రామయ్యకు ప్రత్యేక పూజలు | special prayers to Ramayya | Sakshi
Sakshi News home page

రామయ్యకు ప్రత్యేక పూజలు

Jul 20 2016 10:55 PM | Updated on Sep 4 2017 5:29 AM

స్వామివారికి నిత్యకల్యాణం నిర్వహిస్తున్న అర్చకులు

స్వామివారికి నిత్యకల్యాణం నిర్వహిస్తున్న అర్చకులు

భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారికి బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర కార్యక్రమాలు నిర్వహించారు. పవిత్ర గోదావరి నది నుంచి తీర్థ జలాలను తీసుకుని వచ్చి భద్రుని గుడిలో అభిషేకం జరిపారు.

  •     భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారికి బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర కార్యక్రమాలు నిర్వహించారు. పవిత్ర గోదావరి నది నుంచి తీర్థ జలాలను తీసుకుని వచ్చి భద్రుని గుడిలో అభిషేకం జరిపారు. ప్రత్యేకంగా అలంకరించిన స్వామివారి నిత్యకల్యాణ మూర్తులను ఆలయ బేడా మండపంలో వేంచేయింపజేసి విశ్వక్సేన పూజ, పుణ్యహవచనం గావించారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోత్రధారణ చేశారు. అర్చకులు స్వామివారు, అమ్మవార్ల వంశ క్రమాన్ని భక్తులకు వివరించారు. ఆలయ విశిష్టత గురించి భక్తులకు తెలిపారు. వేద పండితులు వేద ప్రవచనాలు చేశారు. కల్యాణంలో పాల్గొన్న భక్తుల గోత్రనామాలను స్వామివారికి విన్నవించారు. స్వామివారికి వైభవంగా నిత్యకల్యాణం చేశారు. అర్చకులు స్వామివారి శేష వస్త్రాలు, తీర్థ ప్రసాదాలను భక్తులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధానార్చకులు పొడిచేటి జగన్నాథాచార్యులు, వేద పండితులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.        – భద్రాచలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement