
మొక్కలను సంరక్షించే బాధ్యత తీసుకోవాలి
మొక్కలను నాటడంతోపాటు సంరక్షించే బాధ్యతను తీసుకోవాలని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. కరీంనగర్ మండలం చామన్పల్లిలో గురువారం నిర్వహించిన హరితహారంలో మంత్రి ముఖ్యఅతిథిగా పాల్గొని మొక్కలు నాటారు. అనంతరం మాట్లాడుతూ హరితహారంలో జిల్లాను మొదటిస్థానంలో నిలబెట్టేందుకు కృషి చేస్తామన్నారు.
- జిల్లాను మెుదటిస్థానంలో నిలుపుదాం
- ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్
కరీంనగర్ రూరల్: మొక్కలను నాటడంతోపాటు సంరక్షించే బాధ్యతను తీసుకోవాలని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. కరీంనగర్ మండలం చామన్పల్లిలో గురువారం నిర్వహించిన హరితహారంలో మంత్రి ముఖ్యఅతిథిగా పాల్గొని మొక్కలు నాటారు. అనంతరం మాట్లాడుతూ హరితహారంలో జిల్లాను మొదటిస్థానంలో నిలబెట్టేందుకు కృషి చేస్తామన్నారు. మొక్కలు నాటి సంరక్షించి బాధ్యతను మహిళలు స్వచ్ఛందంగా తీసుకోవాలని సూచించారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్, ఎంపీపీ వాసాల రమేశ్, జెడ్పీ కోఆప్షన్సభ్యుడు జమిలొద్దీన్, సర్పంచు గంట శంకరయ్య, ఎంపీటీసీ సభ్యులు అశోక్, బాలయ్య, తహశీల్దార్ జయచంద్రారెడ్డి, ఎంపీడీవో దేవేందర్రాజు పాల్గొన్నారు.