూర్య నమస్కారాలు ఈ వారం కూడా కొనసాగాయి. ఆకొండి కృష్ణ, రేపాక రామదాసు, తదితరులు ఈ కార్యక్రమం నిర్వహించారు. -
అన్నారం టు అమెరికా
లక్ష డాలర్ల వార్షిక వేతనంతో కొలువుదీరిన తెలుగు యువకుడు సృజన్ రెడ్డి సక్సెస్ అబ్రాడ్ అమెరికాలో ఉన్నత విద్య అవకాశం లభించడం ఎంతో కష్టం. సుదీర్ఘ నిరీక్షణ.. అనేక నిబంధనలు.. టెస్టుల్లో స్కోర్స్. ఆ యువకుడు వాటన్నింటినీ అధిగమించాడు. అమెరికా యూనివర్సిటీలో స్కాలర్షిప్తో అడ్మిషన్ సొంతం చేసుకున్నాడు. ఎంఎస్ పూర్తి చేశాక అక్కడే ప్రముఖ రిటైల్ సంస్థ ‘టార్గెట్’లో లక్ష డాలర్ల వార్షిక వేతనంతో ఉద్యోగం సంపాదించుకున్నాడు. సాధారణ వ్యవసాయ కుటుంబం నుంచి యూఎస్లో ఉన్నత విద్య కోసం అడుగుపెట్టి.. అక్కడే సొంతగా ఉద్యోగాన్వేషణ సాగించి.. విజయం సాధించిన తెలుగు యువకుడు సృజన్ రెడ్డి సక్సెస్ స్టోరీ. మా స్వస్థలం కామారెడ్డి జిల్లాలోని అన్నారం. మాకున్న కొద్దిపాటి భూమిలో నాన్న దేవేందర్రెడ్డి వ్యవసాయం చేస్తుంటారు. అమ్మ జ్యోత్స్న గృహిణి. పదో తరగతి వరకు సిద్దిపేటలోనే చదువుకున్నా. తర్వాత హైదరాబాద్కు వచ్చి ఇంటర్మీడియెట్ పూర్తయ్యాక ఎంసెట్ ర్యాంకుతో హైదరాబాద్లోనే ఓ సాధారణ ఇంజనీరింగ్ కాలేజ్లో బీటెక్ పూర్తి చేశా. నా చదువు పరంగా అమ్మానాన్న ఎంతో సహకరించారు. బీటెక్ నుంచే యూఎస్ కల బీటెక్లో చేరినప్పటి నుంచే ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాలని కలలు కన్నా. బాగా చదువుకొని అక్కడే స్థిరపడాలని లక్ష్యంగా పెట్టుకున్నా. ఆ దిశగా ముందస్తుగానే జీఆర్ఈకి ప్రిపరేషన్ ప్రారంభించా. దాంతో మంచి స్కోర్ లభించింది. అమెరికాలోని యూనివర్సిటీలకు ఎంఎస్ కంప్యూటర్ సైన్స్ కోర్సుకు దరఖాస్తు చేశా. యూనివర్సిటీ ఆఫ్ హోస్టన్, నార్త్వెస్ట్ మిస్సోరి స్టేట్ యూనివర్సిటీ, క్లీవ్ల్యాండ్ స్టేట్ యూనివర్సిటీల్లో ప్రవేశం ఖరారైంది. స్కాలర్షిప్తో అడుగు యూనివర్సిటీ ఆఫ్ హోస్టన్ 60 శాతం స్కాలర్షిప్తో ఆఫర్ ఇవ్వడంతో అందులో చేరాను. ఈ విశ్వవిద్యాలయం అకడమిక్ ట్రాక్ రికార్డ్ బాగున్న విద్యార్థులకు స్కాలర్షిప్ను మంజూరు చేస్తుంది. నా స్కోర్స్ను పరిగణనలోకి తీసుకొని ఫీజులో 60 శాతం స్కాలర్షిప్ అందించింది. 2013 ఫాల్ సెషన్లో ఎంఎస్–కంప్యూటర్ సైన్స్లో చేరాను. ఇబ్బందులు సహజం అమెరికాలోని ఏ యూనివర్సిటీ క్యాంపస్ను చూసినా.. ప్రపంచంలోని భిన్న దేశాలకు, విభిన్న సంస్కృతులకు చెందిన విద్యార్థులు కనిపిస్తారు. కాబట్టి ప్రారంభంలో ఎవరికైనా అక్కడి పరిస్థితుల్లో ఇమిడిపోయే విషయంలో కొంత ఇబ్బంది ఎదురవడం సహజమే. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే.. కొత్త ప్రదేశం.. మనవాళ్లతో కలిసి ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఇండియన్ స్టూడెంట్స్తోనే ఇంటరాక్షన్కు ఎక్కువ మంది ప్రయత్నిస్తారు. ఇది సరికాదు. ఇతర దేశాలకు చెందిన వారితోనూ మాట్లాడాలి. అలాగే క్యాంపస్కే పరిమితం కాకుండా వీలైన సమయంలో బాహ్య ప్రపంచంలో అడుగుపెట్టి స్థానిక సంస్కృతి, జీవనశైలిని అవగాహన చేసుకునే ప్రయత్నం చేయాలి. తద్వారా భవిష్యత్లోæజాబ్ మార్కెట్ కోణంలో వాస్తవంగా పరిస్థితులపై అవగాహన వస్తుంది. ఉద్యోగాన్వేషణ.. స్వయంగానే ఎంఎస్ పూర్తవుతూనే ఉద్యోగాన్వేషణలో పడ్డాను. వాస్తవానికి క్యాంపస్ రిక్రూట్మెంట్ డ్రైవ్స్ జరుగుతాయి. కానీ అక్కడికి వచ్చే కంపెనీలు స్థానికుల (అమెరికన్ల)కే ప్రాధాన్యమిస్తాయి. ఇతర దేశాల విద్యార్థులకు క్యాంపస్ ప్లేస్మెంట్స్లో జాబ్ లభించడం చాలా అరుదు. దీంతో నేను కోర్సు చివరి సెమిస్టర్ నుంచే ఉద్యోగం కోసం స్వీయ అన్వేషణ సాగించాను. ఇందుకోసం ప్రొఫెషనల్ నెట్వర్కింగ్ సైట్ లింక్డిన్, స్థానిక కన్సల్టెన్సీల ద్వారా ఉద్యోగ ప్రయత్నం చేశాను. ‘టార్గెట్’లో కొలువు.. లక్ష డాలర్ల వేతనం కన్సల్టింగ్ సంస్థల ద్వారా అమెరికాలోని ప్రముఖ కామర్స్ అండ్ రిటైల్ సంస్థ టార్గెట్ కార్పొరేషన్లో సీనియర్ డేటా ఇంజనీర్గా 2016 జనవరిలో ఉద్యోగం లభించింది. ప్రస్తుతం లక్ష డాలర్ల వార్షిక వేతనంతోపాటు పెయిడ్ లీవ్స్, హెల్త్ ఇన్సూరెన్స్ వంటి అదనపు భత్యాలు అందుతున్నాయి.. హడూప్, డేటాసైన్స్, క్లౌడ్ కంప్యూటింగ్, ఆటోమేషన్కు సంబంధించిన విధులు నిర్వహిస్తున్నాను. తెలంగాణలోని ఓ చిన్న గ్రామం నుంచి అమెరికాలో అడుగుపెట్టడం.. అంతేకాకుండా ఫార్చూన్–500 జాబితాలోని కంపెనీలో కొలువు సొంతం చేసుకోవడం ఎంతో సంతోషాన్ని కలిగించిన సంఘటనలు. డేటాసైన్స్లో ఎంబీఏ ప్రస్తుతం సీనియర్ డేటా ఇంజనీర్గా ఉద్యోగం చేస్తున్నప్పటికీ.. ఈ విభాగంలోనే ఉన్నత హోదాలు అందుకునేందుకు మార్గం కల్పించే డేటా సైన్స్లో ఎంబీఏ చదవాలనేది నా తదుపరి లక్ష్యం. ఇప్పుడు కంపెనీ లన్నీ డేటా అనలిటిక్స్ ఆధారంగానే కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ఉద్యోగులకు కూడా ఆ నైపుణ్యాలు ఉండాలని కోరుకుంటున్నాయి. ముందస్తు ప్రణాళికతో ఉన్నత విద్య పరంగా అమెరికాను లక్ష్యంగా చేసుకున్న విద్యార్థులు.. ముందస్తు ప్రణాళికతో జాగ్రత్తగా వ్యవహరించాలి. యూనివర్సిటీల అన్వేషణ పరంగా కేవలం కన్సల్టెన్సీలపైనే ఆధారపడకుండా.. స్వయంగా తాము లక్ష్యంగా నిర్దేశించుకున్న కోర్సు, యూనివర్సిటీల గురించి అన్వేషణ సాగించాలి. వాటి అర్హత ప్రమాణాలను తెలుసుకుని వాటిని అందుకునేలా బీటెక్ నుంచే కృషి చేయాలి. అప్డేట్ అయితేనే అమెరికాలో విద్యా విధానం బాగుంటుందని, కరిక్యులం పరంగా ఎప్పటికప్పుడు మార్పులు జరుగుతాయని చాలామంది విద్యార్థులు భావిస్తారు. అయితే అమెరికాలోనూ కెరీర్ పరంగా రాణించేందుకు సెల్ఫ్ అప్డేట్ ఎంతో అవసరం. అంతేకాకుండా ప్రొఫెసర్లు, సీనియర్లతో నిరంతరం సంప్రదిస్తుండాలి. ఫలితంగా స్థానికంగా ఉన్న ఉద్యోగావకాశాల గురించి, వాటిని అందుకోవడానికి గల మార్గాల గురించి తెలుస్తుంది. అడుగుపెట్టినప్పటి నుంచి వ్యక్తిగతంగా, అకడమిక్గా, సామాజికంగా వినూత్న దృక్పథంతో వ్యవహరిస్తే కోర్సు పూర్తయ్యాక ఇక్కడే కొలువుదీరే అవకాశాలు ఎన్నో!! -
ప్చ్.. కరుణ చూపలేదు!
- రూ.200 వ్రతాల భక్తులను కరుణించని పాలక మండలి - క్యూ లైన్పై షెల్టర్ నిర్ణయం వాయిదా అన్నవరం (ప్రత్తిపాడు) : సత్యదేవుని సన్నిధిలో రూ.200 వ్రతాల భక్తులపై అన్నవరం దేవస్థానం పాలక మండలి కరుణ చూపలేదు. క్యూలో నిలబడే ఈ వ్రతాల భక్తులకు నీడ కల్పించేందుకుగాను షెల్టర్ నిర్మించేందుకు ఇంజినీరింగ్ అధికారులు చేసిన ప్రతిపాదనలను మరో నెల వాయిదా వేసింది. ప్రకాష్ సదన్ సత్రంలోని సమావేశ మందిరంలో చైర్మన్ ఐవీ రోహిత్ అధ్యక్షతన సోమవారం మధ్యాహ్నం పాలక మండలి సమావేశం జరిగింది. సభ్యులతోపాటు ప్రధానార్చకుడు కొండవీటి సత్యనారాయణ, ఇన్చార్జి ఈఓ ఈరంకి జగన్నాథరావు తదితరులు పాల్గొన్నారు. సమావేశానికి ముందు సత్యగిరిపై సభ్యులు మొక్కలు నాటారు. సమావేశంలో పలు తీర్మానాలను ఆమోదించారు. ముఖ్య తీర్మానాలివీ.. - దేవస్థానంలో నామినేషన్ పద్ధతిపై నామమాత్రపు అద్దెకు ప్రైవేటు వ్యక్తులు నిర్వహిస్తున్న 14 కాఫీ, టీ విక్రయ పాయింట్లను ఇకపై టెండర్ కం బహిరంగ వేలం ద్వారా లీజుకు ఇవ్వాలి. - సత్యదేవుని ప్రసాదం తయారీకి రూ.49 లక్షలతో కొత్త ఇత్తడి కళాయిలు కొనుగోలు చేయాలి. - యంత్రాలయంలో యంత్రం వద్ద శాస్త్ర విరుద్ధంగా పాత ఈఓ కె.నాగేశ్వరరావు ఏర్పాటు చేసిన విద్యుద్దీపాన్ని తొలగించి, దానిస్థానంలో నూనె దీపాలు ఏర్పాటు చేయాలి. - దేవస్థానం స్టాఫ్ క్వార్టర్లకు పెయింటింగ్, పశ్చిమ రాజగోపురం వద్ద ఫ్లోరింగ్ పనులు చేయాలి. - స్వామివారి నిత్యకల్యాణం మండపానికి రూ.5 లక్షలతో రంగులు వేయాలి. - రెండు టన్నుల వ్యర్థాలతో బయోగ్యాస్ తయారీకి ప్రతిపాదనలు రూపొందించాలి. - రూ.1,500, రూ.2 వేల వ్రత మండపాల్లో రూ.4.15 లక్షలతో అగ్నిమాపక యంత్రాలు ఏర్పాటు చేయాలి. - హరిహరసదన్ సత్రం ముందు వివాహాలు చేసుకునేందుకు ఉపయోగిస్తున్న ఖాళీ స్థలాన్ని ఇకపై అద్దెకు ఇవ్వకూడదు. షెల్టర్ నిర్మించేదెప్పుడో! దేవస్థానంలో జరిగే వ్రతాల్లో సగానికి పైగా రూ.200 వ్రతాలే ఉంటాయి. వీటిని ఆచరించేవారిలో ఎక్కువమంది పేద, మధ్యతరగతివారే. గత ఏడాది రూ.200 వ్రతాలే మూడు లక్షలు జరిగాయి. ఇన్ని వ్రతాలు జరుగుతున్నా వీటి నిర్వహణకు మూడు మండపాలే ఉన్నాయి. బ్యాచ్కు 200 మంది మాత్రమే ఈ మండపాల్లో వ్రతాలాచరించే వీలుంటుంది. ఇందుకోసం భక్తులు గంటల తరబడి క్యూలో నిలబడాల్సి ఉంటోంది. ఎండొచ్చినా, వానొచ్చినా క్యూలో తడవాల్సిందే. వారి కష్టాలపై ‘వ్రతాలు రూ.200.. ఇబ్బందులు వేయింతలు’ శీర్షికన గత నెల 27వ తేదీన సాక్షి దినపత్రికలో వార్త ప్రచురితమైన విషయం విదితమే. దీనిపై స్పందించిన అధికారులు.. రూ.200 వ్రతాలాచరించే భక్తులకు ఎండ, వాన నుంచి రక్షణ కల్పించేలా షెల్టర్ నిర్మించేందుకు సోమవారం జరిగిన పాలక మండలి సమావేశంలో రూ.10 లక్షలతో ప్రతిపాదనలు సమర్పించారు. అయితే దీనిని పాలక మండలి వచ్చే సమావేశానికి వాయిదా వేసింది. ఈ షెల్టర్ నిర్మాణానికి వెంటనే టెండర్ పిలిచినా పనులు ప్రారంభించడానికి కనీసం నెల పడుతుంది. పని పూర్తి కావడానికి మరో నెల పడుతుందని అధికారులు చెబుతున్నారు. ఈ అంశాన్ని పాలక మండలి మరో నెల వాయిదా వేయడంతో ఇప్పట్లో ఈ పనులు జరిగే అవకాశాలు లేవు. ఫలితంగా రూ.200 వ్రతాల భక్తుల ఇబ్బందులు కూడా ఇప్పుడప్పుడే తొలగే పరిస్థితి కానరావడంలేదు. పాలక మండలి సభ్యులు ఈ వ్రత మండపాలను ఈ నెల 25న పరిశీలించి షెల్టర్ అవసరమా, కాదా అనే దానిపై ఒక నిర్ధారణకు వస్తామన్నారని, అందువల్లనే ఈ అంశాన్ని వాయిదా వేశామని ఈఓ జగన్నాథరావు ‘సాక్షి’కి తెలిపారు. -
మహాప్రసాదం
సత్తెన్న ప్రసాదానికి పెరిగిన డిమాండ్ ‘లోవ ’ భక్తుల కొనుగోళ్లు తొలిపాంచా, నమూనా ఆలయం కౌంటర్లలో 65 వేల ప్రసాదం ప్యాకెట్ల విక్రయం రూ.9.75 లక్షల ఆదాయం అన్నవరం: ఆషా«ఢమాసం.. ఆదివారం.. తుని రూరలె మండలంలోని లోవ తలుపులమ్మతల్లి దర్శనానికి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. వారి తిరుగుప్రయాణంలో భారీ ఎత్తున సత్యదేవుని ప్రసాదాలు కొనుగోలు చేశారు. కొండదిగువన తొలిపాంచా వద్ద, బైపాస్ రోడ్డులోని సత్యదేవుని నమూనా ఆలయం వద్ద గల ప్రసాదం విక్రయస్టాల్స్ వద్ద ఆదివారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకూ భక్తుల రద్దీ కొనసాగింది. రాత్రి ఏడు గంటల సమయానికి సుమారు 65 వేల ప్రసాదం ప్యాకెట్లు (125 గ్రాములు రూ.15) విక్రయించగా రూ.9.75 లక్షల ఆదాయం సమకూరింది. ఏటా ఆషాఢమాసంలో వచ్చే ఆదివారాలలో భారీ సంఖ్యలో లోవ తలుపులమ్మ తల్లి దేవస్థానానికి వెళ్లే భక్తులు తిరుగు ప్రయాణంలో సత్యదేవుని ప్రసాదం కొనుగోలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. దాన్ని దృష్టిలో ఉంచుకొనే అన్నవరం దేవస్థానం విస్తృతంగా ఏర్పాట్లు చేసింది. కొండదిగువన తొలిపాంచా వద్ద, బైపాస్ రోడ్డులోని నమూనా ఆలయం వద్ద గల ప్రసాదం స్టాల్స్ వద్ద అదనపు కౌంటర్లను ఏర్పాటు చేసింది. సుమారు 70 వేల ప్రసాదం ప్యాకెట్లను సిద్ధం చేసింది. మధ్యాహ్నం నుంచి రాత్రి ఏడుగంటల వరకూ సుమారు 65 వేల ప్యాకెట్లను విక్రయించినట్టు అధికారులు తెలిపారు. మిగిలిన ఐదువేల ప్రసాదం ప్యాకెట్లు కూడా రాత్రి విక్రయించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. దేవస్థానం ఇన్ఛార్జి ఈఓ ఈరంకి వేంకట జగన్నాథరావు ఈ ప్రసాదం స్టాల్స్ను సందర్శించి అక్కడ సిబ్బందికి తగు సూచనలు ఇచ్చారు. ఏఈఓ సాయిబాబా, ఆలయ సూపరిండెంట్ బలువు సత్యశ్రీనివాస్, ఇనస్పెక్టర్ పోల్నాటి లక్ష్మీనారాయణ తదితరులు స్టాల్స్ వద్ద విక్రయాలు పర్యవేక్షించారు. -
సత్యదేవునికి పన్ను పోటు!
- అన్నవరం దేవస్థానంపై రూ.5 కోట్ల వరకూ జీఎస్టీ? - రత్నగిరీశుని వార్షికాదాయం రూ.125 కోట్లు - రూ.20 లక్షలు దాటితే తప్పని పన్నుభారం - ఇంకా అందని ఆదేశాలు అన్నవరం (ప్రత్తిపాడు) : ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరంలోని శ్రీ వీర వేంకట సత్యనారాయణస్వామివారి దేవస్థానానికి వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) పోటు తగలనుంది. నూతన పన్ను విధానం వలన దేవస్థానంపై రూ.5 కోట్ల వరకూ భారం పడే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆదాయ పరంగా రాష్ట్రంలో తిరుమల - తిరుపతి దేవస్థానం, శ్రీశైలం, విజయవాడ కనకదుర్గమ్మ దేవస్థానాల తరువాతి స్థానంలో అన్నవరం ఉంది. గడచిన ఆర్థిక సంవత్సరంలో సత్యదేవుని వార్షికాదాయం రూ.125 కోట్లు దాటింది. ఈ నేపథ్యంలో నూతన పన్ను విధాన ప్రభావం అన్నవరం దేవస్థానంపై అధికంగానే ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. పూర్తిస్థాయిలో ఇంకా నిర్ధారణ జరగకపోయినా దేవస్థానంలో వివిధ సేవల టిక్కెట్ల విక్రయాలు, ప్రసాదం తయారీకి ముడిసరుకుల కొనుగోళ్లు, అన్నదానం పథకంలో ఆహార పదార్థాల తయారీకి కొనుగోలు చేసే ముడి సరుకులవంటి వాటిపై జీఎస్టీ పడే అవకాశం ఉంది. ఇది ఎంతమేరకు అనేదానిపై ఇంకా స్పష్టత రానందున ఇప్పుడే దీనిపై ఏమీ చెప్పలేమని దేవస్థానం అధికారులు అంటున్నారు. రూ.20 లక్షల వార్షికాదాయం మించితే.. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం రూ.20 లక్షల వార్షికాదాయం దాటిన దేవస్థానాలన్నీ జీఎస్టీ పరిధిలోకి వస్తాయి. దాని ప్రకారం జిల్లాలోని తలుపులమ్మ లోవ దేవస్థానం సహా సుమారు 50 దేవస్థానాలు జీఎస్టీ పరిధిలోకి వస్తున్నాయి. వీటన్నింటికంటే అన్నవరం దేవస్థానం వార్షికాదాయం అధికం. కాబట్టి ఈ దేవస్థానమే ఎక్కువ జీఎస్టీ చెల్లించాల్సిన పరిస్థితి ఉందని భావిస్తున్నారు. ఏటా రూ.26 కోట్లతో ముడిసరుకుల కొనుగోళ్లు అన్నవరం దేవస్థానంలో ఏటా రూ.26 కోట్లతో వివిధ ముడిసరుకులు కొనుగోలు చేస్తున్నారు. వీటిలో రూ.23 కోట్లను ప్రసాదం తయారీలో వాడే గోధుమలు, పంచదార, నెయ్యి, యాలకులు, గ్యాస్, వ్రతాల్లో వాడే నూనె, ఇతర పూజాసామగ్రి, వివిధ సత్రాల్లో వాడే వస్తువుల కొనుగోళ్లకు వెచ్చిస్తున్నారు. అన్నదానం పథకంలో ప్రత్యేకంగా రూ.3 కోట్లతో బియ్యం, పప్పులు, కూరగాయలు, నూనె తదితర వస్తువులు కొనుగోలు చేస్తున్నారు. వీటిలో కొన్నింటిపై ప్రస్తుతం వ్యాట్, కొన్నింటిపై సెంట్రల్ ఎక్సైజ్ ట్యాక్స్ విధిస్తున్నారు. నూతన విధానం ప్రకారం ఒకే పన్ను కావడంతో ఇకనుంచి జీఎస్టీ విధించనున్నారు. తలనీలాల విక్రయంపై కూడా.. దేవస్థానంలో భక్తులు సమర్పించిన తలనీలాల విక్రయం మీద కూడా జీఎస్టీ విధించే అవకాశం ఉంది. ఏటా ఇక్కడి తలనీలాలను బహిరంగ వేలం ద్వారా దేవస్థానం విక్రయిస్తుంది. తద్వారా రూ.కోటి నుంచి రూ.2 కోట్ల వరకూ ఆదాయం వస్తోంది. జీఎస్టీపై ఎటువంటి ఆదేశాలూ రాలేదు దేవస్థానంలో కొనుగోళ్లు, అమ్మకాలపై జీఎస్టీ విధింపు అంశానికి సంబంధించి ఉన్నతాధికారుల నుంచి ఇంతవరకూ ఎటువంటి ఆదేశాలూ రాలేదు. జీఎస్టీ ఎంతమేరకు ఉంటుంది? దేనిపై ఉంటుందనే దానిపై క్లారిటీ ఇవ్వాలని ఆడిటర్లను అడిగాం. ప్రస్తుతానికి దేవస్థానంలో యథాతథ స్థితి కొనసాగుతోంది. జీఎస్టీ అమలుపై ఉన్నతాధికారులు సర్క్యులర్ పంపిస్తే దాని ప్రకారం వ్యవహరిస్తాం. - ఈరంకి వేంకట జగన్నాథరావు, ఇన్చార్జి ఈఓ, అన్నవరం దేవస్థానం -
కోటీశ్వరుడు ... సత్య గిరీశుడు
- హుండీలు తెరిస్తే చాలు...‘రూ కోటి ’ ఆదాయం వచ్చినట్టే ! - వరుసగా మూడు నెలలు రూ.కోటి దాటిన సత్యదేవుని హుండీ ఆదాయం - జూన్ నెల హుండీ ఆదాయం రూ.1,23,71,212 అన్నవరం: (ప్రత్తిపాడు): రత్నగిరివాసుడు శ్రీ సత్యదేవుని ఆలయానికి ఆదాయం గణనీయంగా వస్తోంది. అందులో హుండీల ద్వారా వచ్చే ఆదాయమే ప్రతి నెలా రూ.కోటికి పైగా ఉంటోంది. సంవత్సరంలో ఒకటి, రెండు నెలలు మినహా ప్రతి నెలా హుండీ ఆదాయం రూ.కోటి దాటుతోంది. జూన్ నెలకుగాను శుక్రవారం సత్యదేవుని హుండీలను తెరిచి లెక్కించగా రూ.1,23,71,212 ఆదాయం సమకూరింది. ఏప్రిల్ నెలకు సంబంధించి హుండీలను మే రెండో తేదీన (32 రోజులకు) తెరిచి లెక్కించగా రూ.1.08 కోట్లు ఆదాయం వచ్చింది. మే నెలకు సంబంధించి అదే నెల 29న లెక్కించగా రూ.1.25 కోట్లు ఆదాయం వచ్చింది. వేసవి సెలవులు...వివాహాల సీజన్తో... ఏప్రిల్, మే, జూన్ నెలల్లో స్వామి సన్నిధిన వివాహాలు అధికంగా జరగడం, వేసవి సెలవులు, సత్యదేవుని దివ్యకల్యాణ మహోత్సవాలు తదితర కారణాలతో స్వామివారి ఆలయానికి భారీగా భక్తులు తరలి వచ్చారు. దీంతో స్వామివారికి ఆదాయం భారీగా వచ్చింది. దాంతోపాటే హుండీల్లో కూడా భక్తులు దండిగా కానుకలు సమర్పించడంతో ఆదాయం రూ.కోటి దాటిందని అధికారులు విశ్లేషిస్తున్నారు. హుండీ ఆదాయంలో నగదు 1.15 కోట్లు, చిల్లర రూ.8.15 లక్షలు... శుక్రవారం స్వామివారి హుండీలను తెరిచి లెక్కించగా రూ.1,23,71,212 ఆదాయం వచ్చిందని ఇన్ఛార్జి ఈఓ ఈరంకి జగన్నాధరావు తెలిపారు. ఇందులో రూ.1,15,55,412 నగదు కాగా, రూ.8,15,800 చిల్లర నాణేలు. వీటితోపాటు బంగారం 65 గ్రాములు, వెండి 870 గ్రాములు లభించాయని తెలిపారు. అమెరికా డాలర్లు 719, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దీరామ్స్ 205 , సింగపూర్ డాలర్లు రెండు, మలేషియా రిమ్స్ మూడు. మరో నాలుగు దేశాల కరెన్సీలు లభించాయని తెలిపారు. ఇంకా హుండీలలో రద్దయిన నోట్లు... కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన రూ.500, రూ.1000 నోట్లను భక్తులు ఇంకా హుండీల్లో వేస్తూనే ఉన్నారు. శుక్రవారం స్వామివారి హుండీలను తెరవగా రూ.1,04,000 విలువైన పాత నోట్లు లభించాయి. హుండీలో రూ.500 నకిలీ నోటు... అప్పుడే కొత్త రూ.500 నకిలీ నోట్లు తయారయ్యాయి. ఇందుకు సాక్ష్యమే ఇది. ఈ నకిలీ నోటు ఒకటి శుక్రవారం దేవస్థానం హుండీలలో రాగా లెక్కింపులో సిబ్బంది గుర్తించి చించేశారు. శుక్రవారం జరిగిన హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని పాలకమండలి సభ్యులు పర్వత రాజబాబు, యడ్ల భేతాళుడు, కొత్త వేంకటేశ్వరరావు (కొండబాబు), రొబ్బి విజయశేఖర్, శింగిలిదేవి సత్తిరాజు, యనమల రాజేశ్వరరావు పర్యవేక్షించారు. దేవస్థానం సిబ్బంది, వ్రతపురోహితులు, నాయీ బ్రాహ్మణులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
ఇన్చార్జి ఈఓగా జగన్నాథరావు
- నేడు అన్నవరం దేవస్థానం బాధ్యతలు చేపట్టనున్న ఏసీ - ప్రిన్సిపల్ సెక్రటరీ విదేశీ పర్యటనతో రెగ్యులర్ ఈఓ నియామకంలో జాప్యం అన్నవరం (ప్రత్తిపాడు) : ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వేంకట సత్యనారాయణస్వామి దేవస్థానం ఇన్చార్జి కార్యనిర్వహణాధికారి(ఫుల్ అడిషనల్ చార్జి)గా అసిస్టెంట్ కమిషనర్ ఈరంకి వేంకట జగన్నాథరావు నియమితులయ్యారు. ఈమేరకు దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయం శుక్రవారం సాయంత్రం ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుత ఈఓ, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ కె.నాగేశ్వరరావును విజయనగరం జిల్లా జాయింట్ కలెక్టర్-2గా ఈ నెల 8న ప్రభుత్వం బదిలీ చేసిన విషయం తెలిసిందే. ఆయన స్థానంలో వచ్చేందుకు పలువురు ప్రయత్నాలు చేశారు. అవి ఇంతవరకూ ఒక కొలిక్కి రాలేదు. దీనికితోడు దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జేఎస్వీ ప్రసాద్ రెండు వారాల పాటు సెలవు పెట్టి శుక్రవారం విదేశాలకు వెళ్లారు. ఆయన ఈ నెల 30న తిరిగి వస్తారు. ఆ తరువాతే ఈఓ నియామకంపై ఒక నిర్ణయం తీసుకుంటారని విశ్వసనీయవర్గాల సమాచారం. ఈలోగా దేవస్థానంలో పాలన వ్యవహారాలు చూసేందుకు, బదిలీ అయిన ఈఓ నాగేశ్వరరావును రిలీవ్ చేసేందుకు ఇన్చార్జిగా ఈరంకిని నియమించారు. ఆయనను ఆ ఇన్చార్జి ఈఓగా నియమించే అవకాశం ఉందని ‘సాక్షి’ ముందే చెప్పింది. బదిలీ అయిన ఈఓ నాగేశ్వరరావు నుంచి జగన్నాథరావు శనివారం ఉదయం బాధ్యతలు స్వీకరించనున్నారు. విజయనగరం జేసీ-2గా సోమ లేదా మంగళవారాల్లో తాను బాధ్యతలు స్వీకరిస్తానని నాగేశ్వరరావు శుక్రవారం సాయంత్రం ‘సాక్షి’కి తెలిపారు. ఈరంకికి ఈ బాధ్యతలు ఏడోసారి.. గత ఆరేళ్లుగా ఏసీ జగన్నాథరావు ఆరుసార్లు అన్నవరం దేవస్థానం ఇన్చార్జి ఈఓగా పని చేశారు. ఈసారి కూడా కలుపుకుంటే అది ఏడోసారి అవుతుంది. 2010లో అప్పటి ఈఓ కె.రామచంద్రమోహన్ అమెరికాలో సత్యదేవుని వ్రతాల నిర్వహణకు వెళ్లినపుడు ఈరంకి పది రోజులు ఇన్చార్జి ఈఓగా పని చేశారు. రామచంద్రమోహన్ తరువాత 2012లో స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ ప్రసాదం వేంకటేశ్వర్లు ఈఓగా నియమితులయ్యారు. ఆయన బాధ్యతలు తీసుకోవడానికి 15 రోజులు పట్టడంతో అప్పుడు కూడా జగన్నాథరావే ఇన్చార్జి ఈఓగా పని చేశారు. వేంకటేశ్వర్లు 2013లో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లినపుడు 12 రోజులు ఇన్చార్జి ఈఓగా పని చేశారు. వేంకటేశ్వర్లు 2013 మే నెలలో 15 రోజులు సెలవు పెట్టినపుడు కూడా ఇన్చార్జి ఈఓగా పని చేశారు. 2014 ఆగస్టులో వేంకటేశ్వర్లు వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పీఏగా బదిలీ కాగా, ఆయన స్థానంలో 2015 జూలై రెండో తేదీన కె.నాగేశ్వరరావు ఈఓగా వచ్చే వరకూ ఈరంకి ఇన్చార్జి ఈఓగా పని చేశారు. ఇప్పుడు తిరిగి ఇన్చార్జి ఈఓగా శనివారం బాధ్యతలు స్వీకరించనున్నారు. -
‘స్వామి సొమ్ముతో షో’ వద్దు
- పునఃపరిశీలించాలి - అన్నవరం దేవస్థానం నూతన పాలక మండలి తీర్మానం - రూ.55 లక్షలతో స్వామివారికి కొత్త రథం తయారీకి పచ్చజెండా - సబ్ క్యాంటీన్ వద్ద భక్తులకు ఉచితంగా పులిహోర, దద్ధోజనం పంపిణీ - గోల్డ్బాండ్ స్కీమ్లో 2.860 కిలోల బంగారం డిపాజిట్ అన్నవరం (ప్రత్తిపాడు) : సత్యదేవుని సొమ్ము రూ.2.96 కోట్లతో సౌండ్ అండ్ లైట్ షో ఏర్పాటు చేయాలని తీసుకున్న నిర్ణయాన్ని దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు పునఃపరిశీలించాలని కోరుతూ అన్నవరం దేవస్థానం పాలక మండలి తీర్మానించింది. దేవస్థానం నూతన పాలక మండలి తొలి సమావేశం చైర్మన్ ఐవీ రోహిత్ అధ్యక్షతన ప్రకాష్ సదన్ సత్రంలోని పాలక మండలి సమావేశ మందిరంలో శుక్రవారం జరిగింది. ఉదయం 11 నుంచి సాయంత్రం వరకూ జరిగిన ఈ సమావేశంలో తొమ్మిది అంశాలపై చర్చించారు. పాలక మండలి సభ్యులు రావిపాటి సత్యనారాయణ, యనమల రాజేశ్వరరావు, యడ్ల భేతాళుడు, అవసరాల వీర్రాజు, కందుల విశ్వేశ్వరరావు, నున్న రామచంద్రరావు, చెల్లి శేషుకుమారి, కొత్త వేంకటేశ్వరరావు (కొండబాబు), సత్తి దేవదానరెడ్డి, రొబ్బి విజయశేఖర్, మారెడ్డి సింగారెడ్డి, మట్టే సత్యప్రసాద్, సింగిలిదేవి సత్తిరాజు, ప్రధానార్చకుడు కొండవీటి సత్యనారాయణ, ఈఓ కె.నాగేశ్వరరావు, ఏసీ జగన్నాథరావు, ఇతర అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ముఖ్య తీర్మానాలివీ.. - రూ.2.96 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేయనున్న సౌండ్ అండ్ లైట్ షో దేవస్థానానికి అంత లాభదాయకం కాదు. అలాగని టెంపుల్ టూరిజం అభివృద్ధికి కూడా అంతగా ఉపయోగపడేది కాదు. పైగా ఇది దేవస్థానానికి ఆర్ధికంగా భారం. ఉన్నతాధికారులు పునఃపరిశీలన జరిపి దీనిని ఉపసంహరించాలి. - గత నవంబర్ నుంచి మూసివేసిన సబ్ క్యాంటీన్ వద్ద భక్తులకు ఉదయం ఉచితంగా పులిహోర, దద్ధోజనం పంపిణీ చేయాలి. రద్దీ రోజుల్లో 2 వేల మందికి, ఇతర రోజుల్లో వెయ్యి మందికి సరిపోయేలా పంపిణీ చేయాలి. సోమవారం నుంచి దీనిని ప్రారంభించాలి. - స్వామి, అమ్మవార్లను ఉత్సవాల్లో ఊరేగించేందుకు రూ.55 లక్షలతో నూతన రథం తయారు చేయించాలి. - దేవస్థానంలో ఉన్న 2.860 కేజీల బంగారాన్ని గోల్డ్ బాండ్ స్కీమ్లో డిపాజిట్ చేయాలి. - గురువారం జరిగిన షాపుల వేలంలో గత ఏడాదికన్నా అత్యధికంగా పాడుకున్నవారికి షాపులను ఇవ్వాలి. -
ఎవరికో అన్న‘వరం’
సత్తెన్న సన్నిధిలో రాజకీయం - ఖాళీ అయిన ఈవో పోస్టుపై రత్నగిరిపై తమ్ముళ్ల పోరు సాక్షి ప్రతినిధి, కాకినాడ : అన్నవరం సత్యదేవుని కొండపై రాజకీయ పాచికలు అడుకుంటున్నారు. ఖాళీ అయిన ఈఓ పోస్టు కోసం అధికార పార్టీలో రెండు గ్రూపులు సిగపట్లు పడుతుండటంతో రత్నగిరిపై రాజకీయం రాజుకుంది. రాష్ట్రంలోనే పేరెన్నికగన్న అన్నవరం సత్యదేవుని వార్షిక ఆదాయం రూ.120 కోట్లు. ఏటా 80 లక్షల మంది భక్తులు రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా దేశ, విదేశాల నుంచి కూడా వస్తుంటారు. స్వామి సన్నిధిలో జరిగే వ్రతాలు ఖండాంతర ఖ్యాతిని ఆర్జించాయి. అటువంటి సత్యదేవుని కొండపై పట్టు కోసం నేతలు హోరాహోరీగా తలపడుతూ రాజకీయం చేస్తున్నారు. సత్యదేవుని ఆలయ కార్యనిర్వాహణాధికారి కాకర్ల నాగేశ్వరరావు విజయనగరం జిల్లా జేసీ–2గా గురువారం బదిలీ కావడంతో పోరు తీవ్రమైంది. నాగేశ్వరర రావు స్థానంలో కొత్త ఈవో కోసం రెండు గ్రూపులు రెండు పేర్లను తెరమీదకు తేవడంతో కొండపై రాజకీయం రసకందాయంగా మారింది. అర్హతలేకున్నా అందలాలెక్కించడం, ఏళ్ల తరబడి ఒకే చోట తిష్టవేయడం, లక్షల రూపాయలు చేతులు మారితేనే కానీ పోస్టింగుల రాని పరిస్థితులు దేవాదాయశాఖలో ఇటీవల శృతిమించి పోయిన వ్యవహారాలపై ‘సాక్షి’ పలు కథనాలను ప్రచురించిన సంగతి పాఠకులకు విదితమే. గ్రేడ్–1, గ్రేడ్–2 ఈఓ పోస్టింగులకే రూ.20 నుంచి రూ.30 లక్షలు ముట్టజెప్పితే ఇక అన్నవరం సత్యదేవుని ఈఓ పోస్టింగ్ అంటే మాటలా అంటున్నారు. ఆ పోస్టింగ్కు ఎంత పలుకుతుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే లేదు. ప్రయత్నాల్లో ముగ్గురు... అన్నవరం ఈఓ పోస్టింగ్ కోసం ముగ్గురు పేర్లు ప్రచారంలో ఉన్నాయి. కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు ఈవో మంచెనపల్లి రఘునా«థ్, ద్వారకా తిరుమల ఈవో వేండ్ర త్రినా«ధరావు, రాజమహేంద్రవరం ఆర్జేసీ చంద్రశేఖర్ అజాద్ పేర్లు వినిపిస్తున్నాయి. ఇందులో ఒకరు మినహా ఇద్దరు రాజకీయ పలుకుబడిని ఉపయోగించి తమ ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు. రెండేళ్ల క్రితం నాగేశ్వరరావు అన్నవరం ఈవోగా వచ్చే సమయంలో రఘునా«థ్ కూడా ఇక్కడకు రావడానికి గట్టి ప్రయత్నాలే చేశారు. అప్పట్లో జిల్లాకు చెందిన ఓ మంత్రి సోదరుడు ఈయన్ని తీసుకువచ్చేందుకు అన్ని ప్రయత్నాలు చేసినా చివరకు దేవాదాయశాఖకు సంబధంలేని రెవెన్యూ శాఖ నుంచి స్పెషల్ డిప్యుటీ కలెక్టర్ స్థాయి అధికారి అయిన నాగేశ్వరరావుకు పోస్టింగ్ దక్కింది. ఈ పోస్టింగ్ కోసం అప్పట్లో మంత్రి వర్గీయులు ఒక ఈవో నుంచి తీసుకున్న రూ.20 లక్షలు సంబంధిత వ్యక్తికి ఇప్పటి వరకూ తిరిగి ఇవ్వకపోవడంతో వివాదంగా మారింది. ఆ సొమ్ములు ఎలానూ ఇవ్వలేదు కనీసం ఇప్పుడైనా ఆ పోస్టింగ్ అవకాశం దక్కేలా చూడాలని సంబంధిత వ్యక్తి ఒత్తిడి తెస్తున్నారని సమాచారం. ఏసీబికి చిక్కడంతో... ఇక్కడకు వస్తారని ప్రచారం జరుగుతున్న రఘునా«థ్ 2006 నుంచి 2008 వరకు అన్నవరం ఈవోగా పని చేశారు. ఆ సమయంలోనే ఆదాయానికి మించిన ఆస్తులున్నాయంటూ అవినీతి నిరోధకశాఖ కేసు నమోదు చేయడంతో సస్పెండయ్యారు. ఆ కారణంగానే రెండేళ్ల కిందట తిరిగి అన్నవరం ఈవోగా రావాలనే ప్రయత్నాలకు బ్రేక్ పడింది. ఆ ఏసీబీ కేసులో క్లీన్చిట్ రావడంతో ఇప్పుడు ఇక్కడకు రావడానికి ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారని ఆలయ వర్గాలు చెబుతున్నాయి. ఈసారి ఎట్టిపరిస్థితుల్లోను రఘునా«థ్ను తీసుకువచ్చి తీరతామని మంత్రి అనుచరులు చాలా నమ్మకంగా చెబుతున్నారని ఆలయ వర్గాలు పేర్కొంటున్నాయి. రఘునా«థ్ వస్తే కొండపై తమకు ఇబ్బందులు తప్పవని ఆయనకు వ్యతిరేకంగా ఉన్న ఓ ఇంజినీరింగ్ అధికారి, మరో ఏసీ ఇక్కడి పోస్టింగ్ కోసం ఆసక్తి కనబరుస్తున్న ద్వారకా తిరుమల ఈవో వేండ్ర త్రినాథరావు లైన్లో పెడుతున్నారు. త్రినా«థరావు జిల్లాలో డిప్యుటీ కమిషనర్గా పనిచేసినప్పుడు కొండపై అన్నీ తామే అన్నట్టు చక్రం తిప్పిన ఆ ఇద్దరు రాజకీయంగా పావులు కదుపుతున్నారు. ఆయన ఈవోగా రావడం ఖాయమని ఇప్పటికే విస్తృత ప్రచారాన్ని కూడా చేస్తున్నారు. ఇందుకు మంత్రి వర్గీయులతో పొసగని మెట్ట ప్రాంతానికి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేల సిఫార్సులతో ఉన్నత స్థాయిలో తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని నమ్మకమైన వర్గాల ద్వారా తెలిసింది. ఈవో నాగేశ్వరరావు ముక్కుసూటిగా పోయే విధానంనచ్చని వారు ఇప్పుడు కొండపై తమ మాట వినే వారిని తెచ్చుకునే పనిలో ఉన్నారు. ఇలా రెండు గ్రూపులు చెరొకరి కోసం పోటాపోటీగా ప్రయత్నాలు చేస్తుండగా రాజకీయ సిఫార్సులతో సంబంధం లేకుండా రాజమహేంద్రవరం ఆర్జేసీ చంద్రశేఖర్ ఆజాద్ వైపు దేవాదాయశాఖ కమిషనరేట్ వర్గాలు మొగ్గు చూపుతున్నాయని సమాచారం. ఈ పరిస్థితుల్లో కొండపై మంత్రి, ఎమ్మెల్యేలలో ఎవరి మాట చెల్లుబాటవుతుందో ఎవరు పట్టు సాధిస్తారోననే ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. -
అన్నవరం దేవస్థానం ఈఓ నాగేశ్వరరావు బదిలీ
- విజయనగరం జేసీ–2గా బదిలీ చేసిన ప్రభుత్వం - కొత్త ఈఓ వచ్చేవరకూ ఇన్ఛార్జి ఈఓగా ఏసీ జగన్నాధరావు? అన్నవరం: అన్నవరం దేవస్థానం ఈఓ కె.నాగేశ్వరరావును విజయనగరం జాయింట్ కలెక్టర్–2గా బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో ఎవరినీ నియమించ లేదు. రెవెన్యూ విభాగానికి చెందిన పలువురు స్పెషల్ గ్రేడ్ డిఫ్యూటీ కలెక్టర్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం గురువారం రాత్రి జీఓ ఆర్ఎస్ నెంబర్.1267 విడుదల చేసింది. అందులో రెండో పేరుగా ఈయనది ఉంది. ఇన్ఛార్జి ఈఓగా ఏసీ జగన్నాధరావు? ఇన్ఛార్జి ఈఓగా దేవస్థానం ఏసీ జగన్నాథ రావును నియమించే అవకాశాలున్నాయి. గతంలో పనిచేసిన ఈఓలు కె. రామచంద్రమోహన్, ప్రసాదం వేంకటేశ్వర్లు బదిలీ అయినపుడు వెంటనే రెగ్యులర్ ఈఓలను నియమించకుండా దేవస్థానం ఏసీ జగన్నాధరావునే ఇన్ఛార్జి ఈఓగా నియమించారు. అదే ఆనవాయితీని ఇప్పుడు కూడా పాటిస్తారనే అభిప్రాయం వినిపిస్తోంది. ఈ విషయం ముందే చెప్పిన ‘సాక్షి’ ... దేవస్థానం ఈఓ బదిలీ అవుతున్న విషయాన్నిఈ నెల ఐదో తేదీన ‘అన్నవరం దేవస్థానానికి కొత్త ఈఓ’ శీర్షికన ‘సాక్షి’లో ప్రచురితమైంది. ఈఓ పనితీరుతో అసంతృప్తిగా ఉన్న జిల్లాకు చెందిన కొంతమంది రాజకీయ ప్రముఖులు సీఎం వద్దకు వెళ్లి ఈఓను బదిలీ చేసి దేవాదాయశాఖకు చెందిన మరో అధికారిని ఇక్కడ నియమించాలని కోరగా అందుకు సీఎం అంగీకరించినట్టు, దీనిపై రెండు మూడు రోజుల్లో నిర్ణయం వెలువడుతుందని ఆ వార్తలో ప్రస్తావించాం. అన్నట్టుగానే గురువారం రాత్రి ఈఓ బదిలీకి సంబంధించి జీఓ విడుదలైంది. -
‘‘దేవస్థానానికి అప్రతిష్ట తీసుకురాకండి’’
ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రసాద్ ఆగ్రహం వేద పాఠశాల నిర్మాణ పనుల జాప్యంపై అసంతృప్తి సహజ ఆసుపత్రి నిర్వహణపైనా అదే రీతిలో స్పందన పారిశుద్ధ్యం బాగోలేదని కాంట్రాక్టర్కు రూ.పదివేలు జరిమానా యాగశాల నిర్మాణానికి గ్రీన్సిగ్నల్ అన్నదానం భవనం నిర్మాణస్థలం మార్పుపై పరిశీలన అన్నవరం(ప్రత్తిపాడు) : అన్నవరం దేవస్థానంలో అధికారుల పనితీరుపై దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జేఎస్వీ ప్రసాద్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నిర్మాణాలు నత్తనడకన సాగడం, సహజ ఆసుపత్రి పరిసరాల్లో అపరిశుభ్రత తాండవించడంపై ‘ఇది దేవస్థానానికి అప్రతిష్ట’ అని వ్యాఖ్యానించారు. గురువారం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మూడు గంటల వరకు ఆయన అన్నవరం దేవస్థానంలో పర్యటించారు. వివిధ నిర్మాణపథకాల పనితీరును పరిశీలించారు. సత్యగిరిపై రూ.2.82 కోట్ల వ్యయంతో చేపట్టిన స్మార్త, ఆగమ, వేదపాఠశాల పనులు నత్తనడకన సాగుతుండడంపై జేఎస్వీ సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవస్థానంలో పారిశుద్ధ్యం నిర్వహణ, సహజ ఆసుపత్రి పనితీరుపైనా తీవ్ర అసంతృపి వ్యక్తం చేశారు. ఇంత నిర్లక్ష్యంగా ఎందుకు వ్యవహరిస్తున్నారని అధికారులను నిలదీశారు. డిసెంబర్ నాటికి పూర్తి కావాలి.. సత్యగిరిపై నిర్మిస్తున్న స్మార్త, ఆగమ, వేదపాఠశాల పనులను ఆయన పరిశీలించారు. పనుల జాప్యంపై ఆరాతీశారు. ఈ నిర్మాణాలు చేసే నిపుణులైన పనివారి కొరత ఉండడంతో ఆలస్యమవుతోందని కాంట్రాక్టర్ నాయుడు తెలిపారు. అవసరమైనంత మందిని తీసుకువచ్చి ఈ డిసెంబర్ నెలాఖరుకల్లా పనులు పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. ఈ పనులు పూర్తయ్యేలోపు వేదపాఠశాల ప్రాంగణంలో మొక్కలు నాటాలని, స్థలం చుట్టూ పాతపద్ధతిలో మెస్తో ప్రహరీ నిర్మించాలని ఆదేశించారు. సహజ ఆసుపత్రి పనితీరుపై అసంతృప్తి.. దేవస్థానం నిర్వహిస్తున్న సహజ ప్రకృతి ఆసుపత్రి పనితీరుపై ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రసాద్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో పది మంది సిబ్బంది, నలుగురు పేషెంట్లు ఉండడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రి చుట్టూ అపరిశుభ్ర వాతావరణం ఉండడాన్ని చూసి మండిపడ్డారు. ఇది ఆలయానికి అప్రతిష్ట అని ఈఓను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. దేవస్థానంలో పారిశుద్ధ్య పనులు చూస్తున్న పద్మావతి సంస్థ అన్నవరం మేనేజర్ కుళాయప్పకు రూ.పదివేలు జురిమానా విధించారు. ఆర్జేసీ అజాద్కు ‘సహజ’ బాధ్యతలు.. సహజ ఆసుపత్రిని కేంద్ర ప్రభుత్వ ఆయుష్ సంస్థకు అనుసంధానం చేసి అభివృద్ధి చేస్తామని ప్రిన్సిపల్ సెక్రటరీ జేఎస్వీ ప్రసాద్ అన్నారు. ఇందుకుగాను 20 పాయింట్లు రూపొందించామన్నారు. ఆసుపత్రి ముందు ఔషద మొక్కలను పెంచుతామన్నారు. ఆ పనులను దేవాదాయశాఖ కాకినాడ ఆర్జేసీ చంద్రశేఖర్ అజాద్కు అప్పగిస్తున్నట్టు తెలిపారు. పనులు పూర్తయ్యాక దీనిపై ఒక బ్రోచర్ ముద్రించి ప్రచారం చేస్తామన్నారు. చెందుర్తిలో సోలార్ పవర్ప్రాజెక్ట్ చెందుర్తిలో ఉన్న 135 ఎకరాల దేవస్థానం స్థలంలో 1.5 మెగావాట్ సోలార్ పవర్ ప్రాజెక్ట్ను రూ.4.5 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేయాలని ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రసాద్ సూచించారు. ఈ ప్రాజెక్ట్ ను సత్యగిరిపై ఏర్పాటు చేయాలని గతంలోనే దేవస్థానం చైర్మన్, ఈఓ లతో కూడిన పాలకమండలి తీర్మానించింది. అయితే సత్యగిరిపై కాకుండా చెందుర్తి భూమిలో ఏర్పాటు చేయాలని ఆయన ఆదేశించారు. ఎట్టకేలకు యాగశాల నిర్మాణానికి మోక్షం: దేవస్థానంలో యాగశాల ఏర్పాటు పనులు 18 నెలలుగా నిలిచిపోయిన విషయం విదితమే. అయితే గురువారం ప్రిన్సిపల్ సెక్రటరీ జేఎస్వీ ప్రసాద్ ఈ నిర్మాణానికి గ్రీన్సిగ్నల్ ఇచ్చారు. తన ఆదేశాలను దేవాదాయశాఖ కమిషనర్కు తెలియజేసి వెంటనే పనులు ప్రారంభించాలని ఆయన ఈఓను ఆదేశించారు. అన్నదానం భవన నిర్మాణస్థలం మార్పుపైనా సానుకూలత.. అన్నదాన భవన నిర్మాణాన్ని పాత టీటీడీ సత్రం భవనస్థలంలో నిర్మించే విషయమై పరిశీలనకు ఆయన సంసిద్ధత వ్యక్తం చేశారు. అనంతరం చైర్మన్, ఈఓలతో కలసి ఆయన టీటీడీ సత్రం స్థలాన్ని పరిశీలించారు. సత్యగిరిపై నిర్మాణాలను అంగీకరించే ప్రసక్తి లేదు సత్యగిరిపై 138 గదుల సత్రంతో సహ ఈ విధమైన నిర్మాణాలను అంగీకరించే ప్రసక్తి లేదని మరోసారి ఆయన స్పష్టం చేశారు. అయితే సౌండ్ అంట్ లైట్ షో, అర్బన్ గ్రీనరీ పనులు కొనసాగుతాయని వివరించారు. ప్రిన్సిపల్ సెక్రటరీ జేఎస్వీ ప్రసాద్ వెంట దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ కే నాగేశ్వరరావు, దేవాదాయశాఖ ఆర్జేసీ చంద్రశేఖర్ అజాద్, దేవస్థానం ఈఈ శ్రీనివాసరాజు, డీఈలు రామకృష్ణ, రాజు, ఏఈలు రాంబాబు, తదితరులు పాల్గొన్నారు. -
