Published
Sun, Jul 31 2016 11:21 PM
| Last Updated on Mon, Sep 4 2017 7:13 AM
ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ కల్పించాలి
హుజూర్నగర్ : తెలంగాణ ప్రభుత్వం ముస్లింలకు ఇచ్చిన హామీ మేరకు 12 శాతం రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలని రిజర్వేషన్ సబ్ప్లాన్ యాక్షన్ కమిటీ జిల్లా కార్యదర్శి ఎస్కె.అక్బర్ కోరారు. ఆదివారం స్థానికంగా జరిగిన ఆ సంఘం సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ముస్లింల సర్వతోముఖాభివృద్ధికి ప్రభుత్వం రిజర్వేషన్లు కల్పించడంతో పాటు సబ్ప్లాన్ను కూడా అమలు చేయాలన్నారు. అనంతరం స్థానిక ఉస్మానియా మసీదులో మెుక్కలు నాటారు. కార్యక్రమంలో ఎండి.రహీం, ఖాదర్సాబ్, ఎస్కె.రసూల్, జానీమియా, టైలర్జానీ, మీరావలి, డీసీసీ ఉపాధ్యక్షుడు మన్సూర్అలీ, వక్ఫ్బోర్డు మాజీ డైరెక్టర్ ఎస్కె.సైదా పాల్గొన్నారు.