పెద్ద నోట్లతో బిల్లులు చెల్లించండి
Published Fri, Nov 11 2016 12:49 AM | Last Updated on Thu, Jul 18 2019 1:50 PM
– నేటి అర్ధరాత్రి వరకే గడువు : ఎస్ఈ
కర్నూలు(రాజ్విహార్): విద్యుత్ బిల్లులను, పాత బకాయిలను పెద్ద నోట్లతో చెల్లించవచ్చని విద్యుత్ శాఖ ఏపీ ఎస్పీడీసీఎల్ కర్నూలు ఆపరేషన్స్ ఎస్ఈ జి.భార్గవ రాముడు సూచించారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ శుక్రవారం అర్ధరాత్రి వరకు వినియోగదారులు రూ.500, రూ.1000 నోట్లతో బిల్లులు చెల్లించవచ్చన్నారు. ఈ మేరకు సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ హెచ్వై దొర ఉత్వర్వులు జారీ చేశారని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఒకవేళ అధిక మొత్తం చెల్లించినా వచ్చే నెలల బిల్లుల్లో సరి చేస్తామన్నారు.
Advertisement
Advertisement