తెలంగాణ అన్నవరం
గూడెం గుట్ట పుణ్య తీర్థం ప్రకృతి ఒడిలో.. దేవుని గుడిలో భక్తులను పులకరింపజేస్తుంది గూడెం గుట్ట.. ఎత్తయిన కొండలు... గోదావరి నీటి గలగల సవ్వడులు అలరిస్తున్నాయి. కొండపై వెలసిన శ్రీ రమాసహిత సత్యనారాయణస్వామి భక్తుల పాలిట కొంగు బంగారంగా విరాజిల్లుతున్నాడు. ఈ ప్రదేశాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రెండో అన్నవరంగా పిలిచేవారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ‘తెలంగాణ అన్నవరం’గా పిలుచుకుంటున్నారు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం గూడెం గ్రామ శివారులో ఎత్తయిన కొండపై వెలసిన శ్రీ సత్యనారాయణ స్వామి దేవాలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. ఈ క్షేత్రం మంచిర్యాలకు 30 కిలోమీటర్లు, కరీంనగర్కు 70 కిలోమీటర్ల దూరంలో 63 వ జాతీయ రహదారికి పక్కనే ఉంది. ఆలయ సమీపాన పవిత్ర గోదావరి నది ప్రవహిస్తుంది. దీంతో భక్తులు గోదావరినదిలో పుణ్యస్నానాలు ఆచరించి గుట్టపైన గల శ్రీరమాసహిత సత్యనారాయణ స్వామిని దర్శించుకుంటారు. ఇక్కడ నిత్యపూజలతో పాటు, సత్యనారాయణ వ్రతాలు, పెళ్లిళ్లసీజన్లో పెళ్ళిళ్లు కూడా జరుగుతుంటాయి. ఆలయ ప్రాశస్త్యం సుమారుగా 53 సంవత్సరాల క్రితం గూడెం గ్రామానికి చెందిన గోవర్దన పెరుమాండ్లు అనే చాత్తాద వైష్ణవుడికి సత్యదేవుడు కలలో కనిపించాడు. మీ గ్రామ శివారులో గల రాట్నపు చెవుల కొండపై ఉన్నానని చెప్పాడు. ఆ వైష్ణవుడు కొండపై వెదకగా చిన్న విగ్రహం దర్శనమిచ్చింది. ఆయన సంతోషంతో సమీపాన గల గోదావరి నదికి వెళ్లి స్నానం ఆచరించి వచ్చాడు. గోదావరి జలంతో అభిషేకం నిర్వహించి సుగంధ ద్రవ్యాలతో పూజలు నిర్వహించాడు. విషయం తెలుసుకున్న గ్రామస్థులు కూడా స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. కొద్దిరోజుల తర్వాత చాత్తాద వైష్ణవుడు భక్తుల సహకారంతో గుట్టపైనే ఆలయం నిర్మించాడు. క్రోధి నామ సంవత్సర మాఘశుద్ధ దశమి రోజున (1964 లో) విగ్ర ప్రతిష్ట చేశారు. అప్పటినుంచి ఇప్పటి వరకు ఆలయం దినదినాభివృద్ధి చెందుతూ ప్రసిద్ధికెక్కింది. ఇక్కడ ప్రతి పౌర్ణమికి జాతర, కార్తీక పౌర్ణమికి భారీఎత్తున జాతర నిర్వహిస్తూ, ప్రతి ఏటా స్వామివారి కళ్యాణ బ్రహ్మోత్సవాలు కూడా ఘనంగా నిర్వహిస్తుంటారు. అయ్యప్ప, ఆంజనేయ స్వామి, సాయిబాబా సత్యనారాయణ స్వామి ఆలయం సమీపాన గల మరో ఎత్తయిన కొండపై శ్రీ అయ్యప్పస్వామి, పంచముఖ ఆంజనేయస్వామి ఆలయాలు ఉన్నాయి. శబరిమలైలో ఉండే విధంగా అయ్యప్ప దేవాలయాన్ని నిర్మించడంతో భక్తులు గూడెం అయ్యప్ప ఆలయాన్ని తెలుగువాళ్ల శబరిమలగా పిలుచుకుంటారు. ప్రతి ఏటా అనేకమంది అయ్యప్ప, ఆంజనేయ స్వామి భక్తులు మాలధారణ చేసుకుంటారు. దీక్ష విరమణ కూడా చేస్తారు. వీటితోపాటు గుట్ట కింద శ్రీషిర్డిసాయిబాబా ఆలయం కూడా ఉంది. ఒకేచోట నాలుగు దేవాలయాలు ఉండటంతో ప్రతి నిత్యం ఇక్కడ భక్తుల రద్దీ ఉంటుంది. దీంతో గూడెం గ్రామం పుణ్య క్షేత్రాలకు నిలయంగా ప్రసిద్ధి గాంచింది. ఇలా వెళ్లచ్చు.. గూడెం సత్యనారాయణస్వామి ఆలయానికి కరీంనగర్ నుంచి బస్సులు లేదా ప్రైవేటు వాహనాల్లో రావచ్చు. బస్సుల్లో వచ్చే వారు. లక్సెట్టిపేట మీదుగా ఆదిలాబాద్, మంచిర్యాల వెళ్లే బస్సులు ఆలయం ముందునుంచే వెళతాయి. నిజామాబాద్, జగిత్యాల వైపు నుంచి వచ్చే వాళ్లు లక్సెట్టిపేట, మంచిర్యాల వెళ్లేబస్సుల్లో రావచ్చు. ఈ బస్సులు కూడా ఆలయం ముందునుంచే వెళతాయి. ఆదిలాబాద్ నుంచి వచ్చే వాళ్లు మంచిర్యాల, లేదా వయా లక్సెట్టిపేట మీదుగా కరీంనగర్, హైదరాబాద్, వరంగల్, గుంటూరు, ఖమ్మం వెళ్ళే బస్సుల్లో రావచ్చు. మంచిర్యాల బస్సుల్లో వచ్చేవారు కరీంనగర్ టర్నింగ్ చౌరస్తా లో దిగితే అక్కడనుంచి బస్సుల్లో లేదా ప్రెవేటు వాహనాల్లో వెళ్లచ్చు. మంచిర్యాల వైపు నుంచి వచ్చే వారు లక్సెట్టిపేట మీదుగా కరీంనగర్, జగిత్యాల, నిజామాబాద్, హైదరాబాద్ వెళ్ళే బస్సుల్లో రావచ్చు. రైలు మార్గం ద్వారా.. గూడెం సత్యనారాయణ స్వామి ఆలయానికి రైలు మార్గం ద్వారా వచ్చేవారు మంచిర్యాల రైల్వేస్టేషన్లో దిగాలి. అక్కడనుంచి ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహనాలు వెళతాయి. మంచిర్యాల నుంచి లక్సెట్టిపేట మీదుగా కరీంనగర్, హైదరాబాద్, జగిత్యాల, నిజామాబాద్ వెళ్లే బస్సుల్లో వస్తే ఆలయం ముందే దిగచ్చు. – మొదంపురం వెంకటేష్, దండేపల్లి, మంచిర్యాల -
రత్నగిరిపై ‘ఏకాదశి’ రద్దీ
స్వామిని దర్శించిన 40 వేలమంది భక్తులు ఎండ వేడి తట్టుకోలేక భక్తుల ఇబ్బందులు అన్నవరం(ప్రత్తిపాడు) : ఏకాదశి పర్వదినం సందర్భంగా సోమవారం రత్నగిరి శ్రీసత్యదేవుని ఆలయానికి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. స్వామివారిని దర్శించుకున్నారు. తెల్లవారుజామున ఐదు గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకూ భక్తుల రద్దీ కొనసాగింది. సోమవారం 40 డిగ్రీల పైబడి ఎండ కాయడంతో భక్తులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. ఉదయం పది గంటల నుంచి నేల వేడెక్కి కాళ్లు కాలిపోవడంతో తీవ్ర అవస్థలు పడ్డారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకున్న తెల్లవారుజామున ఐదు గంటల నుంచి స్వామివారి ఆలయాన్ని తెరిచి భక్తులకు దర్శనాన్ని ఏర్పాటు చేశారు. నాలుగు గంటల నుంచి వ్రతాల నిర్వహణ ప్రారంభించారు. స్వామివారి దర్శనానికి గంట ప్రత్యేక దర్శనానికి అరగంట సమయం పట్టింది. సత్యదేవుని వ్రతమాచరించిన చిన రాజప్ప, రెడ్డి సుభ్రహ్మణ్యం: డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప, శానసమండలి డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం సత్యదేవుని వ్రతమాచరించి స్వామివారిని దర్శించుకున్నారు. స్వామి దర్శనం అనంతరం వేదపండితులు వేదాశీస్సులు, అధికారులు స్వామివారి ప్రసాదాలను అందజేశారు. ఏసీ మండపంలో వ్రతాలకు డిమాండ్: ఎండ తీవ్రత అధికంగా ఉండడంతో వ్రతాలాచరించే భక్తులు రూ.2,000 టికెట్తో ఏసీ వ్రతమండపంలో వ్రతాలాచరించేందుకు మొగ్గు చూపారు. సాధారణంగా ప్రతి రోజూ వంద వ్రతాల వరకూ మాత్రమే ఇక్కడ జరుగుతాయి. అటువంటిది సోమవారం రెండు వందలకు పైగా ఈ వ్రతాలు జరిగాయి. స్వామివారిని దర్శించిన 40 వేల మంది భక్తులు: సుమారు 40 వేలమంది భక్తులు సోమవారం సత్యదేవుని దర్శించారని అధికారులు అంచనా వేస్తున్నారు. స్వామివారి వ్రతాలు 3,611 జరిగాయి. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.30 లక్షలు ఆదాయం సమకూరిందని అధికారులు తెలిపారు. -
అన్నవరానికి త్వరలో కొత్త ఈఓ!
రెవెన్యూశాఖకు ప్రస్తుత ఈఓ నాగేశ్వరరావు సరెండర్? ప్రచారంలోకి త్రినాథరావు, రఘునాథ్ పేర్లు అధికారపార్టీ నేతల ముమ్మర ప్రయత్నాలు అన్నవరం : అన్నవరం దేవస్థానం ఈఓ కె.నాగేశ్వరరావును ఆయన మాతృ విభాగం రెవెన్యూ శాఖకు సరెండర్ చేయాలా లేక మరో ఆరు నెలలు ప్రస్తుత పదవిలోనే కొనసాగించాలా అనే దానిపై రెండు మూడు రోజుల్లో ప్రభుత్వం నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. అధికారపార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు ఆయనను పంపించి, దేవాదాయశాఖకు చెందిన అధికారిని ఈఓ గా నియమించాలని సీఎంను కోరగా, ఆయన అందుకు అంగీకరించినట్టు ప్రచారం జరుగుతోంది. రెవెన్యూ శాఖలో స్పెషల్గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్గా పనిచేస్తున్న ఆయనను 2015 జూలై రెండో తేదీన దేవస్థానం ఈఓగా ప్రభుత్వం నియమించింది. 2016 జూలై రెండో తేదీకి ఏడాది కాలపరిమితి పూర్తవడంతో మరో ఏడాది డెప్యుటేషన్ పొడిగించింది. దీంతో వచ్చే జూలై రెండో తేదీతో ఆయన కాలపరిమితి ముగియనుంది. తన డెప్యుటేషన్ పూర్తవుతున్నందున తనను రెవెన్యూ విభాగానికి సరెండర్ చేయాలని ఆయన దేవాదాయశాఖ ప్రిన్స్పల్ సెక్రటరీ, కమిషనర్ ను గతంలో కోరారు. అయితే 2018 మే నెలాఖరున పదవీ విరమణ చేయనున్న ఆయన మరో ఆరు నెలలు ఇక్కడే కొనసాగాలని భావిస్తున్నట్టు ప్రచారం జరగుతోంది. పంపించేయాలని నేతల ప్రయత్నాలు: అయితే ఇటీవల కాలంలో ఈఓ పనితీరుపై విమర్శలు వెల్లువెత్తడం, అధికారపార్టీకి చెందిన మెజార్టీ నేతలు కూడా తమకు సరైన గౌరవ మర్యాదలు జరగడం లేదని అసంతృప్తి వ్యక్తం చేస్తుండడంతో ఆయనను కొనసాగించే విషయమై అనుమానం వ్యక్తమవుతోంది. దీనికి తోడు రెవెన్యూ విభాగానికి చెందిన అధికారి ఈఓగా వస్తే దేవస్థానంలో ఎటువంటి అభివృద్ది జరగడం లేదని, ఏడేళ్లుగా ఇదే పరిస్థితి అని కొంతమంది అధికారపార్టీ నాయకులు సీఎంకు వివరించినట్లు సమాచారం. ఈఓగా త్రినాదరావు లేదా రఘునాద్..? ద్వారకా తిరుమల దేవస్థానం ఈఓగా పనిచేస్తున్న వి.త్రినాథరావు లేదా పెనుగంచిప్రోలు దేవస్థానం ఈఓగా పనిచేస్తున్న ఎం.రఘునాథ్ ఇద్దరిలో ఒకరిని అన్నవరం దేవస్థానం ఈఓగా నియమిస్తారనే ప్రచారం సాగుతోంది. త్రినాథరావు గతంలో జిల్లాలో డీసీ పనిచేయగా, రఘునా«థ్ గతంలో అన్నవరం దేవస్థానం ఈఓ గా పనిచేశారు. ఆయన ఆదాయానికి మించి ఆస్తులు కలిగిఉన్నారన్న ఆరోపణలపై అవినీతి నిరోధకశాఖ గతంలో దాడులు చేసింది. ఆ కేసులో ఆయనకు క్లీన్చిట్ లభించిందని చెబుతున్నారు. -
వీడని వివాదాల చెర
అన్నవరం పాలక మండలి ప్రమాణ స్వీకారం తనకు తెలియకుండా ముహూర్తం నిర్ణయించడంపై ఎమ్మెల్యే ఆగ్రహం జూన్ నాలుగుకు మారిన ముహూర్తం అన్నవరం (ప్రత్తిపాడు): అన్నవరం దేవస్థానం పాలకమండలి నియామక జీఓ ఏ ముహూర్తాన విడుదలైందో కానీ ఏదో ఒక వివాదం వెంటాడుతోంది. ఇప్పటివరకూ పాలకమండలి ప్రమాణస్వీకార వేదిక విషయంలో వివాదం ఏర్పడగా, ఇప్పుడు తేదీ విషయంలో మరో వివాదం తలెత్తింది. దీంతో జూన్ నాలుగో తేదీకి ప్రమాణస్వీకారం వాయిదా పడింది. పాలకమండలి ప్రమాణ స్వీకారానికి జూన్ ఒకటో తేదీని ముహూర్తంగా నిర్ణయించి ఆతర్వాత తనను దేవస్థానం అధికారులు ఆహ్వానించడంపై ప్రత్తిపాడు శాసనసభ్యుడు వరుపుల సుబ్బారావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జూన్ ఒకటో తేదీన రాష్ట్ర క్యాబినెట్ సమావేశం ఉందని, అందువల్ల జిల్లా మంత్రులు కానీ, తాను కానీ హాజరయ్యే పరిస్థితి లేదని ఆయన అధికారులకు తెలిపినట్టు సమాచారం. ఇప్పటికే జూన్ ఒకటో తేదీన ప్రమాణస్వీకారం జరుగుతుందని పాలకమండలిలో సభ్యులుగా నియమితులైన 16 మందికీ దేవస్థానం అధికారులు సమాచారం పంపించారు. ఆ సభ్యులు భారీ ఊరేగింపుతో అన్నవరం వచ్చేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రమాణస్వీకార తేదీ మార్పుపై అధికారులు తర్జనభర్జనలు పడ్డారు. చివరకు జూన్ నాలుగో తేదీ సాయంత్రం నాలుగు గంటలు కొత్త ముహూర్తంగా నిర్ణయించారు. ఆ సమయంలో కళావేదిక మీద ఈ కార్యక్రమం జరుగుతుంది. మంత్రులు, ఎమ్మెల్యే హాజరయ్యేందుకు వీలుగా తేదీ మార్పు దేవస్థానం పాలకమండలి సభ్యుల ప్రమాణస్వీకార కార్యక్రమానికి జిల్లాకు చెందిన మంత్రులు, స్థానిక శాసనసభ్యుడు హాజరయ్యేందుకు వీలుగా జూన్ నాలుగో తేదీకి మార్పు చేసినట్టు ఈఓ కె. నాగేశ్వరరావు సోమవారం సాయంత్రం ‘సాక్షి’ కి తెలిపారు. ముందుగా నిర్ణయించిన ఒకటో తేదీన రాష్ట్ర క్యాబినెట్ మీటింగ్ ఉన్నందున ఆ తేదీని మార్చామన్నారు. ఉదయం 9.30 గంటలకు బదులు సాయంత్రం నాలుగు గంటలకు ఆ కార్యక్రమం జరుగుతుందని ఆయన అన్నారు. -
సత్తెన్న ‘ హుండీ ’ సిరి రూ.1.25 కోట్లు
అన్నవరం: శ్రీ సత్యదేవునికి మే నెలలో 27 రోజులకు హుండీల ద్వారా రూ.1,25,18,846 ఆదాయం సమకూరింది. అన్నవరం దేవస్థానంలోని హుండీలను సోమవారం తెరిచి లెక్కించారు. రూ.1,16,37,156 నగదు, రూ.8,81,690 చిల్లర నాణాలు వచ్చినట్టు హుండీ లెక్కింపు పర్యవేక్షించిన దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ కె. నాగేశ్వరరావు తెలిపారు. హుండీల్లో 200 గ్రాముల బంగారం, 145 గ్రాముల వెండి భక్తులు సమర్పించారన్నారు. వీటితో బాటు అమెరికా డాలర్లు 144, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దీనార్లు పది, ఖతార్ సెంట్రల్ బ్యాంక్ దీర్హామ్ ఒకటి, సింగపూర్ డాలర్లు 12, మలేషియా డాలర్లు తొమ్మిది, కెనడా డాలర్లు 20, మరో ఐదు దేశాలకు చెందిన కరెన్సీ లభ్యమయ్యాయని తెలిపారు. వేసవి సెలవుల కారణంగా నెల్లాళ్లుగా సత్యదేవుని ఆలయానికి భక్తులు భారీగా తరలివస్తున్నారని ఈఓ నాగేశ్వరరావు తెలిపారు. దీనికి తోడు పెద్దసంఖ్యలో వివాహాలు జరగడం, స్వామివారి దివ్యకల్యాణమహోత్సవాలు తదితర కార్యక్రమాలను తిలకించడానికి వచ్చిన భక్తులు హుండీలో దండిగా కానుకలు సమర్పించడంతో ఈ ఆదాయం లభించిందన్నారు. ఆదాయంలో రూ.వంద, రూ.పదులదే అగ్రస్థానం: సత్యదేవుని హుండీ ఆదాయంలో సగానికన్నా ఎక్కువగా రూ.వంద, రూ.పది నోట్లే ఉన్నాయి. రూ. 2 వేల నోట్లు 556, రూ. 500 నోట్లు 3,646, రూ. 100 నోట్లు 46,700, రూ. 50 నోట్లు 22,772, రూ. 20 నోట్లు 40,867, రూ. పది నోట్లు 2,06,431, రూ. 5 నోట్లు 2,343, రూ. 2 నోట్లు 15, రూ. 1 నోట్లు 161 ఉన్నాయి. చిల్లర రూ. 8,81,690 సమకూరింది. -
సత్యగిరిపై సత్రానికి మూడో ‘సారీ’
సత్రం నిర్మాణానికి మూడో సారి తీర్మానం తిరస్కరించిన ఉన్నతాధికారులు కొండ దిగువున సత్రం నిర్మాణానికి అంగీకారం అన్నవరం (ప్రత్తిపాడు): ప్రతి చిన్న విషయానికి పొదుపు, విరాళాలు అంటూ కాలయాపన చేసే దేవస్థానం అధికారులు ఒకవైపు... అవసరమని తెలిసి కూడా సత్రాల నిర్మాణానికి అనుమతి ఇవ్వని దేవాదాయశాఖ ఉన్నతాధికారులు మరోవైపు... దీంతో అంగుళం ముందుకు కదలని దేవస్థానం నిర్మాణాలు... వసతి గదులు దొరక్క భక్తుల ఇబ్బందులు...ఇదీ ప్రస్తుతం అన్నవరం దేవస్థానం పరిస్థితి. అన్నవరం సత్యగిరిపై 1.5 ఎకరాల స్థలంలో రూ.16 కోట్లతో ఐదంతస్తుల్లో 138 గదులతో తలపెట్టిన సత్రం నిర్మాణానికి ముచ్చటగా మూడో సారీ దేవాదాయశాఖ ఉన్నతాధికారుల నుంచి చుక్కెదురైంది. ఈ నిర్మాణం ఇప్పుడే వద్దని, ముందు కొండదిగువున ఈరంకి వారి సత్రంలో వంద గదులు నిర్మించుకోవాలని దేవాదాయశాఖ కమిషనర్ వై.వి.అనూరాధ దేవస్థానం అధికారులకు సూచించారు. దీంతో ఈ సత్రం నిర్మాణానికి ఏడేళ్లలో మూడో సారి అధికారులు చేసిన ప్రయత్నం వృ«థా అయింది. దేవస్థానం మాస్టర్ప్లాన్ ఇంకా సిద్ధం కాకపోవడాన్ని సాకుగా చూపి అనుమతి ఇవ్వలేదని అధికారులు తెలిపారు. ప్రిన్సిపల్ సెక్రటరీ జె.ఎస్.వి.ప్రసాద్ దేవస్థానానికి వచ్చి ఈ సత్రం నిర్మాణం అవసరం ఉందో లేదో పరిశీలించిన తరువాత అనుమతి ఇచ్చే విషయం పరిశీలిస్తామని చెప్పినట్టు సమాచారం. దీంతో ఈ సత్రం అనుమతి కోసం విజయవాడ వెళ్లిన ఇంజినీరింగ్ శాఖ అధికారులు డీలా పడ్డారు. 2011లోనే పాలక మండలి తీర్మానం భక్తుల వసతి కోసం సత్యగిరిపై 138 గదులతో సత్రం నిర్మించాలని 2011లో చైర్మన్ ఐ.వి.రామ్కుమార్ అధ్యక్షతన గల పాలకమండలి తీర్మానించింది. ఈ సత్రం నిర్మాణానికి రూ.11 కోట్లు వ్యయమవుతుందని ఇంజినీరింగ్ అధికారులు అంచనా వేశారు. దీన్ని 2012లో అప్పటి కమిషనర్ ఆమోదించగా, అప్పటి ఈఓ, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ ప్రసాదం వేంకటేశ్వర్లు సత్రం నిర్మాణానికి టెండర్లు పిలవకుండా తాత్సారం చేయడంతో నిర్మాణం జరగలేదు. ఆయన బదిలీ అనంతరం మరలా 138 గదుల సత్రం నిర్మాణానికి 2014లో పాలకమండలి రెండో సారి తీర్మానం చేసింది. అప్పుడు దీని అంచనా వ్యయం రూ.11 కోట్ల నుంచి రూ.14.5 కోట్లకు పెరిగింది. 2014లో దేవస్థానానికి వచ్చిన శృంగేరీ పీఠాధిపతి జగద్గురు శ్రీభారతీ తీర్థస్వామి ఈ సత్రం నిర్మాణానికి లాంఛనంగా కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు. గత నెలలో మళ్లీ తీర్మానం భక్తుల వసతికి ఇబ్బందిగా ఉన్నందున 138 గదుల సత్రం నిర్మాణం అవసరమని భావించి మరలా గత నెలలో పాలక మండలిలో తీర్మానించారు. దీని నిర్మాణానికి ప్రస్తుత ధరల ప్రకారం రూ.16 కోట్లు వ్యయమవుతుందని అంచనా వేశారు. వాస్తవంగా చూస్తే 2011లోనే దీని నిర్మాణం ప్రారంభిస్తే అప్పటి అంచనా వ్యయం ప్రకారం రూ.11 కోట్లకే పూర్తయి ఉండేది. మూడేళ్ల క్రితమే భక్తులకు అందుబాటులోకి వచ్చేది. దేవస్థానం అధికారుల అశ్రద్ధ, ఉన్నతాధికారుల అభ్యంతరాల కారణంగా దీని నిర్మాణ వ్యయం రూ.ఐదు కోట్లు పెరిగింది. అయినప్పటికీ ఉన్నతాధికారులు అనుమతించకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. కొండ దిగువున సత్రం నిర్మాణానికి అనుమతి కొండ దిగువున జూనియర్ కళాశాల వెనుక గల 2.34 ఎకరాల ఈరంకి వారి స్థలంలో 110 గదులతో సత్రం నిర్మాణానికి కొన్ని మార్పులతో కమిషనర్ అనుమతి ఇచ్చారు. దీని నిర్మాణానికి రూ.13.25 కోట్లు వ్యయమవుతుందని అంచనా. ఈ స్థలంలో ప్రస్తుతం నర్సరీ గార్డెన్ నిర్వహిస్తున్నారు. ఈ గార్డెన్ను తయారు చేయడానికి సుమారు రూ.20 లక్షలు ఖర్చుపెట్టి పంపా నుంచి మట్టి తెచ్చి ఎత్తు చేశారు. కొండ కింద సత్రాలకు భక్తుల ఆధరణ ఉండటం లేదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. కొండమీద బస చేయాలనుకునే భక్తులే ఎక్కువ. ఇప్పటికే కొండ దిగువున బస చేసేవారు లేక పంపా సత్రాన్ని ప్రైవేట్ వ్యక్తుల నిర్వహణకు ఇచ్చేశారు. సత్యగిరి సత్రంలో గదులు రద్దీ సమయంలో తప్ప పూర్తిగా నిండే పరిస్థితి లేదు. దీంతో కొండ దిగువున సత్రం కట్టడం పెద్దగా లాభదాయకం కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పరిశీలించాకా అనుమతి ఇస్తామన్నారు సత్యగిరిపై నిర్మించే సత్రానికి కమిషనర్ ఇంకా అనుమతి ఇవ్వలేదు. పూర్తి స్థాయిలో పరిశీలించిన తరువాత అనుమతి ఇస్తామన్నారు. ముందు కొండ దిగువున ఈరంకి వారి స్థలంలో సత్రం కట్టేందుకు అనుమతి ఇచ్చారు. అది కూడా పాత ప్లాన్ మార్చమని చెప్పారు. ఆ ప్లాన్ మార్చేందుకు దేవస్థానం ఈఈని విజయవాడలోని దేవాదాయశాఖ కమిషనర్ కార్యాలయానికి పంపాం. - కె.నాగేశ్వరరావు, ఈఓ, అన్నవరం దేవస్థానం -
అన్నవరం దేవస్థానం పాలకమండలి ఏర్పాటు
- ఛైర్మన్గా వ్యవస్థాపక ధర్మకర్త రోహిత్ - ఎక్స్ అఫీషియో సభ్యునిగా ప్రధానార్చకుడు - బీజేపీ నుంచి ఒక్కరికి అవకాశం - జీఓ విడుదల చేసిన ప్రభుత్వం అన్నవరం: ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానానికి రెండేళ్ల కాలపరిమితితో పాలక మండలిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం రాత్రి జీఓ విడుదల చేసింది. గతంలో ఆలయ వ్యవస్థాపక కుటుంబ సభ్యుడు ( వంశపారంపర్య ధర్మకర్త)తో కలిపి తొమ్మిది మంది సభ్యులు ఉండేవారు.ఈ సంఖ్యను తెలుగుదేశం ప్రభుత్వం 16కు పెంచింది. ఇందులో ఆలయ వ్యవస్థాపక కుటుంబ సభ్యుడు, ఆలయ ప్రధానార్చకుడితోపాటు 13 మంది టీడీపీకి చెందినవారున్నారు. ఒకరు బీజేపీ, మరొకరు ఆలయానికి విరాళాలిచ్చిన దాత ఉన్నారు. పాలక మండలి సభ్యులు వీరే... వ్యవస్థాపక ధర్మకర్తగా రాజా ఇనుగంటి వేంకట రోహిత్, పాలక మండలి సభ్యులుగా రావిపాటి సత్యనారాయణ, పర్వత గుర్రాజు(రాజబాబు) యనమల రాజేశ్వరరావు, యడ్ల బేతాళుడు, అవసరాల వీర్రాజు, కందుల విశ్వేశ్వరరావు, నున్న రామచంద్రరావు, చెల్లి శేషుకుమారి , కొత్త విశ్వేశ్వరరావు, సత్తి దేవదానరెడ్డి, రొబ్బి విజయశేఖర్, సింగిలిదేవి సత్తిరాజు, మారెడ్డి సింగారెడ్డి, మట్టే సత్యప్రసాద్, కొండవీటి సత్యనారాయణలు నియమితులయ్యారు. ఈ పాలకమండలికి ఛైర్మన్గా ఐవీ రోహిత్ వ్యవహరిస్తారని, కొండవీటి సత్యనారాయణ ఎక్స్అఫీషియో సభ్యునిగా, మిగిలిన వారంతా సభ్యులుగా వ్యవహరిస్తారని ఆ జీఓలో పేర్కొన్నారు. -
ఘనంగా సత్యదేవుని పుష్పయాగం
-స్వామి, అమ్మవార్లకు 9 పిండివంటల నివేదన -విష్ణుమూర్తి, లక్ష్మీ అవతారాల్లో ఊయలసేవ -ముగిసిన దివ్యకల్యాణ మహోత్సవాలు అన్నవరం (ప్రత్తిపాడు) : సత్యదేవుని దివ్యకల్యాణ మహోత్సవాల చివరి రోజు వైశాఖ బహుళ పాడ్యమి గురువారం రాత్రి సత్యదేవుని శ్రీపుష్పయాగ మహోత్సవం కన్నుల పండువగా జరిగింది. సర్వాంగ సుందరంగా ముస్తాబు చేసిన అనివేటి మండపానికి సత్యదేవుడు, అమ్మవార్లను, పెళ్లిపెద్దలు సీతారాములను ఊరేగింపుగా రాత్రి 7.30 గంటలకు తీసుకువచ్చారు. అక్కడ గల వెండి సింహాసనం మీద స్వామి అమ్మవార్లను, ఆ సింహాసనం పక్కనే గల మరో ఆసనం మీద పెళ్లిపెద్దలు సీతారాములను ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పుష్పయాగం కార్యక్రమాన్ని ప్రారంభించారు. తొలుత విఘ్నేశ్వరపూజ చేశారు. అనంతరం పుణ్యాహవచనం మంత్రాలను పఠించారు. తరువాత పండితులు గర్భాదానం కార్యక్రమానికి సంబంధించిన పూజలు నిర్వíßహించారు. సత్యదేవుడు, అమ్మవార్లకు దేవస్థానం చైర్మన్, ఈఓ నూతన వస్త్రాలను సమర్పించారు. తరువాత సర్వాంగసుందరంగా అలంకరించిన ఊయల మీద పవళించిన విష్ణుమూర్తి, లక్ష్మీదేవి అవతారంలో సత్యదేవుడు, అమ్మవార్లను అలంకరించి పూజలు చేశారు. మొత్తం పది రకాల పుష్పాలతో స్వామి, అమ్మవార్లను సేవించారు. తొమ్మిది రకాల పిండివంటలను నివేదించి పండితుల మంత్రోఛ్చాటన మధ్య స్వామి, అమ్మవార్లు ఉన్న ఊయలను మూడు పర్యాయాలు ఊపారు. భక్తులు ఊయలకు ఎదురుగా ఉంచిన అద్దంలో స్వామి, అమ్మవార్ల ప్రతిబింబాలను తిలకించి పులకించారు. తరువాత ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు దంపతులకు, వేదపండితుల దంపతులకు, ఈఓ దంపతులకు దంపత తాంబూలాలను బహూకరించారు. ఈ కార్యక్రమానికి వచ్చిన మహిళలందరికీ రవికెలగుడ్డలను, భక్తులకు ప్రసాదాలను పంపిణీ చేశారు. దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, వేదపండితులు కపిలవాయి రామశాస్త్రి, ముష్టి కామశాస్త్రి, ప్రధానార్చకులు కొండవీటి సత్యనారాయణ, గాడేపల్లి వేంకట్రావు, స్పెషల్గ్రేడ్ వ్రతపురోహితులు నాగాభట్ల కామేశ్వరశర్మ, ముత్య సత్యనారాయణ, ఇతర అర్చకస్వాములు, పురోహితులు పాల్గొన్నారు. -
శాస్త్రోక్తంగా సత్యదేవుని శ్రీచక్రస్నానం
- పంపా నదిలో నీరు లేక ఇబ్బంది - బిందెతో నీరు తీసి కార్యక్రమం పూర్తిచేసిన పండితులు అన్నవరం (ప్రత్తిపాడు) : శ్రీసత్యదేవుని దివ్యకల్యాణ మహోత్సవాల్లో భాగంగా ఆరో రోజు వైశాఖ బహుళ పాడ్యమి, బుధవారం ఉదయం సత్యదేవునికి పంపా నదిలో శ్రీ చక్ర స్నానం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఉదయం 8.30 గంటలకు స్వామి, అమ్మవార్లను, పెళ్లి పెద్దలు సీతారాములు ఊరేగింపుగా పంపా నదీ తీరంలో పవర్ హౌస్ వద్ద ఉన్న వేదిక వద్దకు తీసుకువచ్చి సింహాసనం మీద స్వామి అమ్మవార్లను ప్రతిష్టించారు. ఆ పక్కనే ఉన్న ఆసనంపై సీతా రాములను ప్రతిష్టించి ప్రత్యేక అభిషేకాలను నిర్వహించారు. తరువాత ఊరేగింపుగా పంపా నది లోనికి తీసుకువెళ్లి నదీ జలాలతో పండితుల మంత్రోచ్చరణ మధ్య స్వామి వారికి, శ్రీ చక్రానికి స్నానం నిర్వహించారు. కార్యక్రమానికి దేవస్థానం ఛైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ కె. నాగేశ్వరరావు, ఏసీ జగన్నా«ధరావు హాజరయ్యారు. వేదపండితులు కపిలవాయి రామశాస్త్రి, గొల్లపల్లి ఘనాపాఠి, శివ ఘనాపాఠి, ప్రధానార్చకులు కొండవీటి సత్యనారాయణ, స్పెషల్ గ్రేడ్ వ్రత పురోహతులు నాగాబట్ల కామేశ్వరశర్మ, ముత్య సత్యనారాయణ, అర్చక స్వాములు కోట శ్రీను, పురోహితులు పాలంకి పట్టాభి తదితరులు పాల్గొన్నారు. అడుగులోతు నీటిలోనే శ్రీచక్ర స్నానం... నదిలో నీరు అడుగు లోతు మాత్రమే ఉండడంతో బిందెలతో నీరు తోడి పోశారు. భక్తులు కూడా అరకొరగా నీళ్లు మీద పోసుకుని స్నానం అయిందనిపించారు. పంపా నదిలో చాలా రోజుల క్రితమే నీరు అడుగంటింది. రెండ్రోజుల కిందటే రెండు అడుగులు నీరు ఉండేలా ఇంజినీరింగ్ సిబ్బంది గొయ్యి తవ్వగా నీరు చేరినా విరగకాసిన ఎండలకు ఆ నీరు కాస్తా ఆవిరై పోయింది. చిన్న పుష్కరణి వంటిది ఏర్పాటు చేసుకోవడమే ఉత్తమం... ఎప్పుడూ నడి వేసవిలోనే సత్యదేవుని కల్యాణ మహోత్సవాలు జరుగుతాయి. భవిష్యత్లో కూడా ఇటువంటి నీటి సమస్య పునరావృతమయ్యే అవకాశాలున్నందున దేవస్థానం కనీసం మూడు సెంట్ల స్థలంలో ‘గ్రౌండ్ లెవల్ రిజర్వాయర్’ (జీఎల్ఆర్)లాంటి ‘చిన్న పుష్కరణి ’ నిర్మించుకుని మోటార్లతో అందులో నీటిని నింపి శ్రీ చక్ర స్నానం నిర్వహించాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వనదుర్గ అమ్మవారికి ప్రత్యంగిర హోమం - రత్నగిరిపై భక్తుల రద్దీ...గత మూడు రోజుల్లో 60 వేల మంది రాక అన్నవరం: వైశాఖ పౌర్ణమి సందర్భంగా బుధవారం రత్నగిరి వనదేవత శ్రీ వనదుర్గ అమ్మవారికి ఘనంగా ప్రత్యంగిర హోమం నిర్వహించారు. ఉదయం ఎనిమిది గంటలకు పండితులు అమ్మవారికి ఘనంగా పూజలు చేశారు. అనంతరం తొమ్మిది గంటలకు ప్రత్యంగిర హోమం ప్రారంభించారు. 11 గంటలకు హోమం పూర్ణాహుతి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్ బలువు సత్యశ్రీనివాస్ పాల్గొన్నారు. పండితులు ఛామర్తి కన్నబాబు, అంగరసతీష్, సీహెచ్ ప్రసాద్, అర్చకస్వాములు చిట్టెం శ్రీహరగోపాల్, గంగాధరబట్ల శ్రీనివాస్ హోమం, తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పెద్దసంఖ్యలో భక్తులు ఈ హోమంలో పాల్గొన్నారు. రత్నగిరిపై భక్తుల రద్దీ... రత్నగిరిపై భక్తుల రద్దీ పెరిగింది. వరుస సెలవులు, వివాహాల సీజన్ కావడంతో భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. దీంతో ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడుతోంది. సత్యదేవుని దర్శనానికి రెండు గంటలు, ప్రత్యేక దర్శనానికి గంట పడుతోంది. సోమ, మంగళ. బుధ వారాలు మూడు రోజుల్లో సుమారు 60 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించినట్లు అధికారులు తెలిపారు. స్వామివారి వ్రతాలు ఆరువేలు జరిగాయి. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి సుమారు రూ.50 లక్షలు ఆదాయం సమకూరింది. -
స్వామి, అమ్మవార్లకు అరుంధతీ నక్షత్ర దర్శనం
అన్నవరం: సత్యదేవుని దివ్యకల్యాణ మహోత్సవాలలో భాగంగా ఆదివారం సాయంత్రం నవదంపతులు శ్రీసత్యదేవుడు, అనంతలక్ష్మీ అమ్మవార్లకు స్థాలీపాక హోమాలు ఘనంగా నిర్వహించారు. రాత్రి ఏడు గంటలకు స్వామి, అమ్మవార్లను ఆలయం వెలుపలకు తీసుకువచ్చి అరుంధతి నక్షత్రం చూపించి పూజలు చేశారు. వేదపండితులు కపిలవాయి రామశాస్త్రి, ముష్టి కామశాస్త్రి, వ్రతపురోహిత ప్రముఖులు నాగాభట్ల కామేశ్వరశర్మ, ముత్య సత్యనారాయణ, పురోహితులు పాలంకి పట్టాభి, అంగర సతీష్, అర్చకస్వామి కోట శ్రీను తదితరులు పాల్గొన్నారు. -
సత్యదేవుని కల్యాణ ఏర్పాట్లపై అసంతృప్తి
చైర్మన్, ఈవోలపై ఎంపీ తోట ఆగ్రహం పోలీసుల బంధువులతో నిండిపోయిన వీఐపీ, వీవీఐపీ గ్యాలరీలు అన్నవరం : శ్రీసత్యదేవుని దివ్యకల్యాణ మహోత్సవాలను దేవస్థానం అధికారులు నిర్వహిస్తున్న తీరుపై అటు వీఐపీలలో, ఇటు సామాన్య భక్తుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ప్రధానంగా శనివారం రాత్రి నిర్వహించిన సత్యదేవుని దివ్యకల్యాణ మహోత్సవంలో దేవస్థానం అధికారులు, పోలీసులు వ్యవహరించిన తీరు వివాదాస్పదమైంది. వీవీఐపీ గ్యాలరీ, వీఐపీ గ్యాలరీ అంటూ వివాహ వేదిక ముందు సగం స్థలాన్ని తమ అదుపులో పెట్టుకుని సామాన్య భక్తులెవరినీ దరిదాపులకు రాకుండా చేశారు. కల్యాణం ప్రారంభమయ్యాక పోలీసులు వారి బంధువులతో ఆ గ్యాలరీలు నింపేశారు. అధికారులపై ఎంపీ ఆగ్రహం గతేడాది స్వామివారి కల్యాణవేదికకు ముందు కాకినాడ ఎంపీ తోటనరసింహానికి సీటు కేటాయించిన అధికారులు ఈసారి వేదికకు దూరంగా కుడివైపున సీటు కేటాయించారు. దీంతో అక్కడ నుంచి చూస్తే సత్యదేవుని కల్యాణ దృశ్యాలు కనిపించకపోవడంతో ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన దేవస్థానం చైర్మన్, ఈఓ ఇద్దరినీ కాకినాడ పిలిపించి ఈ విషయమై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. దీనికి తోడు ప్రొటోకాల్ లేని వారితో కూడా పట్టువస్త్రాలు, తలంబ్రాల పళ్లాలు నెత్తిన పెట్టడం, వారికి అధిక ప్రాధాన్యం ఇవ్వడం కూడా విమర్శలకు తావిచ్చింది. భక్తుల రాకుండా అడ్డుకున్న దేవస్థానం సత్యదేవుని కల్యాణానికి తరలి రావాలని ఫ్లెక్సీలు, బ్యానర్లు, ప్రకటనల ద్వారా ఊదరకొట్టిన దేవస్థానం అధికారులు కల్యాణ సమయానికి మాత్రం భక్తులను కొండమీదకు వచ్చే వీలు లేకుండా చేశారు. రాత్రి తొమ్మిది గంటలు దాటితే ఆటోలు రత్నగిరికి నడవకుండా అధికారులు నిషేధం విధించిన విషయం తెలిసిందే. కల్యాణం రోజున కూడా ఆటోలను వదల్లేదు. ఎక్కువగా దేవస్థానం బస్లను కూడా నడపలేదు. చాలా మంది రాత్రి పది గంటల వరకూ టోల్గేట్ వద్ద ఎదురు చూసి ఇంటికి పోయి టీవీలలో కల్యాణం తిలకించారు. భక్తులను దేవస్థానానికి తరలించాల్సిన ట్రాన్స్పోర్టు ఇన్చార్జి రాజు, ఇతర సిబ్బంది చైర్మన్, ఈఓల సేవలలో తరించారు. జేబు దొంగల చేతివాటం కల్యాణ వేదిక వద్ద సుమారు వంద మందికి పైగా పోలీసులు బంబోబస్తు, వీరికి తోడు దేవస్థానం సెక్యూరిటీ సిబ్బంది ఉన్నప్పటికీ జేబుదొంగలను మాత్రం నిరోధించలేక పోయారు. కాకినాడకు చెందని తుమ్మలపల్లి శివప్రసాద్ జేబులో ఉన్న రూ.లక్షను దొంగలు అపహరించారు. ఆదివారం తెల్లవారుజామున పాయకరావుపేటలో జరిగే గృహ ప్రవేశానికి హాజరవడానికి భార్యతో కలిసి వెడుతూ ఆయన సత్యదేవుని కల్యాణం తిలకించేందుకు రత్నగిరి చేరుకున్నట్టు తెలిపారు. అప్పటి వరకూ భక్తుల గ్యాలరీలో ఉన్న తాను తలంబ్రాలల కోసం వీఐపీ గ్యాలరీ లోకి రాగానే జేబులో ఉన్న 2,000 నోట్ల కట్ట (రూ.లక్ష)ను అపహరించారని తెలిపారు. దీనిపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశానన్నారు. -
సత్యదేవుని ఆదాయానికి ‘క్షవరం’
- అన్నవరం దేవస్థానంలో రూ.7 లక్షల విలువైన తలనీలాలు మాయం - రూ.1.28 కోట్లకు వేలం పాడిన టీడీపీ నేత - షరతుల ప్రకారం సగం సొమ్ము చెల్లించకుండానే మూడు నెలల తలనీలాల తరలింపు - కుమ్మక్కైన సిబ్బంది - ఆలస్యంగా గుర్తించిన అధికారులు - గుమస్తా సస్పెన్షన్.. ఇద్దరికి ఛార్జ్ మెమోలు అన్నవరం : బీహార్లో పశువుల దాణాను మేసేసిన ప్రబుద్ధుల గురించి విన్నాం. రాష్ట్రంలో ఇసుక బుక్కేస్తున్న బకాసురుల బాగోతాలను రోజూ చూస్తూనే ఉన్నాం. తాజాగా అన్నవరం దేవస్థానంలో సత్యదేవుని ఆదాయానికి కొంతమంది సిబ్బంది క్షవరం చేసేశారు. 18 రోజుల కాలానికి భక్తులు సమర్పించిన రూ.7 లక్షల విలువైన తలనీలాలు మాయమయ్యాయి. దాదాపు ఆరు నెలల కిందట జరిగిన ఈ వ్యవహారం బయటకు వెల్లడి కాకుండా కొందరు అధికారులు గోప్యత పాటించారు. ఎట్టకేలకు ఆ బాగోతం బయట పడడంతో కేశఖండన శాల గుమస్తాను సస్పెండ్ చేసి, సంబంధిత సూపరింటెండెంట్, ఏఈఓలకు మెమోలు జారీ చేసినట్లు ఈఓ కె.నాగేశ్వరరావు ఆదివారం విలేకర్లకు తెలిపారు. అసలేం జరిగిందంటే.. పలువురు భక్తులు సత్యదేవునికి తలనీలాలు సమర్పిస్తూంటారు. అలా వచ్చిన తలనీలాలను దేవస్థానం ఏడాది ముందే టెండర్ కం వేలంపాట ద్వారా విక్రయిస్తుంది. పాటదారు ఆ ఏడాదంతా ఆ తలనీలాలను సేకరించుకోవాలి. గత ఏడాది ఆగస్ట్ ఒకటో తేదీ నుంచి ఈ ఏడాది జూలై 31 వరకూ తలనీలాలు పోగు చేసుకుని, తీసుకునే హక్కును తుని మునిసిపాలిటీలో కీలక పదవిలో ఉన్న ఓ టీడీపీ నాయకుడు రూ.1.28 కోట్లకు దక్కించుకున్నారు. టెండర్ షరతుల ప్రకారం సగం మొత్తం అంటే రూ.64 లక్షలు చెల్లించాలి. అనంతరం తలనీలాలు తీసుకోవాలి. దీని ప్రకారం ఆ పాటదారు డిపాజిట్ రూపంలో రూ.10 లక్షలు చెల్లించాడు. మిగిలిన మొత్తంలో రూ.18 లక్షలు నగదు, మిగిలిన మొత్తానికి చెక్కులు ఇచ్చాడు. అయితే ఆ చెక్కులు మారలేదు. దీంతో టెండర్ నిబంధనల ప్రకారం సగం సొమ్ము చెల్లించనందున, భక్తులు సమర్పించిన తలనీలాలను ఒక గదిలో దాచి ఉంచారు. దీనికి అటు దేవస్థానం అధికారులు, ఇటు పాటదారుని వద్ద పని చేసేవారు రెండు తాళాలు వేసి జాయింట్ కస్టడీలో ఉంచుకున్నారు. అయితే పాట పాడిన వ్యక్తి అధికార టీడీపీ నాయకుడు కావడంతో ఏ ఒత్తిళ్లు వచ్చాయో ఏమో కానీ నిబంధనలకు విరుద్ధంగా తలనీలాలు తీసుకువెళ్లడానికి సంబంధిత అధికారులు అనుమతించారు. దీంతో గదిలో భద్రపరచిన మూడు నెలల తలనీలాలను అక్టోబర్ 29న పాటదారుకు అప్పగించారు. ఆ మర్నాటి నుంచి భక్తులు సమర్పించిన తలనీలాలను పాటదారుకు ఇవ్వకుండా ప్రతి రోజూ కేశఖండన శాల సిబ్బంది గ్రేడింగ్ చేసి భద్రపర్చాలి. అయితే అధికారుల నుంచి తమకు అటువంటి ఆదేశాలు లేనందున తలనీలాలు ఉన్న గదికి తాళం వేయలేదని సంబంధిత సిబ్బంది చెబుతున్నారు. మొత్తానికి ఏం జరిగిందో కానీ అక్టోబర్ 30 నుంచి నవంబర్ 16 వరకూ వచ్చిన తలనీలాలు మాయమయ్యాయి. ఏ రోజు ఎంత మొత్తంలో తలనీలాలు వచ్చాయన్న ఆధారాలు కూడా లేవు. దీంతో పాటదారు తరఫు మనుషులతో సిబ్బంది కుమ్మక్కై తలనీలాలను తరలించేసి, సొమ్ము చేసుకున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విచారణకు ఆదేశించాం తలనీలాలు మాయమైన వ్యవహారంలో కేశఖండన శాల గుమస్తా ఎం.రామకృష్ణను సస్పెండ్ చేశాం. ఈ వ్యవహారంపై సంజాయిషీ ఇవ్వాల్సిందిగా సూపరింటెండెంట్ జి.సత్యనారాయణ, ఏఈఓ సాయిబాబాలకు ఛార్జి మెమోలు జారీ చేశాం. పెద్ద పెద్ద స్కామ్లు కూడా చాలా కాలం తరువాతే వెలుగు చూస్తాయి. ఇదీ అంతే. ఆరు నెలల క్రితం జరిగినా అందుకే మా దృష్టికి రాలేదు. పాటదారు చెల్లించిన సొమ్ము మేరకే తలనీలాలు తీసుకువెళ్లేందుకు అనుమతించాం. ఈ వ్యవహారంపై విచారణకు ఆదేశించాం. నవంబర్ 17 నుంచి తలనీలాలను భద్రపరుస్తున్నాం. పూర్తి సొమ్ము కట్టని పాటదారుపై కేసు వేశాం. పాత వేలం రద్దు చేసి కొత్తగా వేలం నిర్వహిస్తాం. - కె.నాగేశ్వరరావు, కార్యనిర్వహణాధికారి, అన్నవరం దేవస్థానం -
సత్తెన్న పెళ్లికొడుకాయెనే...
∙సత్యదేవుని దివ్య కల్యాణానికి సర్వం సిద్ధం ∙రత్నగిరిపై మొదలైన పెళ్లి సందడి ∙నేటి రాత్రి 9.30 నుంచి కల్యాణోత్సవం అన్నవరం : భక్తవరదుడు సత్యదేవుడు వరుడై... సిరులొసగే దేవేరి అనంతలక్ష్మీ అమ్మవారు వధువైన శుభవేళ రత్నగిరి పులకించింది. కల్యాణ కారకులైన స్వామి, అమ్మవార్లే పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తెలుగా దర్శనమిచ్చిన తరుణంలో భక్తకోటి తరించింది. రత్నగిరి వాసుడు సత్యదేవుడు, అనంతలక్ష్మీ అమ్మవారి దివ్యకల్యాణోత్సవాలు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. పండితుల వేద మంత్రోచ్ఛారణల నడుమ అనివేటి మండపంలో స్వామి, అమ్మవార్లను వధూవరులను చేసి కల్యాణ వేడుకలకు శ్రీకారం చుట్టారు. సత్యదేవుడు, అమ్మవార్లు, పెళ్లి పెద్దలు సీతారాములను సాయంత్రం 4 గంటలకు ఊరేగింపుగా అనివేటి మండపం వద్దకు తీసుకువచ్చారు. సర్వాంగ సుందరంగా ముస్తాబు చేసిన ప్రత్యేక ఆసనంపై స్వామి, అమ్మవార్లను, పక్కనే మరో ఆసనంపై సీతారాములను ప్రతిష్ఠించారు. పండితులు ప్రత్యేక పూజలు చేశారు. స్వామి, అమ్మవార్లకు దేవస్థానం చైర్మ¯ŒS ఐ.వి.రోహిత్, ఈఓ కె.నాగేశ్వరరావు నూతన పట్టు వస్త్రాలను సమర్పించారు. సంప్రదాయ ప్రకారం ముత్తయిదువలు పసుపు దంచారు. ఘనంగా ఎదుర్కోలు ఉత్సవం రాత్రి ఏడు గంటలకు రత్నగిరి కళావేదిక మీద శ్రీసత్యదేవుడు, అమ్మవార్ల ఎదుర్కోలు ఉత్సవం కనులపండువగా జరిగింది. స్వామి వారి తరఫున కొంతమంది పండితులు అమ్మవార్ల తరఫున మరికొంత మంది పండితులు మేము గొప్పంటే... మేము గొప్పని వాదించుకున్నారు. ఈ కార్యక్రమం అనంతరం స్వామి, అమ్మవార్లకు పండితులు నీరాజనమంత్రపుష్పాలు సమర్పించారు. స్వామివారికి పట్టువస్త్రాలు శ్రీసత్యదేవుని కల్యాణానికి టీటీడీ పట్టువస్త్రాలు సమర్పించింది. టీటీడీ డిప్యూటీ ఈఓ బాలాజీ పట్టు వస్త్రాలను దేవస్థానం పండితులకు అందజేశారు. నేడు సత్యదేవుని దివ్యకల్యాణం సత్యదేవుడు, అమ్మవార్ల దివ్యకల్యాణోత్సవం రత్నగిరి వార్షిక కల్యాణ వేదికపై శనివారం రాత్రి 9.30 గంటల నుంచి వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. వీవీఐపీలు, వీఐపీలు, సాధారణ భక్తులు, మహిళలకు వేర్వేరు ఎ¯ŒSక్లోజర్లు ఏర్పాటు చేశారు. దూరంగా ఉండే భక్తులకు కల్యాణం స్పష్టంగా కనిపించేందుకు టీవీ, స్క్రీ¯ŒSల ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. కల్యాణ వేదికను, ఏర్పాట్లను దేవస్థానం చైర్మన్, ఈఓ శుక్రవారం రాత్రి పరిశీలించారు. కల్యాణానికి మంత్రులు, కమిషనర్? సత్యదేవుని దివ్యకల్యాణానికి రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి పి.మాణిక్యాలరావు, మంత్రి సుజయ కృష్ణ రంగారావు, దేవాదాయశాఖ కమిషనర్ వైవీ అనూరాధ, జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు, కలెక్టర్ తదితరులు హాజరయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అన్నవరంలో నేడు వైదిక కార్యక్రమాలు తెల్లవారు జాము 3 గంటలకు సుప్రభాతసేవ ఉదయం 8 గంటలకు చతుర్వేదపారాయణ 9 గంటలకు అంకురార్పణ, «ధ్వజారోహణ, కంకణధారణ, దీక్షావస్త్రధారణ రాత్రి 7 గంటలకు కొండ దిగువన స్వామి వారికి వెండి గరుడ వాహనంపై, అమ్మవారికి గజ వాహనంపై, సీతారాములకు వెండి పల్లకీపై ఊరేగింపు రాత్రి 9.30 నుంచి కొండ మీద వార్షిక కల్యాణ వేదికపై సత్యదేవుని దివ్యకల్యాణం సాంస్కృతిక కార్యక్రమాలు ఉదయం 6 నుంచి 9 గంటల వరకూ భజనలు 8 సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకూ భక్తిరంజని, 6 నుంచి 7 గంటల వరకూ గాత్ర కచేరీ -
రత్నగిరిపై కల్యాణ కాంతులు
- నేటి నుంచే సత్యదేవుని దివ్యకల్యాణ మహోత్సవాలు - సాయంత్రం 4 గంటలకు వధూవరులు కానున్న అమ్మవారు, స్వామి - రేపు రాత్రి 9.30 గంటల నుంచి కల్యాణ మహోత్సవం అన్నవరం : మంచి వ్యక్తితో తన జీవితం ముడిపడాలని.. మంచి చదువు, ఉద్యోగం దొరకాలని పార్థించే యువతీయువకులు.. తమ కాపురం నిండు నూరేళ్లూ అష్టైశ్వర్యాలతో పచ్చగా సాగాలని వేడుకొనే నవదంపతులు.. తమ పిల్లల భవిష్యత్తు చక్కగా సాగాలని కోరుకొనే లక్షలాది మంది భక్తులు.. ఇలా భక్తులు కోరిన కోర్కెలు తీర్చే భక్తవరదుడైన సత్యదేవుడు, దేవేరి అనంతలక్ష్మీ సత్యవతీదేవితో కలిసి.. లోకకల్యాణార్థం కల్యాణ తిలకం దిద్దుకుంటున్నవేళ.. పావన దివ్యక్షేత్రం రత్నగిరి సానువులు పులకరిస్తున్నాయి. వరాలిచ్చే సత్యదేవుడే వరుడవుతున్న వేళ.. సిరులిచ్చే శ్రీమహాలక్ష్మే వధువవుతున్న శుభవేళ.. రత్నగిరి కల్యాణశోభతో తుళ్లిపడుతోంది. ఈ కమనీయ ఘట్టానికి దేవస్థానంలో విస్తృత ఏర్పాట్లు చేశారు. ఆలయాన్ని విద్యుద్దీపాలతో సుందరంగా అలంకరించారు. అనివేటి మండపంలో అంగరంగ వైభవంగా.. సత్యదేవుని ప్రధానాలయం దిగువన అనివేటి మండపంలో అమ్మవారిని, సత్యదేవుడిని వధూవరులను చేసే కార్యక్రమం అంగరంగ వైభవంగా జరగనుంది. వైశాఖ శుద్ధ దశమి శుక్రవారం సాయంత్రం 4 గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమం గంటన్నరపాటు జరుగుతుందని పండితులు తెలిపారు. అనంతరం రాత్రి 7 గంటలకు రత్నగిరి కళావేదిక మీద ఎదుర్కోలు ఉత్సవం జరుగుతుంది. పండితులు రెండు పక్షాలుగా ఏర్పడి.. స్వామి, అమ్మవార్ల ఘనకీర్తిని, వంశచరితను వివరించడమే ఈ కార్యక్రమం ప్రత్యేకత. సీతారాములే పెళ్లిపెద్దలుగా.. సత్యదేవుని కల్యాణానికి రత్నగిరి క్షేత్రపాలకుడైన శ్రీరామచంద్రుడు, సీతమ్మతల్లి పెళ్లి పెద్దలుగా వ్యవహరించనున్నారు. అమ్మవారిని, సత్యదేవుడిని వధూవరులను చేసే కార్యక్రమం నుంచే వారి పెద్దరికం మొదలవుతుంది. వైశాఖ శుద్ధ ఏకాదశి, శనివారం రాత్రి 9.30 గంటల నుంచి జరిగే కల్యాణం, ఆపై ఐదు రోజులపాటు వరుసగా జరిగే వైదిక కార్యక్రమాలు.. పండిత సత్కారం, వనవిహారం, చక్రస్నానం, శ్రీపుష్పయాగం తదితర కార్యక్రమాలకు సీతారాములే పెళ్లి పెద్దలుగా వ్యవహరించనున్నారు. వారం రోజులపాటు నిత్యకల్యాణాల నిలుపుదల ప్రతి నిత్యం స్వామి, అమ్మవార్లకు కల్యాణ మండపంలో నిత్య కల్యాణం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే స్వామివారి దివ్యకల్యాణ మహోత్సవాల్లో భాగంగా శుక్రవారం నుంచి ఏడు రోజులపాటు వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఏడు రోజులూ స్వామివారి నిత్యకల్యాణాలు జరగవు. తిరిగి 12వ తేదీ నుంచి నిత్య కల్యాణాలు ప్రారంభమవుతాయి. -
అన్నవరంలో భక్తుల అష్టకష్టాలు
-
కొండకు కల్యాణశోభ
-సత్యదేవుని పెండ్లివేడుకకు ముస్తాబైన రత్నగిరి -శనివారం రాత్రి 9.30 గంటల నుంచి పరిణయోత్సవం అన్నవరం : సత్యదేవుని కల్యాణ వేడుకలకు రత్నగిరి ముస్తాబయింది. శుక్రవారం నుంచి ఈనెల 11 వరకూ జరగనున్న వేడుకలకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ప్ర«ధానాలయం, ఉపాలయాలు, కల్యాణ వేదిక, ఇతర కట్టడాలను, కొండ దిగువన వివిధ సత్రాలనూ రంగు రంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు. భక్తులకు ఎండ తగలకుండా ప్రధానాలయం చుట్టూ షామియానాలు వేయించారు. అన్నవరంలో పలు చోట్ల పెద్ద పెద్ద బ్యానర్లు, ఫెక్ల్సీలు ఏర్పాటు చేశారు. ఇప్పటికే అన్నవరం, చుట్టుపక్కల గ్రామాలలో సత్యదేవుని ప్రచారరథం ద్వారా కల్యాణ మహోత్సవాల గురించి ప్రచారం చేస్తున్నారు. శుక్రవారం సాయంత్రం నాలుగు గంటలకు సత్యదేవుడు, అమ్మవార్లను వధూవరులను చేయడంతో కల్యాణ వేడుకలు ప్రారంభమవుతాయి. శనివారం రాత్రి 9.30 గంటల నుంచి జరిగే సత్యదేవుడు, అమ్మవారి దివ్యకల్యాణ మహోత్సవాన్ని దూరదర్శన్, టీటీడీ చానల్లు ప్రత్యక్ష ప్రసారం చేయనున్నాయి. ఊరేగింపునకు వాహనాలు సిద్ధం శుక్రవారం నుంచి మంగళవారం వరకూ కొండ దిగువన పెళ్లిపెద్దలు శ్రీసీతారాములతో పాటు సత్యదేవుడు, అమ్మవార్లను వివిధవాహనాలలో ఊరేగించనున్నారు. ఆ వాహనాలకు మరమ్మతులు చేసి సిద్ధ చేశారు. రావణబ్రహ్మ, పొన్నచెట్టు వాహనాలకు రంగులు వేసి ఊరేగింపునకు సిద్దం చేశారు. ఊరేగింపు జరిగే ఐదు రోజులు అన్నవరం మెయిన్ రోడ్ మీద ట్రాఫిక్ను నియంత్రించనున్నారు. కల్యాణోత్సవాల సందర్భంగా ప్రత్తిపాడు సీఐ ఆధ్వర్యంలో సుమారు 50 మంది పోలీసులు బందోబస్తు ఏర్పాట్లలో పాల్గొననున్నారు. కల్యాణం రోజున నలుగురు ఎస్ఐలు, వందమంది పోలీసులు బందోబస్తులో పాల్గొంటారు. స్థానిక కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలు కల్యాణోత్సవాల ఏడు రోజులు స్థానిక కళాకారులతో భక్తిరంజని, హరికథ, బుర్రకథ, కూచిపూడి, భరతనాట్యం వంటి సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. పౌరాణిక నాటకాలను ఈ ఏడాది కూడా రద్దు చేశారు. -
శ్రీకారం చుట్టుకుంది.. పెళ్లి ఉత్సవం..
ఐదు నుంచి 11వ తేదీ వరకూ సత్తెన్న కల్యాణ మహోత్సవాలు వైశాఖ ఏకాదశి, ఆరో తేదీ రాత్రి 9:30కి దివ్య కల్యాణం అన్నవరం : సత్యదేవుని వార్షిక కల్యాణ వేడుకలకు పెళ్లిపుస్తకం(శుభలేఖ) శ్రీకారం చుట్టింది. ప్రతీసారి వీఐపీలకు, ఇతర ముఖ్యులకు పంపిణీ చేసే శుభలేఖ రంగుల పుస్తకంలా ఉండేది. అయితే ఈసారి ఆ పుస్తకానికి బదులు డిజిటల్ ప్రింటింగ్లో ఆకర్షణీయంగా శుభలేఖ ముద్రించారు. వైశాఖ శుద్ధ దశమి ఈనెల ఐదో తేదీ నుంచి 11వ తేదీ వరకూ స్వామివారి దివ్యకల్యాణ మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించేందుకు దేవస్థానంలో ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. వైశాఖ శుద్ధ ఏకాదశి ఆరో తేదీ రాత్రి 9:30 గంటల నుంచి సత్యదేవుడు, అనంతలక్ష్మీ అమ్మవార్లకు రత్నగిరి కల్యాణ వేదికపై దివ్యకల్యాణమహోత్సవం కన్నుల పండువగా జరగనుంది.ఇప్పటికే ఈ శుభలేఖలను ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులకు దేవస్థానం చైర్మ¯ŒS ఐవీ రోహిత్, ఈఓ కే నాగేశ్వరరావు స్వయంగా అందజేశారు. ఊరూవాడా పోస్టర్లు, కరపత్రాలతో ప్రచారం చేస్తున్నారు. ఏడు రోజుల వేడుక... సత్యదేవుని దివ్యకల్యాణమహోత్సవాలను ఏడు రోజుల పాటు నిర్వహించనున్నారు. ఈ వేడుకల కోసం బడ్జెట్లో రూ.40 లక్షలు కేటాయించారు. విద్యుత్ దీపాలంకరణ, ఇతర పనులకు అదనంగా మరో రూ.పది లక్షల వరకూ ఖర్చు చేసే వీలుంది. కల్యాణమహోత్సవాలు షెడ్యూల్ l మే 5, వైశాఖ శుద్ధ దశమి : స్వామి, అమ్మవార్లను వధూవరులు చేసే కార్యక్రమం l మే 6, వైశాఖ శుద్ధ ఏకాదశి : శ్రీసత్యదేవుని దివ్య కల్యాణమహోత్సవం. రాత్రి 9 : 30 గంటల నుంచి రత్నగిరిపై వార్షిక కల్యాణవేదిక మీద సత్యదేవుడు, అమ్మవార్లకు దివ్యకల్యాణ మహోత్సవం. l మే 7, వైశాఖ శుద్ధ ద్వాదశి : నవదంపతులకు అరుంధతీ నక్షత్ర దర్శనం, రావణబ్రహ్మ వాహనంమీద స్వామివారి ఊరేగింపు l మే 8, వైశాఖ శుద్ధ త్రయోదశి: వేదపండిత సదస్యం l మే 9, వైశాఖ శుద్ధ చతుర్దశి: వనవిహారోత్సవం, వెండి రథోత్సవం l మే 10, వైశాఖ పౌర్ణిమ: ఉదయం, శ్రీచక్రస్నానం, మధ్యాహ్నం గౌరీపూజ, నాకబలి, దండియాడింపు. l మే11, వైశాఖ బహళ పాడ్యమి. శ్రీపుష్పయాగ మహోత్సవం -
వైశాఖం.. వైభోగం..
సత్యదేవుని సన్నిధిలో జోరుగా కల్యాణాలు గత రెండ్రోజుల్లో 200 వివాహాలు శనివారం పగలు కూడా ఒక్కటైన జంటలు మే నెలంతా, జూ¯ŒS 18 వరకూ పెళ్లిళ్లే పెళ్లిళ్లు అన్నవరం : రత్నగిరి సత్యదేవుని సన్నిధి పెళ్లి బాజాల మోతతో మార్మోగుతోంది. ఏడాదిలో అత్యధికంగా వివాహాలు జరిగే వైశాఖ మాసం గురువారం నుంచి ప్రారంభమైన విషయం విదితమే. దివ్యమైన వివాహ ముహూర్తాలుండడంతో రత్నగిరిపై రెండురోజులుగా పెళ్లిళ్లు జోరుగా జరుగుతున్నాయి. వైశాఖ శుద్ద తదియ, శుక్రవారం రోహిణి నక్షత్రం శుభముహూర్తంలో రాత్రి 12: 40, శనివారం తెల్లవారుజామున 3 : 40 గంటల ముహూర్తంలో పెద్దసంఖ్యలో వివాహాలు జరిగాయి. వివాహాలకు విచ్చేసిన పెళ్లిబృందాల వాహనాలతో శుక్రవారం రాత్రి దేవస్థానం కళాశాల మైదానం నిండిపోయింది. శనివారం పగలు కూడా జోరుగా పెళ్లిళ్లు రోహిణీ న„ýక్షత్రం ఉండడంతో శనివారం ఉదయం 11–19 గంటల ముహూర్తంలోనూ దేవస్థానంలో వివాహాలు జరిగాయి. రోశయ్య మండపం, సర్క్యులర్ మండపం ఈ వివాహాలకు విచ్చేసిన బంధుమిత్రులతో నిండిపోయింది. గత రెండు రోజుల్లో సుమారు 200కి పైగా వివాహాలు జరిగినట్టు అధికారులు తెలిపారు. మే, జూ¯ŒS నెలల్లో జోరుగా వివాహ ముహూర్తాలు వైశాఖ మాసంలో ఈనెల 30, మే నెలలో 4, 6, 7, 8, 11, 12, 13, 14, 17, 18, 19, 20, 21 తేదీల్లో వివాహ ముహూర్తాలు ఉండడంతో ఆయా రోజుల్లో వివాహాలు జరుగునున్నాయి. అదే విదంగా జ్యేష్ట మాసంలో మే 27, 28, 29, 31 తేదీల్లో, జూ¯ŒS నెలలో ఒకటో తేదీ నుంచి 18వ తేదీ వరకూ వివాహ ముహూర్తాలు ఉన్నాయి. వీటి తరువాత ఆషాఢమాసం, ఇతర కారణాల వల్ల సుమారు 40 రోజుల పాటు వివాహాలకు విరామం. తిరిగి జూలై 27వ తేదీ నుంచి వివాహాలు జరుగనున్నాయని పండితులు తెలిపారు. నవ దంపతులతో ఆలయప్రాంగణం కిటకిట భారీగా విచ్చేసిన నవదంపతులు, వారి బంధుమిత్రులతో శనివారం సత్యదేవుని సన్నిధి నిండిపోయింది. శుక్రవారం రాత్రి, శనివారం తెల్లవారుజామున, ఉదయం రత్నగిరిపై పెద్దసంఖ్యలో వివాహాలు జరిగాయి. వీరంతా సత్యదేవుని వ్రతాలాచరించి, స్వామివారిని దర్శించి పూజలు చేశారు. దీంతో రత్నగిరిపై ఎక్కడ చూసినా నవదంపతులు కనువిందు చేశారు. -
సత్యదేవుని దర్శించిన రాష్ట్ర పీఏసీ చైర్మన్‘బుగ్గన’
తుని ఎమ్మెల్యే రాజా, పర్వత ప్రసాద్లతో కలిసి స్వామివారికి పూజలు అన్నవరం : రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్, కర్నూల్ జిల్లా డో¯ŒS శాసన సభ్యుడు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గురువారం ఉదయం రత్నగిరిపై సత్యదేవుని దర్శించి పూజలు చేశారు. తుని శాసనసభ్యుడు దాడిశెట్టి రాజా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రత్తిపాడు నియోజకవర్గ సమన్వయకర్త పర్వత పూర్ణచంద్రప్రసాద్తో కలిసి ఆయన స్వామివారి ఆలయానికి విచ్చేశారు. వారికి పండితులు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం అనంతరం వేదపండితులు ఆశీస్సులందజేశారు. ఆలయ ఏసీ ఈరంకి జగన్నాథరావు స్వామివారి ప్రసాదాలను ఆయనకు అందించారు. బుగ్గన మాట్లాడుతూ తమ కుటుంబ ఇష్ట దైవం సత్యదేవుడని, ప్రతి నెలా తమ ఇంట్లో సత్యదేవుని వ్రతమాచరిస్తామని తెలిపారు. అధికారంలోకి రావడం ఖాయం.. అన్నవరం వచ్చిన బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డిని స్థానిక వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు కలిశారు. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై ఆయన స్పందిస్తున్న తీరును ప్రశంసించారు. ఈ సందర్భంగా బుగ్గన మాట్లాడుతూ మరో 18 నెలలు ఓపిక పడితే మన ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని కార్యకర్తలకు తెలిపారు. ఒకవేళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అదృష్టం బాగుంటే వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం రావడం మరో నాలుగు నెలలు ఆలస్యమవుతుందే తప్ప అధికారంలోకి రావడం ఖాయం అని తెలిపారు. సత్యదేవుని చిత్రపటాన్ని బహూకరించిన కార్యకర్తలు సత్యదేవుని చిత్రపటాన్ని స్థానిక వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నాయకులు ఆయనకు బహూకరించారు. తుని మండల పార్టీ కన్వీనర్ పోతల రమణ, ఆరుమిల్లి ఏసుబాబు, నాగం గంగబాబు స్థానిక పార్టీ నాయకులు సరమర్ల మధుబాబు, ఎస్ కుమార్ రాజా, రాయి శ్రీనివాస్, ధారా వెంకటరమణ, తాడి సత్యనారాయణ, బొబ్బిలి వెంకన్న, బీఎస్వీ ప్రసాద్, ఆశిన శ్రీనివాస్, కొల్లు చిన్నా, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
సత్యదేవుని దర్శనానికి పోటెత్తిన భక్తులు
అన్నవరం : రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ జయంతి, సెలవు దినం కావడంతో రత్నగిరి సత్యదేవుని ఆలయానికి శుక్రవారం పెద్ద సంఖ్యలో భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. మొత్తం 12 వేలమంది భక్తులు దర్శించుకోగా 1,233 వ్రతాలు జరిగాయి. సుమారు రూ.12 లక్షల ఆదాయం సమకూరింది. భక్తులతోపాటు ప్రభుత్వ ఉన్నతాధికారులు కూడా స్వామివారిని దర్శించుకున్నారు. దక్షిణ మధ్య రైల్వే చీఫ్ మెడికల్ ఆఫీసర్ కేహెచ్కే దొర, నేవీ డైరెక్టర్ థాకరేలు స్వామివారిని దర్శించినవారిలో ఉన్నారు. వారికి ఆలయం వద్ద ఏసీ జగన్నాథరావు ఘనంగా స్వాగతం పలికారు. దర్శనానంతరం స్వామివారి ప్రసాదాలను బహూకరించారు. -
సత్యదేవుడిని దర్శించిన ఆర్టీఐ కమిషనర్
అన్నవరం : సమాచారహక్కు చట్టం(ఆర్టీఐ) కమిషనర్ వేంకటేశ్వర్లు దంపతులు గురువారం రత్నగిరిపై సత్యదేవుని వ్రతమాచరించి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం వేదపండితులు వేదాశీస్సులందించగా దేవస్థానం ఏసీ ఈరంకి జగన్నాథరావు వారికి స్వామివారి ప్రసాదాలను అందజేశారు. -
ఆదాయంపై పెద్దదెబ్బ..
నోట్ల రద్దు ప్రభావంతో స్వల్పంగానే పెరిగినసత్తెన్న ఆదాయం 2016–17లో సత్యదేవుని ఆదాయం రూ.122.59 కోట్లు 2015–16లో 118.95 కోట్లు పెరిగిన ఆదాయం కేవలం రూ.3.60 కోట్లు మాత్రమే 2016–17 లో దేవస్థానంలో ఖర్చు రూ.117.64 కోట్లు రూ.34 కోట్లకు చేరిన అన్నదానం విరాళాలు గడచిన ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2016–17లో సత్యదేవుని ఆదాయం కేవలం రూ.3.60 కోట్లు మాత్రమే పెరిగింది అవును మీరు చదివింది నిజమే.. మూడేళ్లుగా ఆదాయంలో దూకుడు ప్రదర్శిస్తున్న సత్తెన్నపై ఈ ఏడాది పెద్దనోట్ల రద్దు ప్రభావం పడిందో! ఏమో! కానీ ఈ సారి ఆదాయం తగ్గింది. ఈ విషయాన్ని ఆలయ చైర్మ¯ŒS, అధికారులు చెబుతున్నారు. – అన్నవరం (ప్రత్తిపాడు) 2016–17లో స్వామివారికి రూ.122,59,79,867 ఆదాయం సమకూరినట్టు దేవస్థానం చైర్మ¯ŒS రాజా ఐవీ రోహిత్, ఈఓ కే నాగేశ్వరరావు మంగళవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో తెలిపారు. ∙2013–14లో స్వామివారి ఆదాయం రూ.72,05 కోట్లు, 2014–15లో 92.92 కోట్లుకాగా పెరుగుదల రూ.21 కోట్లు. ∙2015–16లో ఆదాయం రూ.118.95 కోట్లు కాగా, పెరుగుదల రూ.26 కోట్లు. వీటితో పోలిస్తే గడచిన ఏడాదిలో పెరిగిన రూ.3.60 కోట్లు చాలా స్వల్పమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. త్వరలోనే దేవస్థానం ఆదాయం రూ.150 కోట్లకు చేరవవుతుందని భావించిన అధికారులకు గత ఏడాది ఆదాయం బాగా తగ్గిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఆదాయం తగ్గుదలపై విభాగాల వారీగా సమీక్ష నిర్వహించి ఆదాయం పెరిగేలా చర్యలు తీసుకోకపోతే భవిష్యత్లో ఇబ్బంది తప్పదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 2016–17లో వ్యయం రూ.117.64 కోట్లు 2016–17 ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ.117.64 కోట్లు వ్యయమైనట్టు చైర్మ¯ŒS రోహిత్, ఈఓ నాగేశ్వరరావు తెలిపారు. వీటిలో ప్రధానంగా వ్రతాల నిర్వహణ, పురోహితుల పారితోషికానికి రూ.14.25 కోట్లు, ప్రసాదం తయారీ, ప్యాకర్ల పారితోషికం కలిపి రూ.14 కోట్లు, శానిటేష¯ŒSకు రూ.3.40 కోట్లు, సిబ్బంది జీతభత్యాలు, పెన్షన్లు, కాంట్రాక్ట్ సిబ్బంది వేతనాలు రూ.24 కోట్లు, సీజీఎఫ్, ఇతర చెల్లింపులు రూ.11 కోట్లు, వివిధ నిర్మాణాలు, విద్యుత్ పరికరాల కొనుగోళ్లకు రూ.మూడు కోట్లు, విద్యుత్ చార్జీల కింద రూ. 1.50 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. బ్యాంకుల్లో డిపాజిట్లు రూ.42.04 కోట్లు.. వివిధ వాణిజ్య బ్యాంకుల్లో దేవస్థానానికి (అన్నదానం డిపాజిట్లు కాకుండా) రూ.42.04 కోట్లు డిపాజిట్లు ఉన్నాయని తెలిపారు. ఈ డిపాజిట్లలో రూ.17 కోట్లు గత రెండేళ్లలో కొత్తగా వేశామని వివరించారు. మిగిలిన డిపాజిట్లు రెన్యువల్ చేసినవన్నారు. ఈ ఏడాది అభివృద్ధి ప్రణాళిక 2017–18లో దేవస్థానంలో అనేక అభివృద్ధి చర్యలు చేపట్టనున్నట్టు చైర్మన్, ఈఓ తెలిపారు. దేవస్థానంలో సత్యగిరి, రత్నగిరి సత్రాలలో బస చేసే భక్తుల కోసం ఒక బస్ను ఉచితంగా నడపనున్నామని, ఈ బస్ ఒకట్రెండు రోజుల్లో విజయనగరం నుంచి వస్తుందని తెలిపారు. మరో కొత్త బస్ కొండదిగువ నుంచి రత్నగిరికి టికెట్ పద్ధతిన నడపనున్నామన్నారు. యాగశాల నిర్మాణం ప్రారంభిస్తామని, సత్యగిరిపై ఆగమ పాఠశాల పనులు వేగవంతం చేస్తామన్నారు. రూ.2.95 కోట్ల వ్యయంతో దేవస్థానం లైట్ అండ్ సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేస్తామన్నారు. అన్నదానం భవన నిర్మాణం చేపట్టనున్నట్టు తెలిపారు. కేంద్రప్రభుత్వ ఆయుష్ విభాగం వారితో సహజ ఆసుపత్రి లో ప్రత్యేక విభాగం ఏర్పాటు చేస్తామని తెలిపారు. అన్నదాన పథకంలో 10.83 లక్షల మందికి భోజనం 2016–17లో సత్యదేవుని నిత్యాన్నపథకంలో 10,83,067 మంది భక్తులకు భోజనం పెట్టామని తెలిపారు. 2014–15లో 10.96 లక్షల మందికి, 2015–16లో 11.64 లక్షల మందికి భోజనం పెట్టినట్టు తెలిపారు. గడచిన ఆర్థిక సంవత్సరంలో భక్తుల రాక తగ్గినందున ఆ మేరకు భోజనాలు తగ్గాయని వివరించారు. అన్నదానపథకానికి గత 30 ఏళ్లుగా భక్తులు సమర్పించిన విరాళాలు రూ.33,98,71,086 బ్యాంకులో డిపాజిట్లుగా జమ చేశామన్నారు. కాగా గడచిన సంవత్సరంలో వచ్చిన విరాళాలు రూ.2.98 కోట్లు. అన్నదాన పథకంలో భోజనం తయారీ ఖర్చు 2014–15లో రూ.29.88, 2015–16లో రూ.27.09, 2016–17లో రూ.26.95. ప్రస్తుతం అన్నదానపథకంలో రూ.లక్ష అంతకంటే ఎక్కువ విరాళాలిచి్చన దాతలు 639, రూ.50వేలు పైబడి 454, రూ.పది వేలు అంతకన్నా ఎక్కువగా ఇచ్చినవారు 4,294, రూ.వేయి కన్నా ఎక్కువ మొత్తం విరాళం ఇచ్చిన దాతలు 1,08,441 మంది ఉన్నారు. నాలుగేళ్లుగా వచ్చిన ఆదాయం (రూ.కోట్లలో) విభాగం... 2013–14 2014–15 2015–16 2016–17 వ్రతాలు.... 13.84 19.19 21.76 23.33 ప్రసాదం 15.73 17.57 19.46 20.49 హుండీలు 09.62 11.04 12.59 12.42 సత్రాలు 05.11 05.65 05.90 06.87 స్పెషల్ దర్శనం 03.12 03.53 05.72 05.00 షాపుల లీజులు 08.57 10.37 11.65 14.42 డిపాజిట్లపై వడ్డీ 02.05 02.65 02.58 04.18 ట్రా¯Œ్సపోర్టు 00.84 00.86 01.03 01.07 ఇతర విభాగాలు 13.17 22.07 38.26 34.82 మొత్తం 72.05 92.93 118.95 122.60 -
సత్యదేవుడి వార్షికాదాయం రూ.122.59 కోట్లు..
