- జాయింట్ కలెక్టర్–2 రాధాకృష్ణమూర్తి
పక్కా ప్రణాళికతో ఇంటర్ ప్రాక్టికల్స్
Published Tue, Jan 24 2017 9:54 PM | Last Updated on Tue, Sep 5 2017 2:01 AM
కాకినాడ సిటీ :
జిల్లాలో ఇంటర్ పబ్లిక్ ప్రాక్టికల్ పరీక్షలను పక్కా ప్రణాళికతో నిర్వహించాలని జాయింట్ కలెక్టర్–2 జె.రాధాకృష్ణమూర్తి అధికారులకు సూచించారు. మంగళవారం ఆయన చాంబర్లో అధికారులతో ఈ పరీక్షలు నిర్వహణపై సమీక్షించారు. ఫిబ్రవరి 3 నుంచి 22వ తేదీ వరకూ జిల్లాలో 96 సెంటర్లలో ఈ పరీక్షలు నిర్వహిస్తారన్నారు. ఈ పరీక్షల నిర్వహణకు తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
Advertisement
Advertisement