Published
Sun, Aug 7 2016 8:18 PM
| Last Updated on Mon, Sep 4 2017 8:17 AM
పుష్కర పనుల నాణ్యత ప్రశ్నార్థకం
వాడపల్లి(దామరచర్ల) : ప్రభుత్వం పుష్కర పనులను ఆర్నెళ్ల క్రితం ప్రారంభిస్తే నాణ్యతగా పనులు జరిగేవని సీపీం జిల్లా కార్యదర్శి జూలకంటి రంగారెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని వాడపల్లి పాతపోలీస్ స్టేషన్ ఘాట్, పాత సిమెంట్ఘాట్, శివాలయం ఘాట్ పనులను పరిశీలించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ పుష్కరాలు దగ్గర పడుతుండడంతో హడావుడిగా పనులు చేయడం వలన నాణ్యత ప్రశ్నార్థకంగా మారిందన్నారు. వాడపల్లిలో ఉన్న చారిత్రక కట్టడాల భద్రతపై చర్యలు తీసుకోకపోవడం సరికాదన్నారు. ఇప్పుడు రంగులు, టైల్స్ వేస్తే పుష్కరాలు అయిపోయేంత వరకైనా ఉంటాయా అనేది అధికారులే చెప్పాలన్నారు. ఆయన వెంట డివిజన్ కార్యదర్శి వి.వెంకటేశ్వర్లు, చంద్రశేఖర్ యాదవ్, పాపానాయక్, దయానంద్,వినోద తదితరులు పాల్గొన్నారు.