అన్నవరం: తూర్పుగోదావరి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణస్వామి దేవస్థానానికి 2016-17 ఆర్థిక సంవత్సరానికి రూ.122 కోట్ల 59 లక్షల 79 వేల 867 ఆదాయం వచ్చినట్లు చైర్మన్ రాజా ఐవీ రోహిత్, ఈఓ కె.నాగేశ్వరరావు తెలిపారు. దేవస్థానంలో మంగళవారం వారు విలేకరులతో మాట్లాడారు. 2015-16 సంవత్సర ఆదాయం రూ.118.95 కోట్లతో పోల్చితే రూ.3.60 కోట్లు మాత్రమే పెరుగుదల నమోదైందన్నారు. నోట్ల రద్దు తదితర కారణాలతో ఆదాయం ఆశించినంతగా పెరగలేదన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. దేవస్థానానికి వచ్చిన ఆదాయంలో రూ.23.33 కోట్లు వ్రత విభాగం ద్వారానే వచ్చింది. మొత్తం ఆదాయంలో ఇదే సింహభాగం. కాగా, సత్యదేవుని నిత్యాన్నదాన పథకానికి 2016-17లో రూ.2.99 కోట్ల విరాళాలు వచ్చాయి. దీంతో నిత్యాన్నదాన ట్రస్ట్ మొత్తం విరాళాలు రూ.33.98 కోట్లకు పెరిగాయి. ఈ విరాళాలపై ఈ ఏడాది రూ.2.53 కోట్ల వడ్డీ రాగా, ఇతర విరాళాలు రూ.56 వేలు వచ్చాయి. ఈ మొత్తంతో 10.83 లక్షల మంది భక్తులకు అన్నప్రసాదం అందజేశారు. -
నేటి నుంచి ‘రత్నగిరి’పై శ్రీరామనవమి వేడుకలు
అన్నవరం : రత్నగిరిపై గల రామాలయంలో శ్రీరామనవమి వేడుకలు మంగళవారం నుంచి తొమ్మిది రోజుల పాటు వైభవంగా నిర్వహించడానికి దేవస్థానం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. రత్నగిరిపై సత్యదేవుడు ఆవిర్భవించినప్పటి నుంచి క్షేత్ర పాలకుడిగా శ్రీరాముడు వ్యవహరిస్తుండడంతో ఏటా ఇక్కడ శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా నిర్వహించడం ఆనవాయితీ. దీనిలో భాగంగా మంగళవారం సాయంత్రం నాలుగు గంటలకు రత్నగిరి రామాలయంలో సీతారాములను వధూవరులను చేసే కార్యక్రమం కన్నుల పండువగా నిర్వహిస్తారు. శ్రీరామనవమి సందర్భంగా బుధవారం సీతారాముల కల్యాణం నిర్వహిస్తారు. తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ వేడుకలకు శ్రీసత్యదేవుడు, అమ్మవారు పెళ్లి పెద్దలుగా వ్యవహరించడం విశేషం. శ్రీరామ నవమి వేడుకల షెడ్యూల్.. ∙ఏప్రిల్ 4న ఉదయం 6 గంటల నుంచి శ్రీరామునికి పట్టాభిషేకం. సాయంత్రం నాలుగు గంటలకు సీతారాములను వధూవరులను చేస్తారు. ∙ఏప్రిల్ 5న ఉదయం పది గంటల నుంచి సీతారాముల కల్యాణం ∙ఏప్రిల్ 6న సీతారాములకు ఆస్థానసేవ. ∙ఏప్రిల్ 7న సాయంత్రం నాలుగు గంటలకు సీతారాముల వారి ఆలయంలో పండిత సదస్యం ∙ఏప్రిల్ 8, 9 తేదీల్లో సీతారాములకు ప్రత్యేక ఆస్థానసేవలు ∙ఏప్రిల్ 10న సాయంత్రం 4 గంటలకు సీతారాముల వనవిహారోత్సవం ∙ఏప్రిల్ 11న ఉదయం చక్రస్నానం, సాయంత్రం నాకబలి, దండియాడింపు ∙ఏప్రిల్ 12న రాత్రి 8 గంటలకు సీతారాములకు శ్రీపుష్పయాగమహోత్సవం -
సత్యదేవునికి తప్పని నోట్ల పాట్లు
-
కోవెలలకు ఎల్ఈడీ కాంతులు
తక్కువ ఖర్చుతో అమరుస్తున్న ‘ఫార్చ్యూ¯ŒS’ l ఇప్పటికే తిరుమల సహా పలు ఆలయాల్లో ఏర్పాటు త్వరలోనే అన్నవరంలో.. అన్నవరం : ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ హిందూ దేవాలయాలకు రంగు రంగుల ఎల్ఈడీ విద్యుత్ దీపాలను తక్కువ ఖర్చుతో అమర్చుతూ శోభాయమానంగా తీర్చి దిద్దుతోంది హైదరాబాద్కు చెందిన ‘ఫార్చ్యూ¯ŒS ఆర్ట్ ఎల్ఈడీ లైటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ’ సంస్థ. ఇప్పటికే తిరుమల తిరుపతి సహా పలు ప్రముఖ దేవస్థానాలలో ఎల్ఈడీ దీపాలను ఏర్పాటు చేసి ఆలయ ప్రముఖులు భక్తుల ప్రశంసలు పొందిన ఫార్చ్యూ¯ŒS త్వరలోనే అన్నవరం దేవస్థానంలో కూడా ఏర్పాటు చేసి రత్నగిరి, సత్యగిరిలకు కొత్త వన్నెలద్దేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ నేపథ్యంలో ‘ఫార్చ్యూ¯ŒS’ సీఎండీ అరవింద్ శ్రీమల్ శనివారం ‘సాక్షి’తో మాట్లాడుతూ 35 ఏళ్లు లైటింగ్ వ్యాపారంలో ఉన్న తాము దేశంలోనే తొలిసారిగా ఎల్ఈడీ లైట్లను తయారుచేసే ప్లాంట్ హైదరాబాద్లో ఏర్పాటు చేశామని, అక్కడ తయారయ్యే దీపాలను లాభం ఆశించకుండా తయారీ ఖర్చుతోనే దేవాలయాలలో ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. విజయనగరంలోని శ్రీ రామనారాయణ ఆలయానికి చేసిన ఎల్ఈడీ విద్యుత్ అలంకరణ తమకు మంచి పేరు తెచ్చిందన్నారు. రాత్రి వేళల్లో ఆ ఆలయం భూలోకస్వర్గంలా దర్శనమిచ్చేలా రంగు రంగుల విద్యుల్లతలు, ఫౌంటె¯ŒSలకు, వివిధ దేవతా విగ్రహాలకు చేసిన అలంకరణ ప్రముఖుల ప్రశంసలు తెచ్చిపెట్టిందన్నారు. విజయనగరంలోని శ్రీ అష్టలక్ష్మీ, శ్రీ వాసవి కన్యకాపర మేశ్వరి ఆలయాలకు శ్రీ చినజీయర్ స్వామి ఆశ్రమానికి చేసిన విద్యుత్ అలంకరణ కూడా పేరు తెచ్చిందని చెప్పారు. హైదరాబాద్లో శ్రీ చినజీయర్ స్వామి ఆధ్వర్యంలో రూ.500 కోట్ల వ్యయంతో రూపుదిద్దుకుంటున్న శ్రీరామానుజ సహస్రాబ్ది ప్రాజెక్ట్కు కూడా ఎల్ఈడీ విద్యుత్ అలంకరణ చేసే అవకాశం తమకే దక్కిందన్నారు. అన్నవరం దేవస్థానాన్ని కూడా ఎల్ఈడీ దీపాలతో శోభాయమానంగా తీర్చిదిద్దుతామని వివరించారు. రాత్రి వేళల్లో హైవేపై, రైళ్లలో ప్రయాణించే వారికి,భక్తులకు ఈ అలంకరణ కన్నుల పండువ గావిస్తుందని తెలిపా రు. ఇప్పటికే రూ. 30 లక్షలతో విద్యుత్ దీపాలు ఏర్పాటు చేశామన్నారు. -
తగ్గిన సత్యదేవుని హుండీ ఆదాయం
అన్నవరం : గత నవంబర్ నెలలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పెద్దనోట్ల రద్దు ప్రభావం సత్యదేవుని హుండీ ఆదాయంపై కూడా పడింది. గత ఐదేళ్లుగా ఏటా రూ.కోటిన్నర నుంచి రూ.రెండు కోట్లు పెరుగుతూ వస్తున్న స్వామివారి హుండీ ఆదాయం 2016–17లో పెరగలేదు సరికదా సుమారు రూ.17.50 లక్షలు తగ్గింది. ఈ ఆర్థిక సంవత్సరంలో చివరిసారిగా దేవస్థానంలోని హుండీలను తెరిచి గురువారం లెక్కించారు. దేవస్థానంలోని స్వామివారి నిత్య కల్యాణ మండపంలో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ సాగిన హుండీ లెక్కింపులో రూ.36,00,094 ఆదాయం వచ్చింది. ఇందులో నగదు రూ 33,55,019 కాగా, చిల్లర నాణాలు రూ.2,45,075. ఈ మొత్తంతో కలిపి 2016–17లో వచ్చిన హుండీ ఆదాయం రూ.12, 41,50, 998 కి చేరింది. 2015–16 ఆర్థిక సంవత్సరంలో దేవస్థానం హుండీ ఆదాయం రూ.12,59,06,490 వచ్చింది. దీంతో పోల్చితే గత ఏడాది హుండీ ఆదాయం కన్నా ఈ సంవత్సరం రూ. 17.50 లక్షలు తగ్గింది. బడ్జెట్ అంచనా కన్నా కూడా తక్కువే.. 2016–17 సంవత్సరంలో హుండీల ద్వారా రూ.12.65 కోట్లు ఆదాయం వస్తుందని దేవస్థానం అధికారులు అంచనా వేశారు. అయితే ఆ అంచనాలు కూడా తారుమారయ్యాయి. సుమారు రూ.24 లక్షలు తక్కువగా హుండీ ఆదాయం వచ్చింది. దీంతో 2017–18 ఆర్థిక సంవత్సరంలో రూ.15 కోట్లు హుండీల ద్వారా ఆదాయం రాగలదని వేసిన అంచనాలు కూడా మార్చుకోవల్సి వస్తుందేమోనన్న అభిప్రాయం అధికారులు వ్యక్తం చేస్తున్నారు. గత మూడేళ్లుగా అన్నవరం దేవస్థానానికి వచ్చిన హుండీ ఆదాయం వివరాలు 2014–15.... రూ.11,04,03,076 2015–16... రూ.12,59,06,490 2016–17... రూ.12,41,50,998 2017–18... రూ.15,00,00,000 (బడ్జెట్లో ప్రతిపాదన) తప్పని పాతనోట్ల బెడద... గురువారం హుండీ లెక్కింపులో కూడా రద్దయిన రూ.500, రూ.వేయి నోట్లు దర్శనమిచ్చాయి. రూ.వేయి నోట్లు 20, రూ.500 నోట్లు 47 వచ్చాయి. ఇప్పటికే దేవస్థానం వద్ద పాతనోట్లు రూ.4.77 లక్షలున్నాయి. వాటిని మార్పిడి చేయాలని ఆర్బీఐని కోరినా తిరస్కరించిన విషయం విదితమే. గురువారం హుండీల ద్వారా వచ్చిన పాత నోట్లతో కలిపి పాత నోట్లు రూ.5,20,500కి చేరాయి. -
మే 6న సత్యదేవుని దివ్యకల్యాణం
- 5 నుంచే ప్రారంభం కానున్న ఉత్సవాలు - ఏర్పాట్లకు రూ.35 లక్షల కేటాయింపు - కల్యాణ మహోత్సవ సన్నాహక సమావేశంలో పాలక మండలి నిర్ణయం అన్నవరం : మే నెల ఐదో తేదీ నుంచి 11వ తేదీ వరకూ (వైశాఖ శుద్ధ దశమి నుంచి బహుళ పాడ్యమి వరకూ) జరగనున్న శ్రీ సత్యదేవుని దివ్యకల్యాణ మహోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్టు దేవస్థానం చైర్మన్ రాజా ఐవీ రోహిత్, ఈఓ కె.నాగేశ్వరరావు తెలిపారు. రత్నగిరిపై సోమవారం జరిగిన కల్యాణోత్సవాల సన్నాహక సమావేశంలో ఈమేరకు నిర్ణయించినట్టు చెప్పారు. వైశాఖ శుద్ధ ఏకాదశి సందర్భంగా మే ఆరో తేదీ రాత్రి స్వామివారి దివ్యకల్యాణం వైభవంగా నిర్వహిస్తామన్నారు. కల్యాణ మహోత్సవాలకు రూ.35 లక్షల వరకూ ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. ఈసారి దేవస్థానమే సొంతంగా చలువ పందిళ్లు వేయిస్తుందని చెప్పారు. దేవస్థానం వ్యవసాయ భూమిలోని తాటిచెట్ల నుంచి తాటియాకులు సేకరిస్తామన్నారు. వెదురుబొంగులు ఇచ్చేందుకు ఒక దాత ముందుకు వచ్చారని తెలిపారు. వచ్చే ఏడాది ఉత్సవాలకు కొత్త వాహనాలు సత్యదేవుని దివ్యకల్యాణ మహోత్సవాల్లో స్వామి, అమ్మవార్లను ఐదు రోజులపాటు ఊరేగించే వివిధ వాహనాలు పాతబడినందున వాటి స్థానంలో కొత్తవి తయారు చేయించాలని నిర్ణయించినట్లు చైర్మన్, ఈఓ తెలిపారు. కొత్త వాహనాల తయారీకి ఏడాదికి పైగా సమయం పట్టే అవకాశం ఉన్నందున వచ్చే ఏడాది జరిగే కల్యాణ మహోత్సవాలకు మాత్రమే ఇవి అందుబాటులోకి వస్తాయన్నారు. సత్యదేవుని దివ్యకల్యాణ మహోత్సవాల్లో మొదటి రోజున పెళ్లిపెద్దలు సీతారాములను, వధూవరులు సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవార్లను వేర్వేరుగా వాహనాల్లో ఊరేగిస్తారు. స్వామివారి కల్యాణం రోజున స్వామి, అమ్మవార్లను విడివిడిగా ఊరేగిస్తారు. మిగిలిన రోజుల్లో స్వామి, అమ్మవార్లను ఒకే వాహనంలో ఊరేగిస్తారు. ఇందుకోసం దేవస్థానం వద్ద వెండి రథ వాహనం, ఆంజనేయ వాహనం, గజ వాహనం, గరుడ వాహనం, కొయ్యతో చేసిన రావణబ్రహ్మ వాహనం, పొన్నచెట్టు వాహనాలు ఉన్నాయి. ఇవన్నీ పాతబడడంతో ఊరేగింపు సమయంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దీనికితోడు దేవస్థానానికి పెద్ద రథం కూడా లేదు. రథంతోపాటు కొత్త వాహనాల తయారీకి దాతల సహకారం తీసుకోవాలని నిర్ణయించారు. ఈ వాహనాలను తయారు చేయించే బాధ్యతను వేదపండితులు, ప్రధానార్చకులు, స్పెషల్గ్రేడ్ వ్రత పురోహిæతులతో కూడిన దేవస్థానం వైదిక కమిటీకి, పీఆర్ఓ తులా రాముకు అప్పగించినట్లు తెలిపారు. సహస్ర దీపాలంకరణ సేవ ఏర్పాటుకు యోచన సత్యదేవుని సన్నిధికి వచ్చే భక్తుల కోరిక మేరకు ఆలయ ప్రాంగణంలో సహస్ర దీపాలంకరణ సేవ ఏర్పాటు చేసేందుకు పండితులతో చర్చిస్తున్నట్లు చైర్మన్, ఈఓ తెలిపారు. తొలుత స్వామివారి జన్మనక్షత్రం మఖనాడు ఈ సేవ ఏర్పాటు చేస్తామని, భక్తుల స్పందననుబట్టి వారంలో ఒక రోజు ఏర్పాటు చేసే అవకాశం ఉంటుందని అన్నారు. కల్యాణ మహోత్సవ సన్నాహక సమావేశంలో పీఆర్ఓ తులా రాము, సూపరింటెండెంట్ బలువు సత్య శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
అధికారుల తీరుపై జక్కంపూడి ధ్వజం
ఆలయ భూముల రికార్డులు తీసుకెళ్లడంపై ఆగ్రహం కోరుకొండ : శ్రీలక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయానికి చెందిన వివిధ రకాల రికార్డులను అన్నవరం దేవస్థానం అధికారులు తీసుకెళ్లడంపై రైతులు, ప్రజల్లో పలు అనుమానాలు రేకెత్తిస్తున్నాయని వైఎస్సార్సీపీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి అన్నారు. సోమవారం కోరుకొండలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో విలేకర్ల సమావేశంలో జక్కంపూడి విజయలక్ష్మి మాట్లాడారు. అన్నవరం దేవస్థానం ఈఓ, స్థానిక ప్రజాప్రతినిధి తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గత కొన్నేళ్లుగా కోరుకొండ దేవస్థానంలో ఉన్న రైతులు, ప్రజలకు సంబంధించిన భూముల రికార్డులు, స్వామి వారి ఆస్తుల రికార్డులను ఎవరికీ సమాచారం ఇవ్వకుండా తీసుకెళ్లడంపై మండిపడ్డారు. చివరకు శ్రీలక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయ అనువంశిక ధర్మకర్త ఎస్పీ. రంగరాజభట్టార్ స్వామికి కూడా సమాచారం తెలియకపోవడంపై పలు అనుమానాలకు దారి తీస్తున్నాయన్నారు. గోకవరం మండలం భూపతిపాలెంలో గల స్వామివారికి చెందిన 1180 ఎకరాల భూమి వివరాల పట్టాలన్నీ తీసుకెళ్లడం చూస్తుంటే దీని వెనుక ఏదో దాగి ఉందని విజయలక్ష్మి అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కోరుకొండ, శ్రీరంగపట్నం, కాపవరం, జంబూపట్నం గ్రామాలకు చెందిన పలువురు రైతుల భూములు రిజిస్ట్రేషన్ కాకుండా అన్నవరం దేవస్థానం వారు నిలుపుదల చేయడంపై గతంలో ఆందోళన చేయడం, అన్నవరం ఈఓకు వినతిపత్రం అందించామన్నారు. రెండున్నరేళ్లుగా రైతులు, ప్రజలకు చెందిన భూములను రిజిస్ట్రేషన్లు నిలిపివేయడానికి ఎలాంటి ఆధారం ఉందో తమకు వివరించాలని డిమాండ్ చేశారు. రిజిస్ట్రేషన్లు నిలిపివేసిన భూములు లక్ష్మీనరసింహ స్వామి దేవాలయానికి చెందినవా, రైతులవా అని తెలియకుండా అన్నవరం దేవస్థానం అధికారులు ఏ హక్కుతో రిజిస్ట్రేషన్లు నిలిపివేశారని ఆరోపించారు. వెంటనే అన్నవరం అధికారులు రికార్డులను కోరుకొండకు తీసుకు రాకపోతే ఆందోళన చేపడతామని హెచ్చరించారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర, జిల్లా నాయకులు నక్కా రాంబాబు, గరగ మధు, తాడి హరిశ్చంద్ర ప్రసాద్రెడ్డి, వాకా నరసింహారావు, నీరుకొండ యుదిష్టర నాగేశ్వరరావు, అయిల శ్రీను, తిక్కిరెడ్డి హరిబాబు, దాసరి యేసు, గుగ్గిలం భాను తదితరులు ఉన్నారు. -
సత్తెన్నకు‘అరకిలో’ బంగారు కానుకలు
హుండీల ఆదాయం రూ.59.47 లక్షలు అన్నవరం : రత్నగిరివాసుడు సత్యదేవునికి హుండీల ద్వారా 17 రోజుల వ్యవధిలో రికార్డు స్థాయిలో అరకిలో బంగారం లభించగా, రూ.59.47 లక్షలు వచ్చింది. ఈ బంగారమంతా భక్తులు స్వామికి సమర్పించిన చిరుకానుకలే కావడం విశేషం. బహిరంగ మార్కెట్లో ప్రస్తుతం ఉన్న బంగారం రేటు ప్రకారం ఈ దీని విలువ సుమారు రూ.14 లక్షలు. ఫిబ్రవరిలో 480 గ్రాముల బంగారం వచ్చినా అప్పుడు 29 రోజులకు హుండీలను లెక్కించారు. మార్చిలో తొలివిడతగా శుక్రవారం దేవస్థానంలో హుండీలను తెరిచి లెక్కించారు. వాటిలో భక్తులు సమర్పించిన సుమారు 50 చిరు బంగారు కానుకలు ఉండడంతో వాటిని తూకం వేయించగా 500 గ్రాములు ఉన్నాయి. గత ఫిబ్రవరిలో వచ్చిన 480 గ్రాములు బంగారం ఆలయచరిత్రలో ఇప్పటివరకూ రికార్డుగా ఉంది. ఇక నగదు రూపంలో రూ.55,94,978 , రూ.3,52,886ల చిల్లర నాణాలు వచ్చాయని లెక్కింపును పర్యవేక్షించిన దేవస్థానం చైర్మన్ రాజా ఐవీ రోహిత్, ఈఓ కె.నాగేశ్వరరావు తెలిపారు. నగదుతోపాటు అమెరికా డాలర్లు 137, సౌదీ అరేబియన్ మోనాటిరీలు 22, యూరో కరెన్సీ 5 ఉన్నాయన్నారు. దేవస్థానం ఏసీ ఈరంకి జగన్నాథరావు, ఏఈఓలు వైఎస్ఆర్ మూర్తి, ఎంకేటీఎన్వీ ప్రసాద్, నటరాజ్, తదితరులు పాల్గొన్నారు. ఈ నెలాఖరున మరోసారి హుండీలను లెక్కిస్తామని అధికారులు తెలిపారు. -
అన్నవరంలో 12 మంది పురోహితుల సస్పెన్షన్
తూర్పుగోదావరి: జిల్లాలోని అన్నవరం సత్యదేవుని ఆలయంలో పని చేస్తున్న వ్రత పురోహితులలో సంప్రదాయ ప్రమాణాలు పాటించని 12 మంది వ్రత పురోహితులను సస్పెండ్ చేస్తూ ఆలయ కార్యనిర్వహణాధికారి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. అన్నవరం సత్యనారాయణస్వామి ఆలయం వ్రతాలను ప్రసిద్ధి. ఇక్కడ దాదాపు 250 మంది వ్రత పురోహితులు పని చేస్తున్నారు. మామూలుగా వ్రతాలు చేయించే పురోహితులు నియమాలను పాటించాలి. పంచె కట్టుతో, బొట్టు పెట్టుకుని, పిలక పెట్టుకుని ఉండాలి. ఈ మేరకు రెండు నెలల క్రితం ఈవో సర్కూలర్ జారీ చేశారు. వ్రత పురోహితులకు రెండు నెలల గడువు ఇచ్చారు. అయినా కొందరు పూజారులు పద్దతి మార్చుకోకుండా సర్కూలర్ను ఉల్లంఘించారు. సంప్రదాయానికి విరుద్ధమైన వేష ధారణతో విధులకు వస్తున్నారు. నిబంధనలు పాటించకుండా నిర్లక్ష్యం చేయడంతో 12 మంది వ్రత పురోహితులను సస్పెండ్ చేస్తూ ఈవో ఉత్తర్వులు జారీ చేశారు. -
12 మంది వ్రత పురోహితుల సస్పెన్షన్
అన్నవరం దేవస్థానంలో కలకలం అన్నవరం: సత్యదేవుని సన్నిధిలో 12 మంది వ్రత పురోహితులను ఈఓ కె. నాగేశ్వరరావు మంగళవారం సస్పెండ్ చేశారు. కోడ్ ఆఫ్ కాండక్ట్ పాటించకపోవడం, వి«ధులకు గైర్హాజరవడం వంటి అభియోగాలపై ఈ చర్య తీసుకున్నారు. దేవస్థానంలో ప్రతి పురోహితుడు విధిగా కట్టు, బొట్టు, శిఖ ధరించాలని 2 నెలల క్రితం ఈఓ ఆదేశించారు. కొంతమంది వ్రత పురోహితులు దీనిని పాటించడంలేదు. దీంతో అన్ని వ్రత మండపాలకూ ఈఓ మంగళవారం తిరిగి ఆ పురోహితులను గుర్తించి క్రమశిక్షణ చర్యలు తీసుకున్నా రు. సస్పెండైన పురోహితులు వారంలోగా సంజాయిషీ ఇవ్వాలని ఆదేశించారు. -
విజయనగరం భక్తులకు సత్యదేవుని ‘దివ్యదర్శనం ’
అన్నవరం: హిందూ నిరుపేద భక్తులను ప్రముఖ పుణ్యక్షేత్రాలకు ఉచితంగా తీసుకువెళ్లి ఆయా దేవతామూర్తుల దర్శనం చేయించి స్వగృహాలకు చేర్చే ‘దివ్యదర్శనం’ పథకం రెండు నెలలుగా రాష్ట్రప్రభుత్వం అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ పథకంలో ఐదో విడతగా విజయనగరం జిల్లాకు చెందిన 200 మంది భక్తులు మంగళవారం సాయంత్రం రత్నగిరిపై సత్యదేవుని దర్శించుకొని పూజలు చేశారు. నాలుగు బస్సులలో వీరు సాయంత్రం ఐదు గంటలకు సత్యదేవుని ఆలయం వద్దకు చేరుకున్నారు. అక్కడ పండితులు వారికి సాదరంగా స్వాగతం పలికి స్వామివారి దర్శనానికి తీసుకువెళ్లారు. స్వామి దర్శనం అనంతరం అనివేటి మండపంలో వేదపండితులు వారికి వేదాశీస్సులు, స్వామివారి ప్రసాదాలను అందజేశారు. అనంతరం వారు విజయవాడ వెళ్లారు. -
కూల్.. కూల్గా..
రత్నగిరి భక్తులకు ఎండ నుంచి రక్షణ ఆలయప్రాంగణం, వ్రతమండపాలవద్ద కూల్ పెయింట్ అన్నవరం: సత్యదేవుని ఆలయానికి వచ్చే భక్తులకు ఎండలో కాళ్లు కాలుతుండగా పరుగంటి నడక కష్టాలు తొలగాయి. వారికి ఎండ నుంచి రక్షణకు దేవస్థానం అధికారులు చర్యలు చేపట్టారు. ఎండదెబ్బతో భక్తులు పడుతున్న ఇబ్బందులపై మంగళవారం ‘సాక్షి’ లో‘ ‘వేడి’ంపులు’ శీర్షికన వార్త ప్రచురితమైన విషయం విదితమే. దానికి స్పందించిన ఈఓ కె. నాగేశ్వరరావు ఆలయప్రాంగణం, వ్రతమండపాలు, పార్కింగ్ స్థలం వద్ద కూల్ పెయింట్ వేయించారు. దేవస్థానం డీఈఈ రామకృష్ణ ఈ పనులను పర్యవేక్షించారు. ఆలయప్రాంగణం, రథంపాత్, ఇతర ప్రదేశాలలో వారం రోజుల్లో షామియానాలు వేయిస్తామని ఈఓ కె. నాగేశ్వరరావు ‘సాక్షి’కి తెలిపారు. ఇప్పటి వరకూ వేసవిలో చలువపందిర్లు వేస్తున్నారని, వాటిని వేసవి అనంతరం తొలగిస్తున్నారని ఆయన గుర్తుచేశారు. ఇప్పుడు అలా కాకుండా శాశ్వతప్రాతిపదికన ఇనుపగొట్టాలు పాతి అవసరమైనప్పుడు ఆ గొట్టాల ఆ«ధారంగా షామియానాలు వేసుకొని, అవసరం తీరాక ఆ గొట్టాలను తీసి భద్రపరిచేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. -
సత్యదేవా! సత్ఫలితమివ్వు!
-రత్నగిరికి వెల్లువెత్తుతున్న టెన్త్ విద్యార్థులు -వివాహాలతో ఆలయ ప్రాంగణంలో పెరిగిన రద్దీ అన్నవరం : పౌర్ణమి పర్వదినం, ఆదివారం కలిసి రావడంతో రత్నగిరిపై సత్యదేవుని ఆలయం వేల సంఖ్యలో వచ్చిన భక్తులతో కిటకిటలాడింది. వివాహాలు జోరుగా జరుగుతుండడంతో నవదంపతులు, వారి బంధుమిత్రులు, సత్యదేవుని దర్శించేందుకు వచ్చిన భక్తులతో ఆలయప్రాంగణంతో పాటు వ్రతమండపాలు, సత్రాలు నిండిపోయాయి. కాగా ఈ నెల 17 నుంచి çపరీక్షలు రాయనున్న పదో తరగతి విద్యార్థులు పరీక్షల్లో మంచి మార్కులతో ఉత్తీర్ణులవ్వాలని కోరుకుంటూ పెద్దసంఖ్యలో స్వామి సన్నిధికి వస్తున్నారు. వీరంతా స్వామివారి వ్రతాలాచరించి దర్శనం చేసుకుంటున్నారు. వీరందరితో ఆలయప్రాంగణంలో సందడికి తెరిపి ఉండడం లేదు. స్థానిక శ్రీసత్యసాయి విద్యావిహార్ పదో తరగతి విద్యార్థులు ఆదివారం సత్యదేవుని వ్రతాలాచరించి స్వామివారిని దర్శించుకున్నారు. పరీక్షల్లో మంచి మార్కులతో ఉత్తీర్ణులవాలని వారిని పండితులు ఆశీర్వదించారు. సత్యదేవుని దర్శించిన 20 వేలమంది భక్తులు ఆదివారం సత్యదేవుని 20 వేలమంది దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించిన భక్తులు గోకులంలో సప్తగోప్రదక్షణ అనంతరం రావి చెట్టుకు పూజలు చేశారు. స్వామివారి వ్రతాలు 2,619 నిర్వహించారు. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.25 లక్షల ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. -
సిరిమంతుడు.. సత్యదేవుడు
అన్నవరం దేవస్థానం 2017–18 బడ్జెట్ రూ.142.59 కోట్లు ఆమోదించిన దేవస్థానం పాలకవర్గం అన్నవరం : భక్తుల కోర్కెలు తీర్చే భక్తవరదుడు, రత్నగిరివాసుడు సత్యదేవుడు ‘సిరి’మంతుడుగా వెలుగొందుతున్నాడు. మూడేళ్ల క్రితం స్వామివారి ఆదాయం రూ.వంద కోట్లకు చేరిందని తెలిసి పలువురు ఆశ్చర్యపోయారు. అయితే 2015–16లో స్వామివారి ఆదాయం రూ.120 కోట్లు, 2016–17 లో రూ.132 కోట్లకు చేరింది. తాజాగా 2017–18లో సత్యదేవునికి రూ.142.59 కోట్ల ఆదాయం వస్తుందని గురువారం దేవస్థానంలో జరిగిన పాలకమండలి బడ్జెట్ సమావేశంలో అంచనా వేసింది. ఈ లెక్కన 2020 నాటికి సత్యదేవుని ఆదాయం రూ.200 కోట్లకు చేరినా ఆశ్చర్యపడనవసరం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 142.59 కోట్లతో 2017–18 బడ్జెట్ అంచనా అన్నవరం దేవస్థానంలో 2017–18 బడ్జెట్ ప్రతిపాదనలను గురువారం జరిగిన పాలకమండలి సమావేశంలో ఆమోదించారు. వివిధ విభాగాల ద్వారా రూ.142,58,95,912 ఆదాయం వస్తుందని, దానిలో రూ.142.29 కోట్లు వ్యయమవుతుందని, రూ.29,95,912 మిగులు ఉంటుందని అంచనా వేశారు. దేవస్థానం చైర్మ¯ŒS రాజా ఐవీ రోహిత్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈఓ కే నాగేశ్వరరావు, ఏసీ జగన్నాథరావు, ఈఈ శ్రీనివాసరాజు తదితరులు పాల్గొన్నారు. బడ్జెట్లో వ్యయాలు ఇలా.. కంట్రిబ్యూష¯ŒS కింద రూ.14.12 కోట్లు : ప్రభుత్వానికి చెల్లించాల్సిన సీజీఎఫ్, అర్చక సంక్షేమ నిధి, ఆడిట్ ఫీజు, తదితర చెల్లింపుల కోసం ఈ ఏడాది బడ్జెట్లో రూ.14.12 కోట్లు కేటాయించారు. దేవస్థానం ఆదాయంలో దాదాపు పదిశాతం ఈ చెల్లింపులకే కేటాయించారు. గత ఏడాది కూడా ఈ చెల్లింపులకు రూ.13.84 కోట్లు కేటాయించారు. సిబ్బంది జీతాలు రూ.26.64 కోట్లు : 2017–18లో దేవస్థానం సిబ్బంది జీతాలు, పెన్షన్లు, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ సిబ్బంది వేతనాలకు రూ.26.64 కోట్లు వ్యయమవుతుందని అంచనా వేశారు. 2015–16 లో ఈ వ్యయం రూ.23.74 కోట్లు మాత్రమే. ప్రసాదం తయారీ, ఇతర దినుసుల కొనుగోలుకు రూ.22.81 కోట్లు ∙సత్యదేవుని ప్రసాద తయారీలో వాడే గోధుమ, నెయ్యి, పంచదార, గ్యాస్ ఇతర దినుసుల కొనుగోలుకు, దుప్పట్లు, ఇతర వస్రా్తలు, పూలదండల కొనుగోలుకు రూ.22.81 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. గతేడాది ఈ మొత్తం రూ.22.69 కోట్లు మాత్రమే. ∙పురోహితుల, నాయీబ్రాహ్మణుల పారితోషకాల చెల్లింపునకు రూ.9.50 కోట్లు ∙సత్యదేవుని వ్రత విభాగంలో పనిచేసే పురోహితుల పారితోషకం చెల్లింపునకు రూ.8.10 కోట్లు, నాయీబ్రాహ్మణుల పారితోషకం కింద రూ.40 లక్షలు, ప్రసాదం ప్యాకర్స్ పారితోషకం చెల్లింపునకు రూ.కోటి బడ్జెట్లో కేటాయించారు. ∙నిర్మాణాలకు రూ.ఎనిమిది కోట్లు : దేవస్థానంలో వివిధ నిర్మాణ పథకాల కోసం రూ.ఏడు కోట్లు, వాటర్వర్క్స్ కోసం రూ.కోటి కేటాయించారు. గతేడాదితో పోల్చితే రూ.15 లక్షలు తగ్గింది. ∙స్వామివారి వార్షిక కల్యాణానికి రూ.40 లక్షలు : ఈ ఏడాది మే నెలలో జరగనున్న సత్యదేవుని వార్షిక కల్యాణ మహోత్సవాలకు రూ.40 లక్షలు, ఇతర ఉత్సవాలకు రూ.20 లక్షలు కేటాయించారు. ∙శానిటేష¯ŒS కొరకు రూ.4.31 కోట్లు : దేవస్థానంలో శానిటేష¯ŒS నిర్వహణ కోసం రూ.4.31 కోట్లు కేటాయించాలని ప్రతిపాదించారు. గతేడాది రూ.3.75 కోట్లు మాత్రమే కేటాయించారు. ∙విద్యుత్ ఛార్జీల కోసం రూ.2.92 కోట్లు : దేవస్థానంలో విద్యుత్ చార్జీల కోసం రూ.2.92 కోట్లు కేటాయించారు. గతేడాది రూ.3.92 కోట్లు కేటాయించారు. ∙ట్రా¯Œ్సపోర్టు నిర్వహణకు రూ.1.12 కోట్లు : దేవస్థానం ట్రా¯Œ్సపోర్టు నిర్వహణకు రూ.1.12 కోట్లు కేటాయించారు. ∙దేవస్థానంలో భద్రత కోసం ఏర్పాటు చేసిన ఎస్పీఎఫ్, ఇతర సిబ్బంది కోసం రూ.2.45 కోట్లు కేటాయించారు. ∙దేవస్థానంలో ఉద్యానవనాల నిర్వహణ, ఇతర ఖర్చుల కోసం రూ.కోటిన్నర కేటాయించారు. ∙వివిధ బ్యాంకుల్లో జమ చేసిన డిపాజిట్లను ఈ ఏడాదీ రెన్యువల్ చేస్తారు. ఈ విధంగా జమ చేసే డిపాజిట్లు రూ.32 కోట్లను కూడా వ్యయంగా బడ్జెట్లో చూపించారు. అన్నదానం, గోసంరక్షణ ట్రస్ట్కు విడిగా బడ్జెట్లు ∙దేవస్థానంలోని సత్యదేవుని అన్నదానపథకం ట్రస్ట్ గోసంరక్షణ నిధికి ప్రత్యేక బడ్జెట్లు రూపొందించారు. అన్నదానం ట్రస్ట్కు రూ.27,89,30,587తో అంచనా బడ్జెట్ రూపొందించారు. ∙గోసంరక్షణకు రూ.61 లక్షలతో బడ్జెట్ రూపొందించారు. కమిషనర్ పరిశీలనకు బడ్జెట్ ప్రతిపాదనలు : ఈఓ నాగేశ్వరరావు 2017–18 సంవత్సర బడ్జెట్ ప్రతిపాదనలను కమిషనర్కు పంపుతున్నాం. కమిషనర్ పరిశీలించిన తరువాత వాటిలో స్వల్పమార్పులు, చేర్పులు ఉండే అవకాశం ఉంటుంది. మొత్తం మీద కేటాయింపుల్లో పెద్దగా మార్పులు ఉండవు. మూడేళ్లుగా ముఖ్య విభాగాల ద్వారా వచ్చిన ఆదాయం 2017–18 బడ్జెట్ ఆదాయ అంచనాలు... (రూ.కోట్లలో) విభాగం.. 2014–15 2015–16 2016–17 2017–18 వ్రతాలు 19.19 21.76 23.70 27.00 ప్రసాద విక్రయాలు 17.57 19.45 19.62 21.50 శీఘ్రదర్శనం 2.95 5.02 4.24 6.00 సత్రాల అద్దెలు 5.57 5.79 6.57 7.00 బ్యాంక్ డిపాజిట్లు 17.74 32.02 22.90 32.00 లీజులు, డిపాజిట్లు 1.69 2.63 2.44 3.00 షాపు లీజులు 6.27 7.25 9.43 11.00 తలనీలాలు 1.20 1.71 1.28 1.00 కొబ్బరి ముక్కలు 0.34 0.45 0.41 0.50 టోల్గేట్ 0.48 0.36 0.18 0.21 కల్యాణాలు 0.50 0.56 0.59 0.70 కేశఖండన 0.35 0.50 0.51 0.60 -
సిక్కోలుకు సత్యదేవుడు
ధర్మ ప్రచారానికి తరలిన ప్రచార రథం నేటి నుంచి జిల్లాలో వివిధ పట్టణాల్లో పర్యటన అన్నవరం : సత్యదేవుని ధర్మ ప్రచారరథం బుధవారం శ్రీకాకుళం జిల్లాకు బయల్దేరింది. రత్నగిరిపై ఈ ప్రచార రథానికి అన్నవరం దేవస్థానం చైర్మన్ రాజా ఐవీ రోహిత్, ఈఓ కే నాగేశ్వరరావు జెండా ఊపి పర్యటనను ప్రారంభించారు. ఈ ప్రచారరథం శ్రీకాకుళం జిల్లాలోని ఆముదాలవలస, పాలకొండ, వీరఘట్టం, కొత్తూరు, పాతపట్నం, కోరసవాడ, తుంబూరు, సారవకోట, శ్రీముఖ లింగం, నర్సరావుపేట, శ్రీకాకుళం, తదితర పట్టణాలలో ఈ నెల రెండో తేదీ నుంచి పర్యటించనుందని ఈఓ తెలిపారు. ప్రచారరథంలోని సత్యదేవుడు, అమ్మవార్ల ఉత్సవమూర్తుల దర్శనం, వీలున్న చోట స్వామి, అమ్మవార్ల శాంతికల్యాణాలు కూడా నిర్వహిస్తారని ఆయన తెలిపారు. -
మాఘం.. అమోఘం..
సత్యదేవునికి ‘కోట్లు’ కురిపించిన మాసం హుండీల ద్వారానే రూ.1.11 కోట్ల ఆదాయం రాక మిగిలిన విభాగాల ద్వారా మరో రూ.9 కోట్లు వచ్చే వీలు హుండీ ఆదాయంలో మరలా పది నోట్లదే అగ్రతాంబూలం అన్నవరం : రత్నగిరివాసుడు సత్యదేవునికి ఫిబ్రవరి నెలలో వచ్చిన మాఘమాసం దండిగా సిరులు కురిపించింది. గత నెల 28వ తేదీ నుంచి ఈ నెల 26వ తేదీ వరకూ మాఘమాసంలో భక్తులు సత్యదేవుని సన్నిధికి పోటెత్తారు. ఫలితంగా రికార్డుస్థాయిలో సత్యదేవునికి హుండీల ద్వారా రూ.1,11,13,424 ఆదాయం వచ్చింది. సాధారణంగా హుండీ ఆదాయాన్ని అనుసరించి మిగిలిన విభాగాల ద్వారా ఆదాయం ఎలా వచ్చిందో అంచనా వేస్తారు. సోమవారం నిర్వహించిన హుండీ లెక్కింపులో 27 రోజులకుగాను భారీగా ఆదాయం రావడంతో మిగిలిన ఆదాయ వనరుల ద్వారా దేవస్థానానికి మరో రూ.తొమ్మిది కోట్లకు పైగా ఆదాయం వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. సిరులు కురిపించే మాఘమాసం సాధారణంగా సత్యదేవుని ఆలయానికి కార్తీకం, వైశాఖ మాసాల తరువాత మాఘాన్ని బాగా ఆదాయాన్ని తెచ్చే మాసంగా చెబుతారు. మాఘమాసంలో పెద్దసంఖ్యలో వివాహాలు జరగడం, నవదంపతులు, వారి బంధుమిత్రులు స్వామి సన్నిధికి తరలివచ్చి స్వామివారి వ్రతాలు ఆచరించి, దర్శించుకుంటారు. మాఘమాసంలో వచ్చే శుద్ధ ఏకాదశి భీష్మ ఏకాదశి, అదే విధంగా మాఘ ఆదివారాలు, దశమి, బహుళ ఏకాదశి వంటి పర్వదినాలలో భక్తులు అధికంగా రావడం వల్లే ఆదాయం భారీగా వచ్చిందని అధికారులు చెబుతున్నారు. హుండీ ఆదాయంలో పది నోట్లే అధికం సోమవారం లెక్కించిన హుండీ ఆదాయంలో 40 శాతానికి పైగా రూ.పది నోట్లే లభించాయి. మొత్తం హుండీ ఆదాయం రూ. 1,11,13,424 కాగా, అందులో కరెన్సీ 1,04,68,994. చిల్లర నాణేలు రూ.6,44,430. కరెన్సీలో సుమారు రూ.22 లక్షలు విలువైన రూ.పది నోట్లే ఉండడం విశేషం. రూ.వంద నోట్లు రూ.45 లక్షలు విలువైనవి ఉన్నాయి. ఈ సారి హుండీలో రికార్డు స్థాయిలో బంగారం 480 గ్రాములు, వెండి 615 గ్రాములు లభించాయి. హుండీలో 58 డాలర్ల అమెరికా చెక్కు సాధారణంగా సత్యదేవుని హుండీలో డాలర్లు వస్తాయి. కానీ ఈ సారి ఓ అజ్ఞాతభక్తుడు సత్యదేవునికి 58 డాలర్ల చెక్ కూడా సమర్పించాడు. ఈ చెక్ను ఆన్లైన్లో అమెరికా సెంట్రల్ బ్యాంక్కు కలెక్షన్కు పంపించాల్సి ఉందని అధికారులు తెలిపారు. దీంతో బాటు అమెరికా డాలర్లు 182, మలేషియా డాలర్లు 14, సౌదీ అరేబియా మోనాటరీలు రెండు, యూరోలు పది, నేపాలీ రూపాయలు 20, ఖత్తర్ సెంట్రల్ బ్యాంక్ పది రియల్స్, కెనడా డాలర్లు 25, సింగపూర్ డాలర్లు 5, యునైటెడ్ ఎమిరేట్స్ సెంట్రల్ బ్యాంక్ దీనార్స్ పది, సౌతాఫ్రికా సెంట్రల్ బ్యాంక్ ర్యాండ్స్ 430, ఆస్ట్రేలియా డాలర్లు వంద, బ్యాంక్ ఆఫ్ జమైకా డాలర్లు వంద లభించాయి. సత్యదేవుని హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని దేవస్థానం ఛైర్మన్ రాజా ఐవీ రోహిత్, ఈఓ కే నాగేశ్వరరావు పర్యవేక్షించారు. ఇతర సిబ్బంది లెక్కింపులో పాల్గొన్నారు. అలాగే మాఘమాసం నెల రోజులు ఎంత ఆదాయం వచ్చిందో అధికారికంగా ఒకట్రెండురోజుల్లో అధికారులు వెల్లడించనున్నారు. -
సత్యదేవా .. గోడు కనవా!
ఆదాయం ఘనం... సౌకర్యాలు శూన్యం సత్యదేవుని నమూనా ఆలయం వద్ద వసతుల లేమి ఏటా రూ.ఐదు కోట్ల ఆదాయం భక్తులకు తాగేందుకు నీరు కరువు అన్నవరం : స్థానిక జాతీయ రహదారిపై (బైపాస్ రోడ్) గల సత్యదేవుని నమూనా ఆలయం ద్వారా ఏటా దేవస్థానానికి రూ.ఐదు కోట్లు పైబడి ఆదాయం వస్తోంది. అయినా అక్కడ సరైన సౌకర్యాలు లేక భక్తులు ఇబ్బంది పడుతున్నారు. కనీసం తాగడానికి మంచినీరు కూడా లేని పరిస్థితి నెలకొని ఉంది. దాహం వేసిన భక్తులు పక్కనే పాన్షాపుల్లో వాటర్ బాటిళ్లు కొనుక్కుని తాగుతున్నారు. ఎండలు ముదురుతున్నా భక్తులకు సరైన షెల్టర్ లేదు. అన్నింటికీ మించి అక్కడ విక్రయించే సత్యదేవుని ప్రసాదం ప్యాకెట్లను నిల్వ ఉంచేందుకు గదిలేకపోవడంతో ప్రసాదాలను కౌంటర్లో నిల్వ ఉంచుతున్నారు. గతంలో అన్నవరం గ్రామం నుంచి వాహనాల రాకపోకలు కొనసాగేవి. వాటిలో ప్రయాణించే భక్తుల కోసం సత్యదేవుని మెట్లదారి ప్రారంభంలో తొలిపాంచా నిర్మించి అక్కడ సత్యదేవుని చిత్రపటం ఉంచి, కొబ్బరికాయలు కొట్టే ఏర్పాటు చేశారు. అక్కడే స్వామివారి ప్రసాదాలు విక్రయించే స్టాల్ను కూడా ఏర్పాటు చేశారు. అయితే 1998–2000 సంవత్సరాల మధ్య చెన్నై–హౌరా జాతీయ రహదారి (ఎన్హెచ్–16) విస్తరణ సమయంలో అన్నవరం శివార్లలో నుంచి బైపాస్ రోడ్ నిర్మించారు. దీంతో దేవస్థానానికి వచ్చే వాహనాలు, ఆర్టీసీ బస్లు తప్ప మిగిలిన వాహనాలు గ్రామంలోకి రాకుండా వెళ్లిపోయే పరిస్థితి నెలకొంది. బైపాస్ రోడ్ మీదుగా ప్రయాణించే వాహనాల్లోని భక్తుల కోసం అక్కడ కూడా స్వామివారి నమూనా ఆలయం నిర్మించారు. అక్కడ కూడా స్వామివారి హుండీ పెట్టి, ప్రసాదాల విక్రయాలు ప్రారంభించారు. గత 17 ఏళ్లుగా ఆ నమూనా ఆలయం వద్ద ప్రసాదాల విక్రయాలు, స్వామివారి హుండీ ద్వారా దేవస్థానానికి ఏటా రూ.ఐదు కోట్ల వరకూ ఆదాయం వస్తోంది. అయినా భక్తులకు సరైన సౌకర్యాలు కల్పించడంలో దేవస్థానం అధికారులు శ్రద్ధ చూపడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. తాగేందుకు చుక్కనీరు లేదు అధికారుల అశ్రద్ధ కారణంగా ఇక్కడ భక్తులకు తాగడానికి మంచినీరు కూడా లభ్యం కావడం లేదు. ఇక్కడ బోర్ వెల్ తవ్వితే ఉప్పునీరు పడింది. చేతులు కడుక్కోవడానికి తప్ప తాగడానికి ఆ నీరు పనిచేయడం లేదు. గతంలో మినరల్ వాటర్ టిన్లు దేవస్థానం అధికారులు పంపించేవారు. గత నాలుగు నెలలుగా పంపించడం లేదని అక్కడి సిబ్బంది చెబుతున్నారు. ప్రసాదాలు నిల్వచేసేందుకు చోటేది? స్వామివారి ప్రసాదాలు విక్రయించేందుకు రెండు కౌంటర్లు పెట్టారు. ఒక కౌంటర్లో ప్రసాదం టిక్కెట్లు ఇవ్వడానికి, పక్క కౌంటర్లో ప్రసాదాలు ఇవ్వడానికి వీటిని పెట్టారు. రోజూ వేలసంఖ్యలో వచ్చే ప్రసాదం ప్యాకెట్లను నిల్వ ఉంచే గది లేకపోవడంతో ఓ కౌంటర్లో వాటిని పేర్చుతున్నారు. రద్దీ రోజుల్లో ఎక్కువ ప్రసాదం ప్యాకెట్లు వస్తుండడంతో వాటిని పేర్చేందుకు చోటు లేక నమూనా ఆలయం ముందు పేర్చుతున్నారు. సిబ్బంది కూడా అక్కడే ఉండి ప్రసాదాలు విక్రయిస్తున్నారు. చిన్న షెల్టర్తో ఎన్నో సమస్యలు ప్రస్తుతం నమూనా ఆలయం ముందు ఉన్న షెల్టర్ చాలా చిన్నది. భక్తులకు ఇది సరిపోవడం లేదు. ఉదయం పది గంటల వరకూ ఎండ ఆలయంలోనే ఉంటోంది. వర్షాకాలం ఎక్కువ మందికి నీడనిచ్చే పరిస్థితి లేదు. ఇక్కడ శాశ్వతంగా పెద్ద షెల్టర్ నిర్మించాలని, లేదా పందిరి అయినా వేయించాలని భక్తులు కోరుతున్నారు. -
ఉన్నవారికే పనిలేదు...కొత్తగా ముగ్గురు!
రత్నగిరిపై కొత్తగా ఏఈఈలను నియమించిన సర్కారు కాంట్రాక్ట్ పద్ధతిని నెలకు రూ.30 వేల వేతనం ముగ్గురికీ ఏటా రూ.పది లక్షల అదనపు భారం అన్నవరం :తాదూర కంత లేదు..మెడకో డోలు అన్న చందంగా అన్నవరం దేవస్థానం ఇంజినీరింగ్ విభాగంలో పనిచేసే ఉద్యోగులకే పెద్దగా పనిలేని స్థితిలో మరో ముగ్గురు ఏఈఈలను ప్రభుత్వం మంజూరు చేసింది. ఒక్కొక్కరికీ రూ.30 వేలు వేతనం చెల్లించేలా కాంట్రాక్ట్ పద్ధతిపై ముగ్గురిని నియమించినట్టు ఈఓ కే నాగేశ్వరరావు శుక్రవారం విలేకరులకు తెలిపారు. రాష్ట్రప్రభుత్వం ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజీ ద్వారా వారిని ఎంపిక చేసిందని తెలిపారు. ఈ ముగ్గురిలో దేవరకొండ సత్యచైతన్య, గాలి సురేష్ను సివిల్ ఇంజినీరింగ్ విభాగంలో, పీ వేంకటేశ్వర్లును ఎలక్ట్రికల్ విభాగంలో నియమించారు. ఖర్చు తప్ప ఒరిగేదేమిటి? దేవస్థానం ఇంజినీరింగ్ విభాగంలో ప్రస్తుతం ఒక ఈఈ, ఇద్దరు డీఈఈలు, ఐదుగురు ఏఈఈలు ఉన్నారు. నాలుగేళ్లుగా దేవస్థానంలో చేపట్టిన నిర్మాణ పథకాలు పెద్దగా ఏమీ లేవు. 2015లో గోదావరి పుష్కరాల సందర్భంగా తాత్కాలిక ప్రాతిపదికన చేపట్టిన పనులు మినహా తరువాత చేపట్టిన పనులంటూ ఏమీ లేవు. దేవస్థానం స్థలాల చుట్టూ గోడలు కట్టడం, చదును చేయడం వంటి పనులు మాత్రమే చేస్తున్నారు. సత్యగిరి మీద స్మార్త, ఆగమ పాఠశాల పనులు మాత్రం కొనసా...గుతూ ఉన్నాయి. యాగశాల, అన్నదాన భవనం, తదితర నిర్మాణాలలో కొన్ని దాతల కోసం ఎదురుచూస్తుండడంతోను, మరికొన్ని పనులకు దేవాదాయశాఖ ఉన్నతాధికారుల నుంచి అనుమతులు రాక ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో మరో ముగ్గురు ఏఈఈల వల్ల దేవస్థానానికి ఖర్చు తప్ప ఒరిగేదేమీ లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
రత్నగిరిపై ‘శిఖ’పట్లు
పురోహితులు శిఖ ధరించాలని ఈఓ ఆదేశాలు వ్యతిరేకిస్తున్న కొంతమంది పురోహితులు స్వామీజీ సలహాలు కోరేందుకు పురోహితుల ప్రయత్నం అన్నవరం : రత్నగిరిపై వ్రతాలు చేయించే పురోహితులు వైదిక నియమావళి, శిఖ ధారణ తదితర అంశాలతో కూడిన కోడ్ ఆఫ్ కాండక్ట్ తప్పక పాటించాలని ఈఓ కె.నాగేశ్వరరావు ఇచ్చిన ఆదేశాలు ఆ విభాగంలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. వీటిని అనుసరించేవారు కొందరైతే, మరి కొంతమంది వీటిలోని కొన్ని అంశాలను వ్యతిరేకిస్తున్నారు. ఈ నెల మొదటి వారంలో ఈవో ఇచ్చిన ఈ ఆదేశాలు ఇంకా పూర్తిస్థాయిలో అమలు కాలేదు. దీనిపై పురోహితుల మధ్య చర్చ నడుస్తుండగా కోడ్ పాటించని పురోహితులపై వేటు వేయడానికి అధికారులు సిద్ధమవుతున్నారు. వైదిక వృత్తిలో ఉండే పురోహితులు నడవడిక, వేషధారణ (కోడ్ ఆఫ్ కాండక్ట్ )కలిగి ఉండాలా? తప్పని సరిగా గుండు గీయించుకుని వెనుక వైపు పిలక కలిగి ఉండాల్సిందేనా? దీనిపై శాస్త్రం ఏమి చెప్పింది..? గతంలోలా ఇప్పుడు కూడా ఉండాల్సిందేనా..? రోజులు మారాయి కాబట్టి మేము కూడా మారతామని, అటువంటి సంప్రదాయాలును పూర్తిగా పాటించలేమని యువ పురోహితులు చెబుతున్న దాంట్లో వాస్తవముందా..? ప్రస్తుతం అన్నవరం దేవస్థానంలోని వ్రతాల విభాగంలో వ్రతపురోహితుల మధ్య జరుగుతున్న చర్చ ఇది. ఈ నెల మొదటి వారంలో దేవస్థానం ఈఓ నాగేశ్వరరావు వ్రతపురోహితులు తప్పక కోడ్ ఆఫ్ కాండక్ట్ పాటించాలని ఆదేశాలిచ్చారు. అందులో భాగంగా శిఖ, వస్త్రధారణ తదితర విషయాలలో శాస్త్రం నిర్ధేశించిన దాని ప్రకారం ఉండాలని, లేకుంటే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. అప్పటి నుంచి దీనిపై తర్జన భర్జనలు జరుగుతున్నాయి. దేవస్థానంలోని 214 మంది వ్రత పురోహితుల్లో పాత తరానికి చెందిన సుమారు 125 మంది వరకూ కోడ్ ఆఫ్ కాండక్ట్లో చెప్పినట్టుగా వ్యవహరిస్తున్నారు. మిగిలిన వారిలో సగం మంది పూర్తిగా గుండు గీయించుకోకుండా తల తగ్గించుకుని వెనుక వైపు పిలక ధరించారు. మిగిలిన వారు శిఖ ధారణ తప్ప మిగిలినవన్నీ పాటిస్తున్నారు. వర్గాలుగా విడిపోయిన పురోహితులు దేవస్థానం ఈవో ఇచ్చిన కోడ్ ఆఫ్ కాండక్ట్ ఆదేశాలకు అనుగుణంగా కొంతమంది, వ్యతిరేకంగా మరి కొంతమంది రెండు వర్గాలుగా చీలిపోయారు. కొంతమంది ఆ ఆదేశాలను అమలు చేయాలంటే మరికొంతమంది ఆ ఆదేశాలలో కొన్నింటి అమలుపై విముఖత వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆదేశాలను వ్యతిరేకించేవారు కొత్తగా ఎన్నికైన పురోహిత సంఘం అధ్యక్ష, కార్యదర్శులపై ఒత్తిడి తెస్తున్నారు. ఈ వర్గాల నేపథ్యంలోనే ఇటీవల ఓ పురోహితుడి సస్పెన్షన్ వివాదాస్పదమైంది. ఆదేశాల్లో స్పష్టత లేదంటున్న పురోహితులు పురోహితులు కోడ్ ఆఫ్ కాండక్ట్ కలిగి ఉండాలని ఇచ్చిన ఆదేశాలలో శిఖ ధారణ విషయమై స్పష్టత లేదని కొంతమంది పురోహితులు అభిప్రాయపడుతున్నారు. అసలు పురోహితుల శిఖధారణ (పిలక ధారణ)ఐదు రకాలుగా ఉంటుంది. అందులో ఏది పాటించాలో వివరంగా తెలియచేయాలని కొంతమంది అంటున్నారు. అవేమీ చెప్పకుండా శిఖ ధారణ ఉండాలని ఆదేశాలివ్వడం, పాటించకపోతే చర్యలుంటాయని చెప్పడం సబబు కాదంటున్నారు. కొందరు యువతరం పురోహితులైతే బలవంతంగా తమ చేత శిఖధారణ చేయించాలనుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాము పిలక ధరించి ఉంటే తమకు వివాహాలు కావడం లేదని వారు వాపోతున్నారు. స్వామీజీ సూచనల కోసం పురోహితులు దేవస్థానం పురోహితుల శిఖ ధారణపై తగిన సూచనలివ్వాలని కొంతమంది పురోహితులు తునిలోని ఓ ప్రముఖ స్వామీజీని కలిసి కోరనున్నట్టు తెలిసింది. ఆ స్వామీజీ సూచనల ప్రకారం వ్యవహరించాలని నిర్ణయించినట్టు పురోహితులు చెబుతున్నారు. ఇందు కోసం ఈఓని పది రోజులు గడువు అడిగినట్టు సమాచారం. పురోహితులు కోడ్ ఆఫ్ కాండక్ట్ పాటించాల్సిందే ఈఓ దేవస్థానంలో పనిచేసే పురోహితులంతా కోడ్ ఆఫ్ కాండక్ట్ పాటించాల్సిందేనని ఈఓ నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ఆదివారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ దీనిపై పది రోజులు గడువు కావాలని పురోహితుల సంఘం కార్యదర్శి బండి నర్శింహమూర్తి అడిగారని దానికి అంగీకరించామన్నారు. పది రోజుల తరువాత కోడ్ ఆఫ్ కాండక్ట్ పాటించని వారిపై చర్యలు తప్పవన్నారు. -
20 కిలోల గంజాయి స్వాధీనం
అన్నవరం : రత్నగిరిపైకి వెళుతున్న ఆటోను తనిఖీ చేస్తున్న క్రమంలో 20 కిలోల గంజాయిని టోల్గేట్ వద్ద సిబ్బంది పట్టుకున్నారు. ఈ నేపథ్యంలో ఆటో డ్రైవర్ సహా వాహనంలోని నలుగురు వ్యక్తులు పరారయ్యారు. దేవస్థానం ఈఓ కె.నాగేశ్వరరావు ప్రత్తిపాడు ఎక్సైజ్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎక్సైజ్ ఎస్ఐ నాగరాజు శనివారం రాత్రి అన్నవరం వచ్చి ఆ గంజాయిని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. విశాఖ జిల్లాకు చెందిన ఆటోలో కొందరు వ్యక్తులు శనివారం సాయంత్రం ఐదు గంటల సమయంలో రత్నగిరి టోల్గేట్ వద్దకు వచ్చారు. కొండపైకి వెళ్లడానికి టోల్ ఫీజు చెల్లించేందుకు ఆగారు. డ్రైవర్ సహా నలుగురు వ్యక్తులు ఉన్నారు. ఆటో వెనుక సీటులో రెండు పెద్ద బ్యాగ్లు ఉండడంతో అనుమానం వచ్చిన హోంగార్డు శివ వాటిని తనిఖీ చేశారు. వెంటనే ఆటోలోని వారంతా పరారయ్యారు. ఒక్కొక్క బ్యాగ్లో రెండు కిలోల బరువు గల ఐదు ప్యాకెట్ల వంతున పది గంజాయి ప్యాకెట్లు కనిపించాయి. వెంటనే దేవస్థానం ఈఓ నాగేశ్వరరావుకు సమాచారం అందించారు. ఆయన వచ్చి గంజాయి ప్యాకెట్లను పరిశీలించి ప్రత్తిపాడు ఎక్సైజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్ఐ నాగరాజు సిబ్బందితో వచ్చి ఆ గంజాయిని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. ఆటోలో లభించిన డ్రైవింగ్ లైసె¯Œ్స ఆధారంగా విశాఖ జిల్లా తంజంగి సమీపంలోని చింతపల్లికి చెందిన జి. చిన్నబ్బాయి ఆటోగా పోలీసులు గుర్తించారు. దీని ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తామని పోలీసులు తెలిపారు. గంజాయి తరలిస్తున్న ఆటోను పట్టుకున్న హోంగార్డు శివను ఈఓ , పోలీసులు అభినందించారు. -
సత్యదేవా... ఇదేమి మోత
∙ఆదాయం కోసం... పెళ్లిబాజాకు టెండర్ ! ∙అధికారుల నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు ∙పెళ్లి బృందాలపై మరింత భారం ∙భక్తుల్లో భయం...భయం సత్యదేవుని సన్నిధిలో జరిగే వివాహ వేడుకలు భారం కానున్నాయా... బాజా భజంత్రీలకు టెండర్ వేయడానికి పాలకవర్గం పాల్పడుతుండడంతో సన్నాయి మేళంకు ఎక్కువ మొత్తం డిమాండ్ చేస్తారేమోనని భయం భక్తుల్లో నెలకొంది. అన్నవరం దేవస్థానంలో ఏటా ఐదు వేల వివాహాలు జరుగుతుంటాయని అంచనా. మధ్య తరగతి, పేదవర్గాలు చేసుకునే వివాహాలే దాదాపు 90 శాతం ఉంటాయి. దేవస్థానంలో ఉండే వాయిద్యకారులకే ఎంతోకొంత మొత్తం చెల్లించి వివాహ తంతు జరిపించేసుకునేవారు. ఇదే విధానం శతాబ్దాలుగా సాగుతోంది. ఒకప్పుడు సత్యదేవుని దర్శనం అంటే తక్కువ ఖర్చుతో జరిగే తీర్థయాత్ర అనేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారిపోయింది. తిరుపతి కొండమీద కూడా ఇంతఖర్చు ఉండదేమో అనే రీతిలో దేవస్థానంలో ప్రతీదీ డబ్బుతో ముడిపడి ఉన్న వ్యవహారంగా మారిపోయిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. టోల్గేట్ వద్ద మొదలయ్యే వసూళ్ల పర్వం వాహనాల పార్కింగ్, వ్రతాలు, అంతరాలయ దర్శనం, యంత్రాలయం లోపల దర్శనం, ఇలా సాగిపోతోంది. ఎన్ని కోట్ల ఆదాయం తెచ్చామనే లెక్క తప్ప దీని వలన భక్తులు ఎంత ఇబ్బంది పడుతున్నారు, వారి మనోభావాలు ఏ విధంగా దెబ్బతింటున్నాయనే ఆలోచనే అధికారులకు ఉండడం లేదనే అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది. – అన్నవరం పెళ్లిబాజా కూడా కాంట్రాక్ట్ తాజాగా పెళ్లిళ్లలో ఉపయోగించే బాజాభజంత్రీలు వాయించే వాయిద్యకారులను సరఫరా చేసేందుకు కూడా టెండర్ కం బహిరంగ వేలం నిర్వహించాలనుకోవడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో దేవస్థానానికి కొంత ఆదాయం పెరిగినా తమ ఉపాధి దెబ్బతింటుందేమోనన్న భయం వాయిద్యకారుల్లో నెలకొంది. ఇదిలా ఉంటే దేవస్థానం పురోహితులు వ్రతాల డ్యూటీ సమయంలో వివాహాలు కానీ, ఉపనయనాలు కానీ చేయకూడదని అధికారులు ఆంక్షలు విధించడంపై కూడా పురోహితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 90 శాతం మధ్యతరగతి, పేదవర్గాల పెళిళ్లే్ల అన్నవరం దేవస్థానంలో 90 శాతం మధ్యతరగతి, పేదవర్గాల వివాహాలే జరుగుతుంటాయి. వీటిలో ఎక్కువ వివాహాలు ఆరుబయటే జరుగుతాయి. వీరు దేవస్థానంలో ఉండే వాయిద్యకారులకే ఎంతోకొంత మొత్తం చెల్లించి బాజాభజంత్రీలు వాయించేలా ఏర్పాటు చేసుకుంటారు పాటదారునిదే గుత్తాధిపత్యం టెండర్ కం వేలం ద్వారా సన్నాయిమేళం ఏర్పాటు చేసే అధికారం పాటదారునికి వస్తే అతడు నిర్ణయించిందే రేటు అవుతుంది. దేవస్థానం రేట్లు నిర్ణయించినా అవి అమలయ్యే పరిస్థితి ఉండదు. ఉదాహరణకు దేవస్థానంలో పూజాద్రవ్యాలు కానీ, శీతలపానీయాలు కానీ, తినుబండారాలు కానీ దేవస్థానం నిర్ణయించిన రేట్ల కన్నా ఎక్కువకు విక్రయిస్తారు. భక్తుడెవరైనా ఇదేమిటని ప్రశ్నిస్తే తాము రూ.లక్షలు పెట్టి వేలం పాడుకున్నామని దేవస్థానానికి ఆ సొమ్ము కట్టాలంటే ఈ విధంగా విక్రయించక తప్పదంటారు. ఇపుడు దేవస్థానం నిర్ణయించే సన్నాయి మేళం రేట్లు కూడా అంతే. దేవస్థానం ఈ టెండర్ షెడ్యూల్లో ఇద్దరు వాయిద్యకారులు ఉంటే రూ.వేయి, సన్నాయి వాయించే వారుంటే రూ.మూడు వేలు, ఆరుగురితో కూడిన బ్యాండ్ అయితే రూ.ఐదు వేలు వసూలు చేయాలని అధికారులు చెబుతున్నారు. అయితే పాటదారుడు ఇవే రేట్లు పెళ్లి బృందాల నుంచి వసూలు చేస్తాడని చెప్పలేమని, ఎక్కువ రేట్లు వసూలు చేస్తే పెళ్లి బృందాలు ఇబ్బంది పడతారని అంటున్నారు. అంతే గాక, పెళ్లి బృందాల వారు సొంతంగా సన్నాయిమేళం బృందాన్ని కూడా తెచ్చుకోవచ్చని అధికారులు చెబుతున్నా పాటదారుడు అందుకు అంగీకరిస్తాడా అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇంతకుముందులా పెళ్లి బృందాలతో నేరుగా మాట్లాడుకునే అవకాశం ఉండదు. పాటదారుడి ఆదేశాల మేరకే వ్యవహరించాలి. పాటదారుడు ఎంతిస్తే అంతే తీసుకోవాలి. తప్ప డిమాండ్ చేయడానికి ఉండదు అంటున్నారు. పురోహితులది మరో ఆవేదన అయితే వ్రతాల సమయంలో దేవస్థానంలో వివాహాలు, ఉపనయనాలు చేయించకూడదని, అలా చేయించినవారిపై చర్యలు తీసుకుంటామని అధికారులు ఆంక్షలు విధించడంపై కూడా పురోహితులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వ్రతాల సమయంలో అక్షరాభ్యాసం, అన్నప్రాశన, నామకరణం చేయించడానికి పురోహితులు కావాలి కాని వివాహాలు, ఉపనయనాలు చేయించకూడదు. ఇదేమి రూలు అని ప్రశ్నిస్తున్నారు. దేవస్థానంలో 40 ఏళ్లుగా ఇదే విధంగా చేయిస్తున్నామని, వ్రతాలు ఆగితే అధికారులు అడగాలని పురోహితులు అంటున్నారు. దీనిపై ఈఓ కలిసేందుకు వారు సమాయత్తమవుతున్నారు. బోర్డులు పెడతాం సన్నాయి మేళం పాటదారుడు దేవస్థానం నిర్ణయించిన మొత్తం కన్నా ఎక్కువ వసూలు చేయడానికి వీలు లేకుండా బోర్డులు పెడతాం. నిర్ణయించిన ధరకన్నా ఏమాత్రం ఎక్కువ వసూలు చేసినా చర్య తీసుకుంటాం. – కె.నాగేశ్వరరావు, ఈఓ -
రత్నగిరిపై పెళ్లి సందడి
సత్యదేవుని సన్నిధిలో 30కి పైగా వివాహాలు పెద్ద సంఖ్యలో ఉపనయనాలు, అక్షరాభ్యాసాలు అన్నవరం : రత్నగిరి మామూలుగా వచ్చే భక్తులకు పెక్కు పెళ్లి బృందాలు తోడు కాగా సందడిగా మారింది. బుధవారం సత్యదేవుని సన్నిధి వివాహాలు చేసుకునే వధూవరులు, వారి బంధుమిత్రులు, చిన్నారుల అక్షరాభ్యాస కార్యక్రమాలతో కిటకిటలాడింది. ఉదయం 10.54 గంటల ముహూర్తంలో రత్నగిరిపై 30కి పైగా వివాహాలు, 40 ఉపనయనాలు, 50 అక్షరాభ్యాస కార్యక్రమాలు జరిగాయి. ఈ శుభ కార్యక్రమాలన్నీ ఒకే సమయంలో జరగడంతో ఎక్కడ చూసినా సందడి నెలకొంది. బుధవారం రాత్రి కూడా పెద్దసంఖ్యలో వివాహాలు జరిగే అవకాశం ఉందని పండితులు తెలిపారు. అక్షరాభ్యాస మండపం చాలక ఇబ్బంది దేవస్థానంలో గతంలో వ్రతమండపాల ఆవరణలోనే అక్షరాభ్యాసాలు, అన్నప్రాశనలు, నామకరణాలు జరిగేవి. అయితే ఈ నెల 9 నుంచి దర్బారు మండపం పక్కనే గల మండపంలో సరస్వతి విగ్రహం ఉంచి అక్కడే ఈ మూడు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆ మండపం చాలా చిన్నదిగా ఉండడంతో ఐదు అక్షరాభ్యాసాలు ఒకేసారి జరిగితేనే కిక్కిరిసి పోతోంది. బుధవారం ఒకేసారి 50 మంది తమ చిన్నారులతో సహ ఆ మండపంలోకి రావడంతో ఎవరికీ కూర్చోవడానికి కూడా స్థలం లేదు. దీంతో పురోహితులు పక్కనే గల మండపంలో, మండపం వెలుపల కొన్ని అక్షరాభ్యాసాలు, అన్నప్రాశనలు జరిపించాల్సి వచ్చింది. రూ.700 వ్రతమండపంలో విధులు నిర్వర్తించే పురోహితులు చాలకపోవడంతో రూ.300 వ్రతమండపంలో పనిచేసే పురోహితులు కూడా ఈ కార్యక్రమాలకు రావల్సి వచ్చింది. కాగా బుధవారం 15 వేల మంది భక్తులు సత్యదేవుని దర్శించి పూజలు చేశారు. వ్రతాలు 1,619 జరగగా, అన్ని విభాగాల ద్వారా రూ.15 లక్షల ఆదాయం సమకూరింది. -
సత్యదేవుని సేవలో నైనా జైస్వాల్
అన్నవరం : ప్రముఖ టేబుల్ టెన్నిస్ చాంపియన్ నైనా జైస్వాల్ ఆదివారం కుటుంబసభ్యులతో రత్నగిరిపై సత్యదేవుని దర్శించి పూజ లు చేశారు. ఆల యం వద్ద వారికి అధికారులు స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం అనంతరం వేదపండితులు వేదాశీస్సులందించారు. దేవస్థానం ఏసీ ఈరంకి జగన్నాథరావు స్వామివారి ప్రసాదాలను అందజేశారు. 13వ ఏటే డిగ్రీ పాసయ్యా ఈ సందర్భంగా నైనాజైస్వాల్ మాట్లాడుతూ తాను ఎనిమిదో ఏట పదో తరగతి, పదో ఏట ఇంటర్మీడియట్, 13 ఏట జర్నలిజంలో డిగ్రీ పాసయ్యానని తెలిపారు. తాను టేబుల్ టెన్నిస్లో ఇండియాలోనే నంబర్ వన్ ర్యాంకర్నని, నేషనల్, సౌత్ ఏషియా చాంపియన్నని తెలిపారు. తాను రెండు చేతులతో రాస్తానని, రెండు సెకన్లలోనే ఇంగ్లిష్ అక్షరాలు ఏ టూ జెడ్ టైపు చేస్తానని తెలిపారు. ఇదంతా తాను ఇష్టపూర్వకంగా సాధన చేసి సాధించాను తప్ప కష్టపడి కాదన్నారు. విద్యార్థులు కూడా ఇష్టపడి చదివితేనే మంచి మార్కులతో ఉత్తీర్ణులై ఉజ్వల భవిష్యత్ పొందుతారన్నారు. తన సోదరుడు అగస్త్య జైస్వాల్ కూడా తనలానే ఇష్టపడి చదువుతాడని, అందువల్లే తొమ్మిదే ఏటే పదో తరగతి పాస్ అయ్యాడని, తను కూడా రెండు చేతులతో రాయగలడని తెలిపారు. తమ తల్లిదండ్రులు భాగ్యలక్షి, అశ్విని కుమార్ జైస్వాల్ ప్రేమాభిమానాలతో , ప్రోత్సాహంతో తాము ఈ విజయాలు సాధించగలిగామని తెలిపారు. -
హమ్మయ్య సొమ్ములు దక్కాయి
‘సహజ ’ ఆస్పత్రిలో ‘ వెల్నెస్ సెంటర్ ’ ప్రతిపాదన రద్దు వడ్డీతో కలిపి రూ.31.15 లక్షలు దేవస్థానానికి తిరిగి చెల్లింపు అన్నవరం : దేవస్థానంలోని సహజ ఆస్పత్రిలో ఆధునిక పరికరాలతో యోగా, నేచురోపతి, కేరళ తరహా ఆయర్వేద వైద్యాన్ని అందించే‘ వెల్నెస్ సెంటర్ ’ ఏర్పాటు చేస్తామని గతేడాది ఏప్రిల్లో రూ.30 లక్షలు వసూలు చేసిన బెంగుళూర్లోని ‘స్వామి వివేకానంద యోగా అనుసంధాన సంస్థ (డీమ్డ్ యూనివర్సిటీ) ఎట్టకేలకు వడ్డీతో తిరిగి దేవస్థానానికి చెల్లించింది. వాస్తవానికి గత ఏడాది జూన్ కల్లా ఈ సెంటర్ ఏర్పాటై భక్తులకు సేవలందించాల్సి ఉంది. ఇప్పటి వరకూ అలాంటి సెంటర్ ఏర్పాటు కాలేదు సరికదా, ఏర్పాటు చేసే ఉద్దేశం ఉన్నట్టు కూడా కనిపించలేదు. ఈ వెల్నెస్ సెంటర్ ఏర్పాటు కాకపోవడం, దేవస్థానం చెల్లించిన రూ.30 లక్షలు విషయమై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్న విషయమై గత ఆగష్టు లో ‘ సాక్షి ’దినపత్రికలో వార్త ప్రచురితమైంది. అధికారులలో స్పందన వచ్చి వెంటనే వెల్నెస్ సెంటర్ ఏర్పాటు చేయండి లేదా నిధులను వడ్డీతో సహ వెనక్కి చెల్లించాలని ఆ యూనివర్సిటీకి, దేవాదాయశాఖ ఉన్నతాధికారులకు లేఖలు రాశారు. దేవస్థానం చెల్లించిన రూ.30 లక్షలతో పాటు రూ.1.15 లక్షలు వడ్డీ కలిపి దేవస్థానానికి పంపించింది. ఈ విషయాన్ని ఈఓ నాగేశ్వరరావు శనివారం సాయంత్రం ‘సాక్షి’కి తెలిపారు. అన్నవరంతో పాటు రాష్ట్రంలోని ప్రముఖ దేవస్థానాలలో బెంగళూర్లోని ‘స్వామి వివేకానంద యోగా అనుసంధాన సంస్థ’ (డీమ్డ్ యూనివర్సిటీ)తో ‘వెల్నెస్ సెంటర్ ’ లు ఏర్పాటు చేయాలని దేవాదాయశాఖ గత ఏడాది ఫిబ్రవరిలో నిర్ణయించింది. తొలుత అన్నవరం దేవస్థానంలో సహజ ఆస్పత్రిలో దీనిని ఏర్పాటు చేయాలని భావించారు. ఆ యూనివర్సిటీ ప్రో ఛాన్సలర్గా వ్యవహరిస్తున్న కంభంపాటి సుబ్రహ్మణ్యం మరో ఇద్దరు ప్రతినిధులు అన్నవరం లోని సహజ ఆస్పత్రిని పరిశీలించారు. ‘వెల్నెస్ సెంటర్’ కు అనుగుణంగా మార్పులు చేస్తామని తెలిపారు. సెంటర్ ను 11 ఏళ్లపాటు నిర్వహించేందుకు విడతల వారీగా దేవస్థానం రూ.80 లక్షలు చెల్లించేలా గత ఏప్రిల్లో దేవస్థానానికి, ఆ యూనివర్సిటీకి ఒప్పందం కుదిరింది. తొలి విడతగా రూ.30 లక్షలు ఆ యూనివర్సిటీ ప్రతినిధులకు అందించింది. ఆ తర్వాత ఆస్పత్రిని నెలరోజులు మూసివేసి ఆ భవనాన్ని వారికి అప్పగించారు. సహజ సిబ్బందికి బెంగళూరులోని ఆ యూనివర్సిటీలో మే నెలలో శిక్షణ కూడా ఇచ్చారు. ఆ తర్వాత సెంటర్ ఏర్పాటు ప్రక్రియ ముందుకెళ్లలేదు. దేవస్థానం చెల్లించిన రూ.30 లక్షల గురించి ఆందోళన నెలకొంది. దీనిపై గత ఏడాది ఆగస్టులో ‘సాక్షి’లో వార్త ప్రచురితం కావడంతో ఈఓ నాగేశ్వరరావు స్పందించి ఉన్నతాధికారులకు, యూనివర్సిటీ ప్రతినిధులకు లేఖ రాశారు. దీంతో ఎట్టకేలకు ఆ నిధులు తిరిగి వచ్చాయి. సహజ ఆస్పత్రిని అభివృద్ధి చేసేందుకు ప్రయత్నిస్తామని ఈఓ కె.నాగేశ్వర రావు ‘సాక్షి’కి వివరించారు. దీనిపై త్వరలోనే ఆ సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. -
రత్నగిరి.. భక్తజనఝరి
- భీష్మ ఏకాదశి పర్వదినాన పోటెత్తిన భక్తులు - సోమవారం రాత్రి నుంచే వెల్లువలా రాక - స్వామివారిని దర్శించిన 80 వేల మంది - రూ.60 లక్షల ఆదాయం అన్నవరం (ప్రత్తిపాడు) : కోరిన కోర్కెలు తీర్చే భక్తవరదుడు, రత్నగిరి వాసుడు అయిన సత్యదేవుని సన్నిధి భీష్మ ఏకాదశి పర్వదినం సందర్భంగా మంగళవారం వేలాదిగా తరలివచ్చిన భక్తులతో జనసంద్రంగా మారింది. సుమారు 80 వేలమంది సత్యదేవుని దర్శించుకున్నారు. 7,276 వ్రతాలు నిర్వహించారు. భీష్మ ఏకాదశి పర్వదినం సందర్భంగా సత్యదేవుని వ్రతమాచరించి స్వామివారిని దర్శిస్తే కోరిన కోర్కెలు తీరుతాయనే నమ్మకంతో వేలాదిగా భక్తులు సోమవారం సాయంత్రం నుంచే రత్నగిరికి చేరుకోవడం ప్రారంభించారు. మంగళవారం సాయంత్రం వరకూ భక్తులు వస్తూనే ఉన్నారు. మంగళవారం తెల్లవారుజామున 3 గంటల నుంచే వ్రతాలు, స్వామివారి దర్శనాలు ప్రారంభించారు. అప్పటినుంచి సాయంత్రం వరకూ స్వామి సన్నిధికి భక్తులు వస్తూనే ఉన్నారు. స్వామివారి సర్వదర్శనానికి సుమారు రెండు గంటలు, ప్రత్యేక దర్శనానికి గంట పట్టింది. వ్రతమండపాలన్నీ వ్రతాలాచరించే భక్తులతో నిండిపోయాయి. దీంతో ఉదయం పది గంటల వరకూ స్వామివారి నిత్యకల్యాణ మండపంలో కూడా వ్రతాలు నిర్వహించారు. సర్క్యులర్ మండపంలో ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ భక్తులకు పులిహోర, దద్ధోజనం పంపిణీ చేశారు. విజయవాడకు చెందిన ప్రముఖ వ్యాపారి నాగేంద్రరావు అన్నవరం దేవస్థానానికి రూ.50 వేల విలువైన 6 టన్నుల కూరగాయలను విరాళంగా అందజేశారు. ఈ ఒక్క రోజే దేవస్థానానికి రూ.60 లక్షల ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ కె.నాగేశ్వరరావు ఏర్పాట్లను పర్యవేక్షించారు. సత్యదేవునికి లక్ష పుష్పార్చన భీష్మ ఏకాదశి పర్వదినం సందర్భంగా గర్భాలయంలోని సత్యదేవుడు, అమ్మవార్ల మూలవరులకు లక్ష పుష్పార్చన ఘనంగా నిర్వహించారు. ప్రధానార్చకుడు గాడేపల్లి వేంకట్రావు తదితర అర్చకస్వాములు, రుత్విక్కులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గరుడ వాహనంపై స్వామి, అమ్మవార్ల ఊరేగింపు భీష్మ ఏకాదశి పర్వదినం సందర్భంగా సత్యదేవుడు, అమ్మవార్ల ఉత్సవమూర్తులను మంగళవారం రాత్రి గరుడ వాహనంపై ఘనంగా ఊరేగించారు. తొలి పావంచా వద్ద దేవస్థానం చైర్మన్ రాజా రోహిత్, ఈఓ నాగేశ్వరరావు దీనిని ప్రారంభించారు. -
సత్తెన్న సొమ్ముపై రాజకీయ పెత్తనం!
-ఇప్పటికే వృథాగా కిర్లంపూడి, శంఖవరం కల్యాణ మంటపాలు - తాజాగా కోరుకొండలో డార్మెట్రీహాలు నిర్మాణానికి పాలకవర్గం తీర్మానం అన్నవరం : సత్యదేవుడు కొలువైన అన్నవరంలో దేవస్థానం కల్యాణ మంటపం ఒక్కటీ లేదు. కానీ రాజకీయ ఒత్తిళ్లతో ఇతర ప్రాంతాల్లో దేవస్థానం కల్యాణ మంటపాలు, డార్మెట్రీ హాళ్ల నిర్మాణాలు చేపడుతున్నారు. వివరాలిలాఉన్నాయి... అన్నవరంలో దేవస్థానం కల్యాణ మంటపాలు లేకపోవడంతో ప్రైవేట్ లాడ్జిలకు చెందిన కల్యాణ మంటపాలలోనే సామాన్యులు వివాహాలు చేసుకుంటున్నారు. రాజకీయ వత్తిడుల కారణంగా 1999–2001 సంవత్సరాల మధ్య జిల్లాలోని కిర్లంపూడి, శంఖవరాలలో రెండు కల్యాణ మంటపాలు అధికారులు నిర్మించారు. ఒక్కొక్క దానికి రూ.కోటికి పైగా వ్యయమైంది. వాటిలో పెద్దగా వివాహాలు జరగక, నిర్వహణకు సరిపడా ఆదాయం కూడా రాక లీజు కిచ్చేందుకు దేవస్థానం టెండర్లు కూడా పిలిచింది. ఈసారి కోరుకొండలో.. ఈ చేదు అనుభవం ఉన్నప్పటికీ...తాజాగా కోరుకొండలో దేవస్థానం స్థలంలో రూ.35 లక్షల వ్యయంతో డార్మెట్రీ నిర్మాణానికి పాలకవర్గం తీర్మానించింది. కోరుకొండ ప్రాంత ప్రజాప్రతినిధి ఇటీవల అన్నవరం వచ్చి ఈఓ కే నాగేశ్వరరావుతో ఈ నిర్మాణ విషయమై సుదీర్ఘంగా చర్చించి ఒప్పించినట్టు సమాచారం. వాస్తవానికి కల్యాణ మంటపం నిర్మించడానికే ప్రతిపాదనలు పెట్టారు. అయితే కల్యాణ మంటపం నిర్మాణం అంటే వివాదమవుతుందని భావించి ఈ రకంగా మార్పు చేశారు. 84 అడుగుల పొడవు 33 అడుగుల వెడల్పుతో ఈ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. పొడవుగా రెండు హాల్స్ కలిపి ఒక భవనంగా నిర్మించి ఒక దాంట్లో కిచెన్, డైనింగ్హాల్, మరో దాంట్లో వివాహాలు చేసుకునేందుకు గాను ప్లాన్ సిద్ధం చేశారు. కమిషనర్ అనుమతికి పంపించే ఏర్పాట్లు జరుగుతున్నాయి. మొదట్లో అంతే! గతంలో కిర్లంపూడి, శంఖవరంలో కల్యాణ మంటపాలు నిర్మించేటపుడు కూడా మొదట తక్కువ మొత్తంతోనే ప్లాన్ సిద్ధం చేసి అనుమతులు పొంది, ఆ తరువాత రూ.కోటి వరకూ ఖర్చు చేశారు. ఇప్పుడు కూడా ఈ డార్మెట్రీ హాలు నిర్మాణం పూర్తయ్యేటప్పటికీ సుమారు రూ.60 లక్షల వరకూ ఖర్చవుతుందని సమాచారం. ఈవో నో కామెంట్ అన్నవరంలో కాకుండా ఎక్కడెక్కడో రూ.లక్షలు ఖర్చు పెట్టి నిర్మిస్తుండడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై ఈఓ కే నాగేశ్వరరావును సంప్రదించగా మాట్లాడేందుకు నిరాకరించారు. -
రత్నగిరిపై మొదలైన పెళ్లిసందడి
సత్యదేవుని సన్నిధిలో 40 వివాహాలు స్వామివారిని దర్శించిన 15వేల మంది భక్తులు ఆదాయం రూ.15 లక్షలు అన్నవరం: రెండు నెలల విరామం అనంతరం రత్నగిరిపై వివాహాల సందడి నెలకొంది. మాఘమాసం సందర్భంగా సత్యదేవుని సన్నిధిన పెద్దసంఖ్యలో వివాహాలు జరుగుతున్నాయి. గురువారం రాత్రి, శుక్రవారం ఉదయం ముహూర్తాలలో సుమారు 40 వివాహాలు జరిగాయి. వీటితోపాటు జిల్లా వ్యాప్తంగా వివాహాలు చేసుకున్న పెళ్లి బృందాల వారు కూడా నవదంపతులతో సత్యదేవుని సన్నిధికి విచ్చేస్తుండడంతో ఆలయ ప్రాంగణంలో ఎక్కడ చూసినా నవదంపతులే దర్శనమిస్తున్నారు. ఈ నెలలో ఐదో తేదీ, తొమ్మిదో తేదీ, 13, 15, 16, 18 తేదీల్లో వివాహాలు జరిగే అవకాశం ఉందని పండితులు తెలిపారు. సత్యదేవుని దర్శించిన 15 వేల మంది భక్తులు రత్నగిరికి భక్తులతోపాటు వివాహ బృందాల రాక కూడా పెరిగింది. దీనికి తోడు శుక్రవారం రథ సప్తమి పర్వదినం సందర్భంగా సత్యదేవుని ఆలయాన్ని సుమారు 15 వేల మంది భక్తులు దర్శించి పూజలు చేశారు. ప్రతీ వ్రతమండపంలోను నవదంపతులు వ్రతాలాచరించడంతో మండపాలకే కళ వచ్చింది. సత్యదేవుని దర్శనానికి గంట సమయం పట్టింది. ప్రత్యేక దర్శనానికి అరగంట సమయం పట్టింది. స్వామివారి వ్రతాలు 1,622 జరుగగా అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి సుమారు రూ.15 లక్షలు ఆదాయం సమకూరిందని అధికారులు తెలిపారు. -
అన్నదాన పథకానికి రూ.1,00,001 విరాళం
అన్నవరం : సత్యదేవుని నిత్య అన్నదానపథకానికి ఆలమూరు మండలం ముద్దుకూరుకు చెందిన రాయుడు పట్టాభిరామయ్య రూ.1,00,001 విరాళాన్ని ఈఓ కే నాగేశ్వరరావుకు సోమవారం అందజేశారు. ఈ విరాళం పై వచ్చే వడ్డీతో ఏటా నవంబర్ ఐదో తేదీన రాఘవేంద్ర రైస్ ఇండస్ట్రీస్ పేరున అన్నదానం చేయమని దాత కోరినట్టు ఈఓ తెలిపారు. -
గిరి దిగివచ్చి గ్రామ వీధుల్లో...
ఏటా ధనుర్మాసంలో సత్యదేవుని ఊరేగింపు అన్నవరంలో వందేళ్లుగా కొనసాగుతున్న ఆనవాయితీ అన్నవరం : సాధారణంగా డిసెంబర్ రెండో వారం చివరలో ప్రారంభమయ్యే ధనుర్మాసంలో సూర్యుడు ఉదయించినా చలి, మంచుల వల్ల సమయమెంతో తెలియదు. అయితే ఈ నెలంతా రత్నగిరి మెట్ల దారి నుంచి సత్యదేవుడు గ్రామోత్సవానికి వస్తున్నట్లు బాజాలు వినిపించగానే ‘ఉదయం ఏడు గంటలైనట్టుంది దేవుడు కొండ దిగుతున్నాడు’ అనుకుంటారు అన్నవరం వాసులు. ధనుర్మాసంలో ఉదయం ఏడు గంటలకు సత్యదేవుడు ఊరేగింపుగా కొండ దిగువకు రావడం, ఊరేగిన అనంతరం ఉదయం పది గంటలకు మరలా కొండమీదకు వెళ్లడం గత వందేళ్లుగా కొనసాగుతున్న ఆచారం. ఈ ఏడాది గత నెల 16న ప్రారంభమైన సత్యదేవుని ధనుర్మాస ఊరేగింపు ఈ నెల 15న వచ్చే కనుమ నాడు జరిగే ప్రభోత్సవంతో ముగుస్తుంది. సాధారణంగా డిసెంబర్, జనవరి నెలల్లో రత్నగిరికి భక్తుల రాక తక్కువగా ఉంటుంది. సత్యదేవుడు ఆవిర్భవించిన కొత్తలో సుమారు వందేళ్ల క్రితం కూడా డిసెంబర్, జనవరి నెలల్లో ఆలయానికి భక్తుల రాక బాగా తక్కువగా ఉండేది. అప్పుడు ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రమే. దీంతో స్వామివారిని నెలరోజుల పాటు ఊరేగించి వచ్చిన బియ్యం, ఇతర దినుసులను ఆలయ నిర్వహణకు ఉపయోగించే వారంటారు. అయితే ధనుర్మాసం కాబట్టే గ్రామంలో ఊరేగించేవారనే మరో అభిప్రాయం కూడా ఉంది. ఏదేమైనా ఈ ఆచారం సుమారు వందేళ్లుగా కొనసాగుతోంది. ఉదయం ఏడు నుంచి పది వరకూ.. ఉదయం ఏడు గంటలకు కొండ నుంచి స్వామి, అమ్మవార్లను గ్రామంలోకి పల్లకీ మీద తీసుకువస్తారు. ఉదయం పది గంటల వరకూ గ్రామంలోని ప్రధాన వీధులలో ఊరేగించి తిరిగి రత్నగిరికి చేరుస్తారు. ఈఓ ఆదేశించడంతో ఊరేగింపులో దేవస్థానం వేదపండితులు, వ్రతపురోహితులు, సిబ్బంది కూడా పాల్గొంటున్నారు. ఊరేగింపును విస్తరించాలి.. వందేళ్ల క్రితం సత్యదేవుని ఊరేగింపు నిర్వహించేటపుడు గ్రామంలో ఉన్న నాలుగు ప్రధాన వీధుల్లో మాత్రమే స్వామివారి ఊరేగింపు జరిగేది. ప్రస్తుతం అన్నవరంలో 24 వీధులున్నాయి. ఈ నేపథ్యంలో సత్యదేవుని ధనుర్మాస ఊరేగింపును మరిన్ని వీధులకు విస్తరించాలని గ్రామస్తులు ∙అభిప్రాయపడుతున్నారు. -
ముక్కోటి.. భక్తకోటి
రత్నగిరిపై అంగరంగ వైభవంగా వేడుక విష్ణుమూర్తి, లక్షీ్మదేవి అలంకరణలో దర్శనమిచ్చిన సత్యదేవుడు, అమ్మవారు ఉత్తర ద్వార దర్శనం ద్వారా తిలకించి పులకించిన భక్తజనం అలరించిన పుష్పాలంకరణ ముక్కోటి (వైకుంఠ) ఏకాదశి పర్వదిన వేడుకలు రత్నగిరిపై ఆదివారం రంగరంగ వైభవంగా జరిగాయి. ప్రత్యేక మండపంలో శేషపాన్పుపై పవళించిన విష్ణుమూర్తిగా సత్యదేవుడు, లక్షీ్మదేవిగా అమ్మవారు దర్శనమిచ్చి భక్తులను కనువిందు చేశారు. పలు ప్రాంతాల నుంచి విచ్చేసిన వేలాది మంది భక్తులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఉత్తర ద్వారం ద్వారా స్వామి, అమ్మవార్లను దర్శించి తరించారు. – అన్నవరం తెల్లవారుజామున ఐదు గంటల నుంచి దర్శనం.. స్వామివారి ప్రధానాలయంలోని ప్రత్యేక మండపంలో స్వర్ణభరిత పుష్పాలంకరణతో శోభిల్లుతున్న మండపంలో విష్ణుమూర్తి అవతారంలో ఉన్న సత్యదేవుడు, లక్షీ్మదేవి అవతారంలో గల సత్యవతీదేవి అమ్మవారికి ఆదివారం తెల్లవారుజామున నాలుగు గంటలకు పండితులు ప్రత్యేక పూజలు చేశారు. దేవస్థానం చైర్మ¯ŒS ఐవీ రోహిత్, ఈఓ కే నాగేశ్వరరావు దంపతులు స్వామివారిని దర్శించుకున్నారు. తెల్లవారుజామున ఐదు గంటల నుంచి ఉత్తర ద్వారం ద్వారా భక్తులను దర్శనానికి అనుమతించారు. గర్భాలయంలోని సత్యదేవుడు, అమ్మవార్లను తిలకించి దక్షణ ద్వారం ద్వారా ఆలయం వెలుపలకు వచ్చే ఏర్పాటు చేశారు. సుమారు 20 వేల మంది భక్తులు సత్యదేవుడు, అమ్మవార్లను దర్శించుకున్నారు. ఉభయగోదావరి, విశాఖపట్నం, కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచే కాకుండా తెలంగాణా రాయలసీమ నుంచి కూడా పెద్దసంఖ్యలో భక్తులు స్వామి దర్శనానికి తరలివచ్చారు. కదంబ ప్రసాదం పంపిణీ ముక్కోటి ఏకాదశి సందర్భంగా ప్రత్యేకంగా ఆకుకూరలు అన్నం కలిపి వండిన కదంబం ప్రసాదాన్ని స్వామి, అమ్మవార్లకు నివేదించిన తరువాత భక్తులకు పంపిణీ చేశారు. ఆకట్టుకున్న పుష్పాలంకరణ ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా సత్యదేవుని ప్రధానాలయంలో చేసిన అలంకరణ అందరినీ ఆకట్టుకుంది. చాగల్లు, కత్తిపూడి లకు చెందిన కోలాటం బృందాలు చేసిన కోలాట నృత్యం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. భారీ సంఖ్యలో భక్తులు సత్యదేవుని వ్రతాలాచరించారు. వెండి రథంపై సత్యదేవుని ఊరేగింపు ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా రత్నగిరిపై సత్యదేవుని ఊరేగింపు కార్యక్రమం కన్నుల పండువగా జరిగింది. ఉదయం పది గంటలకు సత్యదేవుడు, అమ్మవార్లను స్వామివారి ఆలయం నుంచి ఊరేగింపుగా తీసుకువచ్చి వెండి రథంపై ఆశీనుల్ని చేసి పండితులు ప్రత్యేక పూజలు చేశారు. వేదపండితుల మంత్రోచ్ఛారణ, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి రథం ఊరేగింపు ప్రారంభమైంది. సత్యదేవుని ఆలయం చుట్టూ మూడుసార్లు ఊరేగించారు. దేవస్థానం ఈఓ కే నాగేశ్వరరావు, ఏసీ జగన్నాథరావు, భక్తులు వెండి రథం లాగారు. 55 కల్యాణాలు నిర్వహణ ముక్కోటి ఏకాదశి పర్వదినం కావడంతో ఆదివారం సత్యదేవుని ఆలయానికి భక్తులు పోటెత్తారు. సుమారు 20 వేల మంది వచ్చినట్టు అంచనా. రికార్డుస్థాయిలో 55 మంది భక్తులు టికెట్లు కొనుగోలు చేసి స్వామివారి నిత్యకల్యాణంలో పాల్గొన్నారు. -
సత్యదేవుని సేవల్లో భక్తుల భాగస్వామ్యం
మూడు విలక్షణ సేవల ప్రారంభానికి పాలకవర్గం నిర్ణయం ఒక రోజు అన్ని సేవల్లో పాల్గొనేందుకు రూ.పది వేలు కొద్ది మార్పులతో రూ.8,500, రూ.7,500 టిక్కెట్లు అన్నవరం: సత్యదేవుని సన్నిధిలో ఉదయం నుంచి సాయంత్రం వరకూ జరిగే పూజా కార్యక్రమాల్లో భక్తుల్ని భాగస్వాముల్ని చేస్తూ మూడు రకాల టిక్కెట్ల తో ‘ఉదయాస్తమాన సేవలు’ ప్రారంభించాలని అన్నవరం దేవస్థానం పాలకమండలి నిర్ణయించింది. శనివారం సాయంత్రం దేవస్థానంలోని ట్రస్ట్బోర్డు సమావేశం హాలులో ఛైర్మ¯ŒS రాజా ఐవీ రోహిత్, ఈఓ కె.నాగేశ్వరరావులతో పాలకమండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాన్ని రాత్రి విలేకర్లకు తెలిపారు. సత్యదేవుని సన్నిధిలో తెల్లవారు జామున సుప్రభాత సేవ వద్ద నుంచి రాత్రి పవళింపు సేవ వరకూ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. వీటిలో పాల్గొనేందుకు వివిధ రుసుములున్నాయి. అయితే ఒకే భక్తుడు అన్ని సేవల్లో పాల్గొనే వీలు లేదు. ఇప్పుడు కొన్ని మార్పులతో మూడు రకాల ‘ఉదయాస్తమాన సేవలు ’ ప్రారంభించాలని నిర్ణయించినట్లు ఛైర్మన్, ఈఓ తెలిపారు. ఈ సేవలు రూ.10,000, రూ.8,500, రూ.7,500 టిక్కెట్తో ఈ సేవలు ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ సేవల్లో పాల్గొనే భక్తులకు అనేక సదుపాయాలు కల్పించాలని నిర్ణయించారు. భక్తులు వారు కోరుకున్న రోజున ఈ కార్యక్రమాల్లో పాల్గొనే వెసులుబాటు కలిగించారు. రూ.పది వేల టిక్కెట్తో లభించే సదుపాయాలు నలుగురు భక్తులు(భార్యా భర్త, మరో ఇద్దరు) స్వామివారి సుప్రభాతసేవ, నిత్యార్చనలో పాల్గొనవచ్చు. వారికి స్వామివారి నిత్యకల్యాణం, ఏసీ వ్రత మండపంలో వ్రతం నిర్వహిస్తారు. స్వామివారి అంతరాలయంలో దర్శనం, యంత్రాలయంలో లోపల దర్శనం చేయిస్తారు. వేద పండితులతో వేదాశీర్వచనం ఏర్పాటు చేస్తారు. భక్తులు దేవస్థానంలో రెండ్రోజులు బస చేసేందుకు ఏసీ గది కేటాయిస్తారు. దంపతులకు వస్రా్తలు, స్వామివారి ఫొటో, అన్నదానప«థకంలో ప్రత్యేకంగా భోజనం, స్వామివారి ప్రసాదం ఇస్తారు. రూ.8,500 టిక్కెట్తో... స్వామివారి సుప్రభాతసేవ, నిత్యార్చన నిత్య కల్యాణంలో పాల్గొనే అవకాశం తప్ప రూ.పదివేలు టిక్కెట్ తీసుకునే వారికి కల్పించే సదుపాయాలే వీరికి కూడా కల్పిస్తారు. అదనంగా వీరు స్వామివారి ఆయుష్యహోమంలో పాల్గొనే అవకాశం కూడా కల్పిస్తారు. వీరికి ఏసీ గదిలో బస ఒకరోజు మాత్రమే కల్పిస్తారు. రూ.7,500 టిక్కెట్తో ... వీరికి ఒక రోజు ఏసీ గదిలో బస, ఏసీ మండపంలో వ్రతం, నిత్యకల్యాణం, వేదాశీర్వవచనం కల్పిస్తారు. నలుగురు భక్తులకు అంతరాలయ దర్శనం, యంత్రాలయ దర్శనం, దంపతులకు వస్రా్తలు, ప్రసాదం, అన్నదాన పథకంలో భోజనం, స్వామివారి ఫొటో కూడా ఇస్తారు. భక్తులు ఈ అరుదైన అవకాశాలను ఉపయోగించుకోవాలని వారు కోరారు. ఈ ఉదయాస్తమాన సేవలను భక్తులకు వివరించి టిక్కెట్లు కొనుగోలు చేసేలా చూసేందుకు కొంతమంది పండితులు, అధికారులు, వ్రతపురోహిత ప్రముఖులతో కమిటీలు వేసేందుకు కూడా అధికారులు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. -
సత్యదేవుని సన్నిధిలో భన్వర్లాల్
అన్నవరం : రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్లాల్ దంపతులు రత్నగిరిపై శనివారం సత్యదేవుని వ్రతమాచరించి, స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం వేదపండితులు వేదాశీస్సులందజేశారు. తొలుత ఆలయం వద్ద వారికి దేవస్థానం చైర్మ¯ŒS రాజా ఐవీ రోహిత్, ఈఓ కె.నాగేశ్వరరావు ఆధ్వర్యంలో పండితులు ఘన స్వాగతం పలికారు. చైర్మన్, ఈవోలు స్వామివారి ప్రసాదాలను అందజేశారు. భన్వర్లాల్ను జాయింట్ కలెక్టర్ ఎస్.సత్యనారాయణ మర్యాద పూర్వకంగా కలిశారు. పెద్దాపురం ఆర్డీవో విశ్వేశ్వరరావు, శంఖవరం తహసీల్దార్ వెంకట్రావు, ఎస్ఐ పార్థసారధి తదితరులున్నారు. -
‘ముక్కోటి’కి ముస్తాబు
రత్నగిరిపై విస్తృతంగా ఏర్పాట్లు రేపు ఉదయం 5 గంటల నుంచి ఉత్తర ద్వార దర్శనం అన్నవరం : ముక్కోటి (వైకుంఠ) ఏకాదశి పర్వదినానికి సత్యదేవుని ఆలయం ముస్తాబవుతోంది. ఈ సందర్భంగా ఆదివారం వేలాదిగా తరలిరానున్న భక్తులను దృష్టిలో ఉంచుకొని అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. శేషపాన్పుపై పవళించే శ్రీమహావిష్ణువుగా సత్యదేవుడిని, శ్రీమహాలక్షి్మగా అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారిని అలంకరించి, ఆ మూర్తులను ఉత్తర ద్వారంగుండా భక్తులు దర్శించే ఏర్పాట్లు చేస్తున్నారు. దేవస్థానంలో గత 20 సంవత్సరాలుగా ఈ ఆనవాయితీ ఉంది. రత్నగిరిపై సాధారణంగా స్మార్త ఆగమ పద్ధతిలో పూజా కార్యక్రమాలు జరుగుతాయి. ఉత్తరద్వార దర్శనం వైష్ణవ సంప్రదాయమైననప్పటికీ సత్యదేవుడు విష్ణుమూర్తి అంశ అయినందున ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని పండితులు తెలిపారు. మామూలుగా ప్రతి రోజూ భక్తులు దక్షిణ ద్వారం ద్వారా వెళ్లి ఉత్తర ద్వారంగుండా వెలుపలకు వస్తారు. ముక్కోటి ఏకాదశినాడు మాత్రం అందుకు వ్యతిరేకంగా ఉత్తర ద్వారం నుంచి ఆలయం లోపలకు వెళ్లి దక్షిణ ద్వారం నుంచి బయటకు వస్తారు. ముక్కోటి వేడుకల నేపథ్యంలో తూర్పు రాజగోపురానికి విద్యుద్దీపాలతో ప్రత్యేకంగా అలంకరణ చేస్తున్నారు. ఇప్పటికే రంగురంగుల సీరియల్ బల్బులు అమర్చారు. వాటితోపాటు మరికొన్ని సీరియల్ బల్బులను కూడా శుక్రవారం ఏర్పాటు చేశారు. దీంతో రాజగోపురం మరింతగా తళుకులీనుతోంది. సాయంత్రం వరకూఉత్తర ద్వార దర్శనం ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా రత్నగిరి సత్యదేవుని సన్నిధిన ఆదివారం విశేష పూజా కార్యక్రమాలు, ఉత్తర ద్వారదర్శనం ఏర్పాటు చేసినట్లు దేవస్థానం ఈవో కె.నాగేశ్వరరావు శుక్రవారం విలేకర్లకు తెలిపారు. ఆ రోజు తెల్లవారుజామున నాలుగు గంటలకు సత్యదేవుడు, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేస్తామన్నారు. అనంతరం ఉదయం ఐదు నుంచి సాయంత్రం ఐదు గంటల వరకూ ఉత్తర ద్వార దర్శనానికి భక్తులను అనుమతిస్తున్నట్టు తెలిపారు. ప్రధానాలయం, ఆలయ పరిసరాలను వివిధ పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరిస్తున్నామని చెప్పారు. -
కీలక నిర్ణయాలకు వేదిక
సత్యదేవుని ఆలయ చరిత్రలో ఓ మైలురాయి 2016 పలు ఆధ్యాత్మిక, విప్లవాత్మక చర్యలకు నాంది అన్నవరం : రాష్ట్రంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి కెక్కిన అన్నవరం సత్యదేవుని ఆలయం 2016 సంవత్సరం అనేక కీలక పరిణామాలు, నిర్ణయాలకు వేదికగా మారింది. సత్యదేవుని దివ్య కల్యాణం , తెప్పోత్సవం, గిరిప్రదక్షిణ వంటి కార్యక్రమాలను ద్రో¯ŒS కెమేరాల ద్వారా చిత్రీకరించి ఆ దృశ్యాలను ప్రసార మాధ్యమాల ద్వారా జన బాహుళ్యంలోకి తీసుకు వెళ్లిన ఘనత 2016 కే దక్కింది. అటు ఆధ్యాత్మికపరంగా, ఇటు పాలనాపరంగా దేవస్థానానికి లబ్ధి చేకూరే పలు నిర్ణయాలు తీసుకున్నారు. దేవస్థానం ఆరో వ్యవస్థాపక ధర్మకర్తగా ఇనుగంటి వంశానికి చెందిన రాజా ఇనుగంటి వేంకట రోహిత్ ఈ బాధ్యతలు స్వీకరించారు. ఆగమ పాఠశాలకు శంకుస్థాపన సత్యదేవ స్మార్త ఆగమ పాఠశాలకు 2016 నవంబర్లో శంకుస్థాపన జరిగింది. రూ.రెండు కోట్లతో దీనిని నిర్మిస్తున్నారు. దాత సహకారంతో తూర్పు రాజగోపురం దిగువన సత్యదేవ యాగశాలకు గత ఏడాది శంకుస్థాపన జరిగినా ఈ ఏడాది పనులు ప్రారంభమయ్యాయి. సత్యదేవుని జన్మనక్షత్రం (మఖ) నాడు మాత్రమే జరిగే ఆయుష్యహోమం కంచి పీఠాధిపతి జగద్గురు జయేంద్ర సరస్వతి స్వామీజీ సూచనలతో రోజూ జరిగేలా నిర్ణయించారు. అయితే ప్రస్తుతం ఇది భక్తుల భాగస్వామ్యంతో రూ.రెండు వేలు టిక్కెట్తో నిర్వహిస్తున్నారు. అందువల్ల వారానికి రెండు లేదా మూడు పర్యాయాలు చేస్తున్నారు. తక్కువ ధరకు ‘వృక్ష ప్రసాదం’ భక్తుల నామ, జన్మనక్షత్రాన్ని బట్టి నాటుకోవల్సిన వివిధ మొక్కలను ’వృక్షప్రసాదం’గా ఈ ఏప్రిల్ నుంచి దేవస్థానంలో తక్కువ ధరలకు విక్రయిస్తున్నారు. గతంలో వీఐపీలకు మాత్రమే లభించే వేదపండితుల ఆశీస్సులు రూ.558 టిక్కెట్తో భక్తులు కూడా అందజేస్తున్నారు. కొండ దిగువ నుంచి ఎగువ వరకూ సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేసి భక్తి గీతాలు, భజనలు, ఇతర ఆధ్యాత్మిక కార్యక్రమాలు వినిపిస్తున్నారు. పాలనాపరమైన నిర్ణయాలు రెగ్యులర్, కాంట్రాక్ట్, ఎ¯ŒSఎంఆర్, వ్రత పురోహితులకు బయోమెట్రిక్ అటెండె¯Œ్స ఏర్పాటు చేసి విధులకు గైర్హాజర్ అయ్యే సిబ్బంది, పురోహితులపై చర్యలు తీసుకుంటున్నారు. గతంలో 20 సీసీ కెమేరాలు ఉండగా 96 కెమేరాలకు పెంచారు. రెండు ఘాట్రోడ్లు, మెట్లదారితో బాటు దేవస్థానంలోని అన్ని ప్రాంతాలను సీసీ కెమేరాల పరిధిలోకి తెచ్చారు. ఇది అటు భద్రతా చర్యల కింద ఉపయోగపడడంతో బాటు, విధులకు గైర్హాజర్ అయ్యే సిబ్బందిని గుర్తించేందుకు ఉపకరిస్తోంది. హుండీ లెక్కింపునకు ఈ ఏడాది నుంచే టేబుల్స్ ఉపయోగిస్తున్నారు. గతంలో సిబ్బంది తివాచీల మీద కూర్చుని లెక్కిండం వల్ల ఆలస్యమయ్యేది. టేబుల్స్ మీద నగదు పరిచి లెక్కించే విధానం ప్రారంభించాక రూ.కోటి అయినా సాయంత్రానికి లెక్కింపు పూర్తి చేస్తున్నారు. పెరిగిన కానుకలు సత్యదేవుని నిత్యకల్యాణంలో స్వామివారికి పట్టువస్రా్తలు సమర్పించేందుకు రూ.558 టిక్కెట్ పెట్టారు. రోజూ కనీసం పదిమంది ఈ టిక్కెట్ కొనుగోలు చేసి పట్టువస్రా్తలు సమర్పిస్తున్నారు. సత్యదేవుని ప్రధానాలయం వద్ద పెద్ద హుండీ ఏర్పాటు చేసి ఆ హుండీ చుట్టూ భక్తులు ప్రదక్షిణ చేసే ఏర్పాటు చేశారు. దీంతో ఆ హుండీలో పడే కానుకలు పెరిగాయి. వ్రతాలు, కేశఖండన శాలలో భక్తుల నుంచి బలవంతంగా కానుకలు వసూలు చేసే పద్ధతిని నిరోధించారు. çఫలితంగా ఆ మేరకు ఆదాయం కూడా పెరిగింది. 2017లో దేవస్థానం రాష్ట్రంలోనే ప్రథమస్థానం పొందేలా కృషి చేస్తామని చైర్మ¯ŒS రోíßహిత్, ఈఓ కే నాగేశ్వరరావు తెలిపారు. వెబ్సైట్కు ప్రశంసలు అన్నవరం దేవస్థానం వెబ్సైట్ అటు డిజై¯ŒS పరంగా, సమాచార పరంగా అత్యుత్తమంగా ఉందని ప్రశంసలు పొందింది. ఈఓ కే నాగేశ్వరరావుకు దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జేఎస్వీ ప్రసాద్ ఈ మేరకు అభినందనలు తెలియచేసి జ్ఞాపిక బహూకరించారు. ఈ ఏడాది సత్యదేవుని కల్యాణ మహోత్సవం, తెప్పోత్సవం, గిరి ప్రదక్షిణం ద్రో¯ŒS కెమేరాతో చిత్రీకరించారు. -
సత్తెన్న హుండీలో వంద నోట్ల వర్షం
రూ.99.47 లక్షల రాబడిలో వాటి విలువ రూ.40 లక్షలు రూ.20 లక్షలతో రెండో స్థానంలో పది నోట్లు పాత 500, వేయి నోట్లు రూ.8.66 లక్షలు అన్నవరం : పెద్దనోట్ల రద్దు తరువాత సత్యదేవుని హుండీలలో వందనోట్లు విరివిగా పడ్డాయి. రూ.రెండు వేలు, రూ.500 కొత్త నోట్లు విడుదలైనా ప్రస్తుతం మార్కెట్లో అత్యధికంగా వంద నోట్లే చలామణిలో ఉండడంతో భక్తులు కూడా సత్యదేవుని హుండీలో వాటినే ఎక్కువగా వేశారు. గురువారం సత్యదేవుని హుండీ ఆదాయాన్ని లెక్కించగా గత 30 రోజులకు రూ.99,47,042 ఆదాయం వచ్చింది. అం దులో రూ.వంద నోట్లు 40,263 ఉన్నాయి. కాగా పది రూపాయల నోట్లు 1,99,912 వచ్చాయి. హుండీ ల ద్వారా బంగారం 79 గ్రాములు, వెండి 535 గ్రాములు సమకూరాయి. 14 దేశాల కరెన్సీ నోట్లు ఇండియా కరెన్సీతో కలిపి మొత్తం 14 దేశాల కరెన్సీ హుండీల ద్వారా లభించింది. యూఎస్ఏ డాలర్లు 436, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దీనార్లు పది, ఖతార్ సెంట్రల్ బ్యాంక్ రియల్స్ 102, సింగపూర్ డాలర్లు 116 , మలేషియా రిమ్స్ 73, ఆస్ట్రేలియా డాలర్లు 105, నేపాల్ రూపాయలు పది, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఒమె¯ŒS రియల్స్ 2.5, యూరో కరెన్సీ 20, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ కువైట్ దీనార్–1, న్యూజిలాండ్ సెంట్రల్ బ్యాంక్ కరెన్సీ 20, సౌతాఫ్రికా కరెన్సీ 50 రాండ్స్ , వెనిజులా కరెన్సీ 100 సీబీలు లభించాయి. 2016లో చివరిసారిగా గురువారం లెక్కించిన సత్యదేవుని హుండీల ద్వారా దేవస్థానానికి భారీగా ఆదాయం సమకూరింది. సాధారణంగా మార్గశిర, పుష్య మాసాలలో భక్తుల రాక తక్కువగా ఉండి హుండీ ఆదాయం కూడా పెద్దగా ఉండదు. అయితే ఈ సారి వరుస సెలవులు, వివాహాల వంటి వాటి వలన హుండీ ఆదాయం గణనీయంగానే వచ్చిందని దేవస్థానం చైర్మ¯ŒS రోహిత్, ఈఓ నాగేశ్వరరావు తెలిపారు. రద్దయిన రూ.500, రూ.వేయి నోట్ల మార్పిడి ఈ నెల 30 తో ముగుస్తున్నందున ఇకపై వచ్చే పాత నోట్లను ఆర్బీఐకే పంపిస్తామని ఈఓ తెలిపారు. తలుపులమ్మ వారికి రూ.14.46 లక్షల రాబడి తుని రూరల్ : తలుపులమ్మ వారి దేవస్థానం ఆవరణలో హుండీల్లో నగదును గురువారం లెక్కించడంతో రూ.14,46,831 ఆదాయం లభించిందని అసిస్టెంట్ కమిషనర్, ఈఓ ఎస్.చంద్రశేఖర్ తెలిపారు. పెద్దనోట్లు రద్దవడం, 30తో మార్చుకునేందుకు గడువు ముగుస్తుండడంతో హుండీలను తెరిచినట్టు తెలిపారు. తుని పట్టణం మెయి¯ŒS రోడ్డులో తలుపులమ్మ వారి గుడి హుండీలో నగదు లెక్కించగా రూ.33,360 లభించాయన్నారు. చైర్మ¯ŒS కరపా అప్పారావు, ధర్మకర్తలు యాదాల లోవకృష్ణ, యాదాల సింహాచలం, అత్తి అచ్చుతరావు, బి.అప్పలనాయుడు, ఎ¯ŒS.సి.హెచ్.నారాయణాచార్యులు, పుల్లంరాజు, తర్రా బుల్లెబ్బాయి, సూపరింటెండెంట్లు కె.వి.రమణ, ఎల్.వి.రమణ, ఆలయ ఇ¯ŒSస్పెక్టర్లు గుబ్బల రామకృష్ణ, నాయుడు తదితరులు లెక్కింపులో పాల్గొన్నారు. -
ప్రతి సోపానానికీ భక్తజన నీరాజనం
ఘనంగా సత్యదేవుని మెట్లోత్సవం అన్నవరం : రత్నగిరి వాసుడు సత్యదేవుని కోవెలకు దారి తీసే సోపానాలు గు రువారం స్వామి, అమ్మవార్ల సమక్షంలో భక్తుల నీరాజనాలందుకున్నాయి. గురువారం ’మెట్లోత్సవం’ సందర్భంగా ము త్తయిదువులు పూసిన పసుపు, కుంకుమ, పుష్పాల అలంకరణ, ఆపై కర్పూర హార తి, నైవేద్యంతో ప్రత్యేక శోభను సంతరించుకున్నాయి. భక్తులు ప్రతి మెట్టునూ స్వామి వారి అంశగా భావించి పూజించా రు. ఉదయం 8 గంటలకు సత్యదేవుడు, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను మెట్ల మార్గంలో పల్లకీ మీద ఊరేగిస్తూ కొండ దిగువకు తీసుకువచ్చారు. ప్రత్యేక పూజ ల అనంతరం వేదపండితుల మంత్రోచ్చారణ, కోలాట నృత్యాల మధ్య గ్రా మంలో ఊరేగించారు. అనంతరం తొలి పాంచా పాదాల మండపం వద్ద ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు. ఉదయం 9.30 గంటలకు శ్రీకనకదుర్గ అమ్మవారి ఆలయం వద్ద గల తొలి మెట్టును ముత్తయిదువులు పసుపు, కుంకుమ, పూలతో అలంకరించగా ఈఓ నాగేశ్వరరావు కొబ్బరికాయ కొట్టి, మెట్టు కు హారతి ఇచ్చి మెట్లోత్సవాన్ని ప్రారంభించారు. ఆ హారతి ఇచ్చిన మెట్ల మీదు గా స్వామి,అమ్మవార్లను పల్లకీ మీద ఊరేగించారు. అనంతరం ముత్తయిదువులు ప్రతి మెట్టుకు పసుపు కుంకుమ, పూలతో అలంకరించగా పండితులు ఒక తమలపాకుపై హారతి కర్పూరం, మరో తమలపాకుపై పటికబెల్లం నివేదించగా భక్తులు ఆ హారతి వెలిగించి, స్వామి, అమ్మవార్లను ఆ మెట్ల మీదుగా ఊరేగించారు. ఇలా మొత్తం 450 మెట్లకు పూజలు చేస్తూ కార్యక్రమాన్ని కొనసాగించారు.చివరగా అనివేటి మండపం మెట్ల వద్ద హారతి వెలిగించడంతో కార్యక్రమం ముగిసింది. వేదపండితులు కపిలవాయి రామశాస్త్రి, ముష్టి కామశాస్త్రి, గొల్లపల్లి ఘనాపాఠీ, గొర్తి విశ్వేశ్వర సుబ్రహ్మణ్య ఘనాపాఠీ, సత్యదేవుని ఆలయ ప్ర«ధానార్చకులు కొండవీటి సత్యనారాయణ, స్పెషల్ గ్రేడ్ వ్రతపురోహితులు నాగాభట్ల కామేశ్వరశర్మ, ముత్య సత్యనారాయణ, దేవస్థానం ఏసీ ఈరంకి జగన్నాథరావు, దేవస్థానం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
రత్నగిరిపై ఆయుష్ హోమం ప్రారంభం
ఈవో, ఛైర్మన్లు ప్రత్యేక పూజలు భక్తులతో కిటకిటలాడిన రత్నగిరి అన్నవరం(తొండంగి) : కంచికామకోటి పిఠాధిపతి జయేంద్ర సరస్వతి సూచనల మేరకు రత్నగిరిపై తలపెట్టిన ఆయుష్ హోమం కార్యక్రమం శనివారం రత్నగిరిపై ఘనంగా ప్రారంభమైంది. దేవస్థానంపై ప్రధానాలయం సమీపంలోని దర్బారు మండపంలో సత్యదేవుడు, అనంతలక్ష్మి అమ్మవార్లను ప్రత్యేక ఆశీనులను చేసి అర్చక స్వాములు ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం వేదపండితుల మంత్రోచ్ఛరణతో ఆయుష్ హోమం కార్యక్రమాన్ని రుత్వికులు ప్రారంభించారు. ఈ సందర్భంగా దేవస్థాన కార్యనిర్వహణాధికారి కె.నాగేశ్వరరావు, ట్రస్టుబోర్డు ఛైర్మ¯ŒS ఐ.వి.రోహిత్ ప్రత్యేక పూజలు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఆయుష్ హోమం పూజల్లో పాల్గొన్నారు. ఘనంగా గోపూజ మహోత్సవం... రత్నగిరి కొండపై శనివారం దేవాదాయ ధర్మాదాయశాఖ, హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్టు సంయుక్తాధ్వర్యంలో గోపూజ మహోత్సవం ఘనంగా జరిగింది. తూర్పు రాజగోపురం సమీపాన ఉన్న శ్రీగోకులం వద్ద ఈ కార్యక్రమాన్ని దేవస్థాన కార్యనిర్వహణాధికారి కె.నాగేశ్వరరావు, ఛైర్మ¯ŒS ఐ.వి.రోహిత్లు ప్రారంభించి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులతో కిటకిటలాడిన రత్నగిరి మార్గశిర మాసం సందర్భంగా శుక్రవారం రాత్రి అధిక సంఖ్యలో వివాహాలు జరగడంతో రత్నగిరిపై శనివారం నూతన దంపతులతో కిటకిటలాడింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన నూతన జంటలు సత్యదేవుని వ్రతం ఆచరించారు. -
జీతమో.. సత్యదేవా?
అన్నవరం ఆలయ సిబ్బంది జీతాలకూ కటకట బ్యాంకుల ద్వారా ప్రతి నెలా రూ.రెండు కోట్లు జీతాలకు కేటాయింపు దేవస్థానం నిధులున్నా.. నగదుకొరతతో చెల్లించలేని పరిస్థితి పెద్ద నోట్ల రద్దు.. బ్యాంకుల్లో నగదు కొరత.. ఈ ప్రభావంతో అన్నవరం వీరవేంకట సత్యనారాయణ స్వామి దేవస్థానం సిబ్బందికి ఈ నెలలో పూర్తి స్థాయిలో జీతాలు అందే పరిస్థితి కనిపించడం లేదు. దేవస్థానం వద్ద రూ.కోట్ల నిధులున్నా, ఆ నగదంతా స్థానిక బ్యాంకుల్లోనే ఉంది. అయితే సిబ్బందికి జీతాలు చెల్లించాల్సిన ఆ బ్యాంకులు షరతులు పెడుతుండడం ప్రస్తుతం ఉద్యోగులకు ఇబ్బందిగా మారింది. - అన్నవరం సిబ్బంది జీతభత్యాల కింద నెలనెలా రూ.రెండు కోట్లు చెల్లింపు అన్నవరం దేవస్థానంలో పని చేస్తున్న సుమారు రెండు వేల మంది రెగ్యులర్, కాంట్రాక్ట్, ఎన్ఎంఆర్ ఉద్యోగులు, వ్రతపురోహితులు, పెన్షనర్స్, నాయీబ్రాహ్మణులకు దేవస్థానం ప్రతి నెలా జీతాల రూపంలో రూ.రెండు కోట్లు చెల్లిస్తోంది. రెగ్యులర్ సిబ్బందికి, పెన్షనర్స్కు ఒకటో తేదీన, రెండు, మూడు తేదీలలో మిగిలిన వారికి బ్యాంకుల ద్వారా చెల్లిస్తున్నారు. దేవస్థానం ఈఓ సంతకంతో జీతాల మొత్తానికి చెక్ రాసి ఏ ఉద్యోగికి ఎంత చెల్లించాలో ఉద్యోగుల లిస్ట్ జత చేసి బ్యాంకులకు పంపిస్తారు. రెగ్యులర్ సిబ్బందికి జీతాల కింద రూ.54 లక్షలు, పురోహితులకు పారితోషకం కింద రూ.40 లక్షలు స్టేట్బ్యాంక్ ద్వారా చెల్లిస్తారు. పెన్షనర్స్కి రూ.30 లక్షలు, నాలుగోతరగతి ఉద్యోగులకు రూ.20 లక్షలు, నాయీబ్రాహ్మణులకు రూ.ఆరు లక్షలు, మిగిలిన ఉద్యోగులకు రూ.50 లక్షలు ఆంధ్రాబ్యాంక్ ద్వారా ప్రతి నెలా చెల్లిస్తారు. బ్యాంకులలో ని«ధులు పుష్కలంగా ఉండేవి కనుక, ఈ జీతాలు బ్యాంకులోని తమ ఖాతాలకు జమైన రోజునే సిబ్బంది డ్రా చేసేసేవారు. ప్రస్తుత పరిస్థితి అందుకు విరుద్ధం సిబ్బంది జీతభత్యాల కింద పూర్తిస్థాయిలో నగదు చెల్లించేందుకు బ్యాంకుల వద్ద సరిపడనంత నగదు లేదు. రూ.500, వేయి నోట్లు రద్దవడంతో బ్యాంకులు వద్ద రూ.రెండు వేల నోట్లు, రూ.వంద నోట్లు, అంతకన్నా తక్కువ డినామినేషన్ నోట్లు మాత్రమే ఉన్నాయి. అవీ కూడా ఏ రోజుకారోజు ఆయా బ్యాంకుల ' ఛెస్ట్'లు(ట్రెజరీ బ్యాంకులు) నుంచి తెచ్చుకోవల్సి వస్తోంది. రూ.కోటి కావాలని ఇండెంట్ పెడితే రూ.20 లక్షల నుంచి రూ.30 లక్షలు మాత్రమే ఇస్తున్నారని బ్యాంకు అధికారులు చెబుతున్నారు. వాటిలో రెండువేల నోట్లే అధికంగా ఉంటున్నాయని తెలిపారు. ఖాతాదారులు రూ.వంద నోట్లు అడుగుతున్నారని, అవి చాలా తక్కువ ఉంటున్నాయని తెలిపారు. ఈ పరిస్థితుల్లో దేవస్థానం సిబ్బందికి పూర్తిస్థాయిలో ఒకేసారి జీతాలు ఇవ్వలేమని తెలిపారు. జీతాల చెక్కులు గురువారం బ్యాంకులకు పంపిస్తాం దేవస్థానం సిబ్బంది జీతాల చెక్కులు డిసెంబర్ ఒకటో తేదీ, గురువారం స్థానిక స్టేట్బ్యాంక్, ఆంధ్రాబ్యాంకులకు పంపిస్తాం. ప్రస్తుత పరిస్థితులలో వీలైనంత ఎక్కువ మొత్తం సిబ్బందికి చెల్లించాలని బ్యాంకు అధికారులకు చెప్పగలం తప్ప అంతకన్నా ఏమీ చేయలేం కె.నాగేశ్వరరావు, ఈఓ, అన్నవరం దేవస్థానం పూర్తి జీతం ఒకేసారి ఇవ్వలేం డిసెంబర్ నెలకు సంబంధించి దేవస్థానం సిబ్బందికి పూర్తిస్థాయిలో జీతం వెంటనే ఇవ్వలేం. పూర్తిస్థాయిలో జీతాలు చెల్లించాలంటే రూ.94 లక్షలు కావాలి. ప్రస్తుతం బ్యాంకు వద్ద రూ.30 లక్షలు కూడా నిల్వ లేదు. అది కూడా రూ.రెండు వేల నోట్లు మాత్రమే. సిబ్బంది కూడా సహకరించాలి. -డీఎస్కే శర్మ, స్టేట్బ్యాంక్ మేనేజర్, అన్నవరం రూ.పది వేలు చొప్పున మాత్రమే చెల్లిస్తాం దేవస్థానం నాలుగోతరగతి ఉద్యోగులు, పెన్షనర్స్కు పూర్తిస్థాయిలో చెల్లించేందుకు తగినంత నగదు లేదు. మొదట రూ.పదివేల చొప్పున మాత్రమే చెల్లిస్తాం. మిగిలిన మొత్తం తరువాత చెల్లిస్తాం. వైవీ సత్యనారాయణ మూర్తి, మేనేజర్, ఆంధ్రాబ్యాంక్ -
సత్యదేవుని ఆలయం.. భక్తజనసంద్రం..
అన్నవరం : మరో రెండు రోజుల్లో కార్తిక మాసం ముగియనుండడంతో.. రత్నగిరిపై సత్యదేవుని సన్నిధికి ఆదివారం భక్తులు పోటెత్తారు. సెలవు దినం కావడంతో ఉదయం నుంచీ స్వామివారిని దర్శించడానికి క్యూ కట్టారు. తెల్లవారుజాము నుంచే ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది. దీంతో అధికారులు తెల్లవారుజామున మూడు గంటల నుంచే స్వామివారి వ్రతాలను, దర్శనాలను ప్రారంభించారు. అప్పటి నుంచి సాయంత్రం ఐదు గంటల వరకూ రద్దీ కొనసాగుతూనే ఉంది. స్వామివారి సాధారణ దర్శనానికి గంటన్నర, ప్రత్యేక దర్శనానికి గంట సమయం పట్టింది. సుమారు 5 వేల వాహనాల్లో దాదాపు 70 వేలమంది భక్తులు తరలివచ్చారు. పార్కింగ్ ప్రదేశాలు చాలకపోవడంతో ఘాట్రోడ్ పక్కన వాహనాలను నిలిపివేశారు. దీంతో పలుమార్లు వాహనాల రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది. ఉదయం పది గంటల తరువాత వచ్చిన వాహనాలను సత్యగిరి మీదకు పంపించారు. ఈఓ కె.నాగేశ్వరరావు ద్విచక్రవాహనంపై స్వయంగా తిరుగుతూ ట్రాఫిక్ను చక్కదిద్దారు. ఆదివారం ఒక్కరోజే 6,998 వ్రతాలు జరిగాయి. కల్యాణాలు 49 నిర్వహించారు. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.65 లక్షల ఆదాయం సమకూరింది. భక్తుల రద్దీ కారణంగా వ్రత మండపాలు సరిపోలేదు. దీంతో స్వామివారి నిత్యకల్యాణ మండపంలో రూ.300 వ్రతాలను ఉదయం పది గంటల వరకూ నిర్వహించారు. అనంతరం స్వామివారి నిత్య కల్యాణం జరిపారు. ఆదివారంతో కలిపి కార్తిక మాసంలో మొత్తం 1,10,379 వ్రతాలు జరిగినట్లు అధికారులు తెలిపారు. సోమ, మంగళవారాల్లో మరో 10 వేల వ్రతాలు జరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. గత ఏడాది కార్తికంలో మొత్తం జరిగిన వ్రతాలు 1,10,248 మాత్రమే. దీంతో పోలిస్తే ఈ ఏడాది ఇప్పటికే మరో 131 వ్రతాలు అధికంగా జరిగాయి. -
సూపరింటెండెంట్ పై చర్యలు తీసుకోండి
ఈఓకు పురోహితుల ఫిర్యాదు ∙ చైర్మన్తో చర్చించిన తర్వాతేనని హామీ అన్నవరం : అన్నవరం దేవస్థానంలో వ్రత పురోహితుల విషయంలో సూపరింటెండెంట్ కె. కొండలరావు దురుసుగా ప్రవర్తించడంపై ఏర్పడిన వివాదం ఈఓ జోక్యంతో సద్దుమణిగింది. ఒక దశలో సూపరింటెండెంట్పై సత్వరం చర్య తీసుకోవాలని ఈఓ కార్యాలయం వద్ద నిరసన తెలపాలని పురోహితులు భావించారు. అయితే మధ్యాహ్నం ఈఓ నాగేశ్వరరావుతో సమావేశమైన తరువాత ఆయన సూపరింటెండెంట్పై చర్యలకు ఇచ్చిన హామీతో వివాదం సద్దుమణిగింది. వివరాలిలా ఉన్నాయి. భక్తుల నుంచి పురోహితులు ఏరకమైన దక్షిణలనైనా డిమాండ్ చేయరాదని, వారిస్తే తీసుకోవచ్చని ఈఓ నిబంధన విధించారు. దీనిపై అసంతృప్తిగా ఉన్న పురోహితులు గురువారం భక్తులు స్వచ్ఛందంగా ఇచ్చిన కానుకలు కూడా హుండీలోనే వేసేసారు. గురువారం ఉదయం వ్రతకధలో భాగంగా సత్యదేవుని ఆలయం త్రిమూర్త్యాత్మకం అనే విషయాన్ని ఓ భక్తుడు అడిగిన సందేహానికి పురోహితుడు వివరణ ఇస్తుండగా సూపరింటెండెంట్ కొండలరావు అతనిని బలవంతంగా జబ్బ పట్టుకుని మండపం నుంచి బయటకు లాగేశాడని సహ పురోహితులు తెలిపారు. మిగిలిన నలుగురి పురోహితుల విషయంలో కూడా ఆయన ఇలాగే ప్రవర్తించాడని పురోహితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జరిగిన విషయాన్ని పురోహితులు ఈఓ నాగేశ్వరరావుకు ఫో¯ŒSలో వివరించి సూపరింటెండెంట్పై చర్యలకు డిమాండ్ చేశారు. దీనిపై చర్చించేందుకు మధ్యాహ్నం ఒంటిగంటకు తన చాంబర్ కు రావాలని ఈఓ వారికి తెలిపారు. మధ్యాహ్నం ఈఓ ను కలిసిన పురోహితులు జరిగిన విషయాన్ని, అలాగే భక్తులు స్వయంగా ఇచ్చే కానుకలు తీసుకోవడానికి అనుమతించే విషయాన్ని వివరించారు. అలాగే తాము భక్తులను కానుకలు అడిగితే సస్పెండ్ చేయవచ్చునని ఈఓకి హామీ ఇచ్చారు. దీనిపై ఈఓ సానుకూలంగా స్పందించారు. అలాగే సూపరిండెంట్ విషయాన్ని కార్తికమాసం తరువాత ఆలయ చైర్మన్ రోహిత్తో చర్చించి నిర్ణయిస్తామని ఈఓ తెలిపారు. ఈఓ కె.నాగేశ్వరరావును కలిసిన పురోహితుల ఫైవ్మె¯ŒS కమిటీ సభ్యులు స్పెషల్గ్రేడ్ పురోహితుడు నాగాభట్ల కామేశ్వరశర్మ, కర్రి వైకుంఠరావు, బండి నర్శింహమూర్తి, చామర్తి కన్నబాబు, కర్రి సూర్యనారాయణ మూర్తి, స్పెషల్గ్రేడ్ పురోహితుడు ముత్య సత్యనారాయణ తదితరులు ఉన్నారు. -
సత్యదేవుని సన్నిధిలో కంచి పీఠాధిపతులు
ఉపముఖ్యమంత్రి చినరాజప్పకు జయేంద్ర సరస్వతి సూచన చిన్న దేవాలయాలను పెద్ద ఆలయాలు దత్తత తీసుకోవాలి సత్యదేవునికి కంచి పీఠాధిపతి, ఉత్తరాధికారి విశేష పూజలు అన్నవరం : హిందూ మత ఔన్నత్యాన్ని చాటిచెప్పేందుకు ’ప్రజల వద్దకు «ధర్మం’ కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహించాలని కంచి కామకోటి పీఠా«ధిపతి జగద్గురు శ్రీ జయేంద్ర సరస్వతి స్వామీజీ, ఉత్తరాధికారి జగద్గురు శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామీజీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్పకు సూచించారు. రత్నగిరికి విచ్చేసిన జయేంద్ర సరస్వతి స్వామీజీ, విజయేంద్ర సరస్వతి స్వామీజీ ఆదివారం ఉదయం గర్భాలయంలో సత్యదేవుడికి, అమ్మవార్లకు విశేష పూజలు చేశారు. అనంతరం చినరాజప్ప వారిని కలిసి ఆశీస్సులు పొందారు. జయేంద్ర సరస్వతి తరఫున విజయేంద్ర సరస్వతి స్వామీజీ మాట్లాడుతూ టీటీడీ నిర్వహిస్తున్న ’మనగుడి’ కార్యక్రమం చాలా బాగుందని ప్రశంసించారు. రాష్ట్రంలోని అన్ని ప్రముఖ దేవస్థానాలు కనీసం రెండు జిల్లాల్లోని దేవాలయాలను దత్తత తీసుకుని అభివృద్ధి చేయాలని సూచించారు. వేదపాఠశాలలను ఎక్కువగా స్థాపించి ఎక్కువ మంది విద్యార్థులు వేదం అభ్యసించేలా ఏర్పాట్లు చేయాలన్నారు. అన్నవరం దేవస్థానంలో రూ.2.3 కోట్లతో స్మార్త, ఆగమ పాఠశాల ఏర్పాటు చేస్తున్నామని, దానిని వేదపాఠశాలగా మార్చే ప్రతిపాదన కూడా ఉందని దేవస్థానం ఈఓ కె. నాగేశ్వరరావు పీఠాధిపతులకు వివరించారు. పీఠాధిపతి, ఉత్తరాధికారికి ఘనంగా పూజలు సత్యదేవుని దర్శనం అనంతరం ఆలయంలోని విశిష్ట వ్రతమండపంలో పీఠా«ధిపతి, ఉత్తరాధికారులకు దేవస్థానం చైర్మ¯ŒS రాజా ఐవీ రోహిత్, ఈఓ కె. నాగేశ్వరరావు పూజలు చేశారు. పండితులు ఆశీర్వచనాలు అందచేశారు. నాలుగు వేదాల పండితులు వేదాలను పఠించారు. ఐదు రకాల పళ్లు, రూ. 10,116 నగదు పారితోషికాన్ని చైర్మన్, ఈఓ వారికి సమర్పించారు. కంచి పీఠం తరఫున పీఠాధిపతి జయేంద్రసరస్వతి స్వామీజీ చైర్మన్, ఈఓలకు శాలువాలు కప్పి ఘనంగా సత్కరించారు. దేవస్థానం వేదపండితులు కపిలవాయి రామశాస్త్రి, ముష్టి కామశాస్త్రి, గొల్లపల్లి ఘనాపాఠీ, గొర్తి సుబ్రహ్మణ్య ఘనాపాఠీ, ప్రధానార్చకులు కొండవీటి సత్యనారాయణ, గాడేపల్లి వేంకట్రావు, స్పెషల్గ్రేడ్ వ్రతపురోహితులు నాగాభట్ల కామేశ్వరశర్మ, ముత్య సత్యనారాయణ, దేవస్థానం ఏసీ ఈరంకి జగన్నా«థరావు పాల్గొన్నారు. అతిరుద్ర మహాయాగం సందర్శించిన ఉత్తరాధికారి పోలవరం ప్రాజెక్టుకు ఎటువంటి అంతరాయం లేకుండా పూర్తి కావాలనే ధ్యేయంతో రత్నగిరిపై నిర్వహిస్తున్న అతిరుద్ర మహాయాగాన్ని ఉత్తరాధికారి విజయేంద్ర సరస్వతి స్వామీజీ సందర్శించారు. -
కంచి పీఠాధిపతి జయేంద్ర సరస్వతికి స్వాగతం
అన్నవరం : కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురు శ్రీ జయేంద్ర సరస్వతి స్వామీజీ శనివారం రాత్రి అన్నవరం విచ్చేశారు. ఉత్తరాధికారి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామీజీతో కలసి వచ్చిన జయేంద్ర సరస్వతికి దేవస్థానం ఘాట్ రోడ్ ముఖద్వారంలో వందలాది మంది పండితులు, అర్చకస్వాములు, పురోహితులు, సిబ్బందితో కలిసి దేవస్థానం చైర్మ¯ŒS రాజా ఐవీ రోహిత్, ఈఓ కె.నాగేశ్వరరావు ఘనస్వాగతం పలికారు. కారులో ఉన్న స్వామీజీకి పండితులు మం త్రోచ్ఛారణతో హారతులిచ్చి స్వాగతం పలికారు. అనంతరం ఆయన సత్యగిరి మీద ఉన్న అతిథి గృహా నికి రాత్రి బసకు వెళ్లారు. ఉదయం ఆరు గంటలకు స్వామీజీ సత్యదేవుని ఆలయానికి విచ్చేసి గర్భాలయంలో స్వామి, అమ్మవార్లకు, శంకరునికి ప్రత్యేక పూజలు చేస్తారు. సుమారు గంటసేపు ఈ పూజలు కొనసాగుతాయి. అనంతరం ఉదయం తొమ్మిది నుంచి మ«ధ్యాహ్నం ఒంటిగంట వరకూ కొండ దిగువన పంపా సత్రంలో స్వామీజీ శ్రీ మహాత్రిపురసుందరీ సమేత శ్రీ చంద్రమౌళీశ్వరస్వామి పూజ నిర్వహించనున్నారు. ఈ పూజ కోసం వంద బిందెల పరిశుద్ధ జలం సిద్ధం చేస్తున్నారు. సుమారు మూడు గంటలపాటు జరిగే ఈ పూజను భక్తులంతా వీక్షించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అనంతరం మధ్యాహ్నం మూడు గంటలకు స్వామీజీ విశాఖపట్నం బయల్దేరి వెడతారు. స్వామీజీని దర్శించేందుకు ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప రానున్నారు. శనివారం రాత్రి 11 గంటలు దాటాక ఆయన రత్నగిరి చేరుకుని బస చేస్తారు. ఆదివారం ఉదయం స్వామీజీతోపాటు వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారని అధికారులు తెలిపారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం కోసం దేవస్థానంలో నిర్వహిస్తున్న అతి రుద్ర మహాయాగంలో కూడా మంత్రి పాల్గొంటారు. -
రత్నగిరి..భక్తజన సిరి
సత్యదేవుని దర్శించిన 40 వేలమంది రూ.40 లక్షల ఆదాయం అన్నవరం : మూడు రోజుల విరామం అనంతరం రత్నగిరి మళ్లీ భక్తజనసంద్రంగా మారింది. సత్యదేవుని దర్శించేందు కు శనివారం సుమారు 40 వేల మంది భక్తులు తరలి రావడంతో రత్నగిరి కిక్కిరిసిపోయింది. స్వామివారిని దర్శిం చేందుకు భక్తులు ఉదయం నుంచీ క్యూ కట్టారు. వ్రతమండపాలు చాలకపోవడంతో స్వామివారి నిత్య కల్యాణ మం డపంలో ఉదయం ఏడు నుంచి పది గంటల వరకూ వ్రతా లు నిర్వహించారు. ఒక దశలో వ్రతాలాచరించే భక్తులు పెరగడంతో క్యూ కల్యాణ మండపం నుంచి రావిచెట్టు వరకూ పెరిగిపోయింది. సాయంత్రం 5 గంటల సమయానికి 4,710 వ్రతాలు జరిగాయి. వ్రతాలాచరించిన భక్తులు స్వామివారిని దర్శించి, గోకులంలో సప్తగో ప్రదక్షిణ చేసి, రావిచెట్టు వద్ద జ్యోతులు వెలిగించారు. సుమారు 5 వేలమంది భక్తులకు పులిహోర, దద్ధోజనం ఉచితంగా పంపిణీ చేశారు. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.40 లక్షల ఆదాయం సమకూరిందని అధికారులు తెలిపారు. ఆదివారం సెలవు కూడా కావడంతో సుమారు 50 వేలమంది భక్తులు స్వామి సన్నిధికి వస్తారని భావిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఆ మేరకు తెల్లవారుజాము నుంచీ వ్రతాల నిర్వహణ, దర్శనాలకు ఏర్పాట్లు చేస్తున్నారు. -
రత్నగిరిపై రాజకీయనీడ
సాక్షి ప్రతినిధి, కాకినాడ : రాజకీయ నాయకులు అన్నంత పనీ చేశారు. దైవసన్నిధిలో రాజకీయాలు చొప్పించి సత్యదేవుని ప్రతిష్టను బజారున పడేశారు. రాష్ట్రంలోనే కాదు.. దేశంలోనే వ్రతాలు నిర్వహించే పుణ్యక్షేత్రం ఒక్క అన్నవరం సత్యదేవుని సన్నిధి మాత్రమే. అమెరికాలో కూడా వ్రతాలు జరిపించుకున్న ఖ్యాతి కూడా ఆయనకే సొంతం. అటువంటి దేవుని ప్రతిష్టను అధికారపార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు తమ రాజకీయ స్వార్థం కోసం మసకబార్చారని భక్తులు ఆవేదన చెందుతున్నారు. ట్రస్టు బోర్డు సభ్యుల నియామకానికి సీఎం చంద్రబాబు గ్రీ¯ŒS సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో సెప్టెంబరు 30న ’అన్నవరానికి ధర్మకర్తల మండలి నియామకం’పై వార్తను ’సాక్షి’ ప్రచురించింది. పాలక మండలి నియామకం జరిగినా నేతల నిర్వాకంతో అది చాలా కాలం పెండింగ్లో పడింది. ఎట్టకేలకు ఏడాది తరువాత పాలకవర్గం ఏర్పాటవుతుందనుకుంటుండగా అధికార పార్టీ నేతల నిర్వాకంతో ట్రస్టుబోర్డు ఏర్పాటుకు విడుదల చేసిన జీఓ రద్దయింది. ట్రస్టుబోర్డులో సభ్యుల ప్రాతినిధ్యంపై టీడీపీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, ఎంపీ తోట నరసింహంల మధ్య వివాదం తలెత్తింది. ఎంపీ తోట ప్రతిపాదించిన వ్యక్తిని పక్కనబెట్టి జ్యోతుల ప్రతిపాదించిన వారికి స్థానం కల్పించడం, తుని నియోజకవర్గం నుంచి ఇద్దరికి ప్రాతినిధ్యం ఇవ్వడం, బీజేపీకి చెందిన దేవాదాయశాఖ మంత్రి మాణిక్యాలరావుకు తెలియకుండా జాబితా సీఎంకు వెళ్లడంతో ఆ అంశం టీడీపీలో రచ్చకెక్కింది. ఇదే విషయాన్ని ’సాక్షి’ గత నెల 26న ’సత్తెన్నకు తప్పని ’దేశం’ సతాయింపు’ శీర్షికన వెలుగులోకి తెచ్చింది. ఆశావహులకు నిరాశే.. ట్రస్టుబోర్డులో సభ్యత్వం ద్వారా పవిత్రమైన సత్యదేవుని సన్నిధిలో సేవ చేసే అవకాశం లభిస్తుందని చాలా మంది ఆశించారు. ఆ క్రమంలోనే 13 సభ్యత్వాలకు 500 మంది దరఖాస్తు చేసుకున్నారు. కానీ టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర నేతలు సిఫార్సు చేసిన వారికి మాత్రమే ప్రాతినిధ్యం దక్కింది. అందులో కూడా టీడీపీ ప్రజాప్రతినిధుల మధ్య అంతర్గత విభేదాలు తలెత్తడంతో రెండేళ్ల కాలపరిమితితో ఏర్పాౖటెన ట్రస్టుబోర్డు రద్దుకు దారితీసింది.కనీసం ఈ సారి విడుదలచేసే నోటిఫికేష¯ŒSలో అయినా వివాదాలకు తావులేకుండా నేతలు తమ స్వార్థాన్ని వీడాలని, నియామకంలో పారదర్శకతను పాటించి సత్యదేవుని ప్రతిష్టను కాపాడాలని భక్తులు కోరుతున్నారు. -
రేపు అన్నవరం రానున్న జయేంద్ర సరస్వతి
కంచి కామకోటి పీఠాధిపతి పర్యటనకు విస్తృత ఏర్పాట్లు 20న పంపా సత్రంలో శ్రీచంద్రమౌళీశ్వరస్వామి పూజ అన్నవరం : కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురు శ్రీజయేంద్ర సరస్వతి స్వామీజీ పర్యటనకు అన్నవరం దేవస్థానంలో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. నాలుగేళ్ల తరువాత స్వామీజీ ఈ నెల 19న సాయంత్రం అన్నవరం దేవస్థానానికి వస్తున్నారు. 20 వరకూ ఆయన అన్నవరంలోనే బస చేస్తారని ఈఓ నాగేశ్వరరావు గురువారం ‘సాక్షి’కి తెలిపారు. పోలవరం ప్రాజెక్ట్ ఏ అవాంతరాలు లేకుండా పూర్తి కావాలని కోరుతూ దేవస్థానంలో గత వారం రోజులుగా నిర్వహిస్తున్న అతిరుద్ర మహాయాగంలో కూడా ఆయన పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు దేవాదాయ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు కూడా 19న వస్తారన్నారు. స్వామీజీ పర్యటన గురించి అన్నవరం, చుట్టుపక్కల గ్రామాలలో ప్రచారం చేయిస్తున్నామని తెలిపారు. ఇదీ పర్యటన షెడ్యూల్ కంచి కామకోటి పీఠం ఉత్తరాధికారి జగద్గురు శంకర విజయేంద్ర సరస్వతి స్వామీజీ తో కలిసి రానున్న శ్రీజయేంద్ర సరస్వతి స్వామీజీకి 19న సాయంత్రం ఘాట్రోడ్ ముఖద్వారంలో ఘనస్వాగతం పలుకుతారు. అనంతరం స్వామీజీ సత్యదేవుని ఆలయానికి చేరుకుంటారు. స్వామివారిని దర్శించి పూజలు చేశ సత్యగిరి అతిథిగృహంలో బస చేస్తారు. 20న ఉదయం 9 నుంచి మ«ధ్యాహ్నం ఒంటిగంట వరకూ కొండదిగువన పంపా సత్రంలో శ్రీ మహా త్రిపురసుందరి సమేత శ్రీచంద్రమౌళీశ్వరస్వామి పూజ నిర్వహిస్తారు. పంపా సత్రంలో నిర్వహించే శ్రీచంద్రమౌళీశ్వరస్వామి పూజకు తటాకం లేదా ప్రవహించే కాల్వ లేదా భూమిలో నుంచి మోటార్ ద్వారా వచ్చే వంద బిందెల పరిశుద్ధ జలం అవసరం. పీఠాధిపతి బస చేసే పంపా సత్రం పక్కనే పంపా కాల్వ ప్రవహిస్తోంది. సత్రం ఈశాన్యభాగంలో బోర్ కూడా ఉంది. దీంతో పంపా సత్రంలో పూజ నిర్వహించాలన్న ఆయన అభిమతం మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఘాట్రోడ్ ముఖద్వారం, తొలిపావంచా, పంపా సత్రం వద్ద జయేంద్ర సరస్వతి చిత్రాలతో భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. -
కన్నులపండువగా తెప్పోత్సవం
పంపానదిలో హంసవాహనంపై సత్యదేవుని విహారం అన్నవరం: క్షీరాబ్ది ద్వాదశి పర్వదినం సందర్భంగా శుక్రవారం రాత్రి పంపానదిలో సత్యదేవుని తెప్పోత్సవం కన్నులపండువగా జరిగింది. వేలాదిగా విచ్చేసిన భక్తులు తిలకిస్తుండగా సత్యదేవుడు, అమ్మవార్లను హంసవాహనంపై మూడుసార్లు పంపానదిలో విహరింపజేశారు. మిరుమిట్లు గొలిపే దీపపు కాంతులు, బాణసంచా కాల్పుల మధ్య, పండితుల మంత్రోచ్ఛారణ మధ్య సాగిన ఈ తెప్పోత్సవం భక్తులకు నయనానందాన్ని మిగిల్చింది. ఊరేగింపుగా పంపా తీరానికి స్వామి, అమ్మవార్లు సాయంత్రం ఐదున్నర గంటలకు సత్యదేవుడు, అమ్మవార్లను, క్షేత్రపాలకులు సీతారాములను మేళతాళాలతో ఊరేగింపుగా రత్నగిరి నుంచి పంపానదీ తీరం వద్ద గల దేవస్థానం పవర్హౌస్ వద్దకు తీసుకువచ్చారు. అక్కడ ఏర్పాటు చేసిన వేదికపై ఉన్న ప్రత్యేక సింహాసనంపై స్వామి, అమ్మవార్లను, మరోపక్క సీతారాములను ఉంచి పండితులు తులసీధాత్రి, తదితర పూజలు చేశారు. వేదపండితులు చతుర్వేద స్వస్తి, సత్యదేవుడు, అమ్మవార్లకు వేదాశీస్సులు, నీరాజనమంత్రపుష్పాలు అందజేశారు. వేదపండితులు వైదిక కార్యక్రమాలు నిర్వహించారు. రాత్రి ఏడు గంటలకు మొదలైన తెప్పోత్సవం వేదికపై పూజలందుకున్న సత్యదేవుడు, అమ్మవార్లను రాత్రి ఏడు గంటలకు మేళతాళాల నడుమ ఊరేగింపుగా పంపానదిలోని హంసవాహనం మీదకు తీసుకువచ్చి అక్కడ గల ప్రత్యేక మందిరంలో ఉంచి పూజలు చేశారు. తరువాత పండితుల మంత్రోచ్ఛారణ మధ్య తెప్పోత్సవం ప్రారంభమైంది. హంసవాహనాన్ని పంపా నదిలో తూర్పు దిశగా ప్రయాణించి మూడు సార్లు ప్రదక్షణం చేసింది. ఈ సారి తెప్పపైకి కేవలం వైదిక సిబ్బంది, తెప్ప నడిపే సిబ్బందిని మాత్రమే అనుమతించారు. కారణమేంటో తెలియదు కానీ ఈ సారి తెప్పోత్సవానికి ప్రజాప్రతినిధులు, జిల్లా ఉన్నతాధికారులు హాజరుకాలేదు. తెప్పోత్సవం చివర్లో మాత్రం కాకినాడ ఎంపీ తోట నరసింహం వచ్చినా దర్శనం చేసుకుని వెళ్లిపోయారు. దేవస్థానం చైర్మ¯ŒS ఐవీ రోహిత్, ఈఓ కే నాగేశ్వరరావు, ఉత్సవాల ఏర్పాట్లు పర్యవేక్షించారు. సుమారు వందమంది పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాట్లు చేశారు. కార్యక్రమం అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. -
భక్తజన గిరి
కార్తిక ఏకాదశి సందర్భంగా కిటకిటలాడిన అన్నవరం సత్యదేవుని దర్శించిన 70 వేల మంది భక్తులు వ్రతాలు 7,400... ఆదాయం రూ.70 లక్షలు అన్నవరం : కార్తికమాసం శుద్ధ ఏకాదశి పర్వదినం సందర్భంగా గురువారం రత్నగిరి సత్యదేవుని ఆలయానికి భక్తులు పోటెత్తారు. సుమారు 70 వేలమంది భక్తులు స్వామివారిని దర్శించి పూజలు చేశారు. సత్యదేవుని దర్శనానికి బుధవారం రాత్రి నుంచే రత్నగిరికి భక్తులు తరలివచ్చారు. దేవస్థానం సత్రాల్లో గదులు బుధవారం సాయంత్రానికే భక్తులతో నిండిపోయాయి. గదులు దొరకని వారు ఆలయప్రాంగణంలోనే విశ్రమించారు. తెల్లవారు జాము నుంచి టికెట్ల విక్రయం.. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకున్న అధికారులు బుధవారం తెల్లవారుజామున రెండు గంటల నుంచి స్వామివారి వ్రతాల టికెట్లు విక్రయించారు. తెల్లవారుజామున మూడు గంటల నుంచి స్వామివారి వ్రతాల నిర్వహణ, నాలుగు గంటల నుంచి సత్యదేవుని దర్శనాలు ప్రారంభమయ్యాయి. ఉదయం ఎనిమిది గంటల సమయంలో భక్తులు కొద్దిగా తగ్గినట్టు అనిపించినా తొమ్మిది గంటల నుంచి మరలా రద్దీ ఏర్పడింది. భక్తుల రద్దీ కారణంగా పలు మార్లు స్వామివారి అంతరాలయ దర్శనం బయట నుంచే అమలు చేశారు. స్వామివారి సాధారణ దర్శనానికి గంట సమయం పట్టింది. ప్రత్యేక దర్శనానికి అరగంట సమయం పట్టింది. రూ.150 వ్రతాలను దేవస్థానం అధికారులు తాత్కాలికంగా నిలిపివేయడంతో భక్తులు రూ.300 వ్రతాలు ఆచరించారు. స్వామివారి వ్రతాలాచరించిన అనంతరం భక్తులు స్వామివారిని దర్శించి పూజలు చేశారు. అనంతరం గోశాలలో సప్తగోవులకు, రాజగోపురం ఎదురుగా గల రావిచెట్టుకు ప్రదక్షణం చేశారు. రూ.75 లక్షల ఆదాయం స్వామివారిని గురువారం 75వేల మంది భక్తులు దర్శించారు. సాయంత్రం నాలుగు గంటల సమయానికి స్వామివారి వ్రతాలు 7,400 జరిగాయి. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.75 లక్షల ఆదాయం సమకూరిందని అధికారులు తెలిపారు. ఐదు వేలమందికి పులిహోర, దద్దోజనం పంపిణీ దేవస్థానానికి విచ్చేసిన భక్తులకు ఉదయం తొమ్మిది గంటల నుంచి మ«ధ్యాహ్నం మూడు గంటల వరకూ పులిహోర, దద్దోజనం పంపిణీ చేశారు. -
సత్యదేవుని దర్శించిన దక్షిణ మధ్య రైల్వే డీఆర్ఎం
అన్నవరం : దక్షిణ మధ్య రైల్వే డీఆర్ఎం అశోక్కుమార్ దంపతులు బుధవారం సాయంత్రం రత్నగిరిపై సత్యదేవుని దర్శించి పూజలు చేశారు. ఆలయం వద్ద వారికి పండితులు ఘనస్వాగతం పలికారు. స్వామి దర్శనం తర్వాత వేదపండితులు ఆశీర్విదించి, ప్రసాదాలను అందజేఆరు. ఎక్స్ప్రెస్లకు హాల్ట్ కల్పించండి... డీఆర్ఎం అశోక్కుమార్ను దేవస్థానం ఈఓ మర్యాదపూర్వకంగా కలిశారు. సత్యదేవుని ఆలయానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం అన్నవరం రైల్వేస్టేషన్లో గరీబ్ రధ్, కోణార్క్, లోకమాన్యతిలక్ సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్లకు అన్నవరం రైల్వేస్టేషన్ హాల్ట్ కల్పించాలని కోరారు. అదేవిధంగా మూడో నెంబర్ ఫ్లాట్ఫాం పక్కన గల ఖాళీ స్థలంలో దేవస్థానం నిధులతో షెడ్డు నిర్మిస్తామని, అందులో ఆటోమే టిక్ టిక్కెట్ వెండింగ్ మిషన్ను ఏర్పాటు చేయాలని కోరారు. దీనికి డీఆర్ఎం అంగీకరించారు. సమయంలేక.. అన్నవరం రైల్వేస్టేషన్ను బుధవారం మధ్యాహ్నం డీఆర్ఎం తనిఖీ చేయాల్సి ఉంది. అయితే ఆయన సాయంత్రం ఆరు గంటలకు అన్నవరం దేవస్థానానికి చేరుకున్నారు. సత్యదేవుని దర్శనం అయ్యే సరికే ఆరున్నర గంటలు అయింది. దీంతో సమయం లేక రైల్వేస్టేషన్ను పరిశీలించకుండానే విజయవాడ బయలుదేరి వెళ్లిపోయారు. ఆయన వెంట సీనియర్ డీసీఎం సిఫాలీ, స్టేషన్ టీటీఈ కిరణ్ తదితరులున్నారు. -
అన్నవరం భక్త జన సంద్రం
కిటకిటలాడిన వ్రత మండపాలు స్వామివారిని దర్శించుకున్న 25 వేల మంది అన్నవరం : సత్యదేవుని ఆలయం శనివారం వేలాదిగా తరలి వచ్చిన భక్తులతో కిటకిటలాడింది. కార్తీకమాసంలో వచ్చిన తొలి శనివారం, పంచమి తాత్కాల షష్ఠి పర్వదినం సందర్భంగా తెల్లవారుజాము నుంచి భక్తులు సత్యదేవుని దర్శనానికి పోటెత్తారు. సాయంత్రం వరకూ ఈ రద్దీ కొనసాగింది. స్వామి వారి వ్రత మండపాలన్నీ భక్తులతో నిండిపోయాయి. అనంతరం గోశాలలో సప్త గోవులకు, రాజగోపురం ఎదురుగా ఉన్న రావిచెట్టుకు ప్రదక్షణలు చేశారు. స్వామి వారిని 25 వేల మంది భక్తులు దర్శించుకున్నారు. 2,656 వ్రతాలు జరి గాయి. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.25 లక్షలు ఆదాయం సమకూరిందని అధికారులు తెలిపారు. సత్యదేవుని సన్నిధిలో ఆకాశదీపం కార్తీక మాసం సందర్భంగా ఐదు రోజులుగా సత్యదేవుని సన్నిధిలో ఆకాశదీపం పెడుతున్నారు. ప్రతీరోజూ సాయంత్రం ఆరు గంటలకు అనివేటి మండపంలోని ధ్వజస్తంభం వద్ద స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆకాశ దీపానికి పూజలు చేసి గర్భాలయంలోని స్వామివారికి అభిముఖంగా ఆ దీపాన్ని వేలాడదీస్తున్నారు. ఈ కార్యక్రమంలో రూ.10 చెల్లించి భక్తులు కూడా పాల్గొనవచ్చునని అధికారులు తెలిపారు. -
సత్యగిరి ప్రదక్షిణకు కొత్త రహదారి
అన్నవరం : కార్తికమాసం పౌర్ణమి పర్వదినం ఈ నెల 14న అన్నవరంలో సత్యగిరి ప్రదక్షిణ చేసే భక్తుల సౌకర్యార్థం కొత్త రహదారిని సిద్ధం చేశారు. సత్యదేవుడు, అమ్మవార్లను రత్నగిరి, సత్యగిరి కొండల చుట్టూ భక్తులు సుమారు 12 కిలోమీటర్లు ప్రదక్షిణ చేస్తుంటారు. గతేడాది నిర్వహించిన గిరి ప్రదక్షిణకు సుమారు ఐదు వేల మంది భక్తులు హాజరయ్యారు. ఈ ఏడాది కార్తీక పౌర్ణమి.. సోమవారం రావడంతో అధిక సంఖ్యలో భక్తులు ఈ గిరి ప్రదక్షిణకు వస్తారన్న అంచనాతో దేవస్థానం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం కొత్త రహదారిని నిర్మించారు. ఇంతవరకూ ఈ ప్రదక్షిణ సత్యగిరి కొండల వెనక పంపా నదీ గర్భం నుంచి సాగేది. అయితే ఈ సారి పంపా నదిలో నిండుగా నీరు ఉండడంతో నదికి ఎగువ ఉన్న మామిడి తోట నుంచి ఉండేలా రహదారిని నిర్మించారు. ఈసారి గిరి ప్రదక్షిణకు ఒక కిలోమీటర్ తగ్గిందని ఇంజనీరింగ్ అధికారులు తెలిపారు. ఈ రోడ్డు పనులను దేవస్థానం చైర్మ¯ŒS రాజా ఐవీ రోహిత్, ఈఓ కె.నాగేశ్వరరావు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారని డీఈ రామకృష్ణ మంగళవారం ‘సాక్షి’కి తెలిపారు. ఈ రహదారిని చదును చేసే పనులు రెండు మూడు రోజుల్లో పూర్తవుతాయని తెలిపారు. ఆ రోడ్డు మధ్యలో పొలాలు, తోటలు ఉన్న రైతులు కూడా సహకరిస్తున్నారని తెలిపారు. -
రత్నగిరిపై వాహనాలకు ‘వన్ వే’
అన్నవరం : కార్తీక మాసంలో సత్యదేవుని ఆలయానికి వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దేవస్థానంలో వాహనాల రాకపోకలకు వన్వే ఏర్పాటు చేశారు. రత్నగిరికి చేరుకునేందుకు, కొండ దిగువకు వచ్చేందుకు వేర్వేరుగా రెండు ఘాట్రోడ్లు ఉన్నాయి. తాజాగా రత్నగిరిపై కూడా వన్వే అమలు చేస్తున్నట్టు దేవస్థానం ఈఓ కె.నాగేశ్వరరావు సోమవారం విలేకరులకు తెలిపారు. ఆలయానికి వెళ్లే వాహనాలను ప్రకాష్ సదన్ సత్రం వెనుక రోడ్డు ద్వారా సీఆర్ఓ కార్యాలయం వద్దకు మళ్లిస్తారు. కాగా స్వామివారి ప్రత్యేక దర్శనం (రూ.100) టిక్కెట్లను మంగళవారం నుంచి ఆన్లైన్కు అనుసంధానం చేస్తున్నారు. భక్తులకు ప్రత్యేక దర్శనం టిక్కెట్లు ఇచ్చేందుకు తూర్పు రాజగోపురం, పశ్చిమ రాజగోపురం , ప్రధానాలయం వద్ద మూడు కౌంటర్లలో ఈ సదుపాయం మంగళవారం నుంచి వినియోగంలోకి వస్తుంది. ఎంతమంది భక్తులు ప్రత్యేకదర్శనం టిక్కెట్లు కొనుగోలు చేశారో ఆన్లైన్ ద్వారా తెలుసుకునే వీలుంటుంది. -
సత్యదేవుని నిత్యాన్నదానానికి రూ.లక్ష విరాళం
అన్నవరం : సత్యదేవుని నిత్యాన్నదాన పథకానికి కాకినాడ రూరల్ మండలం రాయుడు పాలెం గ్రామానికి చెందిన ఆకుల రామచంద్రరావు రూ.లక్ష విరాళాన్ని దేవస్థానం ఈఓ కె.నాగేశ్వరరావుకు సోమవారం అందజేశారు. ఈ మొత్తంపై వచ్చే వడ్డీతో ఏటా ముక్కోటి ఏకాదశి నాడు ఆకుల రామన్న, సూరేకాంతం, న ర్సింహరావు, కృష్ణకుమారి పేర్ల మీదుగా భక్తులకు అన్నదానం చేయమని కోరినట్టు అధికారులు తెలిపారు. దేవాదాయశాఖ డీసీగా రమేష్బాబు బోట్క్లబ్(కాకినాడ) : దేవాదాయశాఖ డీసీగా(ఎఫ్ఏసీ) రాజమండ్రి ఎసీ డీఎల్వీ రమేష్బాబును నియమిస్తూ దేవాదాయశాఖ కమిషనర్ అనురాధ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. డీసీగా పని చేసిన చందు హనుమంతరావు పదవీ విరమణ చేయడంతో ఆయన స్థానంలో రమేష్బాబును నియమించారు. రమేష్బాబు మంగళవారం బాధ్యతలు స్వీకరించనున్నట్టు తెలిసింది. -
సత్యదేవుని హుండీలో పది నోట్లే ఎక్కువ
అన్నవరం : దేవస్థానంలో శుక్రవారం హుండీలు లెక్కించగా వచ్చిన ఆదాయంలో రూ.పది నోట్లు 1,62,827 ఉన్నాయి. హుండీల్లో వచ్చిన వివిధ డినామినేష¯ŒS గల కరెన్సీ నోట్ల వివరాలను దేవస్థానం అధికారులు శుక్రవారం సాయంత్రం తెలిపారు. వాటిలో రూ.వేయ్యి నోట్లు 1,189, రూ.500 నోట్లు 3,279, రూ.వంద నోట్లు 27,279, రూ.50 నోట్లు 11,765, రూ.ఐదు నోట్లు 2,364, రూ.రెండు నోట్లు ఏడు, 36 రూపాయి నోట్లు వచ్చాయి. వీటి విలువ రూ.80,65,930 కాగా, చిల్లర నాణెల విలువ 4,15,771. మొత్తం హుండీ ఆదాయం రూ.84,81,701. దేవస్థానంలో మొత్తం 54 హుండీలు ఉన్నాయి. ఈ హుండీల వారీగా కూడా ఎంత ఆదాయం వచ్చిందో అధికారులు విశ్లేషించారు. గత నెలకు ఈ నెలకు ఏ హుండీ ద్వారా ఆదాయం పెరిగిందో, అదే విధంగా ఆదాయం తగ్గిన హుండీలు అందుకు తగిన కారణాలపై కూడా విశ్లేషణ ప్రారంభించారు. అయితే ఆ వివరాలు గోప్యంగా ఉంచారు. సత్యదేవుని హుండీలో వెండి డాలర్లు అన్నవరం : భక్తులు సమర్పించిన పలు కార్పొరేట్ సంస్థలు ముద్రించిన వెండి డాలర్లు సత్యదేవుని హుండీలో లభించాయి. అక్టోబర్ నెలకు సంబంధించి సత్యదేవుని హుండీలను శుక్రవారం తెరిచి లెక్కించగా రూ.84,81,701 ఆదాయం లభించింది. దీంతోపాటు సాగర్ లూబ్రికంట్స్ సంస్థ ముద్రించిన పది గ్రాముల వెండి డాలర్లు నాలుగు, ఏజీఐపీ సంస్థ ముద్రించిన 15 గ్రాముల బరువు కలిగిన వెండి డాలర్లు మూడు, హోండా సంస్థ ముద్రించిన పది గ్రాముల వెండి డాలర్ హుండీల్లో లభించాయి. వీటితోపాటు సుమారు వంద గ్రాముల బరువు కలిగిన వెండి కిరీటం కూడా ఉంది. తిరుమల హుండీలాగే.. తిరుమలలో వేంకటేశ్వరస్వామి ఆలయంలోని ప్రధానాలయం హుండీ మాదిరి గానే సత్యదేవుని ఆలయంలో కూడా హుండీకి గుడ్డ కట్టి ఆకర్షణీయంగా రూపొందించాలని అధికారులు నిర్ణయించారు. ప్రస్తుతం ఆ హుండీకి రంగువస్రా్తలతో తయారు చేసిన కవర్ను తొడిగారు. హుండీ పైభాగంలో కూడా వస్రా్తన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. -
‘ఘీ’చులాట
నెయ్యి సరఫరా చేయలేమని చేతులెత్తేసిన ఏపీ డెయిరీ కిలో రూ.400 చొప్పున ‘సంగం’ నుంచి కొనుగోలుకు నిర్ణయం అన్నవరం : కార్తీక మాసంలో వచ్చే భక్తుల కోసం విస్తృత ఏర్పాట్లు చేస్తున్న అన్నవరం దేవస్థానం అధికారులకు షాక్ తగిలింది. స్వామివారి ప్రసాదం తయారీలో ఉపయోగించే నెయ్యి(ఘీ)ని సరఫరా చేస్తున్న ఏపీ డెయిరీ అధికారులు ఇకపై నెయ్యి సరఫరా చేయలేమని లేఖ పంపించారు. ప్రతి నెలా సుమారు 12 టన్నుల నెయ్యి ప్రసాదం విభాగంలో వాడుతుండగా కార్తీకమాసంలో ఏకంగా 20 టన్నులకు పైగా నెయ్యి అవసరం. ఇంత పెద్ద మొత్తంలో నెయ్యిని ఎక్కడ కొనుగోలు చేయాలోనని అధికారులు డైలమాలో పడ్డారు. దానికితోడు శుక్రవారం తయారు చేసే ప్రసాదానికి అవసరమయ్యే 400 కేజీల నెయ్యి కూడా దేవస్థానంలో లేని పరిస్థితి. దీంతో అధికారులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. గతంలో రెండు నెలలపాటు నెయ్యి సరఫరా చేసిన సంగం డెయిరీ మళ్లీ నెయ్యి సరఫరా చేయాలని కోరగా సంబంధిత యాజమాన్యం ఆమోదం తెలపడంతో ఊపిరి పీల్చుకున్నారు. అంతే కాదు గురువారం ఒక్కో టిన్ను 15 కేజీల బరువు కలిగిన 350 టిన్నులు నెయ్యిని పంపించడంతో శుక్రవారం ప్రసాదం తయారీకి ఇబ్బంది లేకుండా పోయింది. అయితే రేటు మాత్రం కేజీ నెయ్యికి రూ.26 అదనంగా చెల్లించాల్సి ఉంది. ఆ మేరకు దేవస్థానంపై భారం పడనుంది. దేవస్థానానికి అదనపు భారం: ప్రస్తుతం కేజీ నెయ్యి రూ.374కి కొనుగోలు చేస్తుండగా సంగం డెయిరీ నెయ్యి కేజీ రూ.400. దీంతో కేజీకి రూ.26 అదనపు భారం పడనుంది. నెలకు సుమారు 20 టన్నుల నెయ్యి కొనుగోలు చేస్తారనుకుంటే రూ.5.20లక్షలు అదనపు భారం పడనుంది. అయితే బహిరంగ మార్కెటలో ఇతర మిల్క్ సొసైటీల నెయ్యి రేటు కిలో రూ.420 నుంచి రూ.440 వరకూ ఉందని అధికారులు తెలిపారు. దీంతో పోలిస్తే ఇది తక్కువేనని వివరించారు. ఏపీ డెయిరీ సరఫరా చేయనందునే.. ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ డెయిరీ నుంచే ఇప్పటి వరకూ నెయ్యి కొనుగోలు చేశాం. వారు హఠాత్తుగా సరఫరా చేయలేమని చెప్పడంతో సంగం డెయిరీ నుంచి నెయ్యి కొనుగోలు చేయడానికి నిర్ణయించాం సంగం డెయిరీ విజయవాడ, ద్వారకా తిరుమల దేవస్థానాలకు కేజీ నెయ్యి రూ.400కి సరఫరా చేస్తోందని, అదే రేటు చెల్లించాలని వారు కోరగా అంగీకరించాం – ఈఓ నాగేశ్వరరావు -
దేవస్థానానికి చేరిన 673 కేజీల వెండి
52 అచ్చులగా మార్పు ‘ఈ ఆక్షన్ ద్వారా విక్రయించే ఆలోచన : ఈఓ అన్నవరం : హైదరాబాద్లోని కేంద్ర ప్రభుత్వ మింట్లో శుద్ధి చేసిన సత్యదేవునికి చెందిన 673 కిలోల వెండి అన్నవరం దేవస్థానానికి బుధవారం తెల్లవారుజామున చేరింది. భక్తులు సత్యదేవునికి వివిధ రూపాలలో సమర్పించిన వెండి కానుకలలో 683 కేజీల పాత వెండి ఆభరణాలు, వస్తువులను గత జూ¯ŒSలో దేవస్థానం హైదరాబాద్లోని మింట్కు తరలించిన విషయం విధితమే. అక్కడ వాటిని కరిగించి శుద్ధమైన వెండి అచ్చులుగా మార్చారు. ఒక్కో అచ్చు సుమారు 13 కిలోల బరువుతో 52 అచ్చుల రూపంలో ఈ వెండిని మింట్లో రూపొందించారు. వీటి విలువ సుమారు రూ.మూడు కోట్లు పైగానే ఉంటుందని అంచనా. ఈ వెండి అచ్చులను అన్నవరం దేవస్థానం అధికారుల బృందం ప్రత్యేక బందోబస్తుతో బుధవారం తెల్లవారుజామున దేవస్థానానికి చేర్చిన వెంటనే లాకర్లో భద్రపరచి సాయంత్రం వాటి వివరాలను వెల్లడించారు. గోల్డ్బాండ్లలో డిపాజిట్ : ఈఓ ఈ వెండి అచ్చులను ‘ఈ ఆక్షన్’ ద్వారా విక్రయించి వచ్చిన నగదుతో బంగారం కొనుగోలు చేసి దానిని గోల్డ్బాండ్లలో డిపాజిట్ చేయాలని ఆలోచిస్తున్నట్లు ఈఓ కె.నాగేశ్వరరావు చెప్పారు. సత్యదేవుని డాలర్లు : కాగా, దేవస్థానానికి గతంలో ఒక దాత పది కిలోల వెండిని సమర్పించగా దానితో సత్యదేవుని వెండి డాలర్లు రూపొందించి భక్తులకు విక్రయించేం దుకు అధికారులు ఆలోచిస్తున్నారు. ఈ వెండి డాలర్లు తయారు చేసే విషయాన్ని ఇప్పటికే దేవాదాయశాఖ కమిషనర్ వైవీ అనూరాధ దృష్టికి తీసుకువెళ్లగా ఆమె సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. దీనిపై లిఖిత పూర్వకంగా ఆదేశాలు తీసుకుని డాలర్లు తయారు చేయించాలని అధికారులు భావిస్తున్నారు. -
దేవస్థానం సత్రాల లీజుకు వేలంపాట
అన్నవరం : అన్నవరం దేవస్థానానికి కొండ దిగువన పాత బస్టాండ్ సమీపంలో గల పంపా సత్రం (పంపా ఎమినిటీస్ సెంటర్), కిర్లంపూడి, శంఖవరం గ్రామాల్లోనిS సత్యదేవ కల్యాణ మండపాలను ప్రవేట్ వ్యక్తులకు లీజుకు ఇచ్చేందుకు దేవస్థానం అధికారులు బుధవారం సాయంత్రం టెండర్ కం వేలం నిర్వహించి ఖరారు చేశారు. పంపా సత్రం మూడేళ్లకు లీజు : అన్నవరంలోని పంపా సత్రాన్ని ఏటా పదిశాతం పెంపు పద్ధతిన మూడేళ్ల పాటు లీజు కిచ్చేందుకు బుధవారం సాయంత్రం టెండర్ కం బహిరంగ వేలం నిర్వహించారు. ఇందులో మొదటి ఏడాదికి రూ.7.05 లక్షలు, రెండో ఏడాది పదిశాతం పెంచి చెల్లించేందుకు, రెండో ఏడాది లీజు మొత్తంపై మూడో ఏడాది పది శాతం చెల్లించేందుకు పాట ఖరారైంది. అలాగే శంఖవరం, కిర్లంపూడి గ్రామాల్లో దేవస్థానం 1999–2000 సంవత్సరాల మధ్య రూ. మూడు కోట్ల వ్యయంతో నిర్మించిన రెండు కల్యాణ మండపాలకు లీజు కిచ్చేందుకు వేలం నిర్వహించారు. కిర్లంపూడి కల్యాణ మండపం ఏడాదికి రూ.2.55 లక్షలు, శంఖవరం కల్యాణ మండపం ఏడాదికి రూ.32 వేలుకు లీజు ఖరారైంది. పాట నిర్వహణలో దేవస్థానం ఏసీ ఈరంకి జగన్నాథరావు, ఏఈఓ లు ఎంకేటిఎన్వి ప్రసాద్, శ్రీనివాస్, నటరాజ్, సూపరిండెంట్ లక్ష్మణస్వామి పాల్గొన్నారు. -
గిరిపై దీక్షాధారి
ఘనంగా సత్యదీక్షలు ప్రారంభం జిల్లా వ్యాప్తంగా 1200 మంది దీక్ష ఒక్క ఏజెన్సీ ప్రాంతంలోనే 500 మంది దేవస్థానంలో సత్య స్వాములను పట్టించుకోవడం లేదని విమర్శలు అన్నవరం : సత్యదేవుని జన్మనక్షత్రం మఖ సందర్భంగా మంగళవారం తెల్లవారుజామున స్వామివారి సన్నిధిలో సత్యదీక్షలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఏటా కార్తీకమాసం ప్రారంభానికి ముందు వచ్చే స్వామివారి జన్మనక్షత్రం నుంచి కార్తీకమాసంలో వచ్చే జన్మనక్షత్రం వరకూ 27 రోజుల పాటు సత్యదీక్షలను అన్నవరం దేవస్థానంలో అధికారికంగా నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది ఈ దీక్షలను జిల్లావ్యాప్తంగా సుమారు 1200 మందికి పైగా భక్తులు స్వీకరించారు. అన్నవరం, చుట్టుపక్కల గ్రామాలకు చెందిన 350 మంది భక్తులు పసుపు వస్రా్తలు ధరించి ‘నమో సత్యదేవాయ నమః’ అనే మంత్రాన్ని జపిస్తూ ఆలయ ప్రధానార్చకులు గాడేపల్లి వేంకట్రావు చేతుల మీదుగా స్వామివారి సన్నిధిలో సత్యదీక్ష మాలలు ధరించారు. అదే సమయంలో కొండదిగువన గల వినాయకుని ఆలయం, కనకదుర్గ ఆలయాల్లోనూ మరో 200 మంది వరకు భక్తులు మాలలు ధరించి ఈ దీక్షలు స్వీకరించారు. ఏజెన్సీ ప్రాంతంలో.. జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో పవనగిరి గ్రూప్ ఆఫ్ టెంపుల్స్, అడ్డతీగల ఆధ్వర్యంలో మరో 500 మంది గిరిజనులు ఈ దీక్షలు చేపట్టినట్టు దేవస్థానం అధికారులు తెలిపారు. ఈసారి విజయవాడ, తెనాలి ప్రాంతాల భక్తులు కూడా ఈ దీక్షలు చేపట్టారు. ఉదయం పది గంటలకు రామరాయ కళావేదికలో సత్యజ్యోతి వెలిగించి పండితులు పూజలు చేశారు. అనంతరం సత్యదీక్షా స్వాములు భజనలు చేశారు. సత్యదీక్ష స్వాములకు తగిన ఏర్పాట్లు చేయకపోవడంపై భక్తుల అసంతృప్తి సత్యదీక్ష స్వాములకు దేవస్థానంలో తగిన ఏర్పాట్లు చేయకపోవడంపై పలువురు స్వాములు అసంతృప్తి వ్యక్తం చేశారు. గతంలో సత్యనికేత¯ŒS సత్రంలో సత్యస్వాములు పీఠం పెట్టుకునేందుకు గదులు ఉచితంగా ఇచ్చేవారు. ఈసారి అలా ఇవ్వలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అదే విధంగా అన్నదాన పథకం భోజనం విషయంలో స్వాములకు ప్రాధాన్యం ఇవ్వాలని వారు కోరుతున్నారు. -
సత్తెన్నకూ తప్పని ‘దేశం’ సతాయింపు
కొండెక్కి కలబడుతున్న తమ్ముళ్లు అన్నవరం ట్రస్టు బోర్డుకు బ్రేకులు జీవోను నిలుపుదల చేసిన దేవాదాయ శాఖ సత్యదేవుని సన్నిధిలోనే నలుగు నేతల రాజకీయ పేచీలు... ట్రస్ట్ బోర్డు నియామకం జరిగి ఆమోద ముద్రపడినా జీఓ విడుదల కాని వైనం. తాము ప్రతిపాదించినవారి పేర్లు కాకుండా పెత్తనం చెలాయించే పెద్దల సిఫార్సులకు పెద్దపీట వేస్తారా అని మిగిలిన వర్గాలు మండిపడడంతో దేవాదాయ శాఖా మంత్రి మాణిక్యాల రావు ఏకంగా జీఓను అడ్డుకోవడంతో విభేదాలు రసకందాయంలో పడ్డాయి. దీంతో నేతల మధ్యనే కాదు బోర్డు సభ్యుల మధ్య కూడా అభిప్రాయభేదాలు తలెత్తుతున్నాయి. సాక్షి ప్రతినిధి, కాకినాడ : తెలుగు దేశం పార్టీ విబేధాలు అన్నవరం సత్తెన్నను కూడా సతాయిస్తున్నాయి. ఆ‡ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు సత్యదేవుని సాక్షిగా కొండెక్కి మరీ కలబడుతున్నారు. నేతల కొట్లాటల పుణ్యాన ట్రస్టుబోర్డు నియామకానికి బ్రేక్ పడింది. బోర్డుకు సీఎం చంద్రబాబు గ్రీ¯ŒSసిగ్నల్ ఇచ్చినా దేవాదాయశాఖ నుంచి జీఓ విడుదల నిలిచిపోయింది. మంత్రి మాణిక్యాలరావు ప్రమేయం లేకుండా టీడీపీ నేతలు ట్రస్టుబోర్డు ప్రతిపాదనలు పంపడంపై మొదలైన వివాదం కాకినాడ ఎంపీ తోట నరసింహం, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మధ్య చిచ్చురేపింది. మధ్యలో ఆర్థికమంత్రి యనమల సొంత నియోజకవర్గం తునిలో ఇద్దరికి అవకాశం ఇవ్వడం కూడా తోడవ్డంతో ట్రస్టుబోర్డు వివాదం ముదిరి పాకాన పడింది. ముద్రపడినా పితలాటకాలే.. రాష్ట్రంలో నామినేటెడ్ పోస్టుల నియామకానికి గత నెల 29న సీఎం ఆమోద ముద్రవేశారు.అందులో అన్నవరం సత్యదేవుని పాలకవర్గాన్ని 13 మంది సభ్యులతో గ్రీ¯ŒS సిగ్నల్ ఇచ్చారు.ట్రస్టుబోర్డు జాబితా కాకినాడ ఎంపీ తోట నరసింహం, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మధ్య వివాదం భగ్గుమనేలా చేసింది. జగ్గంపేట నియోజకవర్గానికే చెందిన వీరిద్దరి మధ్య రాజకీయంగా పచ్చగడ్డి వేయకుండా భగ్గుమనే పరిస్థితి. వీరిద్దరూ వేర్వేరు పార్టీల నుంచి ప్రాతినిధ్యం వహించే వారు. ఇటీవల నెహ్రూ టీడీపీకి తిరిగి రావడంతో సహజంగానే జగ్గంపేటలో ఎప్పటి నుంచో వీరి మధ్య ఉన్న వైరం కాస్తా ఆధిపత్య పోరుగా మారింది. ట్రస్టు బోర్డు సభ్యుడిగా ఎంపీ తన అనుచరుడైన కిర్లంపూడి మండలం తామరాడకు చెందిన తోట అయ్యన్న, ఎమ్మెల్యే నెహ్రూ తన అనుచరుడైన కొత్త వెంకటేశ్వరరావును ప్రతిపాదించారు. వీరిద్దరిలో తోట ప్రతిపాదించిన అయ్యన్న పేరు సీఎంకు వెళ్లిన జాబితాలో గల్లంతై నెహ్రూ ప్రతిపాదించిన వెంకటేశ్వరరావు పేరు జాబితాలో ఉంది. పార్టీలోకి వచ్చీరాగానే నెహ్రూ ప్రతిపాదించిన పేరును ఎలా పరిగణనలోకి తీసుకుంటారని ఎంపీ తోట నరసింహావతారమెత్తి కత్తులు నూరుతున్నారు. కనీసం ట్రస్టుబోర్డు సభ్యుడిని కూడా నియమించుకోలేని తోటకు పార్టీలో పరపతి ఎక్కడుందని అతని వర్గీయులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వీరిద్ధరి ఆధిపత్య పోరుకు తాజాగా అన్నవరం ట్రస్టు బోర్డు మరింత అగ్గిని రాజేసింది. ఈ విషయంలో రాజీ పడిపోతే మరో రెండేళ్లు∙ ప్రతి దానికి వెనకడుగు వేయాల్సి వస్తోందని అనుచరుల సూచనలతో ఎంపీ తోట తాడోపేడో తేల్చుకుంటామంటున్నారు. తోట ఈ విషయంపై దేవాదాయశాఖ మంత్రి మాణిక్యాలరావు దృష్టికి తీసుకువెళ్లారని అనుచరులు చెబుతున్నారు. తోట వెర్సెస్ నెహ్రూ వ్యవహారం ఇలా కొనసాగుతుండగా మధ్యలో ఆర్థిక మంత్రి యనమల, ఈయన సోదరుడు కృష్ణుడు ప్రతిపాదించిన ఇద్దరిననీ నియమించడం టీడీపీలో చిచ్చు రేపింది. తుని నియోజకవర్గం నుంచి ఎడ్ల బేతాళుడు, యనమల రాజేష్కు అవకాశమిచ్చారు. గతంలో ఎప్పుడూ లేనిది ఇద్దరికి అవకాశం ఇవ్వడంలో ఆంతర్యమేమిటని పార్టీ సీనియర్లు తీవ్ర అసహనంతో ఉన్నారు. స్వయానా ఆర్థిక మంత్రి సిఫార్సుతో సోదరుడి కుమారుడు రాజేష్కు, కృష్ణుడు సిఫార్సుతో బేతాళుడుని ట్రస్టు బోర్డులోకి తీసుకున్నారు. తుని నుంచి ఇద్దరికి అవకాశం ఇవ్వడంపై పార్టీలో రసవత్తరమైన చర్చ సాగుతోంది. తునిలో అన్నదమ్ములిద్దరు రెండు పదవులు పంచేసుకుంటారా అని నేతలు ప్రశ్నిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు తిరస్కరించినందుకు రెండు పోస్టులు ఇచ్చారా అని తమ్ముళ్లు మధ్య ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ఇచ్చిన ఒక పేరు చెత్తబుట్టలో పడేసి ఎందుకు ప్రాధాన్యతనిచ్చారని ఎంపీ తోట వర్గీయులు ఆగ్రహంతో మంత్రి మాణిక్యాలరావు దృష్టికి తీసుకువెళ్లినట్టు సమాచారం. తనకు తెలియకుండా జాబితా తయారుచేశారని టీడీపీ నేతలపై అసహనంతో ఉన్న మంత్రి మాణిక్యాలరావు జీఓ విడుదలకు సానుకూలంగా లేరని కమలనాధులు చెబుతున్నారు. అన్నవరం కొండపై గత పెళ్లిళ్ల సీజ¯ŒSలో అశ్లీల నృత్యాలు, మందు బాటిళ్లతో క్యాబరేను తలపించిన రీతిలో అసాంఘిక కార్యకలాపాలకు తెరవెనుక సహాయ సహాకారాలు అందించిన ఒక నేతను ట్రస్టుబోర్డులోకి తీసుకోవడం కూడా మంత్రి దృష్టికి వెళ్లినట్టు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. -
సత్తెన్నా.. సత్రానికి చేరేదెలా?
హరిహర సదన్ సత్రం సత్యగిరిపైన... గదులిచ్చే కార్యాలయం రత్నగిరిపైన.. రెండు గిరుల మధ్య దూరం 1.5 కిలోమీటర్లు దేవస్థాన వాహనం లేక ఇబ్బందులు బస చేసే భక్తులకు తప్పని ఇబ్బందులు అన్నవరం దేవస్థానం సత్రాల్లో ఉండాలనుకునే భక్తులకు చుక్కలు కనిపిస్తున్నాయి. రత్నగిరిపై ఉండేవారు సరే ... సత్యగిరిపై ఉండేవారు మాత్రం అష్టకష్టాలు పడుతున్నారు. సంబంధిత అధికారులకు ఈ ఇబ్బందులు తెలిసినా పట్టించుకోకపోవడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అన్నవరం : సత్రాలు ఓ వైపు ... ఈ సత్రాలకు రశీదులు ఇచ్చే కార్యాలయం మరో వైపు ... ఈ రెండింటికీ దూరం ఒకటిన్నర కిలోమీటరు. దీంతో భక్తులు ఇబ్బందులు తారాస్థాయికి చేరుకుం టున్నాయి. అన్నవరం దేవస్థానంలో సత్యగిరిపై నిర్మిం చిన హరిహర సత్రం ఉంది. ఈ సత్రంలో బస చేయాలంటే రత్నగిరిపైనున్న గదుల రిజర్వేషన్ కార్యాలయంS(సీఆర్ఓ ఆఫీసు)కు వెళ్లి రుసుం చెల్లించి రశీదు పొందాలి. ఆ రశీదు కోసం 1.5 కిలోమీటరు దూరం వెళ్లాల్సిందే. ఆటోల్లో వెళ్దామన్నా అందుబాటులో లేని పరిస్థితి. రూ.20 కోట్లతో నిర్మించిన సత్రం... అన్నవరం దేవస్థానంలోని రత్నగిరిపై గల ఆరు సత్రాల్లో దాదాపు 350 గదులున్నాయి. సత్యగిరిపై ఉన్న హరిహర సదన్ను రూ.20 కోట్ల వ్యయంతో 135 గదులతో (వీటిలో 84 గదులు ఏసీ)... అధునాతన హంగులతో ... ఐదు అంతస్తుల్లో , రెండు లిఫ్ట్లతో నిర్మించారు. ఈ సత్రంలో నాన్ ఏసీ గది అద్దె రూ.600 కాగా, ఏసీ గది రూ.950. సత్రంలో గదులన్నీ నిండితే రోజుకి రూ.1.10 లక్షలు ఆదాయం వస్తుంది. ఈ సత్రానికి చేరుకోవడానికి దేవస్థానం బస్సులు కానీ, మరే ఇతర వాహనాల సదుపాయం లేదు. దీంతో సొంత వాహనాలు లేని భక్తులు ప్రయివేట్ వాహనాలను ఆశ్రయించాల్సి వస్తోంది. ఇదే అదునుగా ఆటో డ్రైవర్లు భక్తుల్ని ఆ సత్రానికి తీసుకువెళ్లడానికి రూ.50 నుంచి రూ.100 వరకూ వసూలు చేస్తున్నారు. టీ, టిఫిన్ కావల్సినా రత్నగిరికి రావల్సిందే.. హరిహరసదన్ సత్రంలో బస చేసే భక్తులు టీ, టిఫిన్ కోసం 1.5 కిలోమీటర్ దూరంలోని రత్నగిరి కొండమీదకు రావల్సిందే. లేదంటే రత్నగిరి నుంచి ఆటోను రప్పించుకోవల్సిందే. వచ్చి ... రత్నగిరికి వెళ్లి మళ్లీ సత్రానికి వెళ్లాలంటే మూడు ట్రిప్పులవుతుంది. దీంతో రూ.వంద నుంచి రూ.150 వరకూ వసూలు చేస్తున్నారు. రాత్రి తొమ్మిది గంటలు నుంచి ఉదయం ఆరు గంటల వరకూ కొండదిగువ నుంచి మీదకు ఆటోలు అనుమతించకపోవడంతో మరిన్ని ఇక్కట్లు తప్పడం లేదు. రెండు వాహనాలు సత్యగిరికి నడపాల్సిందే... రత్నగిరి సీఆర్ఓ కార్యాలయం నుంచి సత్యగిరిపై గల హరిహర సదన్ సత్రానికి టాటా మేజిక్లాంటి వాహనాలను రెండింటిని ప్రతిరోజూ నడిపేలా దేవస్థానం చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. ఒక వాహనం సీఆర్ఓ కార్యాలయం వద్ద, మరో వాహనం హరిహర సదన్ సత్రం వద్ద ఎల్లవేళలా అందుబాటులో ఉండాలని, ఇందుకుగాను ఒక భక్తుని వద్ద నుంచి ఎంత వసూలు చేయాలో దేవస్థాన మే నిర్ణయించాలని, లేదా సీజన్, అన్సీజన్ అనే బేధం లేకుండా దేవస్థానమే రత్నగిరి నుంచి సత్యగిరికి ఉచిత బస్సు నడపాలని భక్తులు కోరుతున్నారు. రాత్రి వేళల్లో రత్నగిరి సత్రాల్లో గదులు కేటాయించాలని ఆదేశించాం హరిహరసదన్ సత్రానికి వెళ్లేందుకు ఉన్న ఇబ్బందిని దృష్టిలో పెట్టుకుని సొంత వాహనాలు ఉన్న భక్తులకే ఆ సత్రంలో గదులు కేటాయించాలని సిబ్బందిని ఆదేశించామని ఈఓ కె.నాగేశ్వరరావు ‘సాక్షి’కి తెలిపారు. రాత్రి వేళల్లో అయితే రత్నగిరి సత్రాల్లోనే గదులు ఇవ్వాలని చెప్పామన్నారు. భక్తులు రద్దీ అధికంగా ఉన్నప్పుడు దేవస్థానం బస్సును ఉచితంగా సత్యగిరికి నడుపుతున్నాం. రెగ్యులర్గా నడిపే విషయం కూడా పరిశీలిస్తామన్నారు. – కె. నాగేశ్వరరావు, ఆలయ ఈఓ -
వ్యవసాయ బోర్లకు సోలార్ ఎనర్జీ
అన్నవరం దేవస్థానం భూముల్లో మూడు బోర్లు ఏర్పాటు సబ్సిడీపై అందిస్తున్నట్రాన్స్కో అన్నవరం : ‘సోలార్ ’ విద్యుత్ కేవలం వెలుగులకే కాదు, భూగర్భంలో నీటిని అందించేందుకూ ఉపయోగపడుతుంది. అన్నవరం దేవస్థానానికి చెందిన వ్యవసాయ భూముల్లో సోలార్ విద్యుత్తో నడిచే మూడు బోర్లను ఏర్పాటు చేసి, ఆ నీటితో వివిధ రకాల మొక్కలు పెంచుతున్నారు. ఈ సోలార్ మోటార్లను అన్నవరంలోని ఈరంకి వారి స్థలంలోను, రైల్వేస్టేçÙన్ వెనుక గల స్థలంలో రెండు ఏర్పాటు చేశారు. మరో మూడు బోర్వెల్స్ను ఏర్పాటు చేయనున్నట్టు దేవస్థానం అధికారులు తెలిపారు. ఐదు హెచ్పీ సామర్థ్యం గల ఒక బోర్వెల్ తవ్వి, మోటార్, పైపులు బిగించడానికి సుమారుగా రూ.రెండు లక్షలకు పైగానే ఖర్చు అవుతుంది. అయితే సోలార్ విద్యుత్ బోర్వెల్స్ ద్వారా రూ.55 వేలకే (మొత్తం రూ.3.5 లక్షలు, అందులో సబ్సిడీ రూ.2.95 లక్షలు) బోర్వెల్ (125 అడుగుల లోతు) తవ్వుతున్నారు. బోర్వెల్ ఏర్పాటు ఇలా... ఈ బోర్వెల్స్ ఏర్పాటు ఏపీఈపీడీసీఎల్ ద్వారానే జరుగుతుందని అన్నవరం ట్రాన్స్కో ఏఈ డీవీ రమణమూర్తి తెలిపారు. అయితే రైతులు తమ భూముల్లో సోలా ర్ విద్యుత్ బోర్వెల్స్ ఎలా ఏర్పాటు చేసుకోవాలో శుక్రవారం ఆయన సాక్షికి వివరిం చారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. బోర్వెల్ తవ్వే భూమిలో భూగర్భజలాలు 125 అడుగుల లోతులో ఉందని భూగర్భజల విభాగం (గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్) సర్టిఫికెట్ ఇవ్వాలి. ఆ సర్టిఫికెట్ను జత చేసి బోర్వెల్ తవ్వడానికి మండల తహసీల్దార్కు దరఖాస్తు చేసుకోవాలి. దానికి ఆయన అనుమతివ్వాలి. తహసీల్దార్ ఇచ్చిన అనుమతుల సర్టిఫికెట్ను కాల్సెంటర్లో రూ.25 చెల్లించి రిజిస్టర్ చేయించుకోవాలి. ఆ తరువాత ఆ వివరాలతో సంబంధిత విద్యుత్ సబ్స్టేçÙన్ ఏఈ వద్దకు వస్తుంది. ఏఈ దానిని పరిశీలించి ప్రాజెక్ట్ రిపోర్టు తయారు చేస్తారు. నెడ్క్యాప్ తరఫున నియమించిన ఏజెన్సీ ప్రతినిధులు ఆ స్థలాన్ని పరిశీలించి అనుమతులిస్తే ట్రాన్స్కో అధికారులే బోర్వెల్ తవ్వించి, సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేసి మోటార్ బిగిస్తారు. ఆ ప్యానల్స్ సోలార్ ఎనర్జీని చార్జ్ చేస్తాయి. దాని ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్ను మోటార్కు కనెక్ట్ చేస్తారు. సోలార్ ప్యానెల్స్లో చార్జ్ అయ్యే విద్యుత్ ద్వారా రోజుకు కనీసం ఎనిమిది గంటలు మోటార్ తిరుగుతుంది. రూ.55వేలు మాత్రమే.. సోలార్ బోర్వెల్ కోసం రైతు కేవలం రూ.55 వేలు మాత్రమే ఖర్చు చేస్తే సరిపోతుందని ట్రాన్స్కో ఏఈ డీవీ తెలిపారు. రూ.2.95లక్షలు సబ్సిడీగా ప్రభుత్వం భరింస్తుందని తెలిపారు. భూమిలోకి వెళ్లే పైపులు 25 సంవత్సరాలు, మోటార్ ఒక ఏడాది వారంటీ ఉంటుంది. ఆ తరువాత మరమ్మతులు వస్తే బాగుజేయడానికి నగ దు చెల్లించాల్సి ఉంటుందని వివరించారు. అన్నవరం దేవస్థానం భూములతోపాటు అన్నవరం చుట్టుపక్కల గ్రామాల్లో మరో ఏడు సోలార్ ఎనర్జీ బోర్వెల్స్ ఏర్పాటు చే స్తున్నట్టు ఆయన తెలిపారు. -
విరమణ మంగళవారమా!
ఈనెల 25 నుంచి వచ్చేనెల 22 వరకూ సత్యదీక్షలు చివరిరోజు మంగళవారం కావడంపై భక్తుల సందిగ్ధం మరోసారి పండితులతో చర్చిస్తానంటున్న ఈఓ అన్నవరం : రత్నగిరి వాసుడు సత్యదేవుని పేరిట చేపట్టే ‘సత్యదీక్ష’ విరమణ రోజును నవంబర్ర్ 22 మంగళవారంగా దేవస్థానం నిర్ణయించడంపై భక్తుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మంగళవారం సెంటిమెంట్తో దీక్ష విరమించడానికి చాలా మంది అయిష్టత చూపుతున్నారు. అన్నవరం దేవస్థానం అధికారికంగా నిర్వహించే సత్యదీక్షలు స్వామివారి జన్మనక్షత్రం ‘మఖ’ సందర్బంగా ఈనెల 25 నుంచి ప్రారంభమవుతున్నాయి. 27 రోజుల అనంతరం వచ్చే ‘మఖ’ నక్షత్రం నాడు ఈ దీక్ష విరమించడం ఆనవాయితీగా వస్తోంది. అన్నవరం దేవస్థానం పంచాంగం ప్రకారం నవంబర్ నెలలో వచ్చే ‘మఖ’ నక్షత్రం 21 సోమవారం ఉదయం 7.14 గంటల నుంచి 22 మంగళవారం ఉదయం 9.57 గంటల వరకూ ఉంది. అయితే దేవస్థానంలో స్వామివారి ఆలయం తెరిచే సమయానికి ఏ నక్షత్రం, తిథి ఉంటాయో ఆ రోజంతా వాటినే పరిగణనలోకి తీసుకునే ఆచారం ఉంది. దాని ప్రకారం మంగళవారమే స్వామివారి జన్మనక్షత్ర పూజలు నిర్వహిస్తున్నారు. దాంతో బాటు దీక్ష విరమణ కూడా అదే రోజు నిర్వహిస్తున్నట్లు దేవస్థానం ప్రచారం ప్రారంభించింది. అంతే కాదు పెద్ద పెద్ద ఫ్లెక్సీలను కూడా ఏర్పాటు చేసింది. దీంతో సత్యదీక్షలు చేపట్టాలనుకునే భక్తులు చాలామంది సందిగ్ధంలో పడ్డారు. నవంబర్ 21 సోమవారం ఉదయం 7.14 గంటల నుంచి మఖ నక్షత్రం వస్తున్నందున అదే రోజు దీక్ష విరమణ తేదీగా నిర్ణయిస్తే భక్తుల మనోభావాలను గౌరవించినట్టు కూడా అవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పైగా ఆరోజు సప్తమి తిథి కూడా మంచిదనే అభిప్రాయం వినిపిస్తోంది. ఇది సాధ్యం కాదంటే మరుసటి రోజు బుధవారం దీక్ష విరమించేందుకు అవకాశం ఉంటే ఆ విషయాన్ని అయినా దేవస్థానం పండితులు ప్రకటించాలని భక్తులు కోరుతున్నారు. కాగా సత్యదీక్ష ల విరమణ నవంబర్ 22న అని దేవస్థానం పండితులు నిర్ణయించారని ఈఓ నాగేశ్వరరావు చెప్పారు. అదే రోజున సత్యదేవునికి జన్మనక్షత్రానికి సంబంధించిన పంచామృతాభిషేకం చేస్తారు కాబట్టి ఆరోజునే దీక్ష విరమించాలన్నది పండితుల నిర్ణయమన్నారు. ఆరోజు మంగళవారం కాబట్టి దీక్ష విరమించకూడదన్న సెంటిమెంట్ ఉంటే దీనిపై మరోసారి పండితులతో చర్చిస్తామన్నారు. భక్తుల అభిప్రాయం ఇలా... సాధారణంగా ఏ దేవుని దీక్ష అయినా ఇతర వారాలతో పాటు మంగళవారం, శుక్రవారం కూడా చేపట్టే అవకాశం ఉన్నా దీక్ష విరమణ మాత్రం ఆ రెండు రోజుల్లో చేయడానికి ఇష్టపడరు. మెడలో మాల ధరించి నియమనిష్టలతో దీక్ష చేస్తారు. మంగళవారం లేదా శుక్రవారం దీక్ష విరమించి ఆ మాల మెడ నుంచి తీయాలంటే సెంటిమెంట్ అడ్డొస్తుంది. ఒకవేళ ఎవరైనా ఆ రోజుల్లో దీక్ష విరమించి మాలను విసర్జించినా తరువాత ఏమన్నా జరిగితే మంగళవారం దీక్ష విరమించడం వలనే ఇలా జరిగిందన్న అభిప్రాయం వెంటాడుతుందంటున్నారు. దానికి తోడు మంగళవారం అష్టమి తిథి కూడా ఉంది. అందువలన చాలామంది విరమణ తేదీపై పునరాలోచించాలని కోరుతున్నారు. -
నిత్యాన్నదానానికి రూ.2,00,116 విరాళం
అన్నవరం : సత్యదేవుని నిత్య అన్నదాన పథకానికి ఇద్దరు దాతలు శనివారం రూ.2,00, 116 విరాళాలుగా సమర్పించారు. విశాఖ జిల్లా యలమంచిలికి చెందిన చల్లపల్లి సూర్య నాగేంద్ర, సూర్య వెంకటలక్ష్మీ హేమలత దంపతులు రూ. 1,00,116 విరాళాన్ని ఈఓ నాగేశ్వరరావుకు అందజేశారు. ఈ మొత్తంపై వచ్చే వడ్డీతో ఏటా జ్యేష్ట బహుళ చవితి నాడు తాకాశి వరలక్ష్మి పేరు మీద అ న్నదానం చేయమని కోరినట్టు అధికారులు తెలిపారు. అలాగే హైదరాబాద్కు చెందిన అద్దంకి రవికుమార్ రూ.లక్ష విరాళానికి సంబందించిన బ్యాంక్ డీడీని ఈఓకు అందజేశారు. -
అన్నవరం దేవస్థానానికి ధర్మకర్తల మండలి
13 మంది సభ్యులను ఖరారు చేసిన ప్రభుత్వం వ్యవస్థాపక ధర్మకర్తతో కలిపితే సభ్యుల సంఖ్య 14 వీరిలో తూర్పు గోదావరి జిల్లాకు చెందిన వారు 11 మంది గుంటూరు, విశాఖ జిల్లాకు చెందిన ఒక్కొక్కరికి స్థానం అన్నవరం : ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం దేవస్థానానికి ధర్మకర్తల మండలి సభ్యులను రాష్ట్ర ప్రభుత్వం గురువారం రాత్రి ఖరారు చేసింది. దేవస్థానానికి అందిన సమాచారం ప్రకారం మొత్తం 13 మందిని ఇందులో సభ్యులుగా నియమించింది. వీరిలో తూర్పు గోదావరి జిల్లాకు చెందిన వారు 11 మంది, గుంటూరు, విశాఖ జిల్లాకు చెందిన వారు ఒక్కొSక్కరు ఉన్నారు. సభ్యుల్లో ఒక మహిళ కూడా ఉన్నారు. దేవస్థానానికి వ్యవస్థాపక ధర్మకర్తగా ప్రస్తుతం రాజా ఐవీ రోహిత్ వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఆయనతో కలిపితే ఈ ధర్మకర్తల మండలి సంఖ్య 14కి చేరుతుంది. అయితే అర్చకుల నుంచి ఒకరిని కూడా ధర్మకర్తల మండలిలో నియమించే అవకాశం ఉందంటున్నారు. దేవాదాయశాఖ చట్టం ప్రకారం ధర్మకర్తల మండలి ఛైర్మన్గా వ్యవస్థాపక ధర్మకర్త వ్యవహరించడం ఆనవాయితీగా ఉంది. మరి ప్రభుత్వం దీనిపై ఏ విధంగా వ్యవహరిస్తుందనేది వేచి చూడాలి. ఖరారైన ధర్మకర్తల మండలి సభ్యులు అవసరాల వీర్రాజు, కందుల విశ్వేశ్వరరావు, నున్న రామచంద్రరావు, పర్వత గుర్రాజు రాజబాబు, యడ్ల బేతాళుడు, చెల్లి శేషుకుమారి, కొత్త వేంకటేశ్వరరావు, సత్తి దేవేందర్ రెడ్డి, రావిపాటి సత్యనారాయణ (గుంటూరు), రొబ్బి విజయశేఖర్, పెచ్చెట్టి చిన్నారావు, యనమల రాజేశ్వరరావు, దాతల విభాగం నుంచి ఎంఎస్ రెడ్డి (విశాఖపట్నం)ను నియమించారు. రాష్ట్ర ఆర్థిక, శాసనసభ వ్యవహారాల శాఖా మంత్రి సొంత నియోజకవర్గం తుని నుంచి ఇద్దరికి ఇందులో స్థానం లభించడం విశేషం. -
రూ.2.27 కోట్లతో ఆగమ పాఠశాల
అన్నవరం: అన్నవరం దేవస్థానంలోని సత్యగిరిపై సుమారు ఎకరం స్ధలంలో రూ.2.27 కోట్లు వ్యయంతో స్మార్త, ఆగమ పాఠశాల నిర్మాణం కోసం పిలిచిన టెండర్లను దేవస్థానం ఛైర్మన్, ఈఓలతో కూడిన పాలకవర్గం ఆమోదించింది. గురువారం దేవస్థానం ఛైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ కె.నాగేశ్వరరావు సమావేశమై పలు అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకున్నారు. సమావేశం నిర్ణయాలివీ.. ∙సత్యదేవుని శాశ్వత కల్యాణానికి రూ.పది వేలు రుసుం చెల్లించిన భక్తులకు పది సంవత్సరాలు మాత్రమే వారి పేరు మీద స్వామి, అమ్మవార్లకు కల్యాణం నిర్వహిస్తారు. గతంలోలా మూడేళ్లు పొడగించే పరిస్థితి ఇకపై ఉండదు. ∙విద్యుత్ ఝ్ఛర్జీల ఆదాలో భాగంగా ఐఎస్ఐ స్టార్ రేటింగ్ కలిగిన పంప్సెట్లనే వాడాలని నిర్ణయించారు. పాత విద్యుత్ బల్బులను తొలగించి ఎల్ఈడీ బల్బులనే వాడాలని నిర్ణయించారు. ∙దేవస్థానంలో ఏర్పాటు చే స్తున్న బైక్, చిన్నకార్లు స్టాండ్ల కోసం నిర్వహించిన వేలంలో ఖరారైన నెలకు రూ.61,000 వేలంపాటను సమావేశంలో ఆమోదించారు. ∙అక్టోబర్ 31 నుంచి ప్రారంభం కానున్న కార్తీకమాసంలో స్వామివారి ఆలయానికి వచ్చే భక్తుల కోసం చేపట్టనున్న ఏర్పాట్లను సమావేశంలో సమీక్షించారు. అదే విధంగా నవంబర్ 11వ తేదీన క్షీరాబ్థి ద్వాదశినాడు జరగనున్న సత్యదేవుని తెప్పోత్సవానికి కూడా తగిన ఏర్పాట్లు చేయాలని సమావేశంలో తీర్మానించారు. -
సత్య దేవుని బడ్జెట్ రూ.135.02 కోట్లు
గత ఏడాదితో పోల్చితే రూ.19 కోట్లు పెరుగుదల అన్నదానం ట్రస్ట్కు రూ.32.18 కోట్లు అన్నవరం దేవస్థానంలో నిర్వహిస్తున్న సత్యదేవుని నిత్యాన్నదాన ట్రస్ట్కు 2016–17 సంవత్సరానికిగాను ప్రత్యేకంగా రూ.32.18 కోట్లతో రూపొందించిన అంచనా బడ్జెట్ను కూడా కమిషనర్ ఆమోదించారు. అన్నదానంలో ముడి సరుకుల కొనుగోలుకు రూ.2.90 కోట్లు, సిబ్బంది జీతభత్యాల కింద రూ.45 లక్షలు, ఇతర ఖర్చుల కింద రూ.32.45 లక్షలు కేటాయించారు. అన్నదాన ట్రస్ట్కు రూ.28.50 కోట్లు డిపాజిట్లను తిరిగి బ్యాంకులలో డిపాజిట్ చేయడానికి నిర్ణయించారు. గో సంరక్షణకు రూ.35 లక్షలు... ఈ ఏడాది కొత్తగా ఏర్పాటు చేసిన గోసంరక్షణ ట్రస్ట్కు రూ.35 లక్షలతో రూపొందించిన బడ్జెట్కు కూడా కమిషనర్ ఆమోదం తెలిపారు. ఇందులో రూ.12 లక్షలు గోవుల మేత, గడ్డికి, రూ.80 వేలు గోవులకు ఇన్సూరెన్స్ చేయించడానికి, రూ.17.40 లక్షలు సిబ్బంది జీతభత్యాలకు కేటాయించారు. అన్నవరం : తూర్పు గోదావరి జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అన్నవరం శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానానికి 2016–17 ఆర్థిక సంవత్సరానికిగాను రూ.135.02 కోట్ల అంచనాలతో రూపొందించిన బడ్జెట్ను దేవాదాయ, ధర్మాదాయశాఖ కమిషనర్ వైవీ ఆనూరాధ ఆమోదించారు. 2015–16 వార్షిక బడ్జెట్ రూ.119 కోట్లు. దాంతో పోల్చిచూస్తే ఈసారి రూ.16 కోట్లు అదనంగా బడ్జెట్ పెరిగిందని దేవస్థానం ఈఓ కె. నాగేశ్వరరావు తెలిపారు. బడ్జెట్లో ప్రతిపాదించిన ముఖ్యమైన అంశాలిలా... సత్యదేవుని ప్రసాదాల తయారీకి ముడిపదార్దాల కొనుగోళ్లకు రూ.16 కోట్లు, వ్రతాలలో వాడే పూజా సామాగ్రి కొనుగోళ్లకు రూ.ఆరు కోట్లు, ఇతర వైదిక కార్యక్రమాలలో వాడే సామాగ్రి కొనుగోళ్లకు రూ.67 లక్షలు కేటాయించారు. సిబ్బంది జీతాలు, పెన్షనర్లకు ఇచ్చే పెన్షన్లు, కాంట్రాక్టు సిబ్బంది , ఔట్సోర్సింగ్ సిబ్బంది వేతనాలకు రూ.22.11 కోట్లు బడ్జెట్లో కేటాయించారు. వివిధ భవనాల నిర్మాణం కోసం రూ.ఏడు కోట్లు, విద్యుత్తు, నీటిసరఫరా కోసం రూ.కోటి కేటాయించారు. విద్యుత్ ఛార్జీల చెల్లింపునకు రూ.మూడు కోట్లు, విద్యుత్ ఉపకరణాల కొనుగోలుకు రూ.92 లక్షలు కేటాయించారు. దేవస్థానం సెక్యూరిటీ ఖర్చు కింద రూ.2.25 కోట్లు కేటాయించారు. దేవాదాయశాఖకు చెల్లించాల్సిన కాంట్రిబ్యూషన్ రూ. ఆరు కోట్లు, ఆడిట్ ఫీజు కింద రూ. 68 లక్షలు, సీజీఎఫ్ కంట్రిబ్యూషన్ కింద రూ.2.30 కోట్లు, అర్చక సంక్షేమ నిధి కింద రూ.కోటి , ప్రభుత్వానికి పన్నుల రూపంలో రూ.15 లక్షలు బడ్జెట్లో కేటాయించారు. వ్రత పురోహితుల పారితోషకం రూ.ఏడు కోట్లు, కేశఖండనశాలలో నాయీబ్రాహ్మణుల పారితోషకం రూ.38.50 లక్షలు, ప్రసాదం ప్యాకర్లు పారితోషకం రూ.90 లక్షలు బడ్జెట్లో కేటాయించారు. దేవస్థానంలో శానిటేషన్ నిర్వహణకు రూ.3.75 కోట్లు, షామియానాలు, పందిర్లు వేయడానికి రూ.45 లక్షలు బడ్జెట్లో కేటాయించారు. దేవస్థానం ప్రచార రథం ద్వారా ధర్మప్రచారానికి రూ.40 లక్షలు బడ్జెట్లో కేటాయించారు. రూ.41.25 కోట్లు వివిధ బ్యాంకుల్లో రీ–డిపాజిట్ చేయడానికి బడ్జెట్లో కేటాయించారు. -
దేవస్థానం టోల్గేట్ ఆదాయం రూ.92.64 లక్షలు
అన్నవరం: దేవస్థానం టోల్గేట్లో చిన్నకార్లు, టూరిస్ట్బస్సులు, లారీల నుంచి టోల్ వసూలు చేయడానికి నిర్వహించిన వేలంపాట నెలకు రూ.7.72 లక్షలకు ఖరారైంది. దీంతో ఆ టోల్గేట్ ద్వారా దేవస్థానానికి ఏడాదికి రూ. 92.64 లక్షలు ఆదాయం సమకూరనుందని దేవస్థానం ఇన్చార్జి ఈఓ ఈరంకి జగన్నాథరావు మంగళవారం సాయంత్రం సాక్షికి తెలిపారు. గత ఏడాది ఇదే టోల్ వసూలు చేయడానికి నిర్వహించిన వేలం పాట నెలకు రూ.6.14 లక్షలు మాత్రమే. దీంతో ఈ ఏడాది అదనంగా సుమారు రూ.19 లక్షలు ఆదాయం పెరిగిందని తెలిపారు. -
హిందూ ధర్మప్రచారంతో మతమార్పిడులు నిరోధించాలి
హిందూ ధార్మిక పరిషత్ చైర్మన్ పీవీఆర్కే ప్రసాద్ అన్నవరం : దళిత వాడల్లో హిందూ ధర్మ ప్రచారం నిర్వహించి బలవంతపు మత మార్పిడులను నిరోధించాలని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, హిందూ ధార్మిక పరిషత్ చైర్మన్ పీవీఆర్కే ప్రసాద్ కోరారు. జాతీయ ఎస్సీ పరిరక్షణ సంస్థ, హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ సోమవారం రత్నగిరిపై నిర్వహించిన హిందూ మత ప్రచారం సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రభుత్వాలు నిధులను విడుదల చేసినంత మాత్రాన హిందూ మత ప్రచారం జరగదని ఆయన అన్నారు. ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేసినపుడే అది సాధ్యమవుతుందన్నారు. మరో ముఖ్య అతిథి శ్రీనివాసానంద సరస్వతి స్వామి మాట్లాడుతూ దళితవాడలలో రామాలయం నిర్మాణానికి రూ.ఐదు లక్షలు కేటాయిస్తూ ప్రభుత్వం ఆదేశాలిచ్చిందని తెలిపారు. ఆ మొత్తంతో బాటు భజనసామగ్రి కూడా కేటాయిస్తారని, వీటితో హిందు ధర్మ ప్రచారం నిర్వహించాలని కోరారు. ప్రభుత్వ ఐటీ అడ్వైజర్ హనుమాన్ చౌదరి, జాతీయ ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి కన్వీనర్ కరణం శ్రీశైలం, హిందూ ధర్మ పరిరక్షణ సంస్థ రాష్ట్ర చైర్మన్ చవులూరి గవరయ్య, హిందూ ధర్మ పరిరక్ష సమితి అధ్యక్షుడు కర్రి ధర్మారావు, పలు ప్రాంతాల నుంచి విచ్చేసిన దళితులు పాల్గొన్నారు. -
సత్యదేవుని అంతరాలయానికి సువర్ణశోభ
అంతరాలయంపైకప్పునకు బంగారు తాపడం రూ.40 లక్షలతో చేయించనున్న సీఎంఆర్ అధినేత వెంకటరమణ అన్నవరం : సత్యదేవుని అంతరాలయంలోని గోడల పైకప్పును బంగారు రేకుతో తాపడం చే యించడానికి విశాఖ పట్నం సీఎంఆర్ షాపింగ్ మాల్ అధినేత ఎం. వెంకటరమణ సంసిద్ధత వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన సతీసమేతంగా సత్యదేవుని దర్శించి పూజలు చేశా రు. అనంతరం దేవస్థానం ఈఓ కె.నాగేశ్వరరావును కలిసి తన కోరి కను తెలిపారు. గతంలో ఆయన స్వామివారి అంతరాలయం గోడలకు సుమారు రూ.40 లక్షల వ్యయంతో బంగారు రేకు తాపడం చేయించారు. అంతరాలయం పైకప్పునకు కూడా బంగారు తాపడం చేయిస్తాన్నారు. అందుకు అంచనాలు రూపొందించాలని దేవస్థాన అధికారులకు సూచించారు. అలాగే వనదుర్గ అమ్మవారికి బంగారు మకరతోరణం, వింజూమరలు, ఆలయద్వారాలకు బంగారు రేకు తాపడం సమర్పించడానికి కూడా ఆయన అంగీకరించారు. దాత కోరిక మేరకు బంగారు రేకు తాపడం చేయించడానికి అవసరమయ్యే అంచనాలు తయారు చేసి ఇవ్వాలని దేవస్థానం డిప్యూటీ స్థపతి ఐ.ప్రసాద్ను ఈఓ ఆదేశించారు. ఆలయం పైకప్పు మినహా ఆలయమంతా స్వర్ణమయమే.. ఇప్పటికే సత్యదేవుని ఆలయంలో ప్రధాన ద్వారాలకు, ఆలయ గోడలకు దాతల సహకారంతో స్వర్ణరేకు తాపడం చేశారు. ఇపుడు అంతరాలయం పైకప్పు కూ డా స్వర్ణమయం అయితే ఇక మిగిలేది ముఖ మండపం పైకప్పు మాత్రమే. -
అన్నదాన పథకానికి రూ.2,00,117 విరాళం
అన్నవరం : సత్యదేవుని నిత్యాన్నదాన పథకానికి ఇద్దరు దాతలు గురువారం రూ.2 లక్షల విరాళం అందజేశారు. కాకినాడ రూరల్ తిమ్మాపురానికి చెందిన కొప్పిశెట్టి అక్కన్న, నాగరత్నం దంపతులు రూ.1,00,116 విరాళాన్ని ఏసీ ఈరంకి జగన్నాథరావుకు అందజేశారు. ఈ మొత్తంపై వచ్చే వడ్డీతో ఏటా అక్టోబర్ 19న తమ పేరిట అన్నదానం చేయాలని వారు కోరారు. అలాగే, బెంగళూరుకు చెందిన సరస్వతుల జానకి రూ.1,00,001 విరాళాన్ని అన్నదానం ఏఈఓ పి.నటరాజారావుకు అందజేశారు. ఈ మొత్తంపై వచ్చే వడ్డీతో ఏటా చైత్ర బహుళ తదియనాడు సరస్వతుల సుబ్బయ్యశాస్త్రి పేరిట అన్నదానం చేయాలని కోరారు.