ఆర్వీఎం నూతన భవనం ప్రారంభం | Start new building | Sakshi
Sakshi News home page

ఆర్వీఎం నూతన భవనం ప్రారంభం

Published Tue, Oct 25 2016 3:23 AM | Last Updated on Mon, Sep 4 2017 6:11 PM

ఆర్వీఎం నూతన భవనం ప్రారంభం

ఆర్వీఎం నూతన భవనం ప్రారంభం

 ఉట్నూర్ రూరల్ : మండలంలోని హస్నాపూర్ గ్రామపంచాయతీ పరిధి శ్యాంనాయక్‌తండాలో రూ.6.50 లక్షల వ్యయంతో నిర్మించిన ఆర్వీఎం నూతన భవనాన్ని ఎమ్మెల్యే రేఖానాయక్ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు. అనంతరం శంకర్‌నాయక్‌తండలోని మావోలి, హస్నాపూర్‌లోని బాలాజీ మందిరాల అభివృద్ధికి రూ.లక్ష చొప్పున ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ విమల, ఉప సర్పంచ్ రౌఫ్, ఎంపీపీ రాథోడ్ విమల, జెడ్పీటీసీ సభ్యుడు జగ్జీవన్, ఎంపీటీసీ సభ్యురాలు శారద, కోఆప్షన్ సభ్యుడు ముజీబ్, టీఆర్‌ఎస్ నాయకులు లక్కాకుల భూపతి, అజీం, లింగాగